Saturday, 31 May 2025

జూన్ 3 నుండి 20 వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

      రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 

జూన్ 3 నుండి 20 వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా  త్రిపాఠి తెలిపారు.


        శనివారం ఆమె ఉదయాదిత్య భవన్లో తహసీల్దార్లు , సర్వేయర్లు,సీని



యర్ ,జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు  తో  రెవెన్యూ సదస్సుల నిర్వహణ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు .


     రెవెన్యూ సేవలను సరళతరం చేయడం, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం  రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నదని, అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం-2025 ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

      రెవెన్యూ సదస్సులు నిర్వహించే వివరాలను ముందుగానే ప్రజలందరికీ

 తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని, ఆయా గ్రామాలలో నిర్వహించే సదస్సులకు ఒక రోజు ముందే టాం,టాం ద్వారా ప్రచారం కల్పించాలని, అంతేకాక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ ల ద్వారా ప్రచారం చేయాలన్నారు.రెవెన్యూ సదస్సులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించాలని, ప్రతిరోజు సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఆ రోజు వచ్చిన దరఖాస్తులపై చర్చించాలని తెలిపారు.  దరఖాస్తుల డేటా కోసం ప్రత్యేకంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించాలన్నారు.రెవెన్యూ సదస్సుల నిర్వహణకు గాను ప్రతి మండలంలో రెండు బృందాలుగా ఏర్పడి ఒక బృందానికి  తహసిల్దార్,మరో బృందానికి నాయబ్ తహసీల్దార్  నాయకత్వం వహించాలని,  బృందంలో  ఆర్ ఐ, సర్వేయర్, సీనియర్,జూనియర్ అసిస్టెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చూడాలన్నారు .

    రెవెన్యూసదస్సులు నిర్వహించే చోట టెంటు, కుర్చీలు, ఫ్లెక్సీ బ్యానర్ లు ,హెల్ప్ డెస్క్ లు ,దరఖాస్తులు స్వీకరించేందుకు దరఖాస్తుల స్వీకరణ కేంద్రం , సరిపోయినన్ని ప్రింటు దరఖాస్తులు ,భూములకు సంబంధించిన అన్ని రిజిస్టర్ లను వెంట తీసుకు వెళ్లాలని చెప్పారు. దరఖాస్తు స్వీకరించిన తర్వాత దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వాలని, దరఖాస్తులను ఆయా కేటగిరీల వారీగా విభజించి ప్రతిరోజు దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. అంతేకాక చిన్న మండలాలలో దరఖాస్తులు తక్కువగా వచ్చిన చోట చదివి సిద్దంగా ఉంచుకోవాలని,

దరఖాస్తులు అన్నింటిని జాగ్రత్తగా భద్రపరచాలని అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని  

అన్ని రిజిస్టర్లు జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.   

 

  అనంతరం జిల్లా కలెక్టర్ ఇతర రెవెన్యూ అంశాలను సమీక్షిస్తూ...

 రాష్ట్ర ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాల కు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వాలని ఆదేశించినందున 3 నెలల  రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిస్తున్నారని, తహసిల్దార్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, రేషన్ బియ్యాన్ని చౌక ధరల దుకాణాల లోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, 3 నెలల బియ్యం పంపిణీ విషయాన్ని

 అందరికీ తెలియజేసి తీసుకు వెళ్ళాలా చూడాలని కోరారు.బియ్యం అందుబాటులో ఉండేలా చూడాలని, ఈ విషయంపై తక్షణమే డీలర్లతో సమావేశం నిర్వహించాలని ,సన్న బియ్యం పంపిణీ పై ఎట్టి పరిస్థితులలో 

ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

        

     రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2 న గ్రామస్థాయి మొదలుకొని, జిల్లా కేంద్రం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు .


        రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై ముందే గ్రామాలలో ప్రచారం చేయాలని చెప్పారు. దరఖాస్తులను ఏవిధంగా పూరించాలో వివరించారు.ప్రతి దరఖాస్తుకు గ్రామాల వారిగా రసీదు ఇవ్వాలని, దరఖాస్తులు కేటగిరీ వారీగా విభజించుకోవాలని చెప్పారు.   


      ఈ సమావేశంలో 

ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు, ప్రజావాణి ఫిర్యాదులు, కోర్టు కేసులు,ప్రజావాణి పిటిషన్లు, ఎలక్షన్ కు సంబంధించిన విషయాలపై సమీక్షించారు.

    మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,నల్గొండ  ఆర్ డి ఓ అశోక్ రెడ్డి ,దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి లు మాట్లాడారు.


    పైలెట్ మండలం నకిరేకల్ తహసిల్దార్ జహీర్ నకిరేకల్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల అనుభవాలను సమావేశానికి హాజరైన వారికి తెలియజేశారు.

తిరుమలలో అలా చేయడం సరికాదు- చట్టపరమైన చర్యలుంటాయ్


 తిరుమలలో అలా చేయడం సరికాదు- చట్టపరమైన చర్యలుంటాయ్ 

            ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 71,721 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 36,011 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.42 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. 

                 వేస‌వి సెల‌వుల కార‌ణంగా వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లు, నారాయ‌ణ‌గిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంత‌రాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేస్తోంది. ఈ నేపథ్యంలో- టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. తనిఖీలు నిర్వహించారు. శిలాతోర‌ణం వద్ద క్యూలైన్ల‌ను ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్న అన్న‌ ప్రసాదాలు, ఇతర సౌకర్యాల గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీటీడీ సిబ్బంది అందిస్తోన్న సౌక‌ర్యాల‌పై భక్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. క్యూలైన్ లల్లో భక్తులకు అన్న ప్ర‌సాదాలు అంద‌ట్లేదని నినాదాలు చేశాడని, ఆ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. ఆయ‌నను వెంట‌నే సంప్ర‌దించి ఆరా తీయ‌గా త‌న‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డం, ర‌ద్దీ గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, ద‌ర్శ‌న స‌మ‌యం ఆల‌స్య‌మౌతోందనే కారణంతో తాను అసహనానికి గురైనట్లు ఒప్పుకున్నారని చెప్పారు. ఆ తరువాత క్షమాపణలు చెప్పాడని అన్నారు. 

                 టీటీడీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు క్యూలైన్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ భక్తుల‌కు అందిస్తోన్న స‌దుపాయాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని వెంకయ్య చౌదరి చెప్పారు. వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో ప్ర‌తి రోజూ ల‌క్ష‌కు పైగా భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నార‌ని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 ల‌క్ష‌లు దాటుతోంద‌ని చెప్పారు. వీఐపీ బ్రేక్‌, శ్రీ‌వాణి ద‌ర్శ‌నాల‌ను త‌గ్గించి సాధార‌ణ భ‌క్తుల‌కే ద‌ర్శ‌నాల్లో పెద్ద‌పీట వేస్తున్నామ‌ని అదనపు ఈఓ వివరించారు. ప్ర‌తిరోజూ 60 శాతానికి పైగా స‌ర్వ ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులే స్వామివారిని ద‌ర్శించుకుంటున్నార‌ని పేర్కొన్నారు. సాధార‌ణ రోజుల‌ కంటే 10,000 మంది భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శ‌న‌ం కల్పించడానికి టీటీడీ సిబ్బంది క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అన్నారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా నిరంత‌రాయంగా అన్న ప్ర‌సాదాలు, టీ, కాఫీ, పాలు, మ‌జ్జిగ‌, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామ‌ని, ఆరోగ్య విభాగం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గిస్తూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం త‌లెత్త‌కుండా పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని తెలిపారు.

           ఇక నుంచి..!!" టీటీడీ సిబ్బంది కృషిని ప‌ట్టించుకోకుండా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా కొంద‌రు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని వెంకయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కొంద‌రు అన‌ధికారిక వ్య‌క్తులు ద‌ర్శ‌న క్యూలైన్ల‌లో భ‌క్తుల‌ను రెచ్చ‌గొడుతూ వీడియోలు తీస్తున్నార‌ని, అలాంటివారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. విప‌రీత ర‌ద్దీ నేప‌థ్యంలో భ‌క్తులు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకుని సంయ‌మ‌నం పాటిస్తూ స్వామివారిని ద‌ర్శించుకోవాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం స‌రికాద‌ని చెప్పారు.

Friday, 30 May 2025

Junior Colleges | 183 జూనియర్‌ కాలేజీలు క్లోజ్‌.. అంపశయ్యపై 101 ప్రభుత్వ, 77 ప్రైవేట్‌ కాలేజీలు

 

Junior Colleges | 183 జూనియర్‌ కాలేజీలు క్లోజ్‌.. అంపశయ్యపై 101 ప్రభుత్వ, 77 ప్రైవేట్‌ కాలేజీలు

 

Junior Colleges | రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదే 183 జూనియర్‌ కాలేజీలు మూతపడబోతున్నాయి. 101 గవర్నమెంట్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలు (గురుకులాలు, కేజీబీవీ) క్లోజ్‌ అయ్యే జాబితాలో ఉన్నాయి. ఇందులో 62 గురుకులాలే ఉన్నాయి. బీసీ వెల్ఫేర్‌ 28, మైనార్టీ 16, గిరిజన 14, ఎస్సీ గురుకులాలు 4 ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే 77 ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల కథ కూడా పరిసమాప్తం కానున్నది.                                    అఫిలియేషన్‌కు ఇంకా దరఖాస్తు చేయని వైనం

ఇక ఇవి మూతపడ్డట్టేనా..? అన్న అనుమానాలు

గురుకులాల మూసివేతకు కాంగ్రెస్‌ సర్కారు యత్నం

సమీకృత గురుకులాల ఏర్పాటుకేనన్న ఆరోపణలు

Junior Colleges | హైదరాబాద్‌, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదే 183 జూనియర్‌ కాలేజీలు మూతపడబోతున్నాయి. 101 గవర్నమెంట్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలు (గురుకులాలు, కేజీబీవీ) క్లోజ్‌ అయ్యే జాబితాలో ఉన్నాయి. ఇందులో 62 గురుకులాలే ఉన్నాయి. బీసీ వెల్ఫేర్‌ 28, మైనార్టీ 16, గిరిజన 14, ఎస్సీ గురుకులాలు 4 ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే 77 ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల కథ కూడా పరిసమాప్తంకానున్నది. ఇప్పటి వరకు ఈ కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయనిదే అనుబంధ గుర్తింపు దక్కదు. ఈ లెక్కన 183 కాలేజీల ముచ్చట ఒడిసినట్టే. ఏటా ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు కోసం అన్ని రకాల కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు తనిఖీలు చేసి గుర్తింపు ఇస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,064 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేశాయి.                                                                      183 కాలేజీలు అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు సమర్పించలేదు. వీటిలో అత్యధికంగా 101 ప్రభుత్వ, గురుకుల జూనియర్‌ కాలేజీలే ఉన్నాయి. మూడు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు కూడా దరఖాస్తు చేయలేదు. ఒక కో ఆపరేటివ్‌, ఒక ఇన్సెంటివ్‌, రెండు ఎయిడెడ్‌, ఒక రైల్వే/సెంట్రల్‌గవర్నమెంట్‌ కాలేజీలు, 2 మాడల్‌ స్కూల్స్‌, 34 కేజీబీవీలు కూడా దరఖాస్తులు సమర్పించలేదు. దరఖాస్తు చేసుకున్న 700 పైచిలుకు కాలేజీలకు ఇప్పటికే ఇంటర్‌బోర్డు గుర్తింపు ఇచ్చింది. జూన్‌ 2 నుంచి కాలేజీలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 101 కాలేజీలు క్లోజ్‌ అయినట్టేనా? అన్న అనుమానాలొస్తున్నాయి. ఆలస్య రుసుము లేకుండా అఫిలియేషన్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 4తో ముగిసింది. ప్రస్తుతం ఆలస్య రుసుముతో జూన్‌ 8 వరకు దరఖాస్తు చేసే అవకాశముంది. అంతలోపు దరఖాస్తు చేస్తారా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది.

కాంగ్రెస్‌ హయాంలో 150 ప్రైవేట్‌ కాలేజీలు క్లోజ్‌

రేవంత్‌ సర్కారు కొలువుదీరిన తర్వాత ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు సైతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ రెండేండ్ల కాలంలో 150 వరకు ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు మూసివేతకు సిద్ధమయ్యాయి. ఈ ఒక్క ఏడాదే 77 కాలేజీలు క్లోజ్‌ కానున్నాయి. 2024-25లో 1,415 ప్రైవేట్‌ కాలేజీలు గుర్తింపు పొందగా, ఈ ఏడాది 1,338 కాలేజీలే దరఖాస్తు సమర్పించాయి. 2023-24లో 1,482 ఉండగా, 2024-25కు వచ్చేసరికి వీటి సంఖ్య 1,415కు పడిపోయాయి. నిరుడు ఒక్క ఏడాదిలోనే 67 కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది 77 కాలేజీలు అఫిలియేషన్‌కు దరఖాస్తు చేయలేదు. సర్కారు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయకపోవడం ఇతరాత్ర కారణాలతో కాలేజీలు మూతపడుతున్నట్టు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.


కేసీఆర్‌ పెంచితే.. తుంచేస్తున్న రేవంత్‌

గత కేసీఆర్‌ సర్కారు రాష్ట్రంలో పెద్దఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసింది. 2014లో రాష్ట్రంలో 298 గురుకులాలుండగా, 2023 నాటికి 1,200 పైచిలుకు గురుకులాలను ఏర్పాటు చేసింది. అంటే ఈ పదేండ్ల కాలంలో వెయ్యి వరకు కొత్త గురుకులాలను నెలకొల్పింది. పదో తరగతి వరకు ఉన్న గురుకులాలను ఇంటర్‌, డిమాండ్‌ను బట్టి డిగ్రీ వరకు అప్‌గ్రేడ్‌చేసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో కార్పొరేట్‌కు దీటుగా ఈ గురుకులాలు నడిచాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ గురుకులాలను గాలికొదిలేసింది. క్రమంగా నిర్వీర్యం చేస్తున్నది. ఫలితంగా గురుకులాల్లో పాముకాట్లు, ఎలుకగాట్లు, ఫుడ్‌ పాయిజన్లతో పరిస్థితి అస్తవ్యస్థంగా తయారయ్యింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు గురుకులాలపై నమ్మకం సడలుతున్నది. ఈక్రమంలోనే గురుకులాలను మూసివేసేందుకు సర్కారు పావులు కదుపుతున్నదన్న వాదనలొస్తున్నాయి. సమీకృత గురుకులాల కోసమే కేసీఆర్‌ సర్కారు ప్రారంభించిన గురుకులాలను మూసివేస్తున్నదన్న ఆరోపణలొస్తున్నాయి. 105 కొత్త సమీకృత గురుకులాలను దీంట్లో భాగంగానే మంజూరుచేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.   

Wednesday, 28 May 2025

*అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*



 *అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*

IVF మహిళ విభాగ్ ఆధ్వర్యంలో కొత్త పేట మోహన్ నగర్ కరెంట్ ఆఫీస్ దగ్గర నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం గొప్పది అని ఆయన అన్నారు.
ఆకలి తీర్చడంలో వచ్చే ఆనందం వేరు అని ప్రతి అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్న వారికి అభినందనలు తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు, మహిళ general secretary మంజుల గారు నళిని గారు, మనిమాల, పోల అర్చన, లలిత, సరిత, పద్మజ, సరిత, దాక్షాయణి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 27 May 2025

ACB….రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

 

   ….రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్

ఖమ్మం మండలం తల్లంపాడుకు చెందిన ఒక వ్యక్తి తన రెండెకరాల భూమిని కొడుకు పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్‌ను కలవగా, రూ.50 వేలు డిమాండ్ చేసిన అరుణ

రూ.30 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకొని, ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు

Monday, 26 May 2025

భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.









     భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.


      సోమవారం ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన  లైసెన్స్డ్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలన ,సామగ్రి పంపిణీ  కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


   ఈ నెల 26 నుండి   సుమారు 50 పనిదినాలు లైసెన్స్డ్  సర్వేయర్లకు ఇచ్చే  శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.  వివిధ సందర్భాలలో నిర్వహించే సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర మరువలేనిదని అన్నారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్  భూముల సర్వే, ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే ,ఎఫ్ లైన్ సర్వే వంటి సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు .ప్రత్యేకించి రెవెన్యూ కు సంబంధించి  గ్రామాలు,మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయం లో, అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లది కీలక పాత్ర అని అన్నారు. అందువలన సర్వేయర్లు శిక్షణకు  హాజరై  జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.

   ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ 150 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల కు సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు.

  కాగా జిల్లాలో  లైసెన్స్డ్ సర్వేయర్ల కై మీ- సేవ ద్వారా 819 మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతన సోమవారం 409 మంది ధ్రువపత్రాలు పరిశీలించడం జరిగింది. 2 వ విడత ఆగస్టులో మరో 410 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.లైసెన్స్డ్ సర్వేయర్లకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో శిక్షణ ఇవ్వనున్నారు.


     ఈ కార్యక్రమానికి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇంచార్జ్ ఏ డి సుజాత,డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్  రమణయ్య,సూపరింటిండెంట్ రాధాకృష్ణ, తదితరులు హాజరయ్యారు.

________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు ,సమాచార శాఖ,నల్గొండ*

Sunday, 25 May 2025

గ్రామ పాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్చార్జి


గ్రామ పాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్చార్జి


      ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది .పరీక్ష ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్చార్జి అదనపు కలెక్టర్  నారాయణ్  అమిత్  కలిసి గ్రామ పాలనాధికారుల పరీక్షను తనిఖీ చేశారు . పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్ ఇన్విజిలేటర్లతో పరీక్ష తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరీక్షకు హాజరైన వారు, గైర్హాజరైన వారి వివరాలను, పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, బందోబస్తు ,తదితర అన్ని అంశాలను పరిశీలించారు.


        కాగా నల్గొండ జిల్లా నుండి గ్రామ పాలన అధికారుల పరీక్షకు 276 మంది హాజరు కావలసి ఉండగా  241 మంది పరీక్షకు హాజరయ్యారు. 35 మంది పరీక్షకు  గైర్హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు . గ్రామ పాలనాధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆమె తెలిపారు.


       జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,  స్థానిక సంస్థల ఇన్చార్జ్ అధనపు కలెక్టర్ ,గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, తహసిల్దార్ హరిబాబు, తదితరులు ఉన్నారు.

________________________________


 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

అన్నం తిన్న తరవాత అసలు చేయకూడని కొన్ని పనులు, అలవాట్లు మార్చుకోకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది

 అన్నం తిన్న తరవాత అసలు చేయకూడని కొన్ని పనులు, అలవాట్లు మార్చుకోకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది







తిన్న తరవాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదని వివరించారు డాక్టర్ మనోజ్ఞ. నీళ్లు తాగడంతో పాటు మరి కొన్ని అలవాట్లనూ మానుకోవాలని సూచించారు. తిన్న తరవాత చేయకూడని పనులతో పాటు ఏమేం చేయాలో కూడా చెప్పారు.

అన్నం తిన్న తరవాత అసలు చేయకూడని కొన్ని పనులు, అలవాట్లు మార్చుకోకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది

ఏం తింటున్నాం. ఎలా తింటున్నాం. ఈ రెండే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. కానీ తిన్న తరవాత కూడా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మన హెల్త్ ని నిర్ణయిస్తుంది. చాలా మంది తిన్న వెంటనే కడుపు నిండా నీళ్లు తాగేస్తారు. ఇంకొందరు వెంటనే వెళ్లి మళ్లీ సీట్ లో కూర్చుని ఆఫీస్ పని మొదలు పెడతారు. ఇవన్నీ మనకి చాలా నార్మల్ గానే అనిపిస్తుండొచ్చు. కానీ..రెగ్యులర్ గా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ఈ అలవాట్లతో తెలియకుండానే మనమే ఎన్నో జబ్బులను ఆహ్వానిస్తున్నాం.

తిన్న తరవాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదని వివరించారు డాక్టర్ మనోజ్ఞ. నీళ్లు తాగడంతో పాటు మరి కొన్ని అలవాట్లనూ మానుకోవాలని సూచించారు. తిన్న తరవాత చేయకూడని పనులతో పాటు ఏమేం చేయాలో కూడా చెప్పారు. ఇలా చేయడం వల్ల అజీర్తి, గ్యాస్ తో పాటు మరి కొన్ని సమస్యలు దూరం అవుతాయని వివరించారు. మరి తిన్న తరవాత చేయకూడని పనులేంటి. ఏమేం చేయొచ్చు అన్న వివరాలు తెలుసుకుందాం.

నిద్రపోవడం

సాధారణంగా తిన్న వెంటనే మనకి నిద్ర వచ్చేస్తుంది. కునుకు పాట్లు పడుతుంటాం. ఇది చాలా సహజం. కానీ ఆ సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇలా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీరంలో ఎలాంటి కదలిక లేకుండా రెస్ట్ మోడ్ లో ఉంటే తిన్నదంతా పెట్టెలో పెట్టినట్టే ఉంటుంది. కాస్తైనా కదలికలు ఉంటేనే జీర్ణ వ్యవస్థ యాక్టివ్ గా ఉంటుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ విడుదలై ఆహారం జీర్ణం అవుతుంది. తిన్న వెంటనే నిద్రపోతే ఈ ఎంజైమ్స్ విడుదల కావు. ఫలితంగా తిన్నది గొంతులోకి వచ్చినట్టుగా అవుతుంది. సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

టీ, కాఫీలు తాగడం

తిన్న తరవాత టీ లేదా కాఫీ తాగడం అసలు మంచిది కాదు. ఆహారంలో ఉన్న ఐరన్ తో పాటు మరి కొన్ని పోషకాలు శరీరానికి అందకుండా ఇవి అడ్డుకుంటాయి. అంటే తిన్న వెంటనే టీ , కాఫీలు తాగితే న్యూట్రియెంట్స్ కోల్పోతాం. ఈ అలవాటు ఉండి ఉంటే వెంటనే అది మానుకోవడమే మంచిది. ఇక తిన్న తరవాత స్నానం చేయడమూ మంచిది కాదు. తిన్నది అరగాలంటే బాడీలో హీట్ ఉండాలి. హీట్ సరైన విధంగా ఉంటేనే డైజేషన్ కి అవసరమైన యాసిడ్స్ విడుదలవుతాయి. అయితే..ఆ సమయంలో స్నానం చేయడం వల్ల బాడీ టెంపరేచర్ లో మార్పులు వస్తాయి. ఈ కారణంగా వేడి తగ్గిపోయి ఇది డైజేషన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే తిన్న తరవాత స్నానం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు.

డాక్టర్ ఏం చెప్పారంటే

​నీళ్లు అతిగా తాగడం

తిన్న వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పొట్టలో జీర్ణం అయ్యేందుకు వీలుగా విడుదలయ్యే యాసిడ్స్ చల్లారిపోతాయి. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. దీంతో పాటు తిన్న తరవాత పొరపాటున కూడా స్మోకింగ్, గుట్కాలు తినడం లాంటివి చేయకూడదని వివరించారు డాక్టర్ మనోజ్ఞ. ఈ అలవాట్లు కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు.

అతిగా వ్యాయామం

చాలా మంది తిన్న వెంటనే కేలరీలు తగ్గించుకోవాలని చెప్పి అతిగా వ్యాయామం చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. అయితే..ఓ అరగంట లేదా గంట తరవాత వ్యాయామం చేస్తే బెటర్. తిన్న వెంటనే చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. విపరీతంగా కడుపు నొప్పి రావడం, అజీర్తి లాంటి సమస్యలు వచ్చే ప్రమాదముంటుంది. అయితే..తిన్న తరవాత కనీసం అరగంట నుంచి మూడు గంటల మధ్యలో ఎప్పుడైనా వ్యాయామం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఏం చేయొచ్చు

తిన్న తరవాత వెంటనే కూర్చోకుండా కనీసం పది నుంచి పదిహేను నిముషాల పాటు వాకింగ్ చేయాలి. మరీ నెమ్మదిగా కాదు. మరీ వేగంగా కాదు. నార్మల్ స్పీడ్ లో నడిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. వీటితో పాటు తేలికపాటి పనులు చేసుకోవచ్చు. అన్నం తినే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగకూడదు. తరవాత కూడా కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి తాగాలి. ఇలా అయితే తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య రానే రాదు. యాసిడ్స్ సరైన విధంగా విడుదలై ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. అయితే.. తిన్న తరవాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

గమనిక:ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.

Saturday, 24 May 2025

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..

 

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..

telangana sarpanch mptc elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.               తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగరా మోగనుంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలు. ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరో నెల, రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది.. అప్పటి వరకు ఆగడం ఎందుకన్నట్లు.. ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇప్పటికే గ్రామాల్లో.. స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవుల వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ఆ వివరాలు..


తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నికల తేదీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చేలా ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం- రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి









@  ఎస్ఎల్బీసీ పనులను పునః ప్రారంభించి  మా హయంలొనే పూర్తి చేస్తాం 

@  44 కిలోమీటర్ల ఎస్ ఎల్ బి సి సొరంగ  మార్గం  భూమిని డెన్మార్క్ నుండి హెలికాఫ్టర్ తెప్పించి 

 ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే చేయించనున్నాం .

@ కృష్ణా నది జలాల్లో 70% తెలంగాణకు ఇవ్వాలని కృష్ణ బచావత్  ట్రిబ్యునల్ ముందు ఉంచాం.

@  తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చేలా ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం- రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 


        గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూలిపోయిన ఎస్ ఎల్ బి సి పనులను పునః ప్రారంభించి తమ హయాంలోనే పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

     శనివారం ఆయన నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలోని అయిటిపాముల వద్ద 

100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై  స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి సమీక్షించారు.


      ఎస్ ఎల్ బి సి  సొరంగం వెళుతున్న 44 కిలోమీటర్ల   భూమిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేయించేందుకు డెన్మార్క్ నుండి హెలికాప్టర్  తెప్పించి లైడార్ సర్వే చేయించనున్నట్లు తెలిపారు .ప్రస్తుతం జరుగుతున్న టన్నెల్ పనులు  ప్రపంచంలోనే అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు .


        గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణ, గోదావరి నది జలాల లో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ ,ఖమ్మం రైతాంగంతో పాటు, రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగిందని  అన్నారు.కృష్ణ బచావత్  ట్రిబ్యూనల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయిస్తే, గత ప్రభుత్వ హయంలో 512 ఎంసీలు ఆంధ్రకు, 299 టిఎంసిలు తెలంగాణకు సరిపోతుందని రాతపూర్వకంగా ఇచ్చారని,తాము అధికారంలోకి వచ్చాక ఈ కేటాయింపులను పునః సమీక్షించి కృష్ణాజిల్లాలో 70% తెలంగాణకు ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ ముందు  ఉంచడంతోపాటు, గతంలో ఇచ్చిన  తీర్పు కేసును రీ ఓపెన్  చేయించినట్లు వెల్లడించారు.


      గత ప్రభుత్వం కాళేశ్వరం పై పెట్టిన లక్ష కోట్ల ధనం వృధా అయిందని,  కాలేశ్వరం కూలిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో లేని విధంగా ఈ ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు ,యాసంగిలో  130 లక్షల మెట్రిక్ టన్నులు ,మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టించిందని తెలిపారు. తుమ్మడి హట్టి వద్ద 38 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టెందుకు రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేయగా, గత ప్రభుత్వం దీన్ని మూడింతలు పెంచి తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చిందని ,తుమ్మిడి హట్టిలో ప్రాజెక్టు నిర్మించకపోవడం వల్ల 62 వేల కోట్ల రూపాయలు వృధా అయ్యిందని, ఒకవేళ ఈ 62,000 కోట్లు ఆదా అయి ఉంటే ఈ మొత్తంతో రాష్ట్రంలోని   పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉండేదని తెలిపారు.


    తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా పనులు చేస్తున్నామని, కాలేశ్వరంపై విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ చేపట్టామని, జస్టిస్ పినాకిని చంద్రఘోష్  నేతృత్వంలో విచారణకు ఆదేశించామని అన్నారు . రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా   ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని , నీటిపారుదల శాఖను పటిష్టం చేయడంలో భాగంగా 1100 మంది ఇంజనీర్లను, 1800 మంది లస్కర్లను నియమించామని తెలిపారు .తమ ప్రభుత్వ హాయంలోనే పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల బిసీ, డిండి తదితర ప్రాజెక్టులన్ని పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

    అయిటి పాముల లిఫ్ట్ ఇరిగేషన్ ను డిసెంబర్ లోగా పూర్తిచేసి 8000 ఎకరాలకు సాగు నిరంధించనున్నట్లు మంత్రి వెల్లడించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ విషయంలో రైతులతో చర్చించి ఓపెన్ కాలువ లేదా పైపుల ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంకు సూచించారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నదని, భూసేకరణ సాధ్యం కాకపోతే పైప్లైన్ ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో మాట్లాడి ఒప్పించాలని కోరారు. ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికి ఏజెన్సీ అధిక ప్రాధాన్య పెంచి డిసెంబర్ లోపు పూర్తిచేసేలా చూడాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చే గంధమల్ల లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ సమస్యను దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని తగ్గించి పనులు ప్రారంభించేలా ఆదేశించడం జరిగిందని ,బుణ్యాధిగాని కాలువ, ధర్మారెడ్డి కాల్వ,పిల్లయి పల్లి కాల్వలకు 500 కోట్లు మంజూరు చేసి ఇటీవలే హైదరాబాద్లో సమావేశాన్ని నిర్వహించి ఈ మూడు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టామన్నారు. అలాగే బసవపూర్ ఇరిగేషన్ భూ సేకరణకు వచ్చే నెలలో అవసరమైన నిధులను మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దిండి ఎత్తిపోతల పథకానికి 1800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగిందని , దున్నపోతుల గండిబోత్తలపాలెం తోపాటు, కృష్ణా నదిపై చేపట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి  పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


      నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ఐటిపాముల ఎత్తిపోతల పథకం కు ఆసిఫ్ నగర్ నుండి లింక్ చేయాలని, నవంబర్ డిసెంబర్ లోపు ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటిపాములతో పాటు, బసవపురం గంధమల్ల పై దృష్టి సారించి సాగునీరు అందిస్తే 50,000 ఎకరాలకు నీరు వస్తుందని, అలాగే బ్రాహ్మణ వెల్లేముల, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయపల్లి కాలువ, బునియాది గాని కాలువ తదితర లిఫ్ట్ల ద్వారా నకిరికల్ ప్రాంతానికి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు రానుందని తెలిపారు. పిల్లాయిపల్లి కాలువ ద్వారా చెరువులు నింపే అవకాశాన్ని కల్పించాలని కోరారు .


     మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే 8000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.  


     శాసనమండలి సభ్యులు శంకర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు లిఫ్ట్ ఇరిగేషన్లు, ప్రాజెక్టుల పూర్తి కికృషి చేస్తున్నదని, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మూడు మండలాలకు తాగునీరు అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు.


     నల్గొండ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కట్టంగూర్, నకిరేకల్, శాలిగౌరారం మండలాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని,ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కు 101 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, 200 ఎకరాల భూసేకరణ అవసరం ఉందని, ఇందుకు రైతులు సహకరిస్తే డిసెంబర్ లోపే ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని తెలిపారు .


    అంతకు ముందు మంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించడమే కాకుండా, ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.


     ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ వివరాలు మంత్రికి తెలియజేశారు.కాగా ఇరిగేషన్

 ఇంజనీర్లు, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, స్థానిక తహసిల్దార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .

వేశ్య లాగా చూస్తున్నారు.. మిస్ వరల్డ్ 2025 పోటీలకు గుడ్ బై


 వేశ్య లాగా చూస్తున్నారు.. మిస్ వరల్డ్ 2025 పోటీలకు గుడ్ బై

              తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్‌ వరల్డ్‌ 2025 అందాల పోటీలను నిర్వహిస్తోంది. ఇప్పటికే జరిగిన పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో ఇండియా తరపున నందిని గుప్తా కూడా ఉన్నారు. ఈనెల 31న హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే పోటీ ఉండనుండగా.. ఫైనల్‌ రౌండ్‌లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ ఆర్గనైజర్లు తనను వేశ్య లాగా చూశారంటూ అందాల పోటీల నుంచి ఓ కంటస్టెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఎవరు ? ఏం జరిగిందో తెలుసుకుందాం.... పోటీల నుంచి వైదొలిగిన వ్యక్తి మిస్‌ ఇంగ్లండ్‌ " మిల్లా మాగీ ". 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్లిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మేరకు ఆమె పోటీల నుంచి తప్పుకున్న తర్వాత 'ది సన్‌' న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇంటర్వ్యూ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.

               ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారంటే.. మిస్ వరల్డ్ పోటీదారులను ఎప్పుడు మేకప్‌తోనే ఉండేలా చేస్తున్నారని.. టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని అన్నారు. అంతే కాకుండా సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపారు. ఎప్పుడూ బాల్ గౌన్లోనే ఉండాలని.. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. తమని వేశ్యలు లాగా చూస్తున్నారంటూ మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా వినోదం కోసం తమను వీధుల్లో తిప్పారని మాగీ వాపోయారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తి నింపేందుకు పోటీలో పాల్గొన్నానని.. కానీ అక్కడ పరిస్థితులు వేరని.. కొందరిని సంతృప్తి పరిచేందుకు కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు కాదంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.


        మిల్లా మాగీ ఈ పోటీ నుంచి వైదొలగడంతో ప్రస్తుతం ఆమె స్థానంలో మిస్ లివర్‌పూల్ అయిన 25 ఏళ్ల షార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ ఫైనల్‌లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా మండిపడింది. గతంలో అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాలను స్థానిక మహిళలతో కడిగించి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని.. ఇప్పుడేమో ఈ తరహా కామెంట్స్ ఓ కంటస్టెంట్ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని రాసుకొచ్చారు. 

తెలంగాణ ప్రజల సొమ్ము రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి మరీ అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్, బ్రోకర్ రేవంత్! హైదరాబాద్‌ – "మిస్ వరల్డ్ 2025 ఆర్గనైజర్లు నన్ను వేశ్యలా చూశారు" అంటూ అందాల పోటీల నుండి మధ్యలోనే హైదరాబాద్ నుండి ఇంగ్లాండ్ వెళ్లిపోయిన… pic.twitter.com/RmLL2kfT0W

*ప్రైవేట్ హాస్టళ్ల పై కొరడా* *స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ టీమ్ లు* *38 హాస్టళ్లకు షోకాజ్ నోటీసులు* *7 హాస్టల్ కిచెన్ లను సీజ్* *రూ. 2,46,000/- జరిమానా విధింపు*

 *ప్రైవేట్ హాస్టళ్ల పై కొరడా*






*స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ టీమ్ లు*


*38 హాస్టళ్లకు షోకాజ్ నోటీసులు*


*7 హాస్టల్ కిచెన్ లను సీజ్*


*రూ. 2,46,000/- జరిమానా విధింపు*


 *హైదరాబాద్,    :నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న పలు హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమీషనర్ ఆదేశాల మేరకు వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం పలు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ షోకాజు నోటీసులు, కిచెన్ సీజ్ తో పాటు జరిమానాలు విధించారు.



ఈ టీమ్ శుక్రవారం నాడు 58 హాస్టళ్లను తనిఖీ చేసి 30 హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి, 8 హాస్టల్ కిచెన్ లను సీజ్ చేశారు. అంతేకాకుండా సుమారు 2.45 లక్షల రూపాయల జరిమానా విధించారు. హాస్టల్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం మూలంగా ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో జిహెచ్ఎంసి కమీషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ ద్వారా నగరంలోని హాస్టళ్లలో తనిఖీలు చేయించారు.


హాస్టళ్ల ఆకస్మిక తనిఖీలకు కొనసాగింపుగా 24.05.2025 శనివారం ఎల్బీనగర్ జోన్‌లోని శ్రీనగర్ కాలనీ, లలిత నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం, కూకట్‌పల్లి జోన్‌లోని KPHB, మూసాపేట్ ప్రాంతాలు, శేరిలింగంపల్లి జోన్‌లోని వినాయక్ నగర్, పత్రికా నగర్‌లలో ఈ డ్రైవ్ నిర్వహించారు. 60 హాస్టళ్లను తనిఖీ చేసి 38 హాస్టల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. 07 హాస్టల్ కిచెన్ లను మూసివేశారు. జీహెచ్ఎంసి చట్టం, 1955 నిబంధనల ప్రకారం బృందాలు రూ.2,46,000/- జరిమానా విధించారు.

లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్

 లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్




 


 



హైదరాబాద్, మే 24:    లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వార్ హాల్ లో టౌన్ ప్లానింగ్ అడిషనల్ సి సి పి, డిప్యూటీ కమిషనర్లు, ఏ.సి.పి లతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ కంటెంప్ట్ కోర్టు కేసుల పై సమీక్ష నిర్వహించారు. 


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... బిల్లు కలెక్టర్లు రెసిడెన్షియల్ టాక్స్ తో పాటుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కూడా వాసులు చేయాలని డిప్యూటీ కమిషనర్ లను ఆదేశించారు. రెసిడెన్షియల్ నుండి కమర్షియల్ గా మార్చి పన్ను వసూళ్లు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సర్కిల్ స్థాయిలో దినం తప్పించి దినం  సమీక్ష చేసుకుని టాక్స్ వసూళ్ల లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. డి సి లతో టాక్స్ పై అడిషనల్ కమీషనర్ కూడా రివ్యూ చేయాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో వాసులు చేయకుండా నిర్దేశించిన లక్ష్యం మేరకు వసూలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. 


అంతకు ముందు కమీషనర్ వివిధ జోన్ లలో ఉన్న కంటెంప్ట్ కేసులకు సరైన రిప్లై  ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క జోన్ వారిగా  కంటెంప్ట్ కేసులు సమీక్షించారు. కోర్టు తీర్పు ప్రకారం గా సరైన రిప్లై ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో అవసరమైన సహాయం కొరకు లీగల్ ఓ.ఎస్.డి, అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, సిసిపి శ్రీనివాస్ లను సంప్రదించాలని సూచించారు. కంటెంప్ట్ కేసులు తర్వాత వచ్చే వారంలో రిట్ పిటిషన్ లపై రివ్యూ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.


ఈ సమావేశంలో సిసిపి శ్రీనివాస్, అడిషనల్ కమీషనర్లు అనురాగ్ జయంతి, సత్యనారాయణ, వేణు గోపాల్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రామ్ నాయక్, ఆడిషనల్ సిసిపి వెంకన్న, లీగల్ ఓ.ఎస్.డి సుధీర్, డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి లు తదితరులు పాల్గొన్నారు.

-------------------------------------------------------------

- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.


Friday, 23 May 2025

హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదు..ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు

నమోదు..ఎక్కడంటే..?

రాష్ట్రంలో మొట్టమొదటి కరోనావైరస్ (COVID-19) కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక వైద్యుడికి ఈ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

                 తొలి కేసు నమోదు కావడంతో, అధికారులు వెంటనే ఆ వైద్యుడిని ఐసోలేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. కూకట్‌పల్లి ప్రాంతంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనవసరంగా బయట తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేయడానికి దారితీసింది. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

              మరోవైపు ఏపీలో కూడా తొలి కేసు నమోదైంది. వైజాగ్‌‌లో తొలి కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

             ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రిలో ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది.

Thursday, 22 May 2025

ఎల్బీనగర్ జోన్ లో పర్యటించిన కమిషనర్ ఆర్.వి.కర్ణన్

 ఎల్బీనగర్ జోన్ లో పర్యటించిన కమిషనర్ ఆర్.వి.కర్ణన్





హైదరాబాద్,
   ఎల్బీనగర్ జోన్ లో పలు అభివృద్ధి పనులను గురువారం జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోన్ లోని సరూర్ నగర్ సర్కిల్ లో పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. వెంకటేశ్వర కాలనీ కి వెళ్లగా ఆ కాలనీకి చెందిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్ ను కలిసి కాలనీకి సంబంధించి సమస్యలు వివరించగా వెంటనే పరిష్కరించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్ లను ఆదేశించారు. గడ్డిఅన్నారం డివిజన్ లో బాక్స్ డ్రెయిన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వల్లభ నగర్ లో వాటర్ లాగింగ్ పాయింట్ ను కమిషనర్ పరిశీలించారు.


కమీషనర్ వెంట జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్.ఈ అశోక్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------------------------------
- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

మన శరీరంలో ముఖ్యమైన భాగాలుగా మూత్రపిండాలను చెప్పాలి. సరిగ్గా మూత్రపిండాలు పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రక్తంలో మలినాలు చేరకుండా మన శరీరాన్ని కాపాడతాయి. ఇక అటువంటి మూత్రపిండాల ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరికి కచ్చితంగా శ్రద్ధ ఉండాలి. ఒక్కోసారి మూత్రపిండాల సమస్య వచ్చినప్పటికీ సమస్య తీవ్రతరం అయ్యేవరకు అర్థం కాదు.

మూత్రపిండాలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు

మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయి. ఒకవేళ ఆ లక్షణాలు కనిపిస్తే మూత్రపిండాల వైద్యుల్ని సంప్రదించి, మూత్రపిండాల ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కచ్చితంగా చేయాలి. ఇక ఇంతకీ మూత్రపిండాలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

చర్మ ఆరోగ్యానికి మూత్రపిండాల ఆరోగ్యానికి లింక్

మూత్రపిండాలు పాడయ్యే ముందు మన శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీ సమస్య మూత్ర విసర్జన మరియు కడుపు నొప్పికి సంబంధించిన లక్షణాలకు పరిమితం కాదు. మూత్రపిండాలు పాడయ్యే ముందు అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం, పొరలు పొరలుగా మారడం మూత్రపిండాల సమస్యలకు సంబంధించిన లక్షణాలుగా చెప్పవచ్చు. కాబట్టి చర్మానికి సంబంధించి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త.

కళ్ళ చుట్టూ వాపు.. నిర్లక్ష్యం చెయ్యొద్దు

ఒక్కోసారి కిడ్నీ సమస్యలకు సంబంధించిన లక్షణాలు కళ్ల ద్వారా తెలుస్తాయి. కళ్ళ చుట్టూ వాపుకు కంటి పరీక్షలు చేయించుకున్నా ఎటువంటి కారణం తెలియకపోతే కచ్చితంగా కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, కళ్ళ చుట్టూ వాపు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇక కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, కళ్ళలో వాపు వంటి లక్షణాలు కిడ్నీ సమస్యలకు కారణం.

ఈ లక్షణాలతో కిడ్నీలకు ముప్పు

కిడ్నీలు రక్తాన్ని సరిగ్గా వడ పోయకపోతే రక్తహీనత కలుగుతుంది. ఫలితంగా అలసట నీరసం వంటి సమస్యలు వస్తాయి .ఇక కిడ్నీలు వ్యర్ధాలను వడపోసి మూత్రం గా బయటకు పంపించకపోతే మూత్ర విసర్జన కూడా తక్కువ అవుతుంది. మూత్రంలో రంగు మార్పు, దుర్వాసన రావడం కూడా కిడ్నీలు సరిగా పనిచేయడం లేదేమో అని చెప్పడానికి సంకేతం. వీపుపై భాగంలో పక్కటెముకల కింద కుడి లేదా ఎడమ వైపున నొప్పి వస్తే అది కూడా కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పే సంకేతం. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయొద్దు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని ధృవీకరించలేదు.

ఇది వాడండి... షుగరు టాబ్లెట్లు విసిరికొట్టండి

 ఇది వాడండి... షుగరు టాబ్లెట్లు విసిరికొట్టండి 

 

షుగరు అనేది ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తోంది. పుట్టుకతోనే కొందరికి షుగర ఉంటోందంటే అర్థం చేసుకోండి దాని ప్రభావం ఎంతగా విస్తరిస్తుందో అని. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కొన్నిసార్లు ప్రీ-డయాబెటిస్ దశలో లేదా డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. అయితే ఇప్పటికే మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా లేకుండా ఆపడం చాలా ప్రమాదకరం. షుగర్ నియంత్రణకు సహజ పద్ధతులు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలకు దూరంగా ఉండాలి. తెల్ల పిండి (మైదా) ఉత్పత్తులు, కేకులు, పేస్ట్రీలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించుకోవాలి. బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలు, ఆకుకూరలు (పాలకూర, బచ్చలికూర), కూరగాయలు, పండ్లు (తక్కువ చక్కెర ఉన్నవి) ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెరిగేలా చేస్తాయి. చర్మం లేని పౌల్ట్రీ, చేపలు, టోఫు, చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. కెనోలా ఆయిల్, ఆలివ్ నూనె, అవకాడోలు వంటి మొక్కల ఆధారిత నూనెలు ఉపయోగించాలి. 

            పండ్లు నేరుగా తినాలి పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది. వెల్లుల్లి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.రాత్రిపూట నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ను అల్లం తగ్గిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది. శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం. 

.. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున కొన్ని మెంతి గింజలు తీసుకొని నోట్లో వేసుకోవాలి. వెంటనే పులుపు లేని మజ్జిగను తాగాలి. అవసరమైతే రాత్రి కొంచెం పెరుగు తోడుబెట్టుకొని దాన్ని పొద్దున్నే మజ్జిగలా చేసుకొని మెంతి గింజలు మింగగానే దాన్ని తాగాలి. ఇది చాలా మంచిదని, మెంతి గింజలు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడంకన్నా ఇది మంచి పద్ధతని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీంతో షుగరు టాబ్లెట్లు అవసరమే రాదు.

భవిష్యవాణి చెప్పే స్వర్ణలతకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఆమె కోరుకున్న చోటే, పత్రాలు అందజేత

 

భవిష్యవాణి చెప్పే స్వర్ణలతకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఆమె కోరుకున్న చోటే, పత్రాలు అందజేత.           సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం చెప్పే స్వర్ణలతకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఆమెకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటి పట్టాను అందజేశారు. స్వర్ణలత కోరుకున్న మారేడుపల్లిలోనే ఇల్లు కేటాయించారు. అద్దె ఇంట్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు ప్రభుత్వం ఊరటనిచ్చింది.               సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి వినిపించే అరుపుల స్వర్ణలతకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆమెకు డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ డబుల్ బెడ్ రూం ఇంటి పట్టాను అందజేశారు. ఆమె కోరుకున్న మారేడుపల్లి ప్రాంతంలోనే డబుల్ బెడ్ రూం ఇల్లును ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ సమీపంలోని తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమె.. డబుల్ బెడ్ రూం ఇంటి కోసం పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఎట్టకేలకు సర్కార్ ఆమెకు డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించి పత్రాలు అందజేశారు.                   హైదరాబాద్

భవిష్యవాణి చెప్పే స్వర్ణలతకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఆమె కోరుకున్న చోటే, పత్రాలు అందజేత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం చెప్పే స్వర్ణలతకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఆమెకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటి పట్టాను అందజేశారు. స్వర్ణలత కోరుకున్న మారేడుపల్లిలోనే ఇల్లు కేటాయించారు. అద్దె ఇంట్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు ప్రభుత్వం ఊరటనిచ్చింది.
                 సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి వినిపించే అరుపుల స్వర్ణలతకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆమెకు డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ డబుల్ బెడ్ రూం ఇంటి పట్టాను అందజేశారు. ఆమె కోరుకున్న మారేడుపల్లి ప్రాంతంలోనే డబుల్ బెడ్ రూం ఇల్లును ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ సమీపంలోని తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమె.. డబుల్ బెడ్ రూం ఇంటి కోసం పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఎట్టకేలకు సర్కార్ ఆమెకు డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించి పత్రాలు అందజేశారు.


1997 నుంచి నేటి వరకు..
కాగా, సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగలలో ఒకటి. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండగ వైభవంగా జరుగుతుంది. ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సికింద్రాబాద్ బోనాలు సాధారణంగా రెండు రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజున మహిళలు ఉదయం నుండి తమ ఇళ్ల నుండి బోనాలను నెత్తిన పెట్టుకుని ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం (భోజనం) సమర్పిస్తారు.                                               
      ఇక రెండో రోజున రంగం కార్యక్రమం జరుగుతుంది. స్వర్ణలత అమ్మవారి రూపంలో భవిష్యవాణి చెబుతారు. పచ్చి కుండపై నిలబడి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుందో, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమె తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు.               
       స్వర్ణలత ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆరో తరం రంగం చెప్పేవారు. అంతకుముందు వారి అక్క స్వరూప, వారి నానమ్మ బాగమ్మ, పూర్వీకులు జోగమ్మ, పోషమ్మ వంటి వారు ఈ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సంప్రదాయం దాదాపు 200 సంవత్సరాల నాటిదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తొలుత ఇది మహంకాళి బోనాల పండుగలో భాగం కాకపోయినా.. కాలక్రమేణా ప్రధాన ఆచారంగా స్థిరపడింది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు, పంటలు, ప్రజల ఆరోగ్యం వంటి విషయాలపై అమ్మవారు భవిష్యవాణి చెప్పడం ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశం.

రంగం భవిష్యవాణి తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమైన నమ్మకం. అమ్మవారు చెప్పే మాటలను దైవ వాక్కుగా భావిస్తారు. రాబోయే ఏడాదిలో వర్షాలు ఎలా ఉంటాయి, ప్రజలకు ఎలాంటి కష్టాలు వస్తాయి, వాటి నివారణకు ఏం చేయాలి వంటి విషయాలను స్వర్ణలత గారు రంగం ద్వారా తెలియజేస్తారు. ఇది ప్రజలకు ఒక రకమైన మార్గదర్శకంగా, భరోసాగా ఉంటుంది. ఆమె చెప్పే మాటలను శ్రద్ధగా విని, వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. 1997 నుంచి ఆమె ఆలయంలో రంగం భవిష్యవాణి వినిపిస్తున్నారు.

రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ - సీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్..!!





రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ - సీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్..!!

ఒక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కాళ్లు మొక్కటం సంచలనంగా మారింది. హోదాను మరిచి వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్‌ రామకృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు. హోదాను కించపరిచేలా, వ్యక్తిత్వాన్ని తగ్గించుకునేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవ ని హెచ్చరించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి సైతం అధికారులు హోదాకు తగిన విధంగా నడుచుకోవాలని.. ఈ విధమైన శైలి సరి కాదని మందలించారు. సీఎం సూచన మేరకు సీఎస్ ఈ ఉత్తర్వులు జారీ చేసారు.

సీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఐఏఎస్‌ అధికారి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ శరత్‌ సీఎంను ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా ఆయన కాళ్లు మొక్కారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో, కొందరు ఐఏఎస్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో పాటు వారి ప్రవర్తనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సీరియస్ అయ్యారు. సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయ వద్దంటూ ఐఏఎస్‌ అధికారులకు ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ కాస్తా ఘాటుగా వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఆ క్రమంలో ఐఏఎస్ అధికారులకు ఆయన పలు సూచనలు చేస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు ఐఏఎస్ అధికారి శరత్ మొక్కిన ఘటన పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో, ఈ వ్యవహారం పైన సీఎస్ రామకృష్ణారావు స్పందించారు. ఆ క్రమంలో కీలక సూచనలతో కూడిన ఉత్తర్వులను ఆయన జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల అనుచిత ప్రవర్తన వల్ల ఐఏఎస్‌ల ప్రతిష్టను దెబ్బ తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి చర్యల కారణంగా ఐఏఎస్‌ అధికారుల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని తెలిపారు. ఐఏఎస్ 1968 లోని 3(1) నియమావళి ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యుడు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఐఏఎస్‌లకు సూచించారు. సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయొద్దంటూ ఐఏఎస్‌లకు ఆయన కాస్తా ఘాటుగా సూచించారు.

జగన్ అరెస్ట్ జరిగేనా, ఢిల్లీ జోక్యంతో - ఊహించని పరిణామాలు..!?


 జగన్ అరెస్ట్ జరిగేనా, ఢిల్లీ జోక్యంతో - ఊహించని పరిణామాలు..!? 

           మాజీ సీఎం జగన్ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసారు. అందులో జగన్ కోర్ టీం సభ్యులు ఉన్నారు. జగన్ ఓఎస్డీతో పాటుగా సీఎం గా ఉన్న సమయంలో కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే, జగన్ అరెస్ట్ వార్తల్లో నిజమెంత. ఢిల్లీ నుంచి అమరావతి వరకు ఈ వ్యవహారంలో ఏం జరుగు తోంది. తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. జగన్ అరెస్ట్ ప్రచారంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ కాబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీల పైన విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సాయిరెడ్డి, మిథున్ రెడ్డి సైతం పలువురు విచారణకు హాజరు అయ్యారు. తాజాగా జగన్ సీఎం గా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డిని సైతం అరెస్ట్ చేసారు. ఈ కేసులో అరెస్ట్ ల పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ స్పందించారు. అసలు స్కాం లేని చోట.. రాజకీయంగా కుట్రలు చేసి అరెస్ట్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేస్తే మూడు నెలలు చేయగలుగుతారు..ఆ తరువాత మాత్రం తప్పించు కోలేరని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తమ హయాంలో అసలు మద్యం అమ్మకాల్లో అక్రమాలకు అవకాశమే లేదని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. సిట్ దూకుడు మద్యం కేసులో సిట్ విచారణలు - అరెస్ట్ లతో దూకుడుగా వ్యవహరిస్తోంది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో నమోదు చేసిన నిందితుల్లో జగన్ పేరు లేదు. అయితే, జగన్ పేరు లేకపోయినా అరెస్ట్ చేయకూడదనే నిబంధన లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో జరిగిన నగదు లావా దేవీలకు సంబంధించి ఆధారాలు.. స్టేట్మెంట్స్ కీలకంగా మారుతున్నాయి. అంతిమంగా లబ్ది దారు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలు దొరికితే నే జగన్ ను అరెస్ట్ చేస్తారనే వాదన అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. లిక్కర్ పై సిట్ విచారణ కొనసాగుతున్న సమయంలో వైసీపీ హయాంలో జంగారెడ్డి గూడెంలో జరిగిన లిక్కర్ మరణాల పైన మరో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 

             రాజకీయ పర్యవసానాలు జగన్ అరెస్ట్ అయితే రాజకీయంగా చోటు చేసుకునే పర్యవసానాల పైన కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. జగన్ అరెస్ట్ పైన బీజేపీ నాయకత్వంతోనూ సంప్రదించాల్సి ఉంటుందనే వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అరెస్టులు.. స్కిల్ కేసులో చంద్రబాబును జైలుకు పంపటం.. ఆ తరువాత వరుసగా నమోదు చేసిన కేసులతో ప్రజల్లో వచ్చిన అభిప్రాయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ను అరెస్ట్ చేస్తే రాజకీయ ప్రతీకార చర్యగా భావించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దీంతో, పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతనే తుది నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా జగన్ అరెస్ట్ విషయంలో బీజేపీ అధినాయకత్వం మూడ్ కీలకంగా మారుతోంది. పూర్తి ఆధారాలు ఢిల్లీ నేతలకు ఇప్పటికే పంపారని చెబుతున్నారు. కాగా, జగన్ అరెస్ట్ విషయంలో రాజకీయంగా తుది నిర్ణయం జరగలేద నేది అర్దం అవుతోంది. దీంతో.. రానున్న రోజుల్లో జగన్ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.