Monday, 23 March 2026

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.





 ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

       ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

      ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను సీరియస్ గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆదేశించినట్లు ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ సభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామపంచాయతీ, మండల,  మున్సిపల్,జిల్లా వారిగా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను తక్షణమే తయారు చేసి సిపిఓ కు  సమర్పించాలి. మండల ప్రత్యేక అధికారులు  మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను సందర్శించి ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి.

      జనగణనకు సంబంధించి తక్షణమే ఎన్యుమరేషన్ బ్లాక్ లను  నిర్ణయించడంతోపాటు, సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలి. అంతేకాక నియామకపు తరువులు జారీ చేయాలి.

        ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా వివిధ పథకాల కింద నిధులు పొందిన అధికారులందరూ తక్షణమే యుటీలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి.

     జంతు సంరక్షణ లో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబిసీ 

 స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలి. మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పనులు జరిగేలా చూడాలి. దేవరకొండ ఆర్డిఓ దేవరకొండలో ఏబి సి కేంద్రం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలాన్ని చూడాలి. అందరూ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి అన్ని మేజర్ గ్రామపంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో ఏబీసీల ఏర్పాటుకు స్థలాన్ని చూడాలి.  

        కుక్కల రిహబిలిటేషన్ గాను నల్గొండ మున్సిపల్ కమిషనర్ నల్గొండలో కుక్కల షెల్టర్ ను  ఏర్పాటు చేయాలి. ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల ఆవరణలలో సంచరించే కుక్కలకు సెంటర్లకు తరలించే ఏర్పాటు  చేయాలి. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఒక రోజు "దత్తత" కార్యక్రమాన్ని నిర్వహించి ఆవులు, కుక్కలను దత్తత ఇచ్చేలా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్  చూడాలి.  దీనికి మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ సహకార అందించాలని కలెక్టర్ ఆదేశించారు .

       ఈ సమావేశంలో ఉపాధి హామీ ,తదిత అంశాలపై సమీక్షించారు.

         కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 40 పిటిషన్లు,  ఇతర శాఖలకు 43 పిటిషన్లు,  మొత్తం 83 ఫిర్యాదులను ప్రజలు ప్రజావాణిలో సమర్పించారు.

        మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ  అమిత్, రెవెన్యూ అదనపు కలెక్ట్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

__________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.



 పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు  కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

        సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.

         పరీక్షా కేంద్రాలలో  అన్ని వసతులు ఎప్పటిలాగే ఉండాలని,ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,టాయ్ లెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అధికారులకు చెప్పారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కుండలలో తాగునీరు  ఏర్పాటు చేయాలని అన్నారు. 

పరీక్ష కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయాలని తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని,పూర్తి స్థాయిలో తనిఖీ తర్వాతే విద్యార్థులను  పరీక్ష కేంద్రం లోకి పంపించాలన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల హాజరు,తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స లో భాగంగా ఏ ఎన్ ఎం తో మాట్లాడారు.వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్


 తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 

         తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు నూతన నేషనల్ హైవేలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వద్ద ఈ రహదారి ముగుస్తుంది. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది. తెలంగాణా నుండి తిరుపతికి కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతి వెళ్లాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి దొరికినట్లు అయింది. ఈ కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు ప్రాంతాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. మరిన్ని కనుగొనండి TV & Video జాతీయ వార్తలు సబ్స్క్రిప్షన్ తెలుగు భాషా కోర్సులు ఆరోగ్యం & ఫిట్‌నెస్ ఉత్పత్తులు ఎన్ హెచ్ 565 నిర్మాణంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ గతంలో మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుండి హైదరాబాదుకు రాత్రిపూట అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే జనాలు ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మీదుగా దారుణంగా రోడ్డు ఉండేది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ ఎన్ హెచ్ 565 నిర్మాణం చేయడంతో ప్రస్తుతం ఆ కష్టాలు తొలగిపోయాయి. ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరంగా మారింది. రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యంతో అడ్డంకి NH565 లోని 20 కిలోమీటర్ల రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యం వంటి అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో, వేగవంతం చేసి నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు. అటవీ ప్రాంతంలో సాగే ఈ మార్గం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. Powered By 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయల ఖర్చు గతంలో పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మండలం వరకు ప్రయాణం చేయాలంటే 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లోనే ప్రయాణం సాగుతుంది. దీంతో సమయం బాగా ఆదా అవుతుంది. 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అటవీ మరియు ఘాట్ ప్రాంతాలను కలుపుతూ 16 వంతెనలు, ఎనిమిది అండర్ పాస్ లు ఈ మార్గంలో ఏర్పాటయ్యాయి. Also Read హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! ఈ ప్రాంతాల మీదుగా రహదారి మొత్తం 420 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ, కనగల్ ప్రాంతాల మీదుగా వచ్చి, మాచర్ల వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపుకు వెళితే కాళహస్తి కుడివైపుకు వెళితే తిరుపతిని చేరుకునేలా ఈ మార్గం ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు తిరుపతి వెళ్లడం ఈజీ అవుతుంది.

Sunday, 22 March 2026

ఘనంగా వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం .,........



 ఘనంగా వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం .,........                             











  హైదరాబాద్... వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమము మహిళా దినోత్సవ వేడుకలు శనివారం రోజు కర్మన్ఘాట్ లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది ఫౌండేషన్ గ్లోబల్ అధ్యక్షులుగా మేడ నరేష్ ప్రధాన కార్యదర్శిగా నారాయణస్వామి కోశాధికారిగా గ్రంధి సతీష్ ఉపాధ్యక్షులుగా కమలాపురం నాగేష్ లు మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్ విజయలక్ష్మి కే వసంత కోశాధికారిగా ఎస్ నీరజలు ప్రమాణస్వీకారం చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీ శివ స్వామి మాట్లాడుతూ  హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గందే సుధాకర్ ఇమ్మడి జూఎలర్స్ అధినేత విబిజి నాయకులు ఇమ్మడి రమేష్.లా కేఫిన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ. విబిజి ఫౌండర్లు మడిపడి గ రాము మడిపడిగ రాజు,ప్రసాద్,ఫౌండేషన్ నాయకులు రాజేశ్వర్ డొంకేశ్వర్ పబ్లిషెడ్ శివకుమార్ బుగ్గారి శివకుమార్ ఎల్వి సేవా వేదిక అధ్యక్షులు ఎల్వీ కుమార్ జగిని శ్శ్రీనివాస్.జగిని రమేష్ మయూకా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు

Saturday, 14 March 2026

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం

 

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం



 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అద్యక్షులు గా మిరుదొడ్డి శ్యామ్ సుందర్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి*


*మీలా వంశి ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో మద్దతు పలికిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు*


సూర్యాపేట పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అద్యక్షులుగా పోటి చేస్తున్న మిరుదొడ్డి శ్యామ్ సుందర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ అమరావది లక్ష్మి నారాయణ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని మిరుదొడ్డి శ్యామ్ సుందర్ పోరాటం చేసి ఎన్నికలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూమిరుదొడ్డి శ్యాంసుందర్ కు అత్యదికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సుందర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయడంతో పాటు, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. శ్రీశైలం ఆర్య సత్రం చైర్మన్ గా వ్యవహరించారని, అనేక సేవా కార్యక్రమాలు చేశారని వారు తెలిపారు. ఆర్యవైశ్యులలో రాజకీయ చైతన్యం కావాలి అని, మార్పు కోరుకునే వారందరూ కూడా శ్యామ్ సుందర్ కు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా మహదేవ్, కక్కిరేణి చంద్రశేఖర్, బ్రాహ్మండ్లపల్లి మురళిధర్, బొమ్మిడి లక్ష్మి నారాయణ, సింగిరికొండ రవీందర్, గొండ్రాల అశోక్, కర్నాటి రవి లు పాల్గొన్నారు. సూర్యాపేట ఆర్యవైశ్య నాయకులు కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, వెంపటి శబరినాథ్, చల్లా లక్ష్మయ్య, యామా సంతోష్, మంచాల శ్రీనివాస్, బెలిదె శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, మిర్యాల వెంకటేశ్వర్లు, వా సా లక్ష్మి నారాయణ,


Friday, 13 March 2026

 మార్చి మొదటి పక్షం

Thursday, 12 March 2026

ఆర్యవైశ్యుల శక్తి అపారం


 ఆర్యవైశ్యుల శక్తి అపారం

* జయాపజయాలను ప్రభావితం చేయగలరు

* వాసవీ పారాయణం ప్రపంచ రికార్డు సృష్టించాలి

హైదరాబాద్:  ఆర్యవైశ్యుల శక్తి అపారం..వారు తలచుకుంటే రాజకీయాలను , జయాపజయాలను ప్రభావితం చేయగలరని  మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలన్నారు.ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఆర్యవైశ్యులు వాసవి మాత పారాయణం చేయ తలపెట్టడం హర్షణీయమని  అన్నారు. ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా నలభై వేల మందితో... భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా వాసవీమాత పారాయణం చేయాలన్నారు. ఆ రికార్డు కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు 

శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం పేరిట ఈనెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సామూహిక పారాయణానికి సంబంధించి  గురువారం బంజారా హిల్స్ పార్క్ హోటల్ కర్టెన్ రెయిజర్ కార్యక్రమం జరిగింది.‌ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.‌ ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత సంకల్పాన్ని కొనియాడారు. . శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆకాంక్షించారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత మాట్లాడుతూ 

 21,000 మందితో సామూహిక పారాయణానికి వైశ్యులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.  అందుకు తగిన ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ పారాయణం ప్రపంచ రికార్డు కాబోతోందని అన్నారు. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాల వాసవీ మాత స్తుతి గీతాన్ని  ఈ కార్యక్రమంలో ఆలపించారు. వాసవమ్మ జాతరకు తరలి రావాలంటూ ప్రముఖ జర్నలిస్ట్ , మఖన్లాల్ చతుర్వేది జర్నలిజం యూనివర్సిటీ బోర్డు మెంబర్ రావి కంటి శ్రీనివాస్ రచించి, దృశ్య రూపంలో చిత్రీకరించిన గీతాన్ని ఈ సందర్భంగా 

ప్రదర్శించారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కొణిజేటి సుబ్బారావు , ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చీకోటి ప్రవీణ్ , కాచం సత్యనారాయణ, మలిపెద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు. .