పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?
పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?
వంట గ్యాస్ సరఫరా.. ధరలు వినియోగదారుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పరిమితుల పైన ఆంక్షలు విధించారు. అటు కమర్షియల్ గ్యాస్ సరఫరా సమస్యతో హోటళ్లు మూత బడుతున్నాయి. కేంద్రం ఈ పరిస్థితుల పై అధ్యయనం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పెరిగిన వంట గ్యాస్ ధరల పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. సరఫరా, బుకింగ్ లో పరిమితులు వినియోగ దారులకు సమస్యగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒకే సారి ఏకంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చేలా.. ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. దీంతో పాటుగా సిలిండర్ బుకింగ్ కోసం పరిమితులు.. గడువు విధించింది. దీంతో.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కాగా, దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!
central-key-discussions-over-the-lpg-rates-reports-indicate-a-further-increase-in-prices-here-the
అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పెరిగిన ధరల పై పునరాలోచన
ఈ పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పశ్చిమాసియా పరిస్థితులతో పాటుగా వంట గ్యాస్ సరఫరా.. పెరిగిన ధరల పైన సమీక్ష చేయనుంది. ఈ వారంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతిపక్షాలు వంట గ్యాస్ ధరల పెంపు పైన రాజకీయం గా టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలను ఎంత మేర తగ్గిస్తే.. ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందీ... పశ్చిమాసియాలో ఎప్పటి లోగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశాల పైన చర్చించనున్నారు. ఎన్నికల వేళ వంట గ్యాస్ ధరల పైన పునరాలోచన చేయకుంటే నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. గ్లోబల్ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ వినియోగంపై నియంత్రణ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజు కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home