Friday, 31 January 2025

*కాంగ్రెస్ నేతలకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటారుమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి




*కాంగ్రెస్ నేతలకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటారు:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి


*బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులు విమర్శించే స్థాయి లేదు*


*మందడి సైదిరెడ్డిని పట్టణ ప్రజలు చైర్మన్ గా గుర్తించలేదు*


*ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు*


*గుమ్ముల, బుర్రి విమర్శిస్తే గుణపాఠం తప్పదు*


*బిఆర్ఎస్ నేతలకు యువజన కాంగ్రెస్ హెచ్చరిక*


********************************************"**"*""

*నల్లగొండ: 

పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని  యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు అన్నారు. 

శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ను విమర్శించే స్థాయి లేదన్నారు. 

మందడి సైదిరెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆయనను ఎవరు చైర్మన్ గా గుర్తించలేదని భూపాల్ రెడ్డి డ్రైవర్ గానే గుర్తించారని అన్నారు. 

మా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించి బీఆర్ఎస్ పార్టీ నేతలతో మెప్పు పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

బిఆర్ఎస్ పార్టీ నేతల ఒక్కొక్క ఒక్కొక్కరి చరిత్ర మాకు తెలుసని అన్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేక అధికారం కోల్పోయిన తర్వాత నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 

నల్లగొండలో ఏ అభివృద్ధి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి అని స్పష్టం చేశారు. 

గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి  శ్రీనివాస్ రెడ్డిలు రాజకీయాలలోకి వచ్చినప్పుడు మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్ లకు రాజకీయ వనమాలు కూడా తెలవని ఎద్దేవ చేశారు. 

అలాంటివారు కూడా మా నాయకుల గురించి మాట్లాడం సిగ్గుచేటని విమర్శించారు. 


కాంగ్రెస్ పార్టీ నాయకులు *రేగట్టే లింగస్వామి గౌడ్* మాట్లాడుతూ  మందడి సైదిరెడ్డి స్థాయిని మించి మాట్లాడుతున్నాడని ధ్వజ మెత్తారు.

ఆయన కాలం కలిసి వచ్చి మున్సిపల్ చైర్మన్ అయ్యాడనీ అన్నారు. 

ఆ పార్టీ నాయకులే ఆయనను పలుమార్లు చైర్మన్ ప్రయత్నాలు చేసిన సంగతి తెలియదా అని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ గా తీర్మానాలు లేకుండా పనులు చేసి మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 

ఈ విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్ కుమార్, మహమ్మద్ ముజ్జు, కె.వి.ఆర్ సతీష్, బోరిగం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

217 ఉచిత వివాహం మొగుళ్లపల్లి ఉపేందర్

 ఈ రోజు మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్





గారి ఆధ్వర్యంలో 217 ఉచిత వివాహం 31.1.2025 ఉదయం 9.53 ని సుమన్ కు మౌనిక తో పూర్తి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది 

శ్రీ కోటగిరి సుధాకర్.. ఉదయ లక్ష్మి కుమారుడు సచిన్.. సంధ్య గార్ల ఆర్థిక సహకారం తో శ్రీ దాస ఆంజనేయ దేవాలయం కొత్తపేట లో ముఖ్య అతిధి గా స్థానిక కార్పొరేటర్ శ్రీ నాయకోటి పవన్ గారు నూతన దంపతులకు ఆశీస్సులు అందచేశారు 

ఉచిత వివాహం ఇద్దరు స్త్రీ పురుషులను భగవంతుడు నిర్ణయిస్తే ఏకం చేసే పవిత్రమైన కార్యక్రమం దేవుడు ఇచ్చిన వరం గా భావిస్తూనానని ఉపేందర్ అన్నారు ఈ వివాహ కార్యక్రమం చేయడం పూర్వ జన్మ సుకృతం గా భావిస్తూ.. సభ్యులు శ్రీ తుమ్మల బాల్ రెడ్డి దాత.. Y సత్యనారాయణ .చోళ్ళేటి ఆనంద్ చొప్పవరపు పవన్ అధ్యక్షులు ఇమ్మడి నారాయణ విజయ్ బొడ్ల సత్యనారాయణ హాజరైనారు..మీ ఉపేందర్ మొగుళ్లపల్లి.. ప్రతి కార్యక్రమం కు సహాయ సహకారం చేస్తున్న మా స్నేహితులు బంధువులు దాతలు ఏప్పుడు ఆనందం గా ఐశ్వర్యం గా ఆరోగ్యం ఉండాలని దేవున్ని కోరుతూ ప్రార్ధన .

Thursday, 30 January 2025

ACB: ఏసీబీ వలలో ఎస్సై, పశువైద్యాధికారి


 కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన వ్యాపారి కొండేశ్‌ తన కారును నిజామాబాద్‌కు చెందిన స్వామి అనే వ్యక్తికి 2022లో విక్రయించారు. విక్రయం సమయంలో ఆ కారుపై ఉన్న వాయిదాలను కొన్నవారే చెల్లించాలని ఒప్పందం కుదిరింది.                                                       కేసు నమోదు చేయకుండా ఉండేందుకు, ఎన్‌వోసీ

ఇచ్చేందుకు లంచాలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

ఖిల్లా (నిజామాబాద్‌)/ ఉట్నూర్‌: ఓ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు, మరో ఉదంతంలో ఎన్‌వోసీ ఇచ్చేందుకు లంచాలు తీసుకుంటూ ఎస్సై, పశువైద్యాధికారి ఎసీబీ అధికారులు దొరికిపోయారు. కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన వ్యాపారి కొండేశ్‌ తన కారును నిజామాబాద్‌కు చెందిన స్వామి అనే వ్యక్తికి 2022లో విక్రయించారు. విక్రయం సమయంలో ఆ కారుపై ఉన్న వాయిదాలను కొన్నవారే చెల్లించాలని ఒప్పందం కుదిరింది. అయితే స్వామి ఆ వాయిదాలను చెల్లించకపోవడంతో అసలు యజమాని కొండేశ్‌కు బ్యాంకు అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. దీంతో స్వామిపై కొండేశ్‌ లింగంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో లింగంపేట ఎస్సై సుధాకర్‌ కారుతో సహా స్టేషన్‌కు రావాలని స్వామికి సూచించారు. స్వామి కారు తీసుకుని స్టేషన్‌కు వెళ్లగా కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్‌ చేశారు.


తాను అంతివ్వలేనని రూ.12,500 ఇస్తానని ఎస్సైతో చెప్పిన స్వామి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు నిజామాబాద్‌లోని రుక్మిణి చాంబర్‌ సమీపంలో స్వామి.. రూ. 12,500 నగదును ఎస్సైకు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన్ను పట్టుకున్నారు. మరో ఉదంతంలో.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం సాంపూర్‌ గ్రామ పశు వైద్యాధికారి రాథోడ్‌ రమేశ్‌ తనతో పాటు ఆసుపత్రిలో పనిచేసిన ఉద్యోగికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ.25 వేలు డిమాండ్‌ చేశారు. చివరకు ఇద్దరి మధ్య రూ. 15 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం పశువైద్యాధికారి రాథోడ్‌ రమేశ్‌ కార్యాలయంలో సదరు ఉద్యోగి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్టు చేశారు.

Wednesday, 29 January 2025

టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు...ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

 టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు...

*  గుట్ట ప‌విత్ర‌త కాపాడేలా చ‌ర్య‌లు...

* భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌

* ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌:  తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల (టీటీడీ) త‌ర‌హాలోనే యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు ఏర్పాటు  కు వేగంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సీఎం సూచించారు. యాద‌గిరిగుట్ట బోర్డు నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న నివాసంలో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌లలో మాదిరే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలో రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌ని, ఆల‌య ప‌విత్ర‌త కు భంగం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నియామ‌కంతో పాటు ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, సేవా కార్య‌క్ర‌మాల‌పై ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌లు మార్పులు సూచించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు,  ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా

        ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా.           


   ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండటంతో హరీశ్ గుప్తాను నియమించింది. కాగా ఎన్నికల సమయంలోనూ హరీశ్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు

Tuesday, 28 January 2025

నల్లగొండ డి పి ఆర్ ఓ గారిని పరామర్శించిన జర్నలిస్టు నాయకులు

ఈరోజు నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్ పౌర సంబంధాల శాఖ వెంకటేశ్వర్లు గారి తండ్రి పరమపదించిన సందర్భంగా వారి స్వగృహమైన మహబూబ్నగర్ లో పరామర్శించడం జరిగినది, ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ పౌర సంబంధాల శాఖ శ్రీనివాస్ గారు, మరియు చిన్న పత్రికల సంఘం నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ ఉపాధ్యక్షులు సోమవరపు యాదయ్య ఉపాధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమరాజు శ్రీనివాస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మక్సుద్ అహ్మద్ పాల్గొన్నారు.


రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారి...

 

రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారి...

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యుత్ శాఖ సెక్షన్ ఏఈ కృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు.                                   తూప్రాన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యుత్ శాఖ సెక్షన్ ఏఈ కృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. కొంతకాలంగా కాళ్లకల్ ఏఈ కృష్ణపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి సోదాలు నిర్వహించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం విద్యుత్ సెక్షన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అతడిని విచారణ చేస్తున్నారు. ఫిర్యాదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మౌని అమావాస్య అనగానేమి ? మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి ?*

 _*రేపు మౌని అమావాస్య*_



*మౌని అమావాస్య అనగానేమి ? మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి ?*


పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్రస్నానాలు ఆచరిస్తారు.  స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసేచోట చేస్తే పెరుగుతుంది.  మరో ముఖ్య విషయం మౌని అమావాస్య సాధారణంగా ఆంగ్ల సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది.


*మౌని అమావాస్య ప్రాముఖ్యత*


మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు , సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి , దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు.  ఏమీ చెప్పవలసిన అవసరం కానీ , చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు.


గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.


గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు.  వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి , మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు ఎంత ముఖ్యమైనదంటే  5 కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంగమ్ ఘాట్ల దగ్గర చేరి పవిత్రస్నానం ఆచరిస్తారు.


మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరభారతం వారు పాటించే క్యాలెండర్ లో మాఘమాసంలో వస్తుంది


*మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత*


మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని , అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు.

మౌనికి అనువాదం - మాట్లాడకుండా మౌనంగా ఉండటం , అమ - చీకటి మరియు వస్య - కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని , కామాన్ని తొలగించుకోవాలని.

చంద్ర దేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు.

భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు - *'మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు , అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీమీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.'*

శరీరాన్ని , మనస్సును , ఆత్మను శుద్ధిచేసుకునే పవిత్రనదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు.


*మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలి?*


సాంప్రదాయంగా , భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు.  మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే , మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు. 


మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే

మీ ఇంట్లో గంగానది నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే , అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి జతచేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు.

*'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ,*

*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'*

పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది.


*పితృపూజ*


పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని , వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ , వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు.


*ధ్యానం*


ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉఛ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది.


*రుద్రాక్షలు*


చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.


*మూన్ స్టోన్*


మూన్ స్టోన్ ను మనస్సుకు సానుకూలత ఏర్పడటానికి వాడవచ్చు.

జంతువులకి ఆహారం పెట్టడం కుక్కలు , ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు.


*శనీశ్వరుడు*


మౌని అమావాస్య నాడు శనేశ్వరుడిని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు శనేశ్వరుడికి అభిషేకం చేస్తారు.


*దానాలు*


ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైనవారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం , బట్టలు ఇవ్వవచ్చు.

Monday, 27 January 2025

ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* *- నారా చంద్రబాబు నాయుడు*



*ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* నారా చంద్రబాబు నాయుడు* 



*- వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు* 



ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు నారా లోకేష్ గారిని ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మానిఫెస్టో లో పెట్టాలని కోరగా ఆ నాడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని

అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మానిఫెస్టో లో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. మానిఫెస్టో లో పెట్టడంతోపాటు ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 'మాఘ శుద్ధ విదియ ' తిథి నాడు నిర్వహించాలని జీవో నెంబర్ 181 ని విడుదల చేసింది ఎన్డీయే ప్రభుత్వం. ఆర్యవైశ్య ఇలవేల్పు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. 

ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తెలిపారు. నాడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో వివిధ ఆర్యవైశ్య సంఘాల నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు,వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్  అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారు, అవోప మహిళా విభాగం అధ్యక్షురాలు ఆరవీటి నిర్మల గారు,ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ సేగు షణ్ముఘం గారు, విబిజి గ్రూప్ ఫౌండర్ ఎం.రాజు గారు, ఆర్యవైశ్య సత్ర సముదాయం సెక్రటరీ గురు బ్రహ్మం గారు మరికొందరు ఆర్యవైశ్య నాయకులు నంద్యాల నాగేందర్, పత్తి హిమబిందు, పల్లపోతు వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది. ఈనెల 31 వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ గారు పిలుపునిచ్చారు.

Acb వలలో


 ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్ 32వ వార్డు అధికారి నల్లంటి వినోద్, తెలంగాణ ఏసీబీ అధికారులకు "రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇంటి మంజూరు దరఖాస్తులు ప్రాసెస్ చేయాలని" ఫిర్యాదుదారుడి వద్ద నుండి రూ.2,500/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించిన తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

2nd day started of Strick


2nd day started of Strick 



Saturday, 25 January 2025

గణతంత్ర దినోత్సవం జనవరి 26



 *📡🇳🇪🇳🇪🇳🇪 🫵 ఈ దేశ ప్రజలకు మన రాజ్యాంగం✍️ కల్పించిన మొదటీ హక్కు✊ఈరోజు అతి ముఖ్యమైన సమాచారం,👇🇳🇪👇,,,🇳🇪August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?✍️*


*ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.*


 *అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.* 


*ఆ తేడా ఏమిటో  తెలుసుకుందాము*👇


*👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.*


 *ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.* 

*మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.* 


*👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. 

*ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.*

 ( *గమనిక:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి* ).


*దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.*


 *స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.*

*అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.*


*అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే..*


*👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు*(Flag Hoisting).

*👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు* (Flag Unfurling) .


*ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.*


*👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది.*


*👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.*


*ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).*


🇮🇳🇮🇳🇮🇳🙏🇳🇪🇳🇪🙏🙏🤝🤝🤝🫡🫡

ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదు*:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*




ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదు:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*


*ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి*


*వచ్చే ఎన్నికల్లో తన పోటీ చేసినా చేయకపోయినా ప్రజలకు సేవ చేస్తా*


*ప్రజల మనసులు గెలుచుకొని మళ్ళీ కౌన్సిల్లోకి రావాలి*


**రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*


*మున్సిపల్ నూతన కౌన్సిల్ సమావేశం, కమిషనర్ ఛాంబర్ ను ప్రారంభించిన మంత్రి*


*********"***************************************


*నల్గొండ*:

ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ

శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

శనివారం నల్గొండ మున్సిపల్ పాలకవర్గం చివరి సమావేశం, సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ నూతన కౌన్సిల్ సమావేశ మందిరం, కమిషనర్ చాంబర్ ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయంలో ఉన్నప్పుడు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినా చేయకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. 

నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ పాల వర్గం ఎంతో కృషి చేసిందని అభినందించారు. 

పట్టణ ప్రజలకు ప్రధాన సమస్యలైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,సిసి రోడ్లు,తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. 

ప్రస్తుత కౌన్సిలర్లు మాజీలైన ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. 

మున్సిపాలిటీ పాలకవర్గం ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన సాగుతున్న మాజీ కౌన్సిలర్లంతా ప్రజల సమస్యలను అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. 

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరోసారి ప్రజల మనసులను గెలుచుకొని మళ్లీ కౌన్సిల్లో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. 

వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

అనంతరం మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించారు.మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు అందరితో మంత్రి ఫోటోలు దిగారు. అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లను మంత్రి ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్,నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ముసాక్ అహ్మద్, అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు,మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు 200 మందికి అమరజీవి సేవా సంస్థ ద్వారా అన్నదానం

           బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు 200 మందికి అమరజీవి సేవా సంస్థ ద్వారా అన్నదానం                             



                           ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మన సుజాతక్క పుట్టినరోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు 200 మందికి అమరజీవి సేవా సంస్థ ద్వారా అన్నదానం చేయడం జరిగింది అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది మీ సర్ ఆఫ్ తులసి గుప్తా


Wednesday, 22 January 2025

ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోండి:.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోండి....  



ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి  పదకాలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని. నాలుగు పథకాలకు జరిగే గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో బుధవారం గ్రామ, వార్డ్ సభలు నిర్వహించగ మొత్తం 475 గ్రామ పంచాయితీలు ఉండగా 139 గ్రామ సభలు, 05 మున్సిపాలిటీ పరిదిలోని 141 వార్డులలో 35 వార్డ్ సభలను   అధికారులు నిర్వహించారు. గ్రామ సభలలో 616 మంది రైతు భరోసా కొరకు, 5537 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 4384 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 6124 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వార్డ్ సభలలో 14 మంది మంది రైతు భరోసా కొరకు, 03 గురు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 972మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 1042మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 630 మంది రైతు భరోసా కొరకు, 5540 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 5356 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 7166 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

కుంభమేళా అసలు కథ ఏంటో తెలుసా?





 కుంభమేళా అసలు కథ ఏంటో తెలుసా? 

 కుంభమేళా అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు ఒక ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా గుర్తింపు పొందిన ఈ మహా కుంభం, దాని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమూహాల్లో మహా కుంభమేళా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇది ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద ఈవెంట్ కావడంతో ప్రపంచం మొత్తం ఈ కుంభమేళా వైపే చూస్తోంది. ఇప్పటికే త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. హిందువులు జరుపుకునే అతిపెద్ద వేడుకల్లో ఇది ఒకటి. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ కుంభమేళా విశిష్టతలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కుంభమేళ పవిత్రత కుంభమేళాలో స్నానం చేస్తే వంద జన్మల పుణ్యం వస్తుందని మన పూర్వికులు చెబుతుంటారు. ఎందుకంటే మూడు నదులు కలిసే ప్రదేశంలో కుంభమేళా నిర్వహించినప్పుడు ఆ ప్రదేశంలోని నీరు అమృతంలా మారుతుందని, దీని కారణంగా అందులో స్నానం చేసే భక్తుల బాధలన్నీ పోతాయని నమ్ముతారు. అందుకే త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కుంభమేళాలో పాల్గొనడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని చెబుతున్నారు. 

: కుంభమేళా స్పేస్ వ్యూ చిత్రాలు చూశారా ..!" 

కుంభమేళా జరిగే ప్రధాన ప్రదేశాలు కుంభమేళా మన దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనది త్రివేణి సంగమం. ఆ నాలుగు ప్రధాన నగరాలు ఏవంటే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మధ్యప్రదేశ్‌లో షిప్రా ఉజ్జయిని గంగా నది ఒడ్డున మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది ఒడ్డున ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద త్రివేణి సంగమం కథ ఏంటి? త్రివేణి సంగమం అనేది మూడు నదులు ఒకే చోట కలిసే ప్రత్యేక ప్రదేశం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ రెండు నదులు మాత్రమే కలుస్తున్నాయి. గంగా మరియు యమునా నదులు ప్రస్తుతం ఇక్కడ కలుస్తాయి. కానీ సరస్వతి నది ఇప్పుడు ప్రవహించడం లేదు. కానీ విశ్వాసాల ప్రకారం, ఈ రెండు నదులలో స్నానం చేయడం ద్వారా సరస్వతి తల్లి మానవుల పాపాలను పోగొడుతుందని భక్తులు విశ్వసిస్తారు.

కోట్లమంది భక్తుల ఆకలి తీర్చుతున్న అదాని" మహాకుంభమేళా సందర్భంగా ఈ త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అనారోగ్యం నయమవుతుందని కూడా నమ్ముతారు. ఈ కుంభమేళా ఎందుకు ప్రత్యేకం? ఈ ఏడాది మహా కుంభమేళా చాలా ప్రత్యేకం. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా కావడం విశేషం. మహా కుంభమేళా 2025 144 సంవత్సరాల తర్వాత గ్రహాలు, నక్షత్రాల అరుదైన కలయికల వలన జరుగుతోంది. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఈ రోజు శుభప్రదమని నమ్ముతారు. కుంభమేళా నాలుగు రకాలు 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా అర్ధ కుంభమేళా- 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది 

Advertisement పూర్తి కుంభమేళా- 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహా కుంభమేళా- 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది

పవన్ కళ్యాణ్ ‘జనసేన’కు ఈసీ గుడ్‌న్యూస్


 పవన్ కళ్యాణ్ ‘జనసేన’కు ఈసీ గుడ్‌న్యూస్ 

 ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది. 

 "'డిప్యూటీ సీఎం' పదవి రచ్చ - వార్ పీక్, తేల్చేసిన ఢిల్లీ నేతలు..!!" కాగా, జనసేన పార్టీని ప్రముఖ సినీనటుడు పవన్​కళ్యాణ్​2014లో స్థాపించారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో జనసేన నేరుగా పోటీ చేయకుండా ఇతర పార్టీల(తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల)కు మద్దతిచ్చింది. దీంతో 2014లో టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. Powered By ఆ తర్వాత 2019 ఎన్నికలలో పోటీ చేసిన జనసేన ఒక సీటు గెలుచుకుంది. అయితే, ఆ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో జనసేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇక, 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డ్​సాధించింది. రెండు పార్లమెంట్ స్థానాలను కూడా దక్కించుకుంది. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. తాజాగా, ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో జనసేన నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఆక్రమణల కూల్చివేతలపై దానం నాగేందర్ ఆగ్రహం, హెచ్చరిక By Rajashekhar Garrepally Published: Wednesday, January 22, 2025, 17:37 [IST] హైదరాబాద్: ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమ నిర్మాణాను కూల్చివేస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండానే ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు. దిల్ రాజుపై ఐటీ కొరడా- మెరుపుదాడి: మెగా దెబ్బ" దావోస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వరకూ కూల్చివేతలు ఆపాలని అన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తానంటూ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా, గతంలో దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతపైనా ఆ


ఆక్రమణల కూల్చివేతలపై దానం నాగేందర్ ఆగ్రహం, హెచ్చరిక 

 హైదరాబాద్: ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమ నిర్మాణాను కూల్చివేస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండానే ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు.

 దిల్ రాజుపై ఐటీ కొరడా- మెరుపుదాడి: మెగా దెబ్బ" దావోస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వరకూ కూల్చివేతలు ఆపాలని అన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తానంటూ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేశారు.  కాగా, గతంలో దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతపైనా ఆ

Tuesday, 21 January 2025

హైదరాబాద్ లోని LBనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డికపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో వైద్యులు గుండెను తరలించారు...


 హైదరాబాద్ లోని LBనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డికపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో వైద్యులు గుండెను తరలించారు...

ఇందుకోసం మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి
13KM దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని పెషేంట్ కి సకాలంలో గుండెను అమర్చారు.❤️
ఇదే రోడ్డు మార్గంలో అయితే lb నగర్ నుండి లక్డికపూల్ వరకు ఎంత స్పిడుగా వెళ్లిన గంటకు తక్కువ కాదు
థాంక్యూ హైదరాబాద్ మెట్రో

Monday, 20 January 2025

: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు

 హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు

 హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్ రాజు సహా ప్రముఖ నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు జరిపింది ఐటీ శాఖ.

 హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు


హైదరాబాద్‌లో ఐటీ సోదాలు, ప్రముఖ నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు.

| హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ పై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లతో పాటు దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డిలకు సంబంధించిన ఆస్తులపై ఐటి సోదాలు చేపట్టినట్లు సమాచారం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో పలు నిర్మాతల ఇళ్లు, ఆఫీసులు, ఇతర ఆస్తులపై ఐటీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల దాదాపు 50 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

IT Raids | హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో దాడులు

 

IT Raids | హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో దాడులు

 

హైదరాబాద్‌లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

 

IT Raids | హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో దాడులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.


శ్రీ భోనల శ్రీ నివాస్ గారు ( మన వైశ్యుడు ) జాతియ ఏక్తా పార్టీ అద్యక్డుడు 26-01- 2025 రోజు న నిరాహార దీక్షలు: జగిని నాగభూషణం

 శ్రీ భోనల శ్రీ నివాస్ గారు (  మన వైశ్యుడు  ) జాతియ ఏక్తా పార్టీ అద్యక్డుడు   26-01- 2025 రోజు న నిరాహార దీక్షలు :జగిని నాగభూషణం



చేస్తున్నందున మన రాష్ట్రంలో ని వైశ్యులంత సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా మన వైశ్యులు మీ మీ పట్టణాల్లో మన రాష్ట్ర సాదకుడు శీ అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వారి కి శ్రద్దంజలి ఘటించి 


ఆనతరం     అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి పేరు మారుస్తూన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని నినాదాలు/ నిరసన లు తెలపలని మా మనవి 


నిరసన దీక్ష శిబిరం వెధీక కు మిత్రులు మన వైశ్యులందరు అధిక సంఖ్యలో రావాలి అని నా మనవి.



పార్టీ ల కు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేద్దాం

Sunday, 19 January 2025

47వ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

 

  • ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్
  • వాషింగ్టన్‌లో మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత 
  • కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ప్రమాణ స్వీకారం
  • తొలి రోజే వందకుపైగా ఆదేశాలపై ట్రంప్ సంతకాలు
గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం

చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. రాజధానిలో ప్రస్తుతం మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకార వేడుకను బహిరంగంగా కాకుండా కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో నిర్వహించనున్నారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాషింగ్టన్ చేరుకున్నారు. సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ తన రోజును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు చేరుకుని అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి కేపిటల్ హిల్‌కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం తొలి రోజే ట్రంప్ 100కు పైగా ఆదేశాలపై సంతకాలు చేస్తారు.  

*వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V302A క్యాబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవము,బెంగుళూర్*

 *వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V302A క్యాబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవము,బెంగుళూర్









*

Friday, 17 January 2025

నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు


 హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న నుమాయిష్‌లో నిన్న సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఓ అమ్యూజిమెంట్ రైడ్‌ ఎక్కిన సందర్శకులు ప్రాణభయంతో వణికిపోయారు. రైడ్ జరుగుతుండగా ఒక్కసారిగా అది నిలిచిపోయింది. దీంతో అందులో ఉన్నవారు దాదాపు అరగంటపాటు తలకిందులుగా ఉండిపోయారు. భయంతో కేకలు వేశారు. దీంతో ఏం జరిగిందో తెలియక ఎగ్జిబిషన్‌లో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత సిబ్బంది చాలా సేపు శ్రమించి సమస్యను పరిష్కరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ సమస్య కారణంగానే ఇలా జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు.