Thursday, 25 June 2026

జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.

 జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.



1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీ విధించి,

ప్రజల ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు.

ఆర్టికల్ 352 ప్రయోగించి నియంతృత్వ పాలనకు శ్రీకారం చుట్టారు.

ఆ దమనకాండను ప్రతిఘటిస్తూ,

నేను నా సహచరులతో కలిసి నల్లగొండలో కరపత్రాలు పంచాం.

అదే రోజు అరెస్ట్, జైలు, ఆజ్ఞాతవాసం, సత్యాగ్రహాలు…

1976 జనవరి 26న మళ్లీ అరెస్ట్ అయి

5 నెలల జైలు శిక్ష అనుభవించాం.

దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం

అప్పట్లో మేము నిస్వార్థంగా నిలబడ్డాం.

ఈరోజు, ఆ పోరాటాన్ని గుర్తు చేస్తూ

బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో

మాకు సన్మానం జరగడం గర్వంగా ఉంది.

ప్రజాస్వామ్యం ఉచితంగా రాలేదు.

త్యాగాల ఫలితం అది.

చరిత్రను మరిచిపోకూడదు…

మళ్లీ ఎమర్జెన్సీ రోజులు రాకుండా కాపాడుకోవాలి.

సర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్



              సర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. 


     గురువారం ఆయన నార్కెట్‌పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్న సర్ ఓటరు నమోదు, మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. 



          ఈ సందర్భంగా రేగటి సత్తయ్య కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి, ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వారి వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.

 ప్రతి కుటుంబానికి రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఒక ఫారాన్ని పూర్తిగా నింపి బూత్ లెవల్ అధికారికి (బీఎల్‌ఓ) తప్పనిసరిగా అందజేయాలని . కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.

బీఎల్‌ఓలకు కలెక్టర్ సూచనలు చేస్తూ, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నమోదు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

అదేవిధంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా సర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, ఓటరు వివరాల నమోదును విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.


         రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు.


Thursday, 18 June 2026

బాలికల ఆశ్రమ పాఠశాలకు ఘన విరాళం ‘ఆర్ ఎస్ బ్రదర్స్’ నుంచి రూ.4 కోట్ల డిపాజిట్

 బాలికల ఆశ్రమ పాఠశాలకు ఘన విరాళం

‘ఆర్ ఎస్ బ్రదర్స్’ నుంచి రూ.4 కోట్ల డిపాజిట్



శంఖారావం :

బాలికల విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తలకొండపల్లి ఆశ్రమ పాఠశాలకు భారీ ఆర్థిక చేయూత లభించింది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో చాపుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్ ఎస్ బ్రదర్స్, సాత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం రూ.4 కోట్ల డిపాజిట్‌ను ప్రకటించింది.

ఈ సందర్భంగా సంస్థ ఎండీ రాజమౌళి మాట్లాడుతూ, బాలికల విద్యకు సహకరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి తొలి విడతగా రూ.కోటి చెక్కును చాపుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్‌కు అందజేశారు.

ఈ విరాళంతో ఆశ్రమ పాఠశాల మరింత బలోపేతం కావడంతో పాటు, పేద బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు కలగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ సేవా కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.


Sunday, 14 June 2026

ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనాలకు పాల్పడిన రోహింగ్యా ముఠా అరెస్ట్....వివరాలు వెల్లడించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి.

           


 ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనాలకు పాల్పడిన రోహింగ్యా ముఠా అరెస్ట్....వివరాలు వెల్లడించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి.

గ్యాంగ్ లీడర్ హమీద్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు..
జహంగీర్ ఆలం, నూర్ కాసిమ్, నూరుల్ అమీన్, నూరుల్ ఆలం @ మహబూబ్ ఆలం అరెస్ట్...
రాష్ట్ర వ్యాప్తంగా 12 దొంగతనాల కేసులు ఛేదించిన పోలీసులు..
నార్కట్‌పల్లి, మాడ్గులపల్లి, చిట్యాల, వేములపల్లి, వాడపల్లి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో నేరాలు...నిందితుల వద్ద నుంచి రూ.7.71 లక్షల నగదు రికవరీ...
రూ.2 లక్షల విలువైన 3 బైకులు, కట్టర్లు, పానాలు, హ్యాండ్ గ్లౌజులు స్వాధీనం...
రైతులకు, విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం కలిగించిన ముఠాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.

'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క

 


'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క!

తెలిసి కూడా ఇతరులను ఇందులో చేర్పిస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పైస్థాయి వారికి చేరవేస్తే, నిషేధిత స్కీమ్‌లో పాల్గొన్న నేరానికి మీరే బాధ్యులు కావాల్సి ఉంటుంది.
ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు!
అమాయకులను బురిడీ కొట్టించే మోసగాళ్ల వలలో పడి నిలువునా మోసపోకండి. అప్రమత్తంగా ఉండండి!

టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం




 టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం

ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోంది.
పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు
నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం నిలిపివేసింది
ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం… సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదు.
సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది

Friday, 12 June 2026

 https://heyzine.com/flip-book/0ea9a5b100.html