Monday, 21 July 2025

.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై.. ఆగ్రహం వ్యక్తం చేసిన కంచర్ల.

 


 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం  తో ప్రమాదం..


 నల్గొండ మండలం అన్నారెడ్డి గూడెంలో ఘటన.


 చెట్లు కొడుతుండగా బండిపై వెళ్తున్న వారిపై విరిగిపడ్డ కరెంటు స్తంభం.


 రెండు రోజులైనా స్పందించని విద్యుత్ అధికారులు.


 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై.. ఆగ్రహం వ్యక్తం చేసిన కంచర్ల.




 నేడు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.... నిన్న ప్రమాదంలో గాయపడ్డ నల్గొండ మండలం అన్నారెడ్డి గూడెం గ్రామం శాఖ అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు.. కుటుంబాన్ని వారు చికిత్స పొందుతున్న ఐకాన్ హాస్పిటల్ లో పరామర్శించారు. వారు ప్రమాద వివరాలు తెలియచేస్తూ.. తాను తన భార్య మంజుల కుమారుడు హర్షవర్ధన్ తో కలిసి పొలానికి బండిమీద నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో.. బయలుదేరి వెళుతుండగా., అన్నారెడ్డి గూడెం గ్రామ శివారులో... విద్యుత్ అధికారులు చెట్లు కొట్టుతున్నారు.. అందులో ఒక చెట్టు విద్యుత్ స్తంభంపై విరిగిపడి.. అదే దారిలో ప్రయాణిస్తున్న తమపై పడిందని.. అదృష్టవశాత్తు తాను తన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డా మని తమ కుమారునికి.. తలకు బలమైన తీవ్ర గాయాలయ్యాయని.. తాము వెంటనే ఐకాన్ ఆస్పత్రికి తరలించామని తెలియచేసారు.

 కానీ ఇంతవరకు విద్యుత్ సంస్థకు చెందిన అధికారులు ఎవరూ తమ పరామర్శించలేదని.. కంచర్లకు తెలియజేశారు.

 దీంతో వెంటనే స్పందించిన కంచర్ల .. విద్యుత్ ఉన్నతాధికారులతో ఫోన్లో సంభాషించి.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య పట్ల తన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు... కనీస మానవత్వం లేకుండా..తమ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాల బాధ తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ..

 తక్షణమే విద్యుత్ అధికారులు బాధితులను పరామర్శించి వారి చికిత్సకయ్యే ఖర్చులు భరించి వారికి.. విద్యుత్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

 అదేవిధంగా హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.

 మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం,

 మాజీ సర్పంచ్ రాము బీరం గోపాల్ రెడ్డి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home