ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 న నిర్వహించే గ్రామ,మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 న నిర్వహించే గ్రామ,మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
గ్రామ, మున్సిపల్ వార్డు సభల నిర్వహణ వి
షయమై మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ,మండల స్థాయి అధికారులతో ఇదే విషయమై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గ్రామ, మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని, ఈ గ్రామ,వార్డు సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, తదితరులు అందర్నీ ఆహ్వానించాలన్నారు. గ్రామ సభలో వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల పేర్లన్నీ చదివి వినిపించాలని చెప్పారు. గ్రామసభకు హాజరయ్యే వారి కి అవసరమైన టెంటు, తాగునీరు వంటివి ఏర్పాటు చేయాలని, ఆయా పథకాల కింద లబ్ధిదారులను గుర్తించి వారి ద్వారా వారు పొందిన లబ్ధిపై మాట్లాడించాలన్నారు. గ్రామసభల నిర్వహణ వివరాలన్ని రిపోర్టు రూపంలో డాక్యుమెంటేషన్ చేసి పంపించాలని తెలిపారు. గ్రామసభ సక్రమ నిర్వహణకు గాను ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, గ్రామ సభకు సంబంధించి గ్రామ అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు. గ్రామ సభలలో భాగంగా ఆయా పథకాల కింద లబ్ధిదారులకు లబ్ధిని కల్పించే పత్రాల పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని, గ్రామసభల ను సవ్యంగా నిర్వహించేందుకు తక్షణమే మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ,వార్డ్ సభలను పకడ్బందీగా నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడాలని, జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరిని గ్రామ సభలకు పిలవాలని, ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల పేర్లన్నీ చదివి వినిపించాలని, ముఖ్యంగా రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ జీవిత బీమా, పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం వంటి వాటన్నిటిపై తెలియజేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.
స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్ నాయక్, గృహ నిర్మాణ పిడి రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
_________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*










