Wednesday, 29 April 2026

వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

 పత్రికా ప్రకటన, నల్గొండ, 29.4.2026

____________________________


@ వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.




             వానాకాలం పంటల సాగులో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాలనే ఉపయోగించాలని, నకిలీ విత్తనాల జోలికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు.

రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


       బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అగ్రికల్చర్ సివిల్ సప్లై, రెవెన్యూ  అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.


      

        జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకై  ప్రత్యేక టాస్క్ ఫోర్స్  స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ టీంలు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో పనిచేస్తూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. ఎన్ ఫోర్స్‌మెంట్ టీంలు వారానికి కనీసం రెండు సార్లు తనిఖీలు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని 869 గ్రామపంచాయతీలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వానాకాలం ప్రారంభానికి ముందే కాటన్ సీడ్స్, ఎరువుల సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువులు విత్తనాల

 డిస్ట్రిబ్యూటర్లు రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు విక్రయించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సివిల్ సప్లై, మార్కెటింగ్, అగ్రికల్చర్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

యాక్షన్ ప్లాన్ ప్రకారం గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో సమావేశాలు పూర్తి చేయాలని, సీడ్ మరియు ఫెర్టిలైజర్ డీలర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. కాటన్ సీడ్ మరియు పాడి సంబంధిత విత్తనాల స్టాక్ ఎంత ఉందో మండల ఆఫీసర్ కి చెప్పాలని లేనిచో జిల్లా  అధికారులకు తెలియజేయాలన్నారు.

యూరియా మరియు ఇతర ఎరువుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, అవసరమైతే వెంటనే జిల్లా స్థాయిలో చర్యలు తీసుకుని సరఫరా చేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు కఠినంగా నిఘా పెట్టి, కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


         ఈ సమావేశంలో ఏ ఎస్పి రమేష్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా అధికారులు ఉన్నారు.

____________________________ 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Monday, 27 April 2026

విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్

విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని  జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్

         విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని




  జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్. అన్నారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక  99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత & రక్షణ మరియు "మత్తు పదార్థాలకు నో చెప్పండి"అనే అంశంపై  ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థల్లో ఉన్న విద్యార్థులు ఉన్నతికి కృషి చేస్తామని  కలెక్టర్ అన్నారు.


         సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ (CCIs)ల్లో ఆశ్రయం పొందుతున్న 18 సంవత్సరాల లోపు  బాల బాలికలకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. జనన ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, హెల్త్ కార్డులు, ఆధార్ కార్డులు, సేవింగ్ బ్యాంక్ ఖాతా పుస్తకాలను జిల్లా  కలెక్టర్ బాలలకు అందజేశారు.


       ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు సంరక్షణ సంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలను బాలలు సద్వినియోగం చేసుకొని బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.


         ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు  కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్, జిల్లా కో-ఆర్డినేటర్ (చైల్డ్ లైన్)  బి. మహేశ్, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది  ఉన్నారు.

Sunday, 26 April 2026

ఆమె పేరు పూనం మాలకొండయ్య IAS

 ఆమె పేరు పూనం మాలకొండయ్య గారు


ఆమె తాతగారు బుందేల్‌ఖండ్‌లో ధైర్యసాహసాలతో పేరుగాంచిన ఒక పోలీస్ ఆఫీసర్. వారి కుటుంబంలో చదువుకున్న మొదటి వ్యక్తి ఆమె తండ్రి. ఆయన శాస్త్రవేత్త (సైంటిస్ట్) అయ్యారు.


ఆమె ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి మైక్రోబయాలజీలో గోల్డ్ మెడలిస్ట్. పరిశోధన (రీసెర్చ్) చేయడమే ఆమె మొదటి ప్రాధాన్యత. అప్పుడు ఎవరో ఆమెకు UPSC రాయమని సూచించారు. కోచింగ్‌కు డబ్బు లేదు, తగినంత సమయం కూడా లేదు. ఆమె ఒంటరిగానే ప్రిపేర్ అయ్యారు. 1988లో దాన్ని సాధించారు.


ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న రీసెర్చ్ కెరీర్ లేదా IAS


- ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆమె IASనే ఎంచుకున్నారు.


అగ్రికల్చర్ కమిషనర్‌గా ఉన్నప్పుడు, ఆమె మోన్శాంటో (Monsanto) సంస్థను MRTP కమిషన్‌కు లాగారు. ఆ బహుళజాతి సంస్థ BT పత్తి విత్తనాల కోసం భారతీయ రైతులను పీల్చి పిప్పి చేసేలా ధరలను వసూలు చేస్తోంది. ఆమె ఆ సంస్థను ధరలు తగ్గించేలా ఒత్తిడి చేశారు.


రవాణా, విద్య మరియు పౌరసరఫరాలు.. ఇలా ఆమె ఏ శాఖలో పనిచేసినా అవినీతిపై పోరాడారు. ఆమె చర్యలు తీసుకున్న ప్రతిసారీ, ఆమె బదిలీ అయ్యారు.

ఆరేళ్లలో ఏడు బదిలీలు.


ఇండియా టుడే ఆమెను భారతదేశపు మూడవ అత్యంత నిజాయితీ గల IAS అధికారిగా పేర్కొంది.


ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జూన్ 2024లో పదవీ విరమణ చేశారు. ముప్పై ఆరేళ్ల సర్వీసు.


ఆమె తండ్రి ఆ కుటుంబంలో అక్షరం ముక్క నేర్చుకున్న మొదటి వ్యక్తి. ఈ దేశ ప్రజలు మోసపోకుండా ఉండేలా చూడటంలో ఆమె 36 ఏళ్ల కాలాన్ని వెచ్చించారు.

Friday, 24 April 2026

*వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*


 *వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ఆర్యవైశ్య సమాజం హర్షం వ్యక్తం చేస్తోందని, ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆర్య వైశ్యుల తరుపున TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవి మాత జయంతి అనేది ఆర్యవైశ్యుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున జరుపుకునే ఈ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఆర్యవైశ్యుల భావోద్వేగాలను గౌరవించినట్టయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ ప్రకారం, వాసవి మాత జయంతి రోజున రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు వాసవి మాత జయంతి ఉత్సవాలు మరింత భక్తి, శ్రద్ధలతో నిర్వహించబడతాయని అన్నారు.

Wednesday, 15 April 2026

అవినీతినిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నుసుం సుధాకర్ రెడ్డి, ఒక ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన తుపాను నీటి కాలువ నిర్మాణ పనులకు సంబంధించి మెజర్మెంట్ బుక్ (M-Book) నమోదు చేసి, ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేసేందుకు రూ. 50,000/- #లంచం డిమాండ్ చేసి, హుజూరాబాద్‌లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద ఆ #లంచం తీసుకుంటుండగా తెలంగాణ #అవినీతినిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


Tuesday, 14 April 2026

హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి

 హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి


హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు



తదుపరి ఆదేశాల వరకు హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీలులేదు


హైడ్రాకు ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన SOP(standard operating procedure) లేదు..ఏ లెక్కన కూల్చివేతలు చేపడుతున్నారు? 


చెరువులు, కుంటలు, రోడ్లు ఆక్రమిస్తేనే చర్యలు తీసుకోవాలి


అది కూడా SOP నిర్ధారించిన తరువాతనే


అమీన్‌పూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతల బాధితులు దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ హైకోర్టు అసహనం

డి ఈ ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేషం లో మంత్రి కామెంట్స్





 @ నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 135 జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

@ మర్రిగూడా బై పాస్ వద్ద డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి,

@ డి ఈ ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేషం లో మంత్రి కామెంట్స్



@ చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం


@ డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ ఖ్యాతి పొందారు.

@ అందరూ చదువుకోవాలి

@ చదువు పై ఉన్న ప్రేమతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడా స్కూల్,జూనియర్  కాలేజి కట్టించాను

@ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది

@ కుల మతాలకు అతీతంగా అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నాము

@ అన్ని కులాలు, మతాల పిల్లలు ఒకేచోట చదివేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం

@నియోజక వర్గానికి ఒక తెలంగాణ  మోడల్ స్కూల్

@ డి ఈ ఓ ఆఫీస్ చౌరస్తాను సుందరీకరించి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చౌరసాగా నామకరణం చేస్తాం.

@ పాల్గొన్న నల్గొండ మేయర్ బుర్రి చైతన్య  జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్.

Tuesday, 7 April 2026

నిర్భయ సాహస గాథ: సరస్వతి రాజమణి ఇప్పుడు “మణి”




సంవత్సరం 1942..... రంగూన్ (ప్రస్తుత మయన్మార్). నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటిలో ఓ భారతీయ కుటుంబం నివసించేది. తండ్రి ఒక బంగారు గని యజమాని. పుట్టినప్పటి నుంచీ ఆ అమ్మాయి అపారమైన వైభవం తప్ప మరొకటి చూడలేదు_ఖరీదైన కార్లు, పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు. అదే ఆమె బాల్యం. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఆమె వయస్సు కేవలం పదిహేను–పదహారు సంవత్సరాలు మాత్రమే. కానీ విధి ఆమెకు రాజప్రాసాదాలు కాదు_అరణ్య మార్గాలు, గన్‌పౌడర్ వాసననే రాసింది.

అదే రోజున భారత స్వాతంత్ర్యానికి చివరి ఆశ అయిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రంగూన్‌కు వచ్చారు. వేలాది మందితో నిండిన జన సమూహం ముందు ఆయన గర్జించారు — “మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను.”

జనసమూహంలో నిలిచిన యువతి రాజమణి రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ క్షణంలోనే ఆమె తన హారం, కంకణాలు, చెవిపోగులు_అన్నీ ఆజాద్ హింద్ ఫౌజ్ నిధికి అర్పించింది.

తరువాతి ఉదయం ఆ  విలాసవంతమైన భవనం ముందు ఒక సైనిక జీప్ ఆగింది. స్వయంగా నేతాజీ దిగారు_ఆమె ఇచ్చిన ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి వచ్చారు. 

ఇంత చిన్న వయస్సులో ఉన్న అమ్మాయి భావోద్వేగంతో ఇంత విలువైన ఆభరణాలు ఇచ్చి ఉంటుందనుకున్నారు. ఇంతటి త్యాగానికి ఆమె ఇంకా చిన్నదే అనిపించింది. కానీ రాజమణి ఆయన కళ్లలోకి నేరుగా చూసి చెప్పిన మాటలు చరిత్రగా మారాయి ! 

“నేతాజీ, నేను ఈ దానాన్ని పొరపాటున ఇవ్వలేదు. ఇది నా దేశానికి అర్పణ. నేను ఒకసారి ఇచ్చినదాన్ని తిరిగి తీసుకోను.”

నేతాజీ ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ నిలిచిపోయారు. ఆమె కళ్లలో భయం లేదు—ఉక్కులాంటి దృఢ సంకల్పం మాత్రమే. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆమెకు కొత్త పేరు పెట్టారు_“సరస్వతి”!

అమెతో ఇలా అన్నారు —

“నువ్వు నా బృందంలోకి కావాలి. తుపాకితో కాదు_నీ పని దానికంటే కూడా కష్టం.”

ఇక్కడినుంచే నేతాజీ ఆదేశాలతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమ్మాయిల పొడవాటి జుట్టు కత్తిరించారు. షర్ట్, ప్యాంట్ వేసారు. సరస్వతి రాజమణి ఇప్పుడు “మణి” 


అయ్యింది. ఆమెకు తోడుగా మరో ధైర్యవంతురాలైన అమ్మాయి_దుర్గ. 

వారి మిషన్—గూఢచర్యం..! 

ఒక్కసారి ఊహించండి—

పట్టు పరుపులపై నిద్రించిన పదహారు ఏళ్ల అమ్మాయి, ఇప్పుడు బ్రిటిష్ సైనిక మెస్‌లో ఒక “అబ్బాయి” వేషంలో పని చేస్తోంది. అధికారుల బూట్లు పాలిష్ చేయడం, గదులు శుభ్రం చేయడం, టీ అందించడం—ఇవే వారి రోజువారీ పనులు. ఆంగ్ల జనరళ్లకు వీరు ఇంగ్లీష్ తెలియని స్థానిక కుర్రాళ్లుగా కనిపించేవారు. 

అందుకే వారిముందే రహస్య యుద్ధ సమావేశాలు చేసేవారు—మ్యాప్‌లపై గుర్తులు వేస్తూ, ఎక్కడ ఐఎన్‌ఏపై బాంబులు వేయాలో, సరఫరా మార్గాలు ఏవో చర్చించేవారు.

గదిలో ఒక మూల బూట్లు పాలిష్ చేస్తూ మణి చెవులు అప్రమత్తంగా ఉండేవి. ఆమె మెదడు ప్రతి తేదీని, ప్రతి సంకేతాన్ని గుర్తుపెట్టుకునేది. పని పూర్తయ్యాక ఆమె మరుగు దొడ్డికి వెళ్లి, చిన్న చిన్న కాగితాలపై అన్నీ రాసి, వాటిని రొట్టెలో లేదా చెప్పుల్లో దాచుకుని ఆ సమాచారాన్ని నేతాజీ శిబిరానికి చేర్చేది.

రోజురోజుకూ మరణంతో ఆడే ప్రాణాంతక దాగుడుమూతలు కొనసాగాయి.

చీకటి రాత్రి: నిర్భయ సాహస గాథ

కానీ గూఢచారి జీవితం ప్రతిక్షణం పట్టుబడతామనే భయంతోనే సాగుతుంది. ఒక రోజు ఆ భయంకర కల నిజమైంది. రాజమణి స్నేహితురాలు దుర్గా బ్రిటిష్‌ల చేతికి చిక్కింది. ఆమెను సైనిక కారాగారంలో బంధించి, త్వరలోనే హింసించి సమాచారం రాబట్టబోతున్నారనే వార్త వచ్చింది.

ఐఎన్‌ఏ నియమం చాలా కఠినం—

పట్టుబడితే ఆత్మహత్య చేసుకో, కానీ బ్రతికుండగా పట్టుబడవద్దు.

అందరూ రాజమణికి చెప్పారు—

“పారిపో. అక్కడికి వెళ్తే నీవు కూడా చనిపోతావు.” కానీ రాజమణి చెప్పింది., “నా స్నేహితురాలు పట్టుబడింది, నేను పారిపోవాలా? అది నా వల్ల కాదు.”

రాత్రి చీకటిలో, అబ్బాయి వేషంలో, ఆమె కఠిన భద్రత ఉన్న ఆ బ్రిటిష్ కోటలోకి చొరబడింది.

 కాపలాదారుల బలహీనతలు ఆమెకు తెలుసు. వారి ఆహారం, టీ లో తీవ్రమైన అఫీమ్ కలిపింది. కాపలాదారులు గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆమె తాళాలు దొంగిలించి దుర్గా గదిని తెరిచింది.

ఇద్దరూ జైలు గోడ ఎక్కుతుండగా సైరన్ మోగింది. సర్చ్‌లైట్లు తిరగసాగాయి, కాల్పులు మొదలయ్యాయి. చీకట్లో పరుగెత్తుతుండగా ఒక్కసారిగా మణి కుడి కాలు మండిపోయినట్లైంది. ఒక గుండు  మాంసాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లింది. రక్తం నేలను తడిపింది. బాధతో శరీరం వణికిపోయింది.

కానీ ఆమె ఆగలేదు.

ఆగడం అంటే ఇద్దరి మరణమే.

రక్తస్రావంతోనే వారు అరణ్యంలో దాక్కున్నారు. బ్రిటిష్ సైనికులు కుక్కలతో వెతుకులాట మొదలుపెట్టారు.

తప్పించుకోవడానికి రాజమణి, దుర్గా ఒక భారీ చెట్టెక్కారు.

నమ్మశక్యం కాని విషయం—

వారు మూడు రోజులు (72 గంటలు) అదే చెట్టుపై ఉన్నారు.

 కాళ్లలో గుండు, శరీరమంతా జ్వరం, నీరు లేదు, ఆహారం లేదు. కింద బ్రిటిష్ గస్తీ.

మూడు రోజుల తర్వాత బ్రిటిష్‌లు వెతుకులాట ఆపినప్పుడు, ఇద్దరూ దిగివచ్చి, ఆజాద్ హింద్ ఫౌజ్ శిబిరానికి చేరుకున్నారు.

నేతాజీ సెల్యూట్ : 

శిబిరానికి చేరేసరికి ఆమె దాదాపు స్పృహ కోల్పోయింది. నేతాజీ స్వయంగా ఆమెను చూడటానికి వచ్చారు. డాక్టర్ ఆమె కాలి నుంచి గుండూ తీస్తుండగా, నేతాజీ ఆ పదహారు ఏళ్ల యోధురాలికి సెల్యూట్ చేసి అన్నారు —

“మన సేనలో ఇంతటి శక్తివంతమైన పేలుడు దాగి ఉందని నాకు తెలియదు. నీవే భారతదేశపు తొలి మహిళా గూఢచారివి. నీవే నా ఝాన్సీ రాణి.”

జపాన్ చక్రవర్తి ఇచ్చిన తన పిస్టల్‌ను ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. కానీ రాజమణి కోరిందొకటే—భారత స్వాతంత్ర్యం.

మరచిపోయిన వీరనారి :

1947లో భారత్ స్వతంత్రమైంది.

కానీ దేశం కోసం తన యౌవనం, తన రక్తం, తండ్రి సంపూర్ణ సంపదను అర్పించిన ఆమెను దేశం గుర్తుంచుకున్నదా?

చరిత్ర పుస్తకాలలో ఆమెకు స్థానం దక్కలేదు. ఒకప్పుడు బంగారు పడకలపై నిద్రించిన ఆమె, జీవితపు చివరి దశను చెన్నై రాయపేట్లోని ఒక శిథిలమైన గది అద్దె ఇంట్లో తీవ్ర దారిద్ర్యంలో గడిపింది.

స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ ఇవ్వడంలో కూడా ఆలస్యం ...... అయినా ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.

2004 సునామీ సమయంలో, అందరూ సహాయం అడుగుతుండగా, తన మందులకే డబ్బుల్లేని ఈ వృద్ధురాలు—తన దాచుకున్న పెన్షన్ మొత్తాన్ని సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది.

పత్రికా విలేకరులు అడిగారు—

“మీ దగ్గర ఏమీ లేదు, అయినా ఎందుకు ఇచ్చారు?” ఆమె చిరునవ్వుతో చెప్పింది —

“ఇవ్వడం నా రక్తంలో ఉంది. చిన్నప్పుడే దేశ స్వాతంత్ర్యం కోసం అన్నీ ఇచ్చేశాను. ఈరోజు దేశ ప్రజల కోసం ఇచ్చాను.”

2018లో, 91 ఏళ్ల వయస్సులో, భారతదేశానికి చెందిన ఈ అగ్నిధార వంటి కుమార్తె గుండెపోటుతో ప్రశాంతంగా కన్నుమూసింది.

జాతీయ శోకం లేదు, టీవీల్లో పెద్ద వార్త లేదు. కానీ ఈరోజు స్వతంత్ర భారత ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి—

ఈ స్వేచ్ఛను ఒక పదిహేను ఏళ్ల అమ్మాయి తన కాళ్ల రక్తంతో, తన మొత్తం జీవిత త్యాగంతో చెల్లించింది.

ఆమె పేరు సరస్వతి రాజమణి.

ఆమెను గుర్తుంచుకోండి—చరిత్ర ఆమెను మరచిపోయినా, ఆమె ఋణం నుంచి మనం ఎప్పటికీ విముక్తులు కాలేం..! 

ఎందరో త్యాగధనులు అష్టకష్టాలను ఓర్చి సంపాదించి పెట్టిన దేశ స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడమే మనం వారికి సమర్పించే నివాళి !

( Forwarded as received  )










































































































































































































































































































































































































































































































































































































































































































































































































































సంవత్సరం 1942..... రంగూన్ (ప్రస్తుత మయన్మార్). నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటిలో ఓ భారతీయ కుటుంబం నివసించేది. తండ్రి ఒక బంగారు గని యజమాని. పుట్టినప్పటి నుంచీ ఆ అమ్మాయి అపారమైన వైభవం తప్ప మరొకటి చూడలేదు_ఖరీదైన కార్లు, పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు. అదే ఆమె బాల్యం. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఆమె వయస్సు కేవలం పదిహేను–పదహారు సంవత్సరాలు మాత్రమే. కానీ విధి ఆమెకు రాజప్రాసాదాలు కాదు_అరణ్య మార్గాలు, గన్‌పౌడర్ వాసననే రాసింది.

అదే రోజున భారత స్వాతంత్ర్యానికి చివరి ఆశ అయిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రంగూన్‌కు వచ్చారు. వేలాది మందితో నిండిన జన సమూహం ముందు ఆయన గర్జించారు — “మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను.”

జనసమూహంలో నిలిచిన యువతి రాజమణి రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ క్షణంలోనే ఆమె తన హారం, కంకణాలు, చెవిపోగులు_అన్నీ ఆజాద్ హింద్ ఫౌజ్ నిధికి అర్పించింది.

తరువాతి ఉదయం ఆ  విలాసవంతమైన భవనం ముందు ఒక సైనిక జీప్ ఆగింది. స్వయంగా నేతాజీ దిగారు_ఆమె ఇచ్చిన ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి వచ్చారు. 

ఇంత చిన్న వయస్సులో ఉన్న అమ్మాయి భావోద్వేగంతో ఇంత విలువైన ఆభరణాలు ఇచ్చి ఉంటుందనుకున్నారు. ఇంతటి త్యాగానికి ఆమె ఇంకా చిన్నదే అనిపించింది. కానీ రాజమణి ఆయన కళ్లలోకి నేరుగా చూసి చెప్పిన మాటలు చరిత్రగా మారాయి ! 

“నేతాజీ, నేను ఈ దానాన్ని పొరపాటున ఇవ్వలేదు. ఇది నా దేశానికి అర్పణ. నేను ఒకసారి ఇచ్చినదాన్ని తిరిగి తీసుకోను.”

నేతాజీ ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ నిలిచిపోయారు. ఆమె కళ్లలో భయం లేదు—ఉక్కులాంటి దృఢ సంకల్పం మాత్రమే. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆమెకు కొత్త పేరు పెట్టారు_“సరస్వతి”!

అమెతో ఇలా అన్నారు —

“నువ్వు నా బృందంలోకి కావాలి. తుపాకితో కాదు_నీ పని దానికంటే కూడా కష్టం.”

ఇక్కడినుంచే నేతాజీ ఆదేశాలతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమ్మాయిల పొడవాటి జుట్టు కత్తిరించారు. షర్ట్, ప్యాంట్ వేసారు. సరస్వతి రాజమణి ఇప్పుడు “మణి” అయ్యింది. ఆమెకు తోడుగా మరో ధైర్యవంతురాలైన అమ్మాయి_దుర్గ. 

వారి మిషన్—గూఢచర్యం..! 

ఒక్కసారి ఊహించండి—

పట్టు పరుపులపై నిద్రించిన పదహారు ఏళ్ల అమ్మాయి, ఇప్పుడు బ్రిటిష్ సైనిక మెస్‌లో ఒక “అబ్బాయి” వేషంలో పని చేస్తోంది. అధికారుల బూట్లు పాలిష్ చేయడం, గదులు శుభ్రం చేయడం, టీ అందించడం—ఇవే వారి రోజువారీ పనులు. ఆంగ్ల జనరళ్లకు వీరు ఇంగ్లీష్ తెలియని స్థానిక కుర్రాళ్లుగా కనిపించేవారు. 

అందుకే వారిముందే రహస్య యుద్ధ సమావేశాలు చేసేవారు—మ్యాప్‌లపై గుర్తులు వేస్తూ, ఎక్కడ ఐఎన్‌ఏపై బాంబులు వేయాలో, సరఫరా మార్గాలు ఏవో చర్చించేవారు.

గదిలో ఒక మూల బూట్లు పాలిష్ చేస్తూ మణి చెవులు అప్రమత్తంగా ఉండేవి. ఆమె మెదడు ప్రతి తేదీని, ప్రతి సంకేతాన్ని గుర్తుపెట్టుకునేది. పని పూర్తయ్యాక ఆమె మరుగు దొడ్డికి వెళ్లి, చిన్న చిన్న కాగితాలపై అన్నీ రాసి, వాటిని రొట్టెలో లేదా చెప్పుల్లో దాచుకుని ఆ సమాచారాన్ని నేతాజీ శిబిరానికి చేర్చేది.

రోజురోజుకూ మరణంతో ఆడే ప్రాణాంతక దాగుడుమూతలు కొనసాగాయి.

చీకటి రాత్రి: నిర్భయ సాహస గాథ

కానీ గూఢచారి జీవితం ప్రతిక్షణం పట్టుబడతామనే భయంతోనే సాగుతుంది. ఒక రోజు ఆ భయంకర కల నిజమైంది. రాజమణి స్నేహితురాలు దుర్గా బ్రిటిష్‌ల చేతికి చిక్కింది. ఆమెను సైనిక కారాగారంలో బంధించి, త్వరలోనే హింసించి సమాచారం రాబట్టబోతున్నారనే వార్త వచ్చింది.

ఐఎన్‌ఏ నియమం చాలా కఠినం—

పట్టుబడితే ఆత్మహత్య చేసుకో, కానీ బ్రతికుండగా పట్టుబడవద్దు.

అందరూ రాజమణికి చెప్పారు—

“పారిపో. అక్కడికి వెళ్తే నీవు కూడా చనిపోతావు.” కానీ రాజమణి చెప్పింది., “నా స్నేహితురాలు పట్టుబడింది, నేను పారిపోవాలా? అది నా వల్ల కాదు.”

రాత్రి చీకటిలో, అబ్బాయి వేషంలో, ఆమె కఠిన భద్రత ఉన్న ఆ బ్రిటిష్ కోటలోకి చొరబడింది.

 కాపలాదారుల బలహీనతలు ఆమెకు తెలుసు. వారి ఆహారం, టీ లో తీవ్రమైన అఫీమ్ కలిపింది. కాపలాదారులు గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆమె తాళాలు దొంగిలించి దుర్గా గదిని తెరిచింది.

ఇద్దరూ జైలు గోడ ఎక్కుతుండగా సైరన్ మోగింది. సర్చ్‌లైట్లు తిరగసాగాయి, కాల్పులు మొదలయ్యాయి. చీకట్లో పరుగెత్తుతుండగా ఒక్కసారిగా మణి కుడి కాలు మండిపోయినట్లైంది. ఒక గుండు  మాంసాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లింది. రక్తం నేలను తడిపింది. బాధతో శరీరం వణికిపోయింది.

కానీ ఆమె ఆగలేదు.

ఆగడం అంటే ఇద్దరి మరణమే.

రక్తస్రావంతోనే వారు అరణ్యంలో దాక్కున్నారు. బ్రిటిష్ సైనికులు కుక్కలతో వెతుకులాట మొదలుపెట్టారు.

తప్పించుకోవడానికి రాజమణి, దుర్గా ఒక భారీ చెట్టెక్కారు.

నమ్మశక్యం కాని విషయం—

వారు మూడు రోజులు (72 గంటలు) అదే చెట్టుపై ఉన్నారు.

 కాళ్లలో గుండు, శరీరమంతా జ్వరం, నీరు లేదు, ఆహారం లేదు. కింద బ్రిటిష్ గస్తీ.

మూడు రోజుల తర్వాత బ్రిటిష్‌లు వెతుకులాట ఆపినప్పుడు, ఇద్దరూ దిగివచ్చి, ఆజాద్ హింద్ ఫౌజ్ శిబిరానికి చేరుకున్నారు.

నేతాజీ సెల్యూట్ : 

శిబిరానికి చేరేసరికి ఆమె దాదాపు స్పృహ కోల్పోయింది. నేతాజీ స్వయంగా ఆమెను చూడటానికి వచ్చారు. డాక్టర్ ఆమె కాలి నుంచి గుండూ తీస్తుండగా, నేతాజీ ఆ పదహారు ఏళ్ల యోధురాలికి సెల్యూట్ చేసి అన్నారు —

“మన సేనలో ఇంతటి శక్తివంతమైన పేలుడు దాగి ఉందని నాకు తెలియదు. నీవే భారతదేశపు తొలి మహిళా గూఢచారివి. నీవే నా ఝాన్సీ రాణి.”

జపాన్ చక్రవర్తి ఇచ్చిన తన పిస్టల్‌ను ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. కానీ రాజమణి కోరిందొకటే—భారత స్వాతంత్ర్యం.

మరచిపోయిన వీరనారి :

1947లో భారత్ స్వతంత్రమైంది.

కానీ దేశం కోసం తన యౌవనం, తన రక్తం, తండ్రి సంపూర్ణ సంపదను అర్పించిన ఆమెను దేశం గుర్తుంచుకున్నదా?

చరిత్ర పుస్తకాలలో ఆమెకు స్థానం దక్కలేదు. ఒకప్పుడు బంగారు పడకలపై నిద్రించిన ఆమె, జీవితపు చివరి దశను చెన్నై రాయపేట్లోని ఒక శిథిలమైన గది అద్దె ఇంట్లో తీవ్ర దారిద్ర్యంలో గడిపింది.

స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ ఇవ్వడంలో కూడా ఆలస్యం ...... అయినా ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.

2004 సునామీ సమయంలో, అందరూ సహాయం అడుగుతుండగా, తన మందులకే డబ్బుల్లేని ఈ వృద్ధురాలు—తన దాచుకున్న పెన్షన్ మొత్తాన్ని సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది.

పత్రికా విలేకరులు అడిగారు—

“మీ దగ్గర ఏమీ లేదు, అయినా ఎందుకు ఇచ్చారు?” ఆమె చిరునవ్వుతో చెప్పింది —

“ఇవ్వడం నా రక్తంలో ఉంది. చిన్నప్పుడే దేశ స్వాతంత్ర్యం కోసం అన్నీ ఇచ్చేశాను. ఈరోజు దేశ ప్రజల కోసం ఇచ్చాను.”

2018లో, 91 ఏళ్ల వయస్సులో, భారతదేశానికి చెందిన ఈ అగ్నిధార వంటి కుమార్తె గుండెపోటుతో ప్రశాంతంగా కన్నుమూసింది.

జాతీయ శోకం లేదు, టీవీల్లో పెద్ద వార్త లేదు. కానీ ఈరోజు స్వతంత్ర భారత ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి—

ఈ స్వేచ్ఛను ఒక పదిహేను ఏళ్ల అమ్మాయి తన కాళ్ల రక్తంతో, తన మొత్తం జీవిత త్యాగంతో చెల్లించింది.

ఆమె పేరు సరస్వతి రాజమణి.

ఆమెను గుర్తుంచుకోండి—చరిత్ర ఆమెను మరచిపోయినా, ఆమె ఋణం నుంచి మనం ఎప్పటికీ విముక్తులు కాలేం..! 

ఎందరో త్యాగధనులు అష్టకష్టాలను ఓర్చి సంపాదించి పెట్టిన దేశ స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడమే మనం వారికి సమర్పించే నివాళి !

( Forwarded as received  )

neehttps://heyzine.com/flip-book/f8661cc895.html

 https://heyzine.com/flip-book/f8661cc895.html

ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై అవినీతి కేసు.

 ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై అవినీతి కేసు.

ఆరేళ్ల సర్వీసులోనే కోట్ల ఆస్తులు. కూడబెట్టినట్లు ఆరోపణలుm



ఏసీబీ అధికారులు తాడేపల్లి,ఉండవల్లి ప్రాంతాల్లో సోదాలు.
నాలుగు చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహణ.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు.
శాంతిని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు.
కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధింపు
సోదాల్లో బయటపడ్డవి:
బంగారం: ~776 గ్రాములు (మొత్తం).
వెండి: 2.9 కిలోలు పైగా.
నగదు: ₹1.13 లక్షలు.
బ్యాంకు బ్యాలెన్స్: ₹2.84 లక్షలు.
విల్లా (తాడేపల్లి), ఫ్లాట్ (విశాఖ)
కారు, స్కూటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు.
ఇతర ముఖ్యాంశాలు:
యూనియన్ బ్యాంక్‌లో లాకర్ గుర్తింపు. (త్వరలో తెరవనున్నారు)
ఆస్తులపై రుణాలు తీసుకున్నట్లు సమాచారం.
రెండో వివాహం విషయాన్ని విచారణలో వెల్లడించిన శాంతి.
గతంలో 20 నెలలు సస్పెన్షన్‌లో ఉన్న అధికారి.

Thursday, 2 April 2026

రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!

 రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!


హైకోర్టు కీలక ఆదేశాలు:


Karnataka High Court సంచలన నిర్ణయం.

ప్రాసిక్యూషన్‌కు వెంటనే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం.

అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ తప్పనిసరి.


2021లో Mysore జిల్లాలో ‘ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల’ కొనుగోలు.

మార్కెట్ ధర ₹13 ఉండగా… ₹52కు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు.

ప్రభుత్వానికి సుమారు ₹7.5 కోట్ల నష్టం.


కోర్టు వ్యాఖ్యలు హాట్ టాపిక్:

“శాఖా విచారణలో క్లీన్ చిట్ వచ్చినా… క్రిమినల్ విచారణ ఆగదు”.

అవినీతి కేసుల్లో నిజాలు వెలికితీయాలంటే పూర్తి దర్యాప్తు అవసరం.

చట్టం కింద చర్యలు:

 Prevention of Corruption Act సెక్షన్ 17A కింద విచారణకు గ్రీన్ సిగ్నల్.

ప్రభుత్వానికి కోర్టు గట్టిగా మందలింపు.

అధికారికంగా దర్యాప్తు ప్రారంభం కానుంది.

రోహిణి సింధూరి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

Wednesday, 1 April 2026

తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..!

 తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..! 


తమిళనాడులో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ప్రాంతాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవుగా తమిళనాడు ఉంది. తమిళనాడులో ప్రాచీనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. అరుణాచలం, రామేశ్వరం, మధురై, తంజావూరు, చిదంబరం లాంటి ప్రధాన క్షేత్రాలను చుట్టేసి రావొచ్చు. భక్తుల కోసం తక్కువ ధరకే ఇండియన్​ రైల్వేస్​ క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి ఈ టూర్ ను ఆస్వాదించవచ్చు. Battle for States 2026 Live Updates | Key Contests తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఓ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, చిదంబరం, మధురై, తంజావూర్ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. టూర్ లో భాగంగా రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణుగుంట మీదుగా వెళ్తుంది. ఈ స్టేషన్లలో ఎక్కడైనా ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. ఇక ప్రస్తుతం ఈ టూర్​ మే 24వ తేదీన అందుబాటులో ఉంది. ఐఆర్సీటీసీ టూర్ లో భాగంగా తొలిరోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్టు రైలు బయల్దేరుతుంది. ఆ రాత్రి ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం 9 గంటలకు అరుణాచలానికి చేరుకుంటారు. అరుణాచలం ఆలయం దర్శనం చేసుకుంటారు. రాత్రికి రామేశ్వరం బయల్దేరుతారు. రామేశ్వరం దర్శనం అనంతరం మధురైకు వెళ్తారు. మధురై దర్శనం తర్వాత అక్కడినుంచి కన్యాకుమారికి స్టార్ట్ అవుతారు. కన్యాకుమారిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస ఉంటుంది. Also Read "పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.." మరిన్ని కనుగొనండి ట్రావెల్ ప్యాకేజీలు తెలుగు పుస్తకాలు విద్య కోర్సులు బిజినెస్ న్యూస్ జిల్లా వార్తలు అంతర్జాతీయ వార్తలు సినిమా రివ్యూస్ ఇక ఏడోరోజు తిరుచిరాపల్లి నుంచి చిదంబరానికి బయల్దేరుతారు. చిదంబరంలో నటరాజస్వామి దర్శనం అనంతరం అక్కడే సికింద్రాబాద్ కు రైలు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరుసటిరోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.