కొలువుదారులకు కొండంత అండ..!
కొలువుదారులకు కొండంత అండ..!
కొలువుదారులకు కొండంత అండ..!
బయట పచ్చళ్ళు కొనుగోలు చేసుకుని చాలామంది తింటూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే పచ్చళ్ళు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక తాజాగా వరంగల్ లో బయటపడిన కల్తీ పచ్చళ్ళు, బూజు పట్టి, కుళ్ళిన పచ్చళ్ళు చూస్తే మీరు జన్మలో బయట పచ్చళ్ళు కొనుగోలు చేసి తినరు. పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ తాజాగా వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సంఘటన మనం బయట నుంచి కొనుగోలు చేసే ఆహార పదార్థాలపై అందరూ ఆలోచించేలా చేస్తోంది. ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఒక ఇంటిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మరిన్ని కనుగొనండి Sports కుళ్ళిన బూజు పట్టిన వందల కిలోల పచ్చళ్ళు తనిఖీలో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన ముడి సరుకులు బయటపడ్డాయి. టమోటా పచ్చడి : 750 కేజీలు, మామిడికాయ పచ్చడి : 900 కి.జి, నిమ్మకాయల పచ్చడి : 200 కేజీలు, ఉసిరికాయలు : 100 కేజీల పచ్చడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ : 150 కేజీలు టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాడైపోయిన పచ్చళ్ళ మొత్తం విలువ: సుమారు రూ.2,25,000. పాడైపోయిన పచ్చళ్ళ విక్రయాలు ఈ పాడైపోయిన పచ్చళ్ళను చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బండారి రాజు, ఆర్ఎస్ఐ ఓ. భాను ప్రకాష్ మరియు టాస్క్ ఫోర్స్ బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న సరుకు మరియు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. Also Read హైదరాబాద్ మెట్రోపై కేంద్రం సూచన.. త్వరలోనే ఆ పనులు షురూ! కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ బయట పచ్చళ్ళు కొనేటప్పుడు చాలా మంది ధర, రుచి మాత్రమే చూస్తారు. కానీ వాటి వెనుక ఉన్న అపరిశుభ్రత, కల్తీలు, కుళ్లిన సరుకులు ఎవరికీ తెలియవు. ఇలాంటి కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక్కోసారి ప్రాణాల మీదకే రావచ్చు. అందుకే బ్రాండ్ లేని లేదా అనుమానాస్పదమైన పచ్చళ్ళు, ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలను కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 16 బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందాలు జరిగాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రమాద బీమాను మొదట సింగరేణిలో ప్రారంభించామనని.. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తున్నామని తెలిపారు. పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేము కానీ.. ఆర్థికంగా ఆదుకుని బాసటగా నిలవాలన్నదే తమ ఉద్దేశం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సంస్థ లేదా ప్రభుత్వం కోసం కష్టపడేవారికి అండగా ఉండాల్సిన బాధ్యత యజమానిదేనని ఈ మేరకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఈ పథకం కింద ఉద్యోగులు, కార్మికులకు గరిష్టంగా రూ. కోటి వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని కనుగొనండి Sports ఇప్పటికే సింగరేణి సంస్థకు చెందిన దాదాపు 45 మంది కార్మికులకు ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేశామని వెల్లడించారు. అలాగే ఇకపై ఉద్యోగులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సమస్టిగా పనిచేయాలని.. రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలని కోరారు. అలాగే తనను గుంపుమేస్త్రీ అని చాలామంది అవహేళన చేశారని, అయినా తాను బాధపడనని అన్నారు. ఈ గుంపంతా తనదేనని స్పష్టం చేశారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినేనని.. హోదా, పదవులు మారినా, ప్రజలతో తనకున్న అనుబంధం మాత్రం మారదని తెలిపారు. తనకు రేవంతన్న అని పిలిపించుకోవడమే అత్యంత ఆనందాన్ని ఇస్తుందని భావోద్వేగం అయ్యారు.
జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీ విధించి,
ప్రజల ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు.
ఆర్టికల్ 352 ప్రయోగించి నియంతృత్వ పాలనకు శ్రీకారం చుట్టారు.
ఆ దమనకాండను ప్రతిఘటిస్తూ,
నేను నా సహచరులతో కలిసి నల్లగొండలో కరపత్రాలు పంచాం.
అదే రోజు అరెస్ట్, జైలు, ఆజ్ఞాతవాసం, సత్యాగ్రహాలు…
1976 జనవరి 26న మళ్లీ అరెస్ట్ అయి
5 నెలల జైలు శిక్ష అనుభవించాం.
దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం
అప్పట్లో మేము నిస్వార్థంగా నిలబడ్డాం.
ఈరోజు, ఆ పోరాటాన్ని గుర్తు చేస్తూ
బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
మాకు సన్మానం జరగడం గర్వంగా ఉంది.
ప్రజాస్వామ్యం ఉచితంగా రాలేదు.
త్యాగాల ఫలితం అది.
చరిత్రను మరిచిపోకూడదు…
మళ్లీ ఎమర్జెన్సీ రోజులు రాకుండా కాపాడుకోవాలి.
సర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
గురువారం ఆయన నార్కెట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్న సర్ ఓటరు నమోదు, మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా రేగటి సత్తయ్య కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి, ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వారి వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కుటుంబానికి రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఒక ఫారాన్ని పూర్తిగా నింపి బూత్ లెవల్ అధికారికి (బీఎల్ఓ) తప్పనిసరిగా అందజేయాలని . కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.
బీఎల్ఓలకు కలెక్టర్ సూచనలు చేస్తూ, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నమోదు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా సర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, ఓటరు వివరాల నమోదును విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు.
బాలికల ఆశ్రమ పాఠశాలకు ఘన విరాళం
‘ఆర్ ఎస్ బ్రదర్స్’ నుంచి రూ.4 కోట్ల డిపాజిట్
శంఖారావం :
బాలికల విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తలకొండపల్లి ఆశ్రమ పాఠశాలకు భారీ ఆర్థిక చేయూత లభించింది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో చాపుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్ ఎస్ బ్రదర్స్, సాత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం రూ.4 కోట్ల డిపాజిట్ను ప్రకటించింది.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ రాజమౌళి మాట్లాడుతూ, బాలికల విద్యకు సహకరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి తొలి విడతగా రూ.కోటి చెక్కును చాపుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్కు అందజేశారు.
ఈ విరాళంతో ఆశ్రమ పాఠశాల మరింత బలోపేతం కావడంతో పాటు, పేద బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు కలగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ సేవా కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.