Sunday, 14 June 2026

ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనాలకు పాల్పడిన రోహింగ్యా ముఠా అరెస్ట్....వివరాలు వెల్లడించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి.

           


 ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనాలకు పాల్పడిన రోహింగ్యా ముఠా అరెస్ట్....వివరాలు వెల్లడించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి.

గ్యాంగ్ లీడర్ హమీద్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు..
జహంగీర్ ఆలం, నూర్ కాసిమ్, నూరుల్ అమీన్, నూరుల్ ఆలం @ మహబూబ్ ఆలం అరెస్ట్...
రాష్ట్ర వ్యాప్తంగా 12 దొంగతనాల కేసులు ఛేదించిన పోలీసులు..
నార్కట్‌పల్లి, మాడ్గులపల్లి, చిట్యాల, వేములపల్లి, వాడపల్లి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో నేరాలు...నిందితుల వద్ద నుంచి రూ.7.71 లక్షల నగదు రికవరీ...
రూ.2 లక్షల విలువైన 3 బైకులు, కట్టర్లు, పానాలు, హ్యాండ్ గ్లౌజులు స్వాధీనం...
రైతులకు, విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం కలిగించిన ముఠాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.

'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క

 


'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క!

తెలిసి కూడా ఇతరులను ఇందులో చేర్పిస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పైస్థాయి వారికి చేరవేస్తే, నిషేధిత స్కీమ్‌లో పాల్గొన్న నేరానికి మీరే బాధ్యులు కావాల్సి ఉంటుంది.
ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు!
అమాయకులను బురిడీ కొట్టించే మోసగాళ్ల వలలో పడి నిలువునా మోసపోకండి. అప్రమత్తంగా ఉండండి!

టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం




 టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం

ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోంది.
పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు
నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం నిలిపివేసింది
ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం… సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదు.
సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది

Friday, 12 June 2026

 https://heyzine.com/flip-book/0ea9a5b100.html

Friday, 5 June 2026

జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ ఏవో 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

 80 వేలు తీసుకుంటే ఏసీబీకి చిక్కిన కొడిమ్యాల అటవీశాఖ ఏవో గులాం మొయినుద్దీన్... అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్న ఏసిబి అధికారులు....


జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ ఏవో 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.



కొడిమ్యాలలో 120 టేకు చెట్లను కొట్టి రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వడానికి ఎఫ్ఆర్వో గులాం మొయినుద్దీన్ రెండు లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో ఇదివరకు లక్షా తీసుకున్నారు. మరో 80 వేలు ఈరోజు కొడిమ్యాల రేంజ్ కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. AO కూర్చున్న టేబుల్ డ్రాయర్ నుండి రూ. 80 వేలు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా, AO తన అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందడం కోసం తన అధికార విధులను అనుచితంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించారని ఏఓను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేసి, కరీంనగర్‌ కోర్టులో హాజరు పరుస్తామని ఏసిబి డిఎస్పీ తెలిపారు.

Thursday, 4 June 2026

విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం – డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్




విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం– డిప్యూటీ 

విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం– డిప్యూటీ 

విద్యార్థుల సురక్షిత రవాణా ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని మరియు డ్రైవర్ యొక్క సామాజిక బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాల అమలు మరియు డ్రైవర్లకు తగిన శిక్షణ కల్పించడం ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రాణ భద్రతను సమర్థవంతంగా కాపాడగలమని పేర్కొన్నారు.


మోటారు వాహనాల చట్టం, 1988 లోని సెక్షన్ 56 ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. ఫిట్‌నెస్ లేని వాహనాలను రహదారులపై నడపడం చట్టవిరుద్ధం. అలాగే కేంద్ర మోటారు వాహనాల నియమాలు, 1989 మరియు పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ప్రకారం పాఠశాల బస్సులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.


పాఠశాల బస్సులలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు (ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు), తగిన సీటింగ్ సదుపాయం మరియు స్పష్టమైన గుర్తింపు బోర్డులు ఉండాలి. వాహనాల బ్రేకులు, టైర్లు, స్టీరింగ్ వ్యవస్థ మరియు ఇతర యాంత్రిక భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.


అదేవిధంగా, పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలి. రహదారి భద్రత, రక్షణాత్మక డ్రైవింగ్ (Defensive Driving), అత్యవసర పరిస్థితుల నిర్వహణ, విద్యార్థులతో సౌమ్యంగా వ్యవహరించడం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలపై వారికి నిరంతర శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.


పాఠశాల యాజమాన్యాలు తమ వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, బీమా పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు మరియు ఇతర చట్టబద్ధమైన పత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి. విద్యార్థుల రవాణాలో భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదని స్పష్టం చేశారు.


రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే వాహన యజమానులు మరియు నిర్వాహకులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుంది.


“పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం – సురక్షిత పాఠశాల రవాణా అందరి బాధ్యత.”


జారీ చేసినవారు

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

రవాణా శాఖ

Tuesday, 2 June 2026

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాం 

 రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 


 దేవాలయం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి 

             నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ ,సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కళ్యాణమండపము, వాటర్ ట్యాంకు కట్టించడం జరిగిందని, 50 కోట్ల రూపాయల కేంద్ర రహదారుల నిధులతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రహదారిని నిర్మించనున్నామని, టెండర్ పూర్తయిందని రేపటినుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ధర్వేశిపురం ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 239 కోట్ల రూపాయలతో ధర్వేశిపురం మీదుగా గుర్రంపోడు- కొండమల్లేపల్లి- దేవరకొండ- డిండి వరకు హ్యాం రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

         మంగళవారం ఆయన ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

         ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్వేశిపురం ను మోడల్ గా తీర్చిదిద్దడంలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని ధర్వేశిపురానికి తీసుకురానట్లు తెలిపారు. ఎక్కడైనా రహదారులు బాగుంటేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలతో 480 రోడ్లను డబుల్ రోడ్లు చేసేందుకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ధర్వేశిపురం, కనగల్ మండలం లో ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ చేపట్టడం జరిగిందని ,రానున్న 2 ఏళ్లలో ఎస్ఎల్ బిసీ సోరంగం పూర్తయితే రెండు పంటలు పండుతాయని చెప్పారు. నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 900 కోట్ల రూపాయలతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని, నల్గొండ పట్టణంలో తాగునీటి ట్యాంకులతో పాటు, విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే బొట్టు గూడా ప్రభుత్వ పాఠశాలను అత్యంత అద్భుతంగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్లు, సిసి రోడ్లతో పాటు, డ్రైన్లు ఇవ్వనుందని ఇవన్నీ పూర్తయితే గ్రామాల రూపు రేఖలు మారుతాయని మంత్రి తెలిపారు.

            రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇదివరకే ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, తక్కిన 5 కోట్లతో పనులు చేపడతామని ,రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరుగుతుందని, ధర్వేశిపురం లో అంగన్వాడీ కేంద్రాన్ని ,అలాగే పాఠశాలకు వెళ్లే రహదారిని మంజూరు చేయాలని మంత్రితో విజ్ఞప్తి చేశారు.

           ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారి కి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు మంత్రికి పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

              నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి ,డిఎస్పి శివరాం రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కనగల్ తహసిల్దార్ పద్మ, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈవో తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

       కాగా ధర్మకర్తల మండలి సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.