Sunday, 5 July 2026

స్వర్గస్తుడి సంతకంతో చెక్ జారీ..! తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర వివాదం**


స్వర్గస్తుడి సంతకంతో చెక్ జారీ..!                               తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర వివాదం**                                  హైదరాబాద్ : తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. మహాసభ ద్వారా ఒక శ్రీయశ్రీ విద్యార్థినికి ₹5,000/- విలువైన చెక్ జారీ చేయగా, ఆ చెక్‌పై స్వర్గస్తులైన కీ.శే. మిత్తినింటి వెంకటేశ్వర్లు గారి సంతకం ఉండడం పెను దుమారం రేపుతోంది. 04-07-2026 తేదీతో జారీ చేసిన చెక్‌పై మృతి చెందిన వ్యక్తి సంతకం ఎలా వచ్చిందనే అంశంపై ఆర్య వైశ్య సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంకటేశ్వర్లు గారు బ్రతికి వచ్చారా? లేదా ఆయన పేరును బద్నాం చేయాలనే దురుద్దేశ్యంతో ఈ చర్య చేపట్టారా? అని జాతి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది సాధారణ పొరపాటు కాదని, పెద్ద స్థాయి ద్రోహం, అధికార దుర్వినియోగం, నకిలీ సంతకాల వ్యవహారమని ప్రక్షాళన కమిటీ ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్న కొందరు నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తూ జాతి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా మార్పు కోసం, క్రమశిక్షణతో, నిజాయితీతో పనిచేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అక్రమాలు, నకిలీ సంతకాలు, దుర్వినియోగం కొనసాగితే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కేసులు తప్పవని ప్రక్షాళన కమిటీ స్పష్టం చేసింది. “ప్రక్షాళన కమిటీ ఎందుకు?” అని ప్రశ్నించే వారికి మీరు చేసిన తప్పులే సమాధానం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీదల కోసం విద్య, వైద్యం, వసతి వంటి సేవలు నిజంగా అందిస్తే మద్దతు ఉంటుందని, కానీ కేవలం కన్వెన్షన్ హాళ్లు, అధికార దాహం కోసమే వ్యవహరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సమాజం డిమాండ్ చేస్తోంది.