: రాథోడ్ విట్టల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,"ACB ట్రాప్ కేసు
#ACB ట్రాప్ కేసు
- ఆదిలాబాద్ రేంజ్
#ACB ట్రాప్ కేసు
*ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*
దిల్సుఖ్నగర్లో మిరిదొద్ది శ్యామ్ సుందర్ గారు ప్రముఖ వస్త్ర సంస్థ కుబేరా సిల్క్స్ నూతన (4వ) బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన షోరూమ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ, వ్యాపార రంగంలో నాణ్యత, విశ్వసనీయత, వినియోగదారుల సంతృప్తిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కుబేరా సిల్క్స్ యాజమాన్యాన్ని అభినందించారు. ఒకే చోట పట్టు చీరలు, బ్రైడల్ కలెక్షన్స్, డిజైనర్ చీరలు మరియు వివిధ రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యమని, ఆ నమ్మకంతోనే కుబేరా సిల్క్స్ వరుసగా కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. ఈ సంస్థ మరింత విస్తరించి, మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుబేరా సిల్క్స్ యాజమాన్యం ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని ఘనంగా సన్మానించి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తమను ఆశీర్వదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుభేర సిల్క్స్ టీం తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం మొత్తం బోనాల శోభతో పులకించిపోతుంది. హైదరాబాద్ లో ఎటు చూసినా సందడే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ నిలుస్తూ వస్తోంది. ఇక ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండగ ఘనంగా జరగనుంది. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల పండగపై సమీక్ష నిర్వహించారు. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో మొదలవుతుంది. అలాగే 20,21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 20 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21 వ తేదీన అమ్మవారి కల్యాణం, 22వ తేదీన రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 2 న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు9 న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయని ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు బోనాల పండగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 3,427 ఆలయాలకు రూ.15.05 కోట్ల నిధులు విడుదల చేసింది. ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీసు , ఆరోగ్య శాఖల సమన్వయంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో భక్తులు దేవుడి ఆరాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో భక్తులు దేవుడి ఆరాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న హైదరాబాద్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు గుడి ప్రశాంత్ శర్మ న్యూస్ 18తో అన్నారు.
ఆషాఢ మాసంలో ఆషాఢ ఏకాదశి (తొలి ఏకాదశి), గురు పౌర్ణిమ, ఆషాఢ అమావాస్య, బోనాలు వంటి ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి. ఈ రోజుల్లో భక్తులు ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. గురుపౌర్ణిమ రోజున గురువులను స్మరించి వారి ఆశీర్వాదాలు పొందడం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం.
ఆషాఢ మాసంలో ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో భూమి పచ్చదనంతో కళకళలాడుతుంది. రైతులు ఈ సమయంలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మంచి వర్షాలు పడి పంటలు బాగా పండాలని రైతులు దేవుడిని ప్రార్థిస్తారు. ఈ నెల వ్యవసాయానికి కూడా ఎంతో కీలకమైనదిగా భావిస్తారు.
మత సంప్రదాయాల ప్రకారం ఈ నెలలో సాత్విక ఆహారం తీసుకోవడం, దానధర్మాలు చేయడం, పెద్దలను గౌరవించడం, పేదలకు సహాయం చేయడం శుభప్రదంగా భావిస్తారు. చాలామంది మాంసాహారాన్ని తగ్గించి, శాకాహారాన్ని పాటిస్తారు. ప్రతిరోజూ దేవాలయ దర్శనం, విష్ణు సహస్రనామం, శివ స్తోత్రాలు, లలితా సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని విశ్వసిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో కొత్త శుభకార్యాలు, వివాహాలు నిర్వహించరు. అయితే ఇది ప్రాంతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నెలను భక్తి, నియమ నిష్ఠలు, ఆత్మపరిశీలనకు అనువైన కాలంగా భావిస్తారు. కోపం, అసత్యం, అనవసర వాదనలకు దూరంగా ఉండి మంచి ఆలోచనలతో జీవించాలని పెద్దలు సూచిస్తారు.మొత్తంగా చెప్పాలంటే, జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగే ఆషాఢ మాసం ఆధ్యాత్మికత, భక్తి, ప్రకృతి అందాలు, పండుగల సమ్మేళనంగా నిలుస్తుంది. ఈ నెలలో సత్కార్యాలు చేయడం, దేవుడిని భక్తితో ఆరాధించడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మనశ్శాంతి, కుటుంబ సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని మత విశ్వాసం. అందుకే హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
neelagirishankaravam july issue -2026
https://heyzine.com/flip-book/9978a4d33f.html
రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖను అన్ని రంగాల్లో నంబర్వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన నల్గొండ జిల్లా ,నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్పల్లి మండల కేంద్రంలో 76 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నార్కట్పల్లి–మునుగోడు సేతుబంధు (సీఆర్ఐ) రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెరుగైన రహదారులు, వంతెనలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, సాగునీరు, వ్యవసాయం, తదితర రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎక్కువ స్థాయిలో ధాన్యం పండిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రంలోనే
ధాన్యం అత్యధికంగా పండించిన జిల్లా నల్గొండ జిల్లా అని అన్నారు.
నార్కట్పల్లి–మునుగోడు రహదారి అభివృద్ధి పనుల్లో స్థానిక రైతుల భూములకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసి నార్కట్పల్లి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నార్కెట్ పల్లి మండలంలో 600 కోట్లతో హ్యాం రోడ్లను,4000 కోట్లతో రాష్ట్రంలో అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు .
2028లో ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం పూర్తి చేసి నార్కట్పల్లి మండల ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు.
ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్
బి చంద్రశేఖర్,
సేతు బందు సిఆర్ఐఎఫ్ చీఫ్ వసంత నాయక్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు .
__________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*