Friday, 1 May 2026

ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది?


 ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది? 


పేదల ఇండ్లు కూల్చడంలో చూపించిన అత్యుత్సాహం చెరువులు ఆక్రమించి కడుతుంటే కనపడట్లేదా!


హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..


సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓ న్యాయవాది


ఈ పిటిషన్ విచారిస్తూ పేదల ఇళ్ల మీదకి ఎలాంటి నిబంధనలు లేకుండా వెళ్లే హైడ్రాకు ఒవైసీ కాలేజీ పట్ల వివక్ష ఎందుకని నిలదీసిన న్యాయమూర్తి..


ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్థారణకు రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా, ఎన్ని ఏళ్లు ఏం చేశారని, ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై నివేదిక తయారు చేయాలని హైకోర్టు ఆదేశాలు..


ఒవైసీ విద్యాసంస్థలో చదువుతున్న వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి మార్చాలని, బయటికి వెళ్లాలనుకునే వారికి ఒవైసీ కాలేజీ యాజమాన్యం సహకరించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు..

Wednesday, 29 April 2026

వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

 పత్రికా ప్రకటన, నల్గొండ, 29.4.2026

____________________________


@ వానాకాలం పంటలకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి - జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.




             వానాకాలం పంటల సాగులో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాలనే ఉపయోగించాలని, నకిలీ విత్తనాల జోలికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు.

రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


       బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అగ్రికల్చర్ సివిల్ సప్లై, రెవెన్యూ  అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.


      

        జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకై  ప్రత్యేక టాస్క్ ఫోర్స్  స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ టీంలు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో పనిచేస్తూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. ఎన్ ఫోర్స్‌మెంట్ టీంలు వారానికి కనీసం రెండు సార్లు తనిఖీలు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని 869 గ్రామపంచాయతీలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వానాకాలం ప్రారంభానికి ముందే కాటన్ సీడ్స్, ఎరువుల సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువులు విత్తనాల

 డిస్ట్రిబ్యూటర్లు రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు విక్రయించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సివిల్ సప్లై, మార్కెటింగ్, అగ్రికల్చర్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

యాక్షన్ ప్లాన్ ప్రకారం గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో సమావేశాలు పూర్తి చేయాలని, సీడ్ మరియు ఫెర్టిలైజర్ డీలర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. కాటన్ సీడ్ మరియు పాడి సంబంధిత విత్తనాల స్టాక్ ఎంత ఉందో మండల ఆఫీసర్ కి చెప్పాలని లేనిచో జిల్లా  అధికారులకు తెలియజేయాలన్నారు.

యూరియా మరియు ఇతర ఎరువుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, అవసరమైతే వెంటనే జిల్లా స్థాయిలో చర్యలు తీసుకుని సరఫరా చేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు కఠినంగా నిఘా పెట్టి, కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


         ఈ సమావేశంలో ఏ ఎస్పి రమేష్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా అధికారులు ఉన్నారు.

____________________________ 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Monday, 27 April 2026

విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్

విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని  జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్

         విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని




  జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్. అన్నారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక  99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత & రక్షణ మరియు "మత్తు పదార్థాలకు నో చెప్పండి"అనే అంశంపై  ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థల్లో ఉన్న విద్యార్థులు ఉన్నతికి కృషి చేస్తామని  కలెక్టర్ అన్నారు.


         సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ (CCIs)ల్లో ఆశ్రయం పొందుతున్న 18 సంవత్సరాల లోపు  బాల బాలికలకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. జనన ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, హెల్త్ కార్డులు, ఆధార్ కార్డులు, సేవింగ్ బ్యాంక్ ఖాతా పుస్తకాలను జిల్లా  కలెక్టర్ బాలలకు అందజేశారు.


       ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు సంరక్షణ సంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలను బాలలు సద్వినియోగం చేసుకొని బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.


         ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు  కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్, జిల్లా కో-ఆర్డినేటర్ (చైల్డ్ లైన్)  బి. మహేశ్, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది  ఉన్నారు.

Sunday, 26 April 2026

ఆమె పేరు పూనం మాలకొండయ్య IAS

 ఆమె పేరు పూనం మాలకొండయ్య గారు


ఆమె తాతగారు బుందేల్‌ఖండ్‌లో ధైర్యసాహసాలతో పేరుగాంచిన ఒక పోలీస్ ఆఫీసర్. వారి కుటుంబంలో చదువుకున్న మొదటి వ్యక్తి ఆమె తండ్రి. ఆయన శాస్త్రవేత్త (సైంటిస్ట్) అయ్యారు.


ఆమె ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి మైక్రోబయాలజీలో గోల్డ్ మెడలిస్ట్. పరిశోధన (రీసెర్చ్) చేయడమే ఆమె మొదటి ప్రాధాన్యత. అప్పుడు ఎవరో ఆమెకు UPSC రాయమని సూచించారు. కోచింగ్‌కు డబ్బు లేదు, తగినంత సమయం కూడా లేదు. ఆమె ఒంటరిగానే ప్రిపేర్ అయ్యారు. 1988లో దాన్ని సాధించారు.


ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న రీసెర్చ్ కెరీర్ లేదా IAS


- ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆమె IASనే ఎంచుకున్నారు.


అగ్రికల్చర్ కమిషనర్‌గా ఉన్నప్పుడు, ఆమె మోన్శాంటో (Monsanto) సంస్థను MRTP కమిషన్‌కు లాగారు. ఆ బహుళజాతి సంస్థ BT పత్తి విత్తనాల కోసం భారతీయ రైతులను పీల్చి పిప్పి చేసేలా ధరలను వసూలు చేస్తోంది. ఆమె ఆ సంస్థను ధరలు తగ్గించేలా ఒత్తిడి చేశారు.


రవాణా, విద్య మరియు పౌరసరఫరాలు.. ఇలా ఆమె ఏ శాఖలో పనిచేసినా అవినీతిపై పోరాడారు. ఆమె చర్యలు తీసుకున్న ప్రతిసారీ, ఆమె బదిలీ అయ్యారు.

ఆరేళ్లలో ఏడు బదిలీలు.


ఇండియా టుడే ఆమెను భారతదేశపు మూడవ అత్యంత నిజాయితీ గల IAS అధికారిగా పేర్కొంది.


ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జూన్ 2024లో పదవీ విరమణ చేశారు. ముప్పై ఆరేళ్ల సర్వీసు.


ఆమె తండ్రి ఆ కుటుంబంలో అక్షరం ముక్క నేర్చుకున్న మొదటి వ్యక్తి. ఈ దేశ ప్రజలు మోసపోకుండా ఉండేలా చూడటంలో ఆమె 36 ఏళ్ల కాలాన్ని వెచ్చించారు.

Friday, 24 April 2026

*వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*


 *వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ఆర్యవైశ్య సమాజం హర్షం వ్యక్తం చేస్తోందని, ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆర్య వైశ్యుల తరుపున TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవి మాత జయంతి అనేది ఆర్యవైశ్యుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున జరుపుకునే ఈ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఆర్యవైశ్యుల భావోద్వేగాలను గౌరవించినట్టయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ ప్రకారం, వాసవి మాత జయంతి రోజున రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు వాసవి మాత జయంతి ఉత్సవాలు మరింత భక్తి, శ్రద్ధలతో నిర్వహించబడతాయని అన్నారు.

Wednesday, 15 April 2026

అవినీతినిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నుసుం సుధాకర్ రెడ్డి, ఒక ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన తుపాను నీటి కాలువ నిర్మాణ పనులకు సంబంధించి మెజర్మెంట్ బుక్ (M-Book) నమోదు చేసి, ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేసేందుకు రూ. 50,000/- #లంచం డిమాండ్ చేసి, హుజూరాబాద్‌లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద ఆ #లంచం తీసుకుంటుండగా తెలంగాణ #అవినీతినిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


Tuesday, 14 April 2026

హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి

 హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి


హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు



తదుపరి ఆదేశాల వరకు హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీలులేదు


హైడ్రాకు ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన SOP(standard operating procedure) లేదు..ఏ లెక్కన కూల్చివేతలు చేపడుతున్నారు? 


చెరువులు, కుంటలు, రోడ్లు ఆక్రమిస్తేనే చర్యలు తీసుకోవాలి


అది కూడా SOP నిర్ధారించిన తరువాతనే


అమీన్‌పూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతల బాధితులు దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ హైకోర్టు అసహనం