జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.
జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీ విధించి,
ప్రజల ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు.
ఆర్టికల్ 352 ప్రయోగించి నియంతృత్వ పాలనకు శ్రీకారం చుట్టారు.
ఆ దమనకాండను ప్రతిఘటిస్తూ,
నేను నా సహచరులతో కలిసి నల్లగొండలో కరపత్రాలు పంచాం.
అదే రోజు అరెస్ట్, జైలు, ఆజ్ఞాతవాసం, సత్యాగ్రహాలు…
1976 జనవరి 26న మళ్లీ అరెస్ట్ అయి
5 నెలల జైలు శిక్ష అనుభవించాం.
దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం
అప్పట్లో మేము నిస్వార్థంగా నిలబడ్డాం.
ఈరోజు, ఆ పోరాటాన్ని గుర్తు చేస్తూ
బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
మాకు సన్మానం జరగడం గర్వంగా ఉంది.
ప్రజాస్వామ్యం ఉచితంగా రాలేదు.
త్యాగాల ఫలితం అది.
చరిత్రను మరిచిపోకూడదు…
మళ్లీ ఎమర్జెన్సీ రోజులు రాకుండా కాపాడుకోవాలి.









