Sunday, 6 July 2025

మహాసభ ఎన్నికల ప్రక్రియ ను బ్రష్టు పట్టించి బైలా ను తుంగలోకి తొక్కిన అమరవాది - మిడిదొడ్డి శ్యాంసుందర్, మొగుళ్ళపల్లి ఉపేందర్

 మహాసభ ఎన్నికల ప్రక్రియ ను బ్రష్టు పట్టించి బైలా ను తుంగలోకి తొక్కిన అమరవాది  - మిడిదొడ్డి శ్యాంసుందర్, మొగుళ్ళపల్లి ఉపేందర్

 




హైద్రాబాద్: 


 అమరవాది తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ ను మొత్తం బ్రష్టు పట్టించి బై లా ను తుంగలోకి తొక్కారని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాంసుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ మొగుళ్ళపల్లి ఉపేందర్ లు విమర్శించారు.


హైద్రాబాద్ లోని NSS ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పు తో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు.


పది సంవత్సరాల నుండి అప్రజా స్వామికంగా ఎన్నికలు నిర్వహించకుండా అమరావాది ఆక్రమించుకొని సిగ్గు లేకుండా అధికారం చెలాయించాడనీ, తన తొత్తులనే ఎన్నికల అధికారి గా నియమించి అక్రమాలకు తెర లేపారనీ అన్నారు.


పది వేలు ఉన్న నామినేషన్ ఫీజు ను లక్షకు పెంచి, Ivf అండ్ వామ్ సభ్యులను పోటీ కి అనర్హులుగా పట్టించి ప్రజాస్వామాన్ని తుంగలో తొక్కి, బై లా ను మరియు ఎన్నికల ప్రక్రియ ను మొత్తం బ్రష్టు పట్టించారు. నామినేషన్లకు అక్రమంగా తొలగించి తాత్కాలికంగా ఆనంద పడ్డారనీ, చివరకు ప్రజాస్వామ్యం గెలిచినదనీ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చే ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందనీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారికి కోర్టు తీర్పు కాపీ అందించామని, త్వరలో ఎన్నికలు బై లా ప్రకారంగా పెట్టాలని కోరామని చెప్పారు.


ఇప్పుడున్న అమరావాదికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చినప్పటికీ సిగ్గు లేకుండా తానే అధ్యక్షుడు అని చెప్తూ సన్మానాలు సత్కారాలు చేసుకుంటూన్నారని విమర్శించారు.


రెండు సంవత్సరాల పదవి కి 11 ఏండ్లు ఉన్నారని అమరవాది కి పోటీ చేసే అర్హత లేదని ఆర్డర్ వచ్చిందినీ తెలిపారు ఇప్పటికైనా అమరవాది బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు సహకరింకాకుంటే చరిత్రలో ఆయన చేసిన అక్రమాలు నిలిచిపోతాయనీ అన్నారు.


ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చే పంచుకున్న డబ్బులు కోటి 75 లక్షలు తో పాటు తెలంగాణ మహాసభ పేరుతో 70 వేల సభ్యత్వం చేసినట్టు సమాచారం మని , దీని డబ్బు దాదాపు 3.5 కోట్లు మొత్తం 5 కోట్ల పైచిలుకు ఉండాలనీ, దీనితోపాటు ఇవన్నీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేసినందున దాదాపు 5 కోట్లు వడ్డీ వస్తుంది మొత్తం 10 కోట్ల పైచిలుకు డబ్బులు ఉండాలనీ, కానీ బయట మాట్లాడుతున్న ప్రకారంగా మూడు నుండి నాలుకోట్లే ఉన్నాయని తెలుస్తుందినీ, ఈ ఆర్థిక వ్యవహారాలపై కూడా పూర్తిగా విచారణ జరగాల్సిన అవసరం ఉందినీ పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చినందున ఇప్పటికైనా అమరవాది ఆర్థిక కార్యకలాపాలు ఆపి అన్ని లెక్కలు ప్రకటించవలసిన అవసరం ఉందిన్నారు.


ఈ ప్రెస్ మీట్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాంసుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ మొగుళ్ళపల్లి ఉపేందర్, కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు యాదా నాగేశ్వర్ రావు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, ఎన్నికల పైన కోర్టులో విజయం సాధించిన వైశ్య నాయకులు అగీర్ వెంకటేశం, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్ వి కుమార్, జగిత్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు పుల్లూరి సత్యనారాయణ, పీసీసీ మెంబర్ కొండ చంద్రశేఖర్, మునుగోటి రమేష్, కోరుట్ల మార్కెట్ డైరెక్టర్ మరియు విశిష్ట గౌరవ అధ్యక్షులు అల్లాడి శ్రీనివాస్, వెళ్డండ మండల అధ్యక్షుడు ఉప్పు ఆంజనేయులు, వంగూర్ మండల అధ్యక్షుడు, మేడీశెట్టి సురేష్, రంగారెడ్డి జిల్లా నాయకులు పోలా విష్ణు లు పాల్గొన్నారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home