అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు స్థల సేకరణ చేస్తే భవన నిర్మాణాలకు నిధులు మంజూరు:. బీసీ సంక్షేమ శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్ తెలిపారు.
అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు స్థల సేకరణ చేస్తే భవన ::నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్ తెలిపారు.
శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టల్ల భవనాల నిర్మాణానికి జిల్లాల వారీగా సల సేకరణ చేసి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో 32 బి సి సంక్షేమ పాఠశాలలు,కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఉండగా సుమారు 30 అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, వీటన్నిటికి పక్కా భవనాలు నిర్మించేందుకు వెంటనే స్థలాలు చూసి ప్రతిపాదనలు పంపించాలన్నారు.
కులవృత్తులను కాపాడటంలో భాగంగా ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఈత చెట్లు, 5 లక్షల తాటి చెట్లను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అలాగే కాటమయ్య రక్షణ కిట్లను ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని , ఉమ్మడి నల్గొండ జిల్లాకు మరో 10 వేల రక్షణ కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదివరకే నల్గొండ దృష్టి పేరుపై మంచి కార్యక్రమాలు నిర్వహించారని, వీటిని వీటిని కొనసాగిస్తూ, అన్ని పాఠశాలలు ,కళాశాలల్లో రోడ్డు భద్రత క్లబ్బులను ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యార్థుల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద ఈ 18 నెలల కాలంలో 195 కోట్ల మంది మహిళలు రాను పోను 6500 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు.
ఆర్టీసీలో 3035 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, హైదరాబాదులో కాలుష్యం తగ్గించేందుకుగాను ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని, త్వరలోనే 2,800 బస్సులు హైదరాబాద్లో తిరిగే ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండ జిల్లాకు 77 ఈవి బస్సులను మంజూరు చేయగా, శనివారం సుమారు 40 బస్సులను ప్రారంభించడం జరిగిందని, మంత్రి వెల్లడించారు. నిజాం కాలం నాటి నార్కెట్పల్లి బస్ డిపోను దత్తత తీసుకొని డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తామని, వారం, పది రోజుల్లో రూటింగ్ ను సెట్ చేస్తామని, నార్కెట్పల్లి డిపోలో బస్సులను మూడింతలు పెంచి వారసత్వ సంపాదన కాపాడుతామని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలక్ట్రిక్ వాహనాల పద్ధతిని అమలు చేయనున్నమని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని చెప్పారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే నిర్ణయం తీసుకొనున్నామని, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ లు చేయనున్నామని చెప్పారు. జిల్లా అటవీశాఖ, డిఆర్డిఓ, బీసీ సంక్షేమ శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఈత, తాటివనాలను పెంచాలని తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ ,మిర్యాలగూడ, నార్కెట్పల్లి బస్సులను పెంచాలని, బీసీ సంక్షేమ హాస్టల్లు, భవనాల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,నకిరేకల్ బస్ డిపోను పట్టిష్టం చేయాలని కోరారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, ముఖ్యంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు వేగం కన్నా ప్రాణముఖ్యం అనే నినాదాలను ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రాయించాలని ,డ్రైవింగ్ లైసెన్సులను ఇచ్చే సమయంలో కఠినంగా ఉండాలని ,తప్పనిసరిగా వ్యక్తులు లేకుండా లైసెన్స్ ఇవ్వవద్దని, దండు మల్కాపూర్ లోని ఫిట్నెస్ సెంటర్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని, మన ఊరు- మనబడి కింద చేపట్టిన పాఠశాల ,సంక్షేమ వసతి గృహాలను పూర్తిచేసి వినియోగం లోకి తేవాలని, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ సంక్షేమ హాస్టల్ భవనాలు, ప్రభుత్వ భవనాలను ఇవ్వాలని, దీనివలన అద్దె బాధ తప్పుతుందని అన్నారు.
నాగార్జునసాగర్ శాసనసభ్యులు కొండూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ డిగ్రీ కళాశాల భవనంమార్చాలని, బీసీ సంక్షేమ హాస్టల్ కు మరమ్మతులు చేయించాలని, తన నియోజకవర్గం లోని కొన్ని రూట్ లకు కొత్త బస్సులను మంజూరు చేయాలని కోరారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పాత రోడ్లలోని పలు బస్సులను రద్దు చేయడం జరిగిందని ,వాటన్నిటిని పునరుద్ధరించాలని, మిర్యాలగూడలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను మార్చాలని కోరారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ నకిర్ కల్ నియోజకవర్గం బస్సులుపెంచాలని, ముంబై బస్సును పునరుద్ధరించాలని, అలాగే చిట్యాల బస్సు పునరుద్ధరించాలని, కేతేపల్లి మండలం మూసి గురుకుల పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రవాణా, బీసీ సంక్షేమ వసతి గృహాల విషయంలో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు .
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఆరు రాష్ట్ర రహదారులు, ఒక జాతీయ రహదారి ఉందని, రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించామని, మారముల ప్రాంతాలకు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేయనున్నామని, ఈ సంవత్సరం ఈత ప్లాంటేషన్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నామని, కొన్ని హాస్టళ్లు 80% పూర్తయ్యాయని, నిధులు లేమీవల్ల ఆగిపోయాయని, వాటికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ బస్సుల నిర్వహణ ,కాటమయ్య రక్షణ కిట్లు ,బీసీ సంక్షేమ వసతి గృహాలు, మహాత్మ జ్యోతిబా పాఠశాలల పై వివరించారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ రహదారి భద్రతపై తెలియజేయగా, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఉప కమిషనర్ వాణి తమ శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలను తెలియజేశారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కీట్లను పంపిణీ చేశారు.
అంతకుముందు మంత్రులు, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కార్యాలయావరణంలో వనమహోత్సవం కింద మొక్కలను నాటారు.
________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*