Wednesday, 29 April 2026

వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

 పత్రికా ప్రకటన, నల్గొండ, 29.4.2026

____________________________


@ వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.




             వానాకాలం పంటల సాగులో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాలనే ఉపయోగించాలని, నకిలీ విత్తనాల జోలికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు.

రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


       బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అగ్రికల్చర్ సివిల్ సప్లై, రెవెన్యూ  అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.


      

        జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకై  ప్రత్యేక టాస్క్ ఫోర్స్  స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ టీంలు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో పనిచేస్తూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. ఎన్ ఫోర్స్‌మెంట్ టీంలు వారానికి కనీసం రెండు సార్లు తనిఖీలు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని 869 గ్రామపంచాయతీలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వానాకాలం ప్రారంభానికి ముందే కాటన్ సీడ్స్, ఎరువుల సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువులు విత్తనాల

 డిస్ట్రిబ్యూటర్లు రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు విక్రయించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సివిల్ సప్లై, మార్కెటింగ్, అగ్రికల్చర్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

యాక్షన్ ప్లాన్ ప్రకారం గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో సమావేశాలు పూర్తి చేయాలని, సీడ్ మరియు ఫెర్టిలైజర్ డీలర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. కాటన్ సీడ్ మరియు పాడి సంబంధిత విత్తనాల స్టాక్ ఎంత ఉందో మండల ఆఫీసర్ కి చెప్పాలని లేనిచో జిల్లా  అధికారులకు తెలియజేయాలన్నారు.

యూరియా మరియు ఇతర ఎరువుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, అవసరమైతే వెంటనే జిల్లా స్థాయిలో చర్యలు తీసుకుని సరఫరా చేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు కఠినంగా నిఘా పెట్టి, కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


         ఈ సమావేశంలో ఏ ఎస్పి రమేష్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా అధికారులు ఉన్నారు.

____________________________ 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home