Thursday, 25 June 2026

జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.

 జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.



1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీ విధించి,

ప్రజల ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు.

ఆర్టికల్ 352 ప్రయోగించి నియంతృత్వ పాలనకు శ్రీకారం చుట్టారు.

ఆ దమనకాండను ప్రతిఘటిస్తూ,

నేను నా సహచరులతో కలిసి నల్లగొండలో కరపత్రాలు పంచాం.

అదే రోజు అరెస్ట్, జైలు, ఆజ్ఞాతవాసం, సత్యాగ్రహాలు…

1976 జనవరి 26న మళ్లీ అరెస్ట్ అయి

5 నెలల జైలు శిక్ష అనుభవించాం.

దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం

అప్పట్లో మేము నిస్వార్థంగా నిలబడ్డాం.

ఈరోజు, ఆ పోరాటాన్ని గుర్తు చేస్తూ

బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో

మాకు సన్మానం జరగడం గర్వంగా ఉంది.

ప్రజాస్వామ్యం ఉచితంగా రాలేదు.

త్యాగాల ఫలితం అది.

చరిత్రను మరిచిపోకూడదు…

మళ్లీ ఎమర్జెన్సీ రోజులు రాకుండా కాపాడుకోవాలి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home