https://heyzine.com/flip-book/0ea9a5b100.html
80 వేలు తీసుకుంటే ఏసీబీకి చిక్కిన కొడిమ్యాల అటవీశాఖ ఏవో గులాం మొయినుద్దీన్... అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్న ఏసిబి అధికారులు....
జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ ఏవో 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
కొడిమ్యాలలో 120 టేకు చెట్లను కొట్టి రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వడానికి ఎఫ్ఆర్వో గులాం మొయినుద్దీన్ రెండు లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో ఇదివరకు లక్షా తీసుకున్నారు. మరో 80 వేలు ఈరోజు కొడిమ్యాల రేంజ్ కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. AO కూర్చున్న టేబుల్ డ్రాయర్ నుండి రూ. 80 వేలు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా, AO తన అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందడం కోసం తన అధికార విధులను అనుచితంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించారని ఏఓను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేసి, కరీంనగర్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసిబి డిఎస్పీ తెలిపారు.
విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం– డిప్యూటీ
విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం– డిప్యూటీ
విద్యార్థుల సురక్షిత రవాణా ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని మరియు డ్రైవర్ యొక్క సామాజిక బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాల అమలు మరియు డ్రైవర్లకు తగిన శిక్షణ కల్పించడం ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రాణ భద్రతను సమర్థవంతంగా కాపాడగలమని పేర్కొన్నారు.
మోటారు వాహనాల చట్టం, 1988 లోని సెక్షన్ 56 ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ను కలిగి ఉండటం తప్పనిసరి. ఫిట్నెస్ లేని వాహనాలను రహదారులపై నడపడం చట్టవిరుద్ధం. అలాగే కేంద్ర మోటారు వాహనాల నియమాలు, 1989 మరియు పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ప్రకారం పాఠశాల బస్సులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
పాఠశాల బస్సులలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు (ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు), తగిన సీటింగ్ సదుపాయం మరియు స్పష్టమైన గుర్తింపు బోర్డులు ఉండాలి. వాహనాల బ్రేకులు, టైర్లు, స్టీరింగ్ వ్యవస్థ మరియు ఇతర యాంత్రిక భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
అదేవిధంగా, పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలి. రహదారి భద్రత, రక్షణాత్మక డ్రైవింగ్ (Defensive Driving), అత్యవసర పరిస్థితుల నిర్వహణ, విద్యార్థులతో సౌమ్యంగా వ్యవహరించడం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలపై వారికి నిరంతర శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
పాఠశాల యాజమాన్యాలు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, బీమా పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు మరియు ఇతర చట్టబద్ధమైన పత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి. విద్యార్థుల రవాణాలో భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదని స్పష్టం చేశారు.
రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే వాహన యజమానులు మరియు నిర్వాహకులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుంది.
“పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం – సురక్షిత పాఠశాల రవాణా అందరి బాధ్యత.”
జారీ చేసినవారు
డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
రవాణా శాఖ
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దేవాలయం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ ,సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కళ్యాణమండపము, వాటర్ ట్యాంకు కట్టించడం జరిగిందని, 50 కోట్ల రూపాయల కేంద్ర రహదారుల నిధులతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రహదారిని నిర్మించనున్నామని, టెండర్ పూర్తయిందని రేపటినుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ధర్వేశిపురం ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 239 కోట్ల రూపాయలతో ధర్వేశిపురం మీదుగా గుర్రంపోడు- కొండమల్లేపల్లి- దేవరకొండ- డిండి వరకు హ్యాం రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం ఆయన ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్వేశిపురం ను మోడల్ గా తీర్చిదిద్దడంలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని ధర్వేశిపురానికి తీసుకురానట్లు తెలిపారు. ఎక్కడైనా రహదారులు బాగుంటేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలతో 480 రోడ్లను డబుల్ రోడ్లు చేసేందుకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ధర్వేశిపురం, కనగల్ మండలం లో ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ చేపట్టడం జరిగిందని ,రానున్న 2 ఏళ్లలో ఎస్ఎల్ బిసీ సోరంగం పూర్తయితే రెండు పంటలు పండుతాయని చెప్పారు. నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 900 కోట్ల రూపాయలతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని, నల్గొండ పట్టణంలో తాగునీటి ట్యాంకులతో పాటు, విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే బొట్టు గూడా ప్రభుత్వ పాఠశాలను అత్యంత అద్భుతంగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్లు, సిసి రోడ్లతో పాటు, డ్రైన్లు ఇవ్వనుందని ఇవన్నీ పూర్తయితే గ్రామాల రూపు రేఖలు మారుతాయని మంత్రి తెలిపారు.
రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇదివరకే ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, తక్కిన 5 కోట్లతో పనులు చేపడతామని ,రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరుగుతుందని, ధర్వేశిపురం లో అంగన్వాడీ కేంద్రాన్ని ,అలాగే పాఠశాలకు వెళ్లే రహదారిని మంజూరు చేయాలని మంత్రితో విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారి కి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు మంత్రికి పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.
నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి ,డిఎస్పి శివరాం రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కనగల్ తహసిల్దార్ పద్మ, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈవో తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
కాగా ధర్మకర్తల మండలి సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
*ఉప్పల స్వప్న గారికి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్*
“కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” కార్యక్ర
మం సినీ, సాంస్కృతిక వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ అవార్డు వేడుక అమీర్ పేట AAA సినిమాస్లో వైభవంగా జరిగింది.
**వ్యాపార ముసుగులో భారీ మోసం!
వాటా ఇస్తానంటూ రూ.24.53 కోట్లకు గండికొట్టిన బీజేపీ నేత గజ్జల యోగానంద్**
వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు దోచుకున్న ఘటన సైబరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గజ్జల యోగానంద్ పై రూ. 24.53 కోట్ల మోసం ఆరోపణలతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, షేర్ల కేటాయింపు పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి, ఆపై తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఒప్పందాలను అమలు చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలపై లోతైన విచారణ జరుపుతున్నారు. అవసరమైతే మరిన్ని సెక్షన్లు జోడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాజకీయ హోదా వెనుక దాగి వ్యాపార ముసుగులో సాగిన ఈ భారీ మోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.