Friday, 28 February 2025

స్వాతంత్య్ర యోధుడు వీర్ సావర్కర్ వర్ధంతి


   స్వాతంత్య్ర యోధుడు వీర్ సావర్కర్ వర్ధంతి.


 వీర వినాయక్ దామోదర్ సావర్కర్ *రెండు జీవిత ఖైదులను* అనుభవించిన స్వాతంత్య్ర సమర యోధుడు. అంతేకాదు, కాలేపానీ అనే పేరుమోసిన అండమాన్ సెల్యులార్ జైలులో అతి క్రూరమైన హింసలతో బంధించబడ్డాడు. అంతేకాదు, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తి ని, భారతదేశం నలుమూలల నుండి వివిధ తీవ్రమైన నేరాలకు పాల్పడి, శిక్ష పడిన ఖైదీలుతో మాత్రమే అతనిని బ్రిటిష్ ప్రభుత్వం జైలు లో ఉంచారు .  వారిలో సావర్కర్ అత్యంత విద్యావంతుడు.  కొబ్బరి తాడులు చేయించడం, ఎద్దు లాగ గానుగ లాగడం మొదలైన కష్టమైన పనులన్నీ చేసేవాడు.  ఆ తర్వాత కూడా వారిని అమానుషంగా హింసించారు.


 భారతదేశ సమైక్యతకు హిందీ ఉపయోగాన్ని అర్థం చేసుకున్న అతను ఖాళీ సమయంలో ఖైదీలకు హిందీ నేర్పడం ప్రారంభించాడు.  అతను చాలా మంది ఖైదీలను ఒకే దేవుడు, ఒక ఆత్మ, ఒకే దేశం మరియు ఒక భాషకు అంగీకరించేలా చేశాడు.  అతని కృషి వల్ల చాలా మంది ఖైదీలు ప్రాథమిక హిందీ నేర్చుకుని చిన్న చిన్న పుస్తకాలు చదవడం ప్రారంభించారు. 


 అప్పుడు సావర్కర్ జీ రామాయణం, మహాభారతం, గీత వంటి పెద్ద మత గ్రంథాలను చదవడానికి తోటి ఖైదీలని ప్రేరేపించారు.  అతని కృషి వల్ల జైలులో ఒక చిన్న లైబ్రరీ కూడా స్థాపించబడింది.  ఇందుకోసం ఖైదీలు స్వయంగా తమ జేబుల నుంచి డబ్బులు ఇచ్చి 'బుక్ ఫండ్'ను రూపొందించారు.


 జైలులో ఖైదీలు తీసిన నూనె, దాని కేక్, పత్తి గింజలు, కొబ్బరి తాడు తదితరాలను విక్రయించేవారు.  ఇందుకోసం జైలులో విక్రయ దుకాణాన్ని నిర్మించారు.  సావర్కర్ జీ చాలా కాలం జైలులో ఉన్నప్పుడు, అతని అనుభవం, విద్య మరియు ఆచరణాత్మక నైపుణ్యాలను చూసి, ఈ దుకాణానికి అధిపతిగా నియమించబడ్డాడు.  ఈ కారణంగా, అతను అండమాన్ వ్యాపారులతో మరియు సరుకులు కొనడానికి వచ్చిన వారి సేవకులతో పరిచయం కలిగి ఉన్నాడు.


 వీర్ సావర్కర్ వారందరినీ హిందీ నేర్చుకునేలా ప్రేరేపించాడు.  అతను వారికి లైబ్రరీ నుండి హిందీ పుస్తకాలు మరియు వాటి సాధారణ అనువాదాలు ఇవ్వడం ప్రారంభించాడు.  ఈ విధంగా ఖైదీలతో పాటు జైలు సిబ్బంది, స్థానిక వ్యాపారులు, వారి కుటుంబసభ్యులు హిందీ నేర్చుకున్నారు.  అందుకే, కొంతవరకు హిందీ అన్ని చోట్లా విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. 


 సావర్కర్ జీ విడుదలైన తర్వాత కూడా ఈ క్రమం కొనసాగింది.  అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతంలో నేటికీ హిందీ మాట్లాడేవారు అత్యధికంగా ఉండటం మరియు అధికారిక భాష హిందీ కూడా రావడానికి ఇదొక కారణం.


 బ్రిటిష్ అధికారుల ప్రోద్బలంతో అండమాన్‌ జైలులో హిందూ ఖైదీలను బాధించడానికి కోసం ముగ్గురు ముస్లిం గార్డులను ఉంచారు.  వారు హిందువులను అనేక రకాలుగా వేధించేవారు.  దుర్భాషలాడడం, కర్రలతో కొట్టడం, దేవుళ్లను దూషించడం సర్వసాధారణంగా ఉండేది.


 వారు, తినే ఆహారాన్ని కూడా కలుషితం చేసేవారు.  దీని కారణంగా, చాలా మంది హిందువులు దీనిని అపవిత్రంగా భావించి తినలేదు. వారు ఆకలితో ఉండడం చూసి ఆ ముస్లిం కాపలాదారులు చాలా సంతోషించేవారు.  సావర్కర్ జీ హిందూ ఖైదీలకు రాముని పేరుకు, అన్ని అపవిత్రతలను తొలగించే శక్తి ఉందని వివరించేవారు.  దీని కారణంగా హిందూ ఖైదీలు శ్రీరాముని పేరు మీద ఆహారం తినడం ప్రారంభించారు;  అయితే ఇది ముస్లిం గార్డులకు చిరాకు తెప్పించింది. 


 ఒకసారి ఒక గార్డు, హిందూ ఖైదీతో అసభ్యంగా ప్రవర్తించేడు.  హిందూ ఖైదీల ఆత్మవిశ్వాసం ఎంతగా పెరిగిందంటే, అది విన్న అతను, గార్డు ఛాతీపైకి ఎక్కి రెండు చేతులతో కొట్టడంతో గార్డు స్పృహ కోల్పోయాడు. 


 ఈ సంఘటనతో భయపడిన ఆ గార్డులు హిందూ ఖైదీలను వేధించడం మానేశారు.  జైలులో ముస్లిం గార్డులు హిందూ ఖైదీలను వేధించి వారిని ముస్లింలుగా మార్చేవారు.  సావర్కర్ జీ అలా మతం మారిన వారందరినీ శుద్ధి చేసి మళ్లీ హిందువులుగా మార్చారు.


 వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్, హిందీ, హిందూ మరియు హిందుస్థాన్‌ లకు బలమైన మద్దతుదారు. సావర్కర్ జి 26 ఫిబ్రవరి 1966న మరణించారు.

Wednesday, 26 February 2025

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ మహిళా ఎస్సై*

 *ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ మహిళా ఎస్సై* 

ని


ర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సోదలు నిర్వహించగా ఎక్సైజ్ మహిళా ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్ లంచం తీసుకునే విషయంలో పట్టుబడ్డారు.


 భైంసా మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు తెల్లకల్లు వ్యాపారులు తమకు అనుమతించిన పరిధిలో తెల్లకల్లు అమ్ముకునే విషయంలో వివాదం తలెత్తింది. 


నిర్మల్‌ జిల్లాలోని కమోల్‌ గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి సుభాష్‌ గౌడ్ ఇటీవల ఒకరు తెల్లకల్లు అమ్మకం తమకు కేటాయించిన పరిధి కాకుండా ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారని ఫిర్యాదు చేశాడు.


బాధితుడి సుభాష్‌ గౌడ్‌ హద్దులోకి ఇతరులు రాకుండా చూసుకోడానికి మహిళా ఎస్సె దాదాపు పదివేల రూపాయల లంచం అడిగినట్లు ఫిర్యాదు దారుడు ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై, కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిర్మల్ లో గత ఆరు నెలల్లో 12వ ఏసీబి దాడులు కావడం గమనార్హం.

Tuesday, 25 February 2025

నల్గొండ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నాంపల్లి భాగ్య*

నల్గొండ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నాంపల్లి భాగ్


*నల్లగొండ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నాంపల్లి భాగ్య రెండోసారి నియమితులయ్యారు* హైదరాబాదులోని గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు, జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి చేతుల మీదుగా ఈ మేరకు నాంపల్లి భాగ్య నియామక పత్రాన్ని అందుకున్నారు.అదేవిధంగా మహిళా కాంగ్రెస్ పట్టణ కార్యదర్శులుగా నిర్మల, నవనీతను నియమించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన *రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గార్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు* 

నల్లగొండ పట్టణంలో మహిళా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మహిళా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.

Monday, 24 February 2025

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లోఅమరవాది లక్ష్మీనారాయణ గారినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలీ.:అధ్యక్షులు తెలుకుంట్ల చంద్ర శేఖర్


  రాబోవు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా ఈరోజు నలగొండ జిల్లాలోని స్టేట్ కౌన్సిల్ సమావేశం మిర్యాలగూడలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షులు తెలుకుంట్ల చంద్ర శేఖర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది,జిల్లా లోని 65 మంది ఓటర్లకు గాను 46 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో నల్లగొండ నలుమూలల నుంచి వచ్చిన కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా రాబోయే ఎలక్షన్లో అమరవాది లక్ష్మీనారాయణ గారినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది,  మిగిలిన సభ్యులను ఫోన్లో  సంప్రదించగా తమ ఓటును కూడా అమర వాది లక్ష్మీనారాయణ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది, ఈ సమావేశంలో రాష్ట్రఉపాధ్యక్షులు ఊరె లక్ష్మణ్ , వనమా సూరి అనంతరాములు, వనమా  వెంకటేశ్వర్లు,ఆలంపల్లి నర్సింహ,రాయపూడి భవాని ,తిరునగరు భార్గవ్, బుక్కఈశ్వ రయ్య టిరమేష్,తెడ్ల జవహర్ బాబు యా మదయాకర్ జైనిరాములు,నాంపల్లి భాగ్య పందిరి గీత,యమా కవిత వనమా హైమా అరుంధతి, లక్ష్మిశేట్టి పారిజాత,గుండా నాగరాజు,  జిల్లా నాయకులు పాల్గొన్నారు...

జిల్లా ఆర్యవైశ్య మహాసభ 

నల్లగొం

స్నానం చేస్తున్న సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారా? ఇది తప్పక చదవండి!

 

స్నానం చేస్తున్న సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారా? ఇది తప్పక చదవండి!

Peeing in the Shower Good or Bad: ఒక్కోసారి అర్జెంట్‌గా ఉన్నప్పుడు, లేక బాత్రూమ్‌కు వెళ్లడం కష్టం అనిపించినప్పుడు స్నానం చేస్తూ పీ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు.

 Peeing in the Shower Good or Bad: ఒక్కోసారి అర్జెంట్‌గా ఉన్నప్పుడు, లేక బాత్రూమ్‌కు వెళ్లడం కష్టం అనిపించినప్పుడు స్నానం చేస్తూ పీ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, దీన్ని అలవాటుగా చేసుకుంటే మాత్రం ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

స్నానం చేస్తున్నప్పుడు పీ చేయడం చాలామందికి కామన్ అలవాటే. 'ఇందులో ఏముందీ? టాయిలెట్‌కు వెళ్లాల్సిన పని మానిపోతుంది, నీరు కూడా ఆదా అవుతుంది' అనుకుంటారు. నిజానికి, ఒక సర్వే ప్రకారం 80శాతం బ్రిటిష్ ప్రజలు స్నానాల సమయంలోనే మూత్రం పోయడం కామన్ అని అంగీకరించారు. దీని వల్ల సంవత్సరానికి 4,000 లీటర్ల నీరు ఆదా అవుతుందని అంచనా. అంతేకాకుండా, యూకేలో ప్రతి ఏడాదికి £426 మిలియన్ (రూ. 4,500 కోట్లు) విలువైన నీటి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అయితే, దీని వెనుక ఆరోగ్య పరంగా, హైజీన్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయనే చెప్పాలి. నిజంగా ఇది మంచిదా? లేకపోతే దీని వల్ల ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయా?

హాని కలుగుతుందా?

నిపుణుల మాట ప్రకారం, స్నానం చేస్తూ పీ చేయడం మన పెల్విక్ ఫ్లోర్ కండరాలకు (Pelvic Floor Muscles) సమస్యను కలిగించొచ్చు. మనం సాధారణంగా టాయిలెట్‌లో కూర్చొని పీ చేసినప్పుడు, మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవుతుంది. కానీ, నిల్చొని లేదా బాత్‌రూమ్ ఫ్లోర్‌పై నిలబడి పీ చేయడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా మిగిలిపోవచ్చు. దీని వల్ల పెల్విక్ ఫ్లోర్ వీక్ అవ్వడం, మెల్లగా మూత్రం లీక్ అవ్వడం (Urinary Incontinence) లాంటి సమస్యలు రావచ్చు.

అంతేకాదు, స్నానం చేస్తున్నప్పుడు నీటి శబ్దం వింటూ పీ చేస్తే, దీని వల్ల నీటి శబ్దం విన్నప్పుడల్లా మూత్ర విసర్జన చేయాలనే అలవాటు ఏర్పడుతుంది. దీని ప్రభావం ఏంటంటే, బయట ఎక్కడైనా నీరు కారుతున్న శబ్దం, వర్షం, లేదా వాష్‌బేసిన్‌లో నీరు పడుతున్న శబ్దం విన్నా పీ చేయాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దీన్ని వైద్య నిపుణులు 'Conditioned Reflex' అంటారు. దీని వల్ల అసలైన అవసరం లేకపోయినా పీ చేయాలనిపించడం, అలాగే మూత్రాశయంపై అదనపు ఒత్తిడి రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇది పురుషులకు, మహిళలకు ఎలా భిన్నంగా ఉంటుంది?

పురుషులు సాధారణంగా నిల్చొని పీ చేయడంలో ఆచారపరంగా, శరీర నిర్మాణపరంగా అలవాటు అయిపోతారు. కానీ, మహిళలు నిల్చొని పీ చేయడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), మూత్రాశయ రాళ్లు (Bladder Stones), కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే, మహిళలకు పెల్విక్ ఫ్లోర్ వీక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పురుషులకు ప్రొస్టేట్ గ్రంథి సహాయం చేస్తుంది, కానీ మహిళలకు అలాంటి సహాయక వ్యవస్థ ఉండదు.

హైజీన్ పరంగా ఏమిటీ సమస్యలు?

చాలామంది మూత్రం అంటే బ్యాక్టీరియా ఉండదు, అది స్టెరైల్ అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ, శరీరాన్ని వదిలే సమయంలోనే మాత్రమే పీ స్టెరైల్‌గా ఉంటుంది, కానీ అది శరీరంపై లేదా బాత్‌రూమ్ ఫ్లోర్‌పై పడిన తర్వాత అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, ఇంట్లో అందరూ ఒకే బాత్‌రూమ్ ఉపయోగిస్తే, పీ పడిన ప్రదేశాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే కొన్ని ఇన్‌ఫెక్షన్లకు కారణం కావచ్చు. అంతేకాకుండా, నీరు, సబ్బు వాడుతున్నప్పుడు కూడా బాక్టీరియా, మూత్రంలోని ఖనిజాలు (Uric Acid, Ammonia) బాత్‌రూమ్ ఫ్లోర్‌పై పేరుకుని, గందంగా మారే అవకాశం ఉంటుంది. దీని వల్ల బాత్‌రూమ్ వాడే ఇతరులకు కూడా ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది.

ఒక్కోసారి అర్జెంట్‌గా ఉన్నప్పుడు, లేక బాత్రూమ్‌కు వెళ్లడం కష్టం అనిపించినప్పుడు స్నానం చేస్తూ పీ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, దీన్ని అలవాటుగా చేసుకుంటే మాత్రం ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, పెల్విక్ ఫ్లోర్ వీక్ అవ్వడం, మూత్రం లీక్ అవ్వడం, నీటి శబ్దం వింటూనే పీ చేయాలనే అలవాటు ఏర్పడడం, హైజీన్ సమస్యలు రావడం ఇవన్నీ దీని వల్ల సంభవించవచ్చు.

ఆర్యవైశ్యుడై ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలి*:మీలా వంశీ

 *ఆర్యవైశ్యుడై ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలి* 


👉 11 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలి 


👉 30 లక్షల మంది ఆర్యవైశ్యుల్లో 1000 మంది ఓటర్లతో గెలిచే గెలుపు గెలుపేనా...??


👉 అమరవాది లక్ష్మీనారాయణతో ఆర్యవైశ్యులు ఎంతో నష్టపోయారు 


👉 సూర్యాపేట పోలీస్ స్టేషన్లో లక్ష్మినారాయణపై ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు 


ఆర్యవైశ్యుడై ఉండి బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొంతమంది ఆర్యవైశ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలని జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు మీలా వంశీ


ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో  పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులుకు సోమవారం ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఇమ్మడి సోమ నరసయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవైశ్యులు ముసలివారు,  వెదవలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అని సంభోదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యుడై ఉండి ఆర్యవైశ్యులను కించపరచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 11 ఏళ్లు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఆర్యవైశ్యులకు సమస్యలు వస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్పందించకపోతే ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 ఏళ్లు అధ్యక్షుడిగా ఉండి తనకు తెలిసిన వారు బంధువులకు ఓట్లు నమోదు చేయించి వారి ఓట్లతోనే గెలవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉంటే 1000 మంది ఓటర్లు ఉండడం ఏమిటని ఆ ఓట్లతో గెలిచే గెలుపు గెలుపేనా అన్నారు. సూర్యాపేట మున్సిపల్ స్థానం జనరల్ కాగా మన ఆర్యవైశ్యుడికి చైర్మన్ పదవి ఇస్తామని ఇవ్వకుంటే ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. 11 సంవత్సరాలుగా మీ అధ్యక్ష పాలనలో ఆర్యవైశ్యులంతా వెనుకబడ్డారని విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని రిజర్వేషన్లు లేవని ఉన్న దగ్గర అన్యాయం జరుగుతుందని విలువ లేకుండా పోయిందన్నారు. ఆర్యవైశ్యులను గ్రూపులుగా విభజించి సిట్టింగులు వేయించి గెలవాలనుకోవడం దుర్మార్గమని ఇప్పటికైనా ప్రతి ఆర్యవైశ్యుడికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా సక్రమంగా బరిలో నిలిచి గెలవాలన్నారు.  ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు మీలా వంశీ మాట్లాడుతూ ఇప్పటికీ 11 సార్లు అధ్యక్ష పదవిలో అమరవాది లక్ష్మీనారాయణ ఉన్నారని ఆయన వల్ల ఆర్యవైశ్యులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. పైగా ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆర్యవైశ్యులను దుర్భాషలాడడం దారుణమని ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి 11 సంవత్సరాలుగా ఆయన ఏం చేశారో చెప్పకుండా తోటి ఆర్యవైశ్యులను దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై లక్ష్మీనారాయణకు పట్టింపు లేదని సమస్యల పరిష్కారం కు ఒక ప్రణాళిక తయారు చేసింది లేదన్నారు. అమరవాది లక్ష్మి నారాయణ వ్యాఖ్యలను ఆర్యవైశ్యులమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు గుండా శ్రీధర్, చింత వెంకన్న,  యామ సంతోష్,  మహంకాళి శివ,  తల్లాడ కృష్ణమూర్తి,  మాద్గుల శంకర్,  కొత్త వెంకటేశ్వర్లు, కర్నాటి వంశీ,  కొత్త వెంకన్న,  వంగవీటి రమేష్,  దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Sunday, 23 February 2025

యాదగిరిగుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్


 





 యాదగిరిగుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్


              :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ బంగారు గోపురాన్ని స్వామివారికి సీఎం రేవంత్ అంకితం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు నిర్ణయించిన సుమూర్తాన మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది. వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్ రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. Also Read ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న అనుష్క , ప్రభాస్ ఫిదా అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Powered By కాగా, యాదాద్రి ఆలయ గోపురానికి బంగారం తాపడం కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తయిన స్వర్ణతాపడ గోపురం ఇదే కావడం విశేషం. విమానంపై ఉన్న నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండవగా దర్శనమిచ్చాయి.

అధికారం అండతో రెచ్చిపోయిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ.. వెలుగులోకి బాగోతం


 అధికారం అండతో రెచ్చిపోయిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ.. వెలుగులోకి బాగోతం

 By Korivi Jayakumar 

                        : ప్రజలకు సేవ చేయాల్సిన గౌరవ ప్రదమైన పదవిలో ఉండి కూడా.. కొందరు మాత్రం అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఎందరో అధికారుల రాసలీలల బాగోతాలు బయటపడ్డాయి. ఈరోజు తెలంగాణలో జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ వ్యవహారం హాట్ టాపిక్ గా బయటపడిన తరుణంలో.. ఏపీలో మరో అధికారి వికృత చేష్టలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఏపీలోని గుంటూరు జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిరణ్. అయితే ఈయన వికృత చేష్టలు మాత్రం వెంటే.. ఈ వయసులోనే ఇలా ఉంటే.. ఆ వయసులో ఇంకెలా ఉన్నారో అని అందరూ అనడం ఖాయం. అంతే కాకుండా కట్టుకున్న భార్యని సైతం ఈ రకంగా చిత్ర హింసలు పెట్టిన ఆ కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. Also Read "ఛావా" సినిమా చూసొచ్చి.. రోడ్లపై రెచ్చిపోయి.. ముస్లింల పేర్లు కనబడితే.. కిరణ్ భార్య ఎల్ఐసీ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. భార్య, పిల్లతో హ్యాప్పీగా ఉండాల్సింది పోయి.. అధికారం అండతో పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు కిరణ్. కట్టుకున్న భార్యను మాత్రం చిత్ర హింసలు పెడుతూ.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు పంపి మానసికంగా వేధించేవాడని వాపోతుంది. ఇదేంటని ప్రశ్నిస్తే తనని, పిల్లలని చావగొట్టేవాడని కన్నేటి పర్యంతం అవుతోంది. కిరణ్ గత రాత్రి భార్యను చితకబాదడంతో.. ఆమె స్పృహ కోల్పోయింది. సమాచారం మేరకు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. ఈ మేరకు ఆయనపై అరండల్ పేట స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే భార్యకు అండగా వచ్చిన బందువులపై సైతం అట్రాసిటి కేసు పెడతానని కిరణ్ బెదిరించినట్టు సమాచారం. Recommended For You "నువ్వు ఈ లక్షణం మార్చుకో: మహేష్‌బాబుకు రాజమౌళి సీరియస్ వార్నింగ్" మరోవైపు జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్‌ను వేరే మహిళతో భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నారు. ఆ అమ్మాయితో ఉండగా.. భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది. గత కొద్దిరోజులుగా భర్తఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది. దాంతో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ దాడిలో గాయాలపాలైన జానకీరామ్‌ను ప్రస్తుతం చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే... వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఇప్పటికే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. వారిని స్టేషన్‌కి తరలించిన పోలీసులు.. కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలని శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని పోలీసులు సూచించారు.

ఢిల్లీకి నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

 

ఢిల్లీకి నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం


దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. సీఎంతో పాటు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, పంకజ్ సింగ్, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిరసా, రవీందర్ ఇంద్రజ్, కపిల్ మిశ్రా మంత్రులుగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, పలువురు ఆధ్యాత్మిక గురువులు హాజరయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Saturday, 22 February 2025

నల్గొండ జిల్లా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు లిస్ట్ చెల్లదు - జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లగొండ అశోక్


 నల్గొండ జిల్లా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు లిస్ట్ చెల్లదు - జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లగొండ అశోక్


నల్గొండ: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికల కు విడుదల చేసిన స్టేట్ కౌన్సిల్ మెంబర్ల లిస్టులో నల్లగొండ జిల్లా సంబంధించి స్టేట్ కౌన్సిల్ లిస్టు చెల్లదని దీనిపైన ఎన్నికల అధికారికి మరియు రిజిస్టర్ సొసైటీస్ కు ఫిర్యాదు చేయనున్నట్లు  జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లగొండ అశోక్ తెలిపారు. నల్లగొండ జిల్లా కు అధ్యక్షుడు గా ఎన్నికైన తెలుకుంట్ల చంద్రశేఖర్ నల్లగొండ జిల్లా లిస్ట్ మండల, పట్టణ సంఘా అధ్యక్షుల సిఫారసు తో రూపొందించి పంపాలి. కానీ అలా కాకుండా ఏకపక్షంగా కొంతమంది రాష్ట్ర, జిల్లా నాయకులు వారి ఇళ్లలో కూర్చొని వారికి నచ్చిన పేర్లు వారి బంధువుల పేర్లు వారి ఫ్యామిలీ ల పేర్లు కొన్ని రాసుకొని బైలాని తుంగలో తక్కినట్లు అయన ఆరోపించారు. దీనిపైన రిజిస్టర్  ఆఫ్ సొసైటీ లకు మరియు ఎన్నికల అధికారికి మరియు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఆ లిస్టును రద్దుపరిచి ప్రజాస్వామ్య బద్దంగా బైలా లో పేర్కొన్న ప్రకారంగా ఇప్పుడున్న అధ్యక్షుడు మండల పట్టణ అధ్యక్షులు సిఫారసుతో కొత్త లిస్టు అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ  కౌన్సిల్ మెంబెర్స్ తో నే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు జరగాలని ఆన్నారు.

 అవసరమైతే ఈ విషయాలు కోర్టుకు కూడా విన్నవించుకుంటామని ఇప్పుడు దాఖలైన కేసుల లో లో ఇంప్లీడ్ అయి  ఈ చెల్లని లిస్టుపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

ఈ విషయం పై జిల్లా అధ్యక్షుడు తెలుకుంట్ల చంద్రశేఖర్ మా ప్రతినిధి వివరణ కోరగా మేము పంపలేదని, 2024 సంవత్సరం లో గత అధ్యక్షులు పంపినారని, కొత్త కార్యవర్గం అడిగితే ఇంతకు ముందు పంపిన లిస్ట్ వర్తిస్తుంది అని చెప్పారని నేను లిస్టు పంపిస్తా అంటే అవసరం లేదుని పాతది పనికి వస్తుందని, రాష్ట్ర జిల్లా నాయకులు అన్నారని, నాకు కుడా లిస్ట్ పంపలేదు ముందు నామినేషన్ లు వేసినక పంపుతామ్ అన్నారని అయన తెలిపారు.

Friday, 21 February 2025

ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం






ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం నల్లగొండ జిల్లా.

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో మొదటి విడతగా తేదీ: 10-2-2025 నుండి 21-2-25 వరకు 12 రోజుల్లో 100 మందికి ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం జిల్లా గ్రామీణ సంస్థ నల్లగొండ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. 12 రోజులు ఇట్టి శిక్షణ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య రెవిన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మృత్య శాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇట్టి శిక్షణలో మంటలు, వరదలు, భూకంపాలు మొదలు విపత్తులు నిర్వహణ, ప్రతిస్పందన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్షించడం, ప్రధమశికిత్స చేయడం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడం మొదలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. 

శిక్షణ లో భాగంగా రెండు రోజులు రెండు గ్రూపులలో (నాలుగు గ్రామాలు) కనగల్, పర్వతగిరి, మునుగోడు, పులిపలుపుల గ్రామాల సందర్శన చేయించడం మరియు పానగలు ఉదయ సముద్రంలో ఫైర్ ముత్యశాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, ప్రాక్టికల్ గా శిక్షణ ఇవ్వడం  జరిగింది. శిక్షణతో పాటు ఆపదమిత్ర వాలంటీర్లు అందరికీ ప్రతిరోజు హార్ట్ఫుల్ నెస్ మెడిటేషన్ పై, 

 శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో,  శ్రీ వై. శేఖర్ రెడ్డి గారు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి/ ఆపద మిత్ర నోడల్ అధికారి  ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రాంతీయ శిక్షణ మేనేజర్ డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డిఐటి పి.వెంకటేశ్వర్లు శిక్షణ సమన్వయకర్తగా నిర్వహించారు. శిక్షణ ముగింపు రోజైన తేదీ 21-02-25 రోజున శిక్షణ పొందిన ఆపదమిత్ర వాలంటీర్లు అందరికీ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు డిఆర్డిఓ గారి చేతుల మీదుగా బహుకరించినారు. ముగింపు కార్యక్రమంలో డిఆర్డిఏ డిపిఎం మోహన్ రెడ్డి, ఏపిఎo ప్రభాకర్, డి.పి. ట్రైనర్ విష్ణువర్ధన్, జయ,వెంకన్న, జెఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ దేవాలయం సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

            ఎల్లమ్మ దేవాలయం సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి :         


 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి         
          :ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహా గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కూటమిలో కొత్త టెన్షన్- మారుతున్న లెక్కలు, చంద్రబాబు అలర్ట్..!!

 కూటమిలో కొత్త టెన్షన్- మారుతున్న లెక్కలు, చంద్రబాబు అలర్ట్..!! 


 ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు పూర్తయింది. ఈ సమయంలో ప్రభుత్వ పాలన పైన ప్రజల మూడ్ ఏంటనేది కీలకంగా మారుతోంది. గ్రాడ్యుయేట్ల నాడి కూటమి పైన ఎలా ఉందో తెలిసిపోనుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సిద్దమైంది. అయితే, క్షేత్ర స్థాయిలో మారుతున్న లెక్కలు కూటమి నేతల్లో టెన్షన్ పెంచుతున్నా యి. దీంతో.. సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. కూటమికి ప్రతిష్ఠాత్మకం రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్లు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ల సీట్ల గెలుపు కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఉభయగోదావరి, కృష్ణా - గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దులకు పీడీఎఫ్ గట్టి ఫైట్ ఇస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానం లో మాత్రం యూనియన్స్ మధ్య పోటీ నెలకొంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన కూటమి పార్టీల కేడర్ ను అలర్ట్ చేస్తున్నారు. Also Read గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి ..పెళ్లైన రెండేళ్లకు చంద్రబాబు అలర్ట్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు ఎన్నికల్లో గెలుపు సవాల్ గా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ కల్పన.. డీఎస్సీ నిర్వహణ అమలు పైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోనూ లోపం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి - క్రిష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు తున్నాయి. గుంటూరు-కృష్ణాజిల్లాల ప‌రిధిలో నాయ‌కుల స‌మ‌న్వ‌యం కొర‌వ‌డడినట్లు నివేదిక లు చంద్రబాబుకు అందినట్లు సమాచారం. దీంతో, మూడు పార్టీల నేతలతో చంద్రబాబు పలు మార్లు టెలికాన్ఫిరెన్స్ నిర్వహించి మార్గనిర్దేశం చేసారు. 

             మంత్రులకు సవాల్ క్రిష్ణా - గుంటూరు నియోకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్దికి కొందరు కూటమి నేతల నుంచే సహకారం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేదు. కానీ, పీడీ ఎఫ్ అభ్యర్దులు గట్టి పోటీ ఇస్తు న్నారు. ఇక, గోదావరి జిల్లాల్లోనూ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పేరాబత్తు ల రాజ‌శేఖ‌ర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేరాబత్తులకు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు తో పాటుగా ఇతరులు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఎన్నికా పరీక్షవంటిదేనని...మూడు పార్టీల అభ్యర్థులు కలిసి కట్టుగా పనిచేయాలని నిర్దేశించారు. ఇక.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో.. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల పై ఉత్కంఠ కొనసాగుతోంది.

TVAJAC పిలుపునిచ్చిన విద్యుత్ సౌద మహా ధర్నా

 TVAJAC  పిలుపునిచ్చిన విద్యుత్ సౌద మహా ధర్నా





నిన్న జరిగిన TVAJAC  పిలుపునిచ్చిన విద్యుత్ సౌద మహా ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసిన  టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి ఆర్టీషన్లను  భయభ్రాంతులకు గురి చేసిన కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆర్టీషన్  నాయకులకు  విద్యుత్ సౌదా ఆర్టిషన్ తరఫున ధన్యవాదములు

Thursday, 20 February 2025

సొసైటీ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలతో సజావుగా ఎన్నికలు జరుపుకోవాలని: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

          సొసైటీ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలతో సజావుగా ఎన్నికలు జరుపుకోవాలని: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   


                   ....   జై వాసవి కొంతమంది నిన్న మహాసభ ఎన్నికల లో రాజకీయ నాయకులను కలవడం అవసరమా అంటున్నారు మరి WAM సంస్థ రిజిస్ట్రేషన్ లో సభనిగా వున్న వ్యక్తి నామినేషన్ వేయద్దు అని ఎలా వేశారు ఎవరు అడగాలి రాష్ట్ర కౌన్సిల్ లో వున్న సాశ్వత సభ్యులను తొలగించడం జరిగింది ఎవరు అడగాలి ఎవరైనా సరే 2 సంవత్సరాలు అధ్యక్షులు గా ఉండి వేరే వారికీ అవకాశం ఇవ్వాలి దానిని తుంగలో తొక్కి 11 సంవత్సరాలకాలం అధ్యక్షులు గా ఉండి మల్లి తానే నామినేషన్ వేస్తే నిరకరించవలసిన వారే మద్దతుగా నిలిచారు కోలేటి దామోదర్ అన్న గారు 5 ఎకరాలు స్థలం ఇప్పిస్తే అమరవాది గారు తానే ఇప్పించానని తప్పుడు ప్రచారం చేస్తే అడిగేవారు లేరు శ్యామ్ అన్న గారు తన జిల్లాలో అధ్యక్షులు గా ఎన్నో కార్యక్రమాలు చేసి రాష్ట్ర అధ్యక్షులు గా నామినేషన్ వేస్తే తనకు ప్రచారం చేసిన వారిని ఎన్నికల అధికారిగా ప్రకటించి శ్యామ్ గారి నామినేషన్ చెల్లదని చెప్పడం ఇవన్నీ జరుగగా మహాసభ కు కొత్త వ్యక్తికి అధ్యక్షులు గా అవకాశం ఇవ్వాలి అని రాష్ట్ర ఆర్య వైశ్య అగ్రనాయకులు చెపితే కూడ వినకుండా తన ఇష్టం ప్రకారమే నడుస్తానని చెప్పితేనే అందరు కలిసి ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్లి సొసైటీ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలతో సజావుగా ఎన్నికలు జరుపలని కోరడం తప్పు అని అంటున్నారు అది వారికే తెలియాలి ఏది ఏమైన అధ్యక్షులు గా శ్యామ్ అన్న గారు ఒక్కరే కొత్తగా నామినేషన్ వేశారు కనుక తనని ఎకగ్రీవంగా ఎన్నుకొని మహాసభ పేరు ప్రతిష్ట ను పెంచే విధంగా అందరు సహకరించగలరు. మండలం జిల్లా అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించి వారు సంఘ నాయకులు గా తెలియజేసి సంబంధాలు కొనసాగించవచ్చు కానీ సంగంలో విషయాలు చెప్పుకోవడం మాత్రం తప్పు గా మాట్లాడుతున్నారు .

ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారు ప్రమాణస్వీకార సెలెబ్రేషన్స్

                ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారు ప్రమాణస్వీకారం సెలెబ్రేషన్స్                         ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆర్కే పురం ఆర్యవైశ్య సంఘం తరఫున సుమారు 40 మంది ఈరోజు ఆమెకు అభినందనలు తెలుపుతూ సెలెబ్రేషన్స్ చేశారు. ఈ కార్యక్రమం బుక్క రమేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇట్లు సగలా పురుషోత్తం గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్



సీఎంఆర్ చెల్లించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ హెచ్చరించారు.


      సీఎంఆర్ చెల్లించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని  అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ హెచ్చరించారు.






      గురువారం అయన తన ఛాంబర్ లో సీఎంఆర్ ,బ్యాంకు గ్యారంటీ తదితర విషయాలపై పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లుల సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.


     2023- 24 రబికి సంబంధించి ఇంకా కొంతమంది రైస్ మిల్లర్లు  9000 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ను చెల్లించాల్సి ఉందని, మార్చి 10 లోగా ఎట్టి పరిస్థితులలో సీఎంఆర్ ను చెల్లించాలని ,లేదంటే  కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పలుమార్లు సీఎంఆర్ విషయంలో హెచ్చరించినప్పటికి సీఎంఆర్ చెల్లించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు నిర్దేశించిన సమయంలో సీఎంఆర్ చెల్లించేలా పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దారులు సంబంధించిన రైస్ మిల్లులోనే ఉండి  సిఎంఆర్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

    బ్యాంకు  గ్యారంటీల పై  సమీక్షిస్తూ రైస్ మిల్లుల సంఘం ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు గ్యారంటీని వెంటనే సమర్పించాలని అన్నారు.

  ఈ సమావేశంలో రానున్న సీజన్ సిఎంఆర్ కు సంసిద్ధం  కావాలని ఆయన తెలిపారు.

     జిల్లా పౌర సరఫరాల  అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ,డిసిఓ పత్యా నాయక్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.

________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

అసంపూర్తిగా ఉన్న చందంపేట గ్రంథాలయ భవనాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల మంజూరు

  అసంపూర్తిగా ఉన్న చందంపేట గ్రంథాలయ భవనాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సంచాలకులకు ప్రతిపాదనలు పంపించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య


సమావేశం తీర్మానించింది.


     గురువారం అదనపు కలెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రత్యేక అధికారి జె. శ్రీనివాస్ అధ్యక్షతన తన చాంబర్లో నిర్వహించిన నల్గొండ జిల్లా గ్రంధాలయ సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు .


    2024 -25 సంవత్సరంలో గ్రంథాలయ సంస్థ ద్వారా చేసిన ఖర్చు, వచ్చిన రాబడులు, లైబ్రరీ సెస్, తదితర  అంశాలపై చర్చించారు. వార్తాపత్రికలకు సంబంధించి రిజిస్టర్, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ,అలాగే ఆడిటింగ్  చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా లైబ్రరీలో వాచ్ మెన్ నియామకానికి సంచాలకుల అనుమతి కోసం సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.


     జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బాలమణి ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, వయోజన విద్యాశాఖ పిఓ మమత, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

____________

ఆ బాధతోనే దూరంగా ఉంటున్నా- పవన్ కీలక వ్యాఖ్యలు..!!


 ఆ బాధతోనే దూరంగా ఉంటున్నా- పవన్ కీలక వ్యాఖ్యలు..!! 

            డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంలో జరుగుతున్న సమావేశాలకు కొద్ది రోజులుగా పవన్ దూరంగా ఉంటున్నారు. తాను పవన్ ఆరోగ్యం పై వాకబు కోసం ఫోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఆ మరుసటి రోజునే పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఇప్పుడు కూటమిలో సమన్వయం.. సమావేశాలకు తాను దూరంగా ఉండటానికి కారణాలను పవన్ వెల్లడించారు. కీలక అంశాలను వివరించారు. అసలు విషయం పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రభుత్వంలోని కీలక సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. మంత్రివర్గ భేటీతో పాటుగా మంత్రులు - కార్యదర్శుల సమావేశానికి పవన్ హాజరు కాలేదు. కేబినెట్ భేటీలో మంత్రుల ర్యాకింగ్స్ పైన పవన్ పదో స్థానంలో ఉండటం పైన చర్చ జరిగింది. కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పవన్ ఆరోగ్యం గురించి మంత్రి మనోహర్ ప్రస్తావన చేసారు. తాను పవన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని.. అందుబాటులోకి రాలేదని సీఎం చంద్రబాబు ఆ సమావేశం లోనే చెప్పుకొచ్చారు. ఇక, పవన్ వరుసగా దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు వెళ్లారు. Also Read 2032, డిసెంబర్ 22: ఎవరు ఉంటారో ఎవరు పోతారో..: నాసా తాజా స్టేట్‌మెంట్‌లో పవన్ క్లారిటీ ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ నైట్ కు పవన్ హాజరయ్యారు. అక్కడ చంద్రబాబు, లోకేష్ తో సహా నందమూరి బాలయ్యతోనూ సరదాగా కనిపించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడ నూతన సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సైతం అదే వేదిక పైన పవన్ ఆహార్యాన్ని చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లున్నారా అంటూ చమత్కరించారు. ఇంకా సమయం ఉందంటూ పవన్ చెప్పటంతో అందరిలోనూ నవ్వులు కనిపించాయి. ఇక, తాను ఈ సమావేశాలకు దూరంగా ఉండటం పైన పవన్ స్పష్టత ఇచ్చారు. ఏపిలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నామని పవన్ స్పష్టం చేసారు. అందుకే దూరంగా తాను వెన్ను నొప్పి కారణంగానే ఏపిలో కొన్ని సమావేశాలకి హాజరు కాలేకపోయానని వివరించారు. ఇప్పటికి వెన్న నొప్పి తీవ్రంగా బాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చటంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. అయినా.. చ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలుగా చెప్పిన పవన్.. నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రంగా పవన్ ఏపీలో కూటమిలో తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పవన్ స్పష్టం చేసారు.

లంచావతారులు! రైతునూ వదల్లేదు


 లంచావతారులు! రైతునూ వదల్లేదు

హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ACB)కు ఇద్దరు లంచావతారులు చిక్కారు. ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొప్పూరి ఆనంద్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గుత్తేదారుకు బిల్లు చెల్లించేందుకు ఆనంద్ కుమార్ రూ. 1.33 లక్షలు డిమాండ్ చేశారు. కాగా, వివిధ నిర్మాణ పనులు చేసినందుకు గుత్తేదారుకు రూ. 33,32,350లు మంజూరయ్యాయి. అయితే, ఆ బిల్లు చెల్లించడానికి ఆనంద్ కుమార్ రూ. 1.33 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. లక్ష లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆనంద్ కుమార్ ను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. దీంతో కోర్టు రిమాండ్ విధించడంతో అతడ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

    రైతు వద్ద లంచం డిమాండ్ చేసిన అధికారి 

 ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ మరో అధికారి అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతును లంచం కోసం వేధించిన సదరు అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి డి శాంతన్ కుమార్.. పత్తి పంటను విక్రయించడానికి అవసరమైన కూపన్ల జారీ కోసం ఓ రైతు నుంచి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. ప్రభుత్వ అధికారిగా తను చేయాల్సిన బాధ్యతను మరిచి రైతు నుంచి లంచం డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ డబ్బు తీసుకుంటుండగా.. అధికారి శాంతన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే.. 1064కు డయల్ చేయండి అని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.

Wednesday, 19 February 2025

ఢిల్లీ సీఎం గా రేఖ గుప్త.

 ఢిల్లీ సీఎం గా రేఖ గుప్త.


.. Congratulations
. మేడం... FDSDelhi New CM: కార్పొరేటర్ నుంచి సీఎం వరకు – రేఖా గుప్తా విజయయాత్ర


రాజకీయ అనుభవం లేకపోయినా, ప్రజాసేవే తన బలంగా నిలిపుకున్న రేఖా గుప్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పనిచేయలేదు. కానీ విద్యార్థి దశలోనే ABVP ద్వారా రాజకీయ ప్రవేశం చేసి, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు.


పితంపుర కౌన్సిలర్‌గా, షాలీమార్ బాగ్-బి కార్పొరేటర్‌గా విజయాలు సాధించి, ప్రజల నమ్మకాన్ని పొందారు. 2015, 2020లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా, 2025లో 29,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.


బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె, పదవులకతీతంగా ప్రజల్లో ఉండే నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రజాసేవ పట్ల ఆమె నిబద్ధత, పార్టీపై ఉన్న విశ్వాసమే ఆమెను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చాయి. "కార్పొరేటర్‌గా మొదలైన ప్రయాణం.. ముఖ్యమంత్రిగా నిలిచిన ఘనత!" ..

ఇసుక పై పూర్తి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి




 ఇసుక పై పూర్తి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

         వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ లనుండి సరఫరా చేసే ఇసుక పై పూర్తి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

       బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మైనింగ్ ,తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్  ఇసుక రీచ్ ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.

     కాగా వంగమర్తి ,ఇటుకలపహాడ్ రీచ్ ల వద్ద  ఇసుక తవ్వే ప్రాంతాలలో ఇదివరకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వే బ్రిడ్జి, ఇసుకను   లోడ్ చేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాత్రి సమయాల్లో కూడా స్పష్టంగా  కనిపించే సామర్థ్యం కలిగిన  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు వంగమర్తి ఇసుక రీచ్ నుండి తీసిన ఇసుక పరిమాణం వివరాలను  కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు .కాగా ఈ సంవత్సరం వంగమర్తి ఇసుక రీచ్ నుండి లక్ష 16 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను  తీసినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, ఇసుక సరఫరాను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు .ఎట్టి పరిస్థితులలో పరిమితికి మించి లోడును తీసుకువెళ్లకూడదని, అన్ని అంశాలకు రికార్డులు, రిజిస్టర్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇటీవల ఎస్పీ ఆదేశాల మేరకు వంగమర్తి ఇసుక రీచ్ వద్ద 24 గంటలు తనిఖీ చేసే విధంగా పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగింది  ఈ విషయాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేస్తున్నది, లేనిధి పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్, ఎస్పీ ,మైనింగ్ అధికారులు సందర్శించారు.

      కాగా జిల్లాలో వంగమర్తి తో పాటు, ఇంకా 24 ఇసుక రీచ్ లు ఉన్న విషయం తెలిసిందే .వీటి ద్వారా ప్రభుత్వ పనులకు ముఖ్యంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, తదితర శాఖలకు ఎంత ఇసుక అవసరం ఉందో దానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన విషయమై గురువారం సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

        జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వంగమర్తి  ఇసుక రీచ్ నుండి ఇసుక అక్రమంగా రవాణా కాకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు, తదితర విషయాలను జిల్లా కలెక్టర్  కు వివరించారు. 

     భూగర్భ జల వనరుల శాఖ సహాయ సంచాలకులు జాకబ్,ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు .

________________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Tuesday, 18 February 2025

వాస్తవం తెలుసుకోండి మిత్రులారా: కోలేటి దామోదర్*

 వాస్తవం తెలుసుకోండి మిత్రులారా:

కోలేటి దామోదర్* 


గళం విప్పిన *కోలేటి దామోదర్* అన్న గారు మహాసభ కు ప్రభుత్వం ఉప్పల్ బాగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలం విషయం లో  అమరావాది గారి ప్రమేయం ఏమి లేదని ముఖ్యమంత్రి గారు అన్ని కుల సంఘాల వారికీ స్థలాలు కేటాయిస్తుండగా పక్కనే వున్న నేను మా వైశ్యులకు కూడ స్థలం కేటాయించాలని అడగగా మీకు ఎందుకు అని అన్నారని దానికి వారు మా వైశ్యలలో కూడ పేదవారు వున్నారని వారికోసం కేటాయించాలని చెప్పగా ఒప్పుకోగా నా లేటర్ పాడ్ పై వినతి పత్రం ఇస్తే బాగుండదని మహాసభ ద్వార ఇవ్వాలని అధ్యక్షులు గారికి ఫోన్ చెసి విషయం చెప్పి లేటర్ పాడ్ తెమ్మనగా ఏ ప్రభుత్వం మనకు ఇవ్వదని అంటే సరే మా డ్రైవర్ ను పంపిస్తాను లేటర్ పాడ్ ఇవ్వండని తెప్పించుకొని మ్యాటర్ వ్రాసి మళ్ళీ సంతకం కోసం పంపించడం జరిగింది అని నా అభ్యర్తన (కోలేటి దామోదర్)మేరకు సుమారు 100 కోట్ల విలువ చేసే భూమి ఇప్పిస్తే కనీసం తనకు అభినందన సమావేశం ఏర్పాటు చేయకపోగా మళ్ళీ ఎన్నికల లో గెలవాలని రాష్ట్ర ఆర్య వైశ్యులకు తన ద్వారనే అ స్థలం వచ్చిందని తప్పుడు ప్రచారం చెయ్యడం సరి కాదని మహాసభ అధ్యక్షులుగా  *మిడిదొడ్డి శ్యామ్ సుందర్* గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి సహాయాసహకారాలు అందించాలని కోరారు

Monday, 17 February 2025

ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు

 ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు

హైద్రాబాద్ : 



ఎన్నికల అధికారి ప్రకటించిన వివరాలు


ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు. ఈరోజు నాగర్ కర్నూలు వాస్తవ్యులు, అడ్వొకేట్ అయిన శ్రీ ఎ.బంగారయ్య గారు లిఖితపూర్వకంగా మరియు నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ IA 39 of 2025 in EOP No. 1/2025 జత చేసి నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయుటకు అర్హుడు కాడని మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరగనందున మహాసభ నియమావళి 11 (డి) ప్రకారం అతనికి మరియు నాగర్ కర్నూలు జిల్లాలోని ఇతర సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని తెలియజేస్తూ, శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారి నామినేషన్ ను పరిగణన లోకి తీసుకోకూడదని మరియు తిరస్కరించవలెనని ఆయన ఆక్షేపణ తెలుపుతూ, దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవలసినదిగా కోరిన దృష్ట్యా, ఇట్టి విషయాన్ని మేము ప్యానెల్ ఆఫ్ అడ్వొకేట్స్తో సంప్రదించి నిర్ణయం ప్రకటించడం

జరుగుతుందని తెలిపారు...

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!



 

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!

రిటర్నింగ్ అధికారికి హై కోర్టు నోటీసులు!

ఎన్నికల్లో అవకతవకలపై కోర్టుల మొట్టికాయలు

ఫిబ్రవరి 8నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను తాత్కాలిక నిలిపివేత

మార్చి 4 వరకు స్టేటస్ కో

ఈ పిటిషన్లపై మార్చి 21న విచారణ

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలపై కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి తదళగుణంగా తీర్పుల నిచ్చాయి. ఏ వెంకటేశం అనే వ్యక్తి హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా అదనపు చీఫ్ జడ్జి – 2 మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియపై స్టేటస్కో విధిస్తూ యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. మహాసభ ఎన్నికల కోసం ఈనెల 8వ తేదీన విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. మార్చి 4వ తేదీ వరకు స్టేటస్కు కొనసాగుతుందని ఆదేశించారు. మహాసభ అధ్యక్ష ఎన్నిక కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించాలన్న అభ్యర్థులతో పాటు తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.                                   మరోవైపు ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ఈసీ సభ్యుడు గట్టు మహేష్ బాబు హైకోర్టులో వేసిన రిప్ పిటిషన్ పై కోర్టు స్పందించి మహాసభ ఎన్నికల నిర్వహణ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఐవిఎఫ్, వ్యామ్ పదవుల్లో ఉన్నవారు మహాసభ అధ్యక్ష పోటీకి అనర్హులని సూచిస్తున్న క్లాజ్ నెంబర్ 3 ను గట్టు మహేష్ బాబు సవాల్ చేయగా, ఆయా పదవుల్లో ఉన్నవారు పోటీకి అర్హులని, తదలగుణంగా వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ హైకోర్టు మహాసభ ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ రెండు కోర్టుల ఆదేశాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది.

అమరవాది లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా

 ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నామినేషన్ వేసిన గౌరవ అమరవాది లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా



33 జిల్లాల అధ్యక్షులు /ప్రధాన కార్యదర్శి/కోశాధికారులు మరియు కేవలం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఓటర్లు హాజరై పూర్తిగా ఏకగ్రీవంగా మద్దతు తెలిపినారు. మహాసభ గౌరవాన్ని పెంపొందించడానికి ,మహాసభ అభివృద్ధి కేవలం అమరవాది లక్ష్మీనారాయణ గారితో సాధ్యమని తెలిపినారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ప్రతినిధులు మరియు సుమారు 700 పైగా రాష్ట్ర కమిటీ ఓటు ఉన్న సభ్యులు పాల్గొని ఏకగ్రీవంగా మద్దతు తెలిపినారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి స్పందన

 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి  స్పందన

హైద్రాబాద్ :    చతికిల పడిపోయిన మహాసభ ను ప్రాణం పొసి పూర్వవైభవం తేవడానికి అమరవాదికి వ్యతిరేకంగా ఆర్యవైశ్య మహామహులు  గంజి రాజమౌళి గుప్త, కాల్వ సుజాత, , బొగ్గరపు దయానంద్, కోలేటి దామోదర్, మొగలపెల్లి ఉపేందర్, ప్రేమ్ గాంధీ, చకిలం  రమణయ్య, మరియు వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు కార్యదర్శులు కౌన్సిల్ సభ్యులు అభిమానులు పెద్దఎత్తున మహాసభ అభ్యర్థి శ్యాంసుందర్ కి మద్దతుగా తరలివచ్చినారు.

Sunday, 16 February 2025

ప్రణవ కార్పోరేట్ ఆఫీస్ లో వేదపండితులచే ఘనంగా పూజలు

                      ప్రణవ కార్పోరేట్ ఆఫీస్ లో వేదపండితులచే ఘనంగా పూజలు                   









                      *ప్రణవ గ్రూప్ అధినేత శ్రీ బూరుగు రవి కుమార్ గారు మరియు Executive Director & Chief Technology Officer (CTO) శ్రీ బూరుగు రాంబాబు గార్ల ఆధ్వర్యంలో సోమాజిగూడ లోని PRANAVA ONE HYDERABAD సోమాజిగూడ ప్రాంగణంలో 17-2-2025 సోమవారం రోజున ఉదయం గం.10. 56 ని. లకు. ప్రణవాలయంలో జరిగే శ్రీ మహాగణపతి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు 16-2-2025 ఆదివారం రోజున ప్రణవ కమర్షియల్ టవర్ లోని 18 వ అంతస్థులోని ప్రణవ కార్పోరేట్ ఆఫీస్ లో వేదపండితులచే ఘనంగా జరిగిన హోమం తదితర పూజా జరిగినది.



Saturday, 15 February 2025

ACB అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్

      అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్                   


 శేరిలింగంపల్లి : ట్రాన్స్ఫార్మర్ల మంజూరు కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్ అనేక అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. శుక్రవారం తన కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం విచారణ చేపట్టింది. ఏడీఈ సతీష్ కార్యాలయంతో పాటు మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని ఆయన నివాసం, అతని సన్నిహితుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సతీష్ కు ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది.

సుమారు రూ.100 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నాయని, నగరంలో పలుచోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందని తెలుస్తుంది. గతంలో చర్లపల్లిలో ఏడీఈగా పనిచేసిన సతీష్ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుని గత 6 నెలల క్రితమే గచ్చిబౌలి ఏడీఈగా వచ్చారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. వచ్చి రాగానే కార్యాలయంలో వాస్తు బాగాలేదని, ఇప్పటికే గచ్చిబౌలిలో ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో తనకు అలాంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశ్యంతో సుమారు రూ.3 లక్షల వరకు వెచ్చించి మార్పులు చేర్పులు చేసుకున్నట్లు తెలుస్తుంది. గచ్చిబౌలి ఏడీఈగా వచ్చేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేసిన సతీష్ వాటిని ఏడాదిలోగా తిరిగి సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకుని లంచావతారం ఎత్తినట్లువిశ్వసనీయ సమాచారం. సతీష్ అక్రమాస్తుల పై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

వృద్ధాప్యాన్ని కూడా దరికి చేరనివ్వని చిట్కా.. ఈ రెండు తీసుకుంటే మార్పు పక్కా.

 

వృద్ధాప్యాన్ని కూడా దరికి చేరనివ్వని చిట్కా.. ఈ రెండు తీసుకుంటే మార్పు పక్కా.                                                       ప్రకృతి మనకు అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలను అందించింది. అందులో తేనె , వెల్లుల్లి అనేవి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని రోజువారి వంట్లో ఉపయోగిస్తాం. వీటిని కలిపి తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదం , నేచురోపథీ ప్రకారం, ఈ రెండు పదార్థాలు శరీరాన్ని డిటాక్స్ చేయడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
తేనె - వెల్లుల్లి రెండు కూడా నేచురల్ యాంటీబయాటిక్స్. వెల్లుల్లిలో అలిసిన్ (Allicin) అనే రసాయనం ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయగలదు తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. నిత్యం ఖాళీ కడుపుతో తేనె-వెల్లుల్లి తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది. వెల్లుల్లి రక్తాన్ని పలుచని చేయడంతో పాటు, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. తేనె హెచ్చిన గుండె జబ్బులను నివారించేందుకు సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు, బీపీని కంట్రోల్ చేస్తుంది. నిత్యం తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.Powered By Logo

కొవ్వును కరిగిస్తుంది:

వెల్లుల్లి కొవ్వు కణాల శక్తిని పెంచి, వాటిని వేగంగా కరిగించేలా చేస్తుంది. తేనెలో ఉండే నేచురల్ ఎంజైములు శరీరంలోని మెటబాలిజాన్ని పెంచి, కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

తేనె, వెల్లుల్లి కలిపిన మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడతాయి. లివర్ పనితీరును మెరుగుపరిచే శక్తి తేనెకు ఉంది. రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బను తేనెతో కలిపి తింటే, శరీరంలోని హానికరమైన రసాయనాలు త్వరగా బయటకు పోతాయి.                                                 ఆరోగ్యం మెరుగుపరిచే గుణం:                          తే నె   మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. వెల్లుల్లి లోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఈ మిశ్రమాన్ని చర్మంపై ప్యాక్‌లా వేసుకుంటే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. తేనె ప్రాణాయామం, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. వెల్లుల్లి గొంతు ఇన్‌ఫెక్షన్, దగ్గు, గుండెపోటు సమస్యలను తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటితో తేనె, వెల్లుల్లి తీసుకుంటే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

ఆరోగ్యం

 

వార్తలు

 

ఆంధ్రప్రదేశ్

 

తెలంగాణ

 

రాజకీయాలు

 

స్పోర్ట్స్

 

మూవీస్/గాసిప్స్

 

ఎడ్యుకేషన్

 

జాబ్స్

 

సైన్స్&టెక్నాలజీ

 

ఎన్నారై

 

లైవ్ టీవీ

 

నగరం

 

మైఖేల్ స్పోర్ట్స్

 

జాతీయ వార్తలు

 

అంతర్జాతీయం

 

మనీ

 

జ్యోతిషం

 

ప్రకటన

 

ట్రెండింగ్ వీడియోలు

Notifications

Get Updates

Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హోమ్ / Health

వృద్ధాప్యాన్ని కూడా దరికి చేరనివ్వని చిట్కా.. ఈ రెండు తీసుకుంటే మార్పు పక్కా!

By Kolli Venkata Kishore

 Published: Friday, February 14, 2025, 14:20 [IST]

ప్రకృతి మనకు అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలను అందించింది. అందులో తేనె , వెల్లుల్లి అనేవి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని రోజువారి వంట్లో ఉపయోగిస్తాం. వీటిని కలిపి తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదం , నేచురోపథీ ప్రకారం, ఈ రెండు పదార్థాలు శరీరాన్ని డిటాక్స్ చేయడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.



రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది:

తేనె - వెల్లుల్లి రెండు కూడా నేచురల్ యాంటీబయాటిక్స్. వెల్లుల్లిలో అలిసిన్ (Allicin) అనే రసాయనం ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయగలదు తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. నిత్యం ఖాళీ కడుపుతో తేనె-వెల్లుల్లి తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది. వెల్లుల్లి రక్తాన్ని పలుచని చేయడంతో పాటు, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. తేనె హెచ్చిన గుండె జబ్బులను నివారించేందుకు సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు, బీపీని కంట్రోల్ చేస్తుంది. నిత్యం తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.



If you take garlic and honey together you won t even age

వృద్ధాప్యం ఆలస్యమయ్యేలా చేస్తుంది:

వెల్లుల్లి పేగులలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి, మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. తేనె కూడా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగుల్లో గల హెలికోబాక్టర్ పైలోరి (H. Pylori) వంటి హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. తేనెలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ముప్పు తగ్గించి తొలుచూపులు, ముడతలు ఆలస్యంగా రావడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి శరీర కణాల్లో జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజిని తగ్గిస్తుంది.


కొవ్వును కరిగిస్తుంది:

వెల్లుల్లి కొవ్వు కణాల శక్తిని పెంచి, వాటిని వేగంగా కరిగించేలా చేస్తుంది. తేనెలో ఉండే నేచురల్ ఎంజైములు శరీరంలోని మెటబాలిజాన్ని పెంచి, కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

తేనె, వెల్లుల్లి కలిపిన మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడతాయి. లివర్ పనితీరును మెరుగుపరిచే శక్తి తేనెకు ఉంది. రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బను తేనెతో కలిపి తింటే, శరీరంలోని హానికరమైన రసాయనాలు త్వరగా బయటకు పోతాయి.


చర్మ ఆరోగ్యం మెరుగుపరిచే గుణం:

తేనె మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. వెల్లుల్లి లోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఈ మిశ్రమాన్ని చర్మంపై ప్యాక్‌లా వేసుకుంటే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. తేనె ప్రాణాయామం, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. వెల్లుల్లి గొంతు ఇన్‌ఫెక్షన్, దగ్గు, గుండెపోటు సమస్యలను తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటితో తేనె, వెల్లుల్లి తీసుకుంటే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.                                         డయాబెటిస్ నియంత్రణ:                                 తేనె రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. వెల్లుల్లి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించగలదు. అయితే, తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది. వెల్లుల్లి మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి, మతిమరుపును తగ్గించడానికి సహాయపడుతుంది. తేనె మెదడు నరాలను శక్తివంతం చేసి ఊహాశక్తి పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.


తీసుకునే విధానం:

ఉదయం ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను బాగా ముద్ద చేసి, ఒక చెంచా తేనెతో కలిపి తినాలి. దీన్ని తీసుకున్న 30 నిమిషాల తర్వాత మాత్రమే అల్పాహారం చేయాలి. మంచి ఫలితాల కోసం కనీసం 30 రోజులు కొనసాగించాలి. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.