Sunday, 28 June 2026

వైశ్య వ్యాపార శక్తికి ప్రతీకగా వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్

 వైశ్య వ్యాపార శక్తికి ప్రతీకగా వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్






విజయవంతంగా ముగించిన వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026


పాల్గొన్న వివిధ రాష్ట్రాల 250 మంది పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు


వ్యాపారాభివృద్ధి, నెట్‌వర్కింగ్‌, పరస్పర సహకారానికి కొత్త దిశ


హైదరాబాద్, జూన్ 28 (): దేశవ్యాప్తంగా ఉన్న వైశ్య వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు నూతన అవకాశాలకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు. మాదాపూర్‌లోని హోటల్ ఆవాసలో జరిగిన ఈ జాతీయ స్థాయి వ్యాపార సదస్సుకు వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, యువ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి విశేష ఆదరణ కల్పించారు.గ్లోబల్ ప్రెసిడెంట్ మహేంద్ర చీమకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాంక్లేవ్‌ను తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ డాక్టర్.నిషాంక్ కండె, హైదరాబాద్ వీ వైశ్య కౌండిన్య గ్రూప్ అధ్యక్షుడు శ్రీకాంత్ సమన్వయం చేశారు. వ్యాపార రంగంలో నెలకొన్న సవాళ్లు, అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడుల విస్తరణ, భాగస్వామ్యాల పెంపు, మార్కెట్ ధోరణులు వంటి అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్న వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్ వ్యాపార వ్యూహాలపై విలువైన సూచనలు అందించారు.


‘నేను’ నుంచి ‘మనం’ వైపు…


“Stop Thinking I… Start Thinking We” అనే నినాదంతో ముందుకు సాగుతున్న వీ వైశ్య గ్లోబల్ సంస్థ, సమిష్టి కృషి ద్వారానే స్థిరమైన విజయాలు సాధ్యమనే సందేశాన్ని కాంక్లేవ్ ద్వారా ప్రతిధ్వనింపజేసింది. పరస్పర సహకారం, విశ్వాసం, నెట్‌వర్కింగ్ ద్వారా వ్యాపారాలను మరింత విస్తరించుకోవచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన ప్రతినిధులు పరస్పర పరిచయాలు పెంపొందించుకొని భవిష్యత్ భాగస్వామ్యాలకు బాటలు వేశారు.


వ్యాపార భవిష్యత్తుపై ఏఐ మార్గనిర్దేశం


ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తోందనే అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ప్రముఖ ఏఐ ట్రైనర్ రఘువీర్ మాట్లాడుతూ, వ్యాపారాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్, డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతపై సమగ్రంగా వివరించారు. భవిష్యత్ వ్యాపార పోటీలో నిలదొక్కుకోవాలంటే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనివార్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఏఐ సాధనాలను వినియోగించడం ద్వారా తమ ఉత్పాదకతను, లాభదాయకతను పెంచుకోవచ్చని సూచించారు. ఆయన ప్రదర్శన ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది.


ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి


వ్యాపారాభివృద్ధితో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సు ఆకట్టుకుంది. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సోమనాథ్ గుప్తా మాట్లాడుతూ, వ్యాపారవేత్తలు ఆర్థికాభివృద్ధితో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. క్రమబద్ధమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, సమయపాలన విజయవంతమైన జీవితానికి పునాదులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ సోలార్ వాలా రాజేష్, హైదరాబాద్ కౌండిన్య గ్రూప్ కార్యదర్శి ప్రశాంత్ కుమార్, గ్లోబల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సంతోష్ శెట్టి, పాస్ట్ గ్లోబల్ ప్రెసిడెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు, దుబాయ్ కి చెందిన ప్రవాస భారతీయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైశ్య వ్యాపారవేత్తల మధ్య బలమైన అనుసంధానం, కొత్త అవకాశాల సృష్టి, పరస్పర సహకారానికి ఈ కాంక్లేవ్ ఒక మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే సమగ్ర వ్యాపార నెట్‌వర్క్ నిర్మాణమే తమ లక్ష్యమని, దేశవ్యాప్తంగా మరింత మంది వ్యాపారవేత్తలను ఈ వేదిక ద్వారా అనుసంధానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.




 రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.

✅ ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
✅ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 13.06 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్థానికులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై:ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు

 మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి



శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

✅ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన చోట భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలి లేదా పరిహారం చెల్లించాలని చెప్పారు.
✅ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే పనులను ఆ ఎక్స్‌పీరిన్స్ సెంటర్‌లో ప్రతిబింబించాలని చెప్పారు. ప్రాజెక్టుపైన ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు.

Thursday, 25 June 2026

కొలువుదారులకు కొండంత అండ..!

 కొలువుదారులకు కొండంత అండ..!

రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ
ప్రజా ప్రభుత్వం అందిస్తున్న మరో చారిత్రాత్మక సంక్షేమ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ అందించే నిర్ణయాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకుంది.
ఈ పథకం అమలు కోసం ఆర్థిక శాఖ భాగస్వామ్య బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకోనుంది.
ముఖ్యాంశాలు
✅ రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ
✅ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు
✅ పెన్షనర్లకు బీమా రక్షణ
✅ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపు
✅ కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా బీమా సదుపాయం
✅ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే మరో కీలక నిర్ణయం

బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు


 బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు

            బయట పచ్చళ్ళు కొనుగోలు చేసుకుని చాలామంది తింటూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే పచ్చళ్ళు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక తాజాగా వరంగల్ లో బయటపడిన కల్తీ పచ్చళ్ళు, బూజు పట్టి, కుళ్ళిన పచ్చళ్ళు చూస్తే మీరు జన్మలో బయట పచ్చళ్ళు కొనుగోలు చేసి తినరు. పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ తాజాగా వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సంఘటన మనం బయట నుంచి కొనుగోలు చేసే ఆహార పదార్థాలపై అందరూ ఆలోచించేలా చేస్తోంది. ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఒక ఇంటిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మరిన్ని కనుగొనండి Sports కుళ్ళిన బూజు పట్టిన వందల కిలోల పచ్చళ్ళు తనిఖీలో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన ముడి సరుకులు బయటపడ్డాయి. టమోటా పచ్చడి : 750 కేజీలు, మామిడికాయ పచ్చడి : 900 కి.జి, నిమ్మకాయల పచ్చడి : 200 కేజీలు, ఉసిరికాయలు : 100 కేజీల పచ్చడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ : 150 కేజీలు టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాడైపోయిన పచ్చళ్ళ మొత్తం విలువ: సుమారు రూ.2,25,000. పాడైపోయిన పచ్చళ్ళ విక్రయాలు ఈ పాడైపోయిన పచ్చళ్ళను చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు టాస్క్ ఫోర్స్ బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న సరుకు మరియు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. Also Read హైదరాబాద్ మెట్రోపై కేంద్రం సూచన.. త్వరలోనే ఆ పనులు షురూ! కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ బయట పచ్చళ్ళు కొనేటప్పుడు చాలా మంది ధర, రుచి మాత్రమే చూస్తారు. కానీ వాటి వెనుక ఉన్న అపరిశుభ్రత, కల్తీలు, కుళ్లిన సరుకులు ఎవరికీ తెలియవు. ఇలాంటి కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక్కోసారి ప్రాణాల మీదకే రావచ్చు. అందుకే బ్రాండ్ లేని లేదా అనుమానాస్పదమైన పచ్చళ్ళు, ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక


 ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక 

                             తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలను కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో 16 బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందాలు జరిగాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రమాద బీమాను మొదట సింగరేణిలో ప్రారంభించామనని.. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తున్నామని తెలిపారు. పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేము కానీ.. ఆర్థికంగా ఆదుకుని బాసటగా నిలవాలన్నదే తమ ఉద్దేశం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సంస్థ లేదా ప్రభుత్వం కోసం కష్టపడేవారికి అండగా ఉండాల్సిన బాధ్యత యజమానిదేనని ఈ మేరకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఈ పథకం కింద ఉద్యోగులు, కార్మికులకు గరిష్టంగా రూ. కోటి వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని కనుగొనండి Sports ఇప్పటికే సింగరేణి సంస్థకు చెందిన దాదాపు 45 మంది కార్మికులకు ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేశామని వెల్లడించారు. అలాగే ఇకపై ఉద్యోగులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సమస్టిగా పనిచేయాలని.. రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలని కోరారు. అలాగే తనను గుంపుమేస్త్రీ అని చాలామంది అవహేళన చేశారని, అయినా తాను బాధపడనని అన్నారు. ఈ గుంపంతా తనదేనని స్పష్టం చేశారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినేనని.. హోదా, పదవులు మారినా, ప్రజలతో తనకున్న అనుబంధం మాత్రం మారదని తెలిపారు. తనకు రేవంతన్న అని పిలిపించుకోవడమే అత్యంత ఆనందాన్ని ఇస్తుందని భావోద్వేగం అయ్యారు.

జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.

 జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.



1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీ విధించి,

ప్రజల ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు.

ఆర్టికల్ 352 ప్రయోగించి నియంతృత్వ పాలనకు శ్రీకారం చుట్టారు.

ఆ దమనకాండను ప్రతిఘటిస్తూ,

నేను నా సహచరులతో కలిసి నల్లగొండలో కరపత్రాలు పంచాం.

అదే రోజు అరెస్ట్, జైలు, ఆజ్ఞాతవాసం, సత్యాగ్రహాలు…

1976 జనవరి 26న మళ్లీ అరెస్ట్ అయి

5 నెలల జైలు శిక్ష అనుభవించాం.

దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం

అప్పట్లో మేము నిస్వార్థంగా నిలబడ్డాం.

ఈరోజు, ఆ పోరాటాన్ని గుర్తు చేస్తూ

బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో

మాకు సన్మానం జరగడం గర్వంగా ఉంది.

ప్రజాస్వామ్యం ఉచితంగా రాలేదు.

త్యాగాల ఫలితం అది.

చరిత్రను మరిచిపోకూడదు…

మళ్లీ ఎమర్జెన్సీ రోజులు రాకుండా కాపాడుకోవాలి.