Friday, 27 February 2026

₹4 లక్షల లంచం కేసులో ఏసీబీ ట్రాప్స్ ఫారెస్ట్సెక్షన్ అధికారి

 #ఆంధ్రప్రదేశ్:

₹4 లక్షల #లంచం కేసులో #ఏసీబీ ట్రాప్స్ #ఫారెస్ట్సెక్షన్ అధికారి

#పశ్చిమగోదావరి జిల్లాలో #సామిల్లు యజమాని నుండి ₹4 లక్షల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాదు సురేష్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
#టేకు కలప స్వాధీనం తర్వాత మిల్లును నిర్వహించడానికి అనుమతించడానికి అతను #డబ్బు డిమాండ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
#అవినీతి నిరోధక చట్టం కింద #కేసు నమోదు చేయబడింది.
సోదాలు కొనసాగుతున్నాయి.

ఎర్ర జెండా అమ్ముడు పోయిందా ?

 ఎర్ర జెండా అమ్ముడు పోయిందా ?

రూ. 50 కోట్లకు డీల్ సెట్ అయిందా ?

ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతలపై కమ్యూనిస్టుల మౌనమెందుకు ?
ఖాళీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కావాలని పంచాయతీ పెట్టె కమ్యూనిస్టు పార్టీలు పేదలను రోడ్డున పడేస్తుంటే ఎందుకు చప్పుడు చేయట్లేదు ?
కంచుకోట ఖమ్మంలో ఇంత అన్యాయం జరుగుతున్నా వారికి పట్టదా ? లేదా పట్టనట్లు నటిస్తున్నారా ?
రేవంత్ రెడ్డి ఇస్తున్న డబ్బుకి ఆశపడ్డారా ? రాజీ పడ్డారా ?.. లేదా పొంగులేటి డబ్బులకు దాసోహం అన్నారా ?
మొన్న కొత్తగూడెంలో కాంగ్రెస్ మీద తొడలు కొట్టి లాలూచి పడిన సీపీఐ నాయకత్వం ఇప్పుడు డబ్బులకు లొంగిందా ?
కమ్యూనిస్టుల కంచు కోట .. ఎర్ర జెండా అడ్డాగా ఉన్న ఖమ్మంలో ఇంత అన్యాయం జరుగుతున్నా బాధితుల వైపు సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఎందుకు వెళ్లట్లేదు ? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు పోరాడట్లేదు ?
కమ్యూనిస్టు నాయకులు ముగ్గురు కాంగ్రెస్ మంత్రులతో రూ. 50 కోట్లు డీల్ సెట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.. కమ్యూనిస్టు పార్టీల మౌనం చూస్తుంటే అది నిజమని నమ్మక తప్పట్లేదు.

Thursday, 19 February 2026

To days paper 20/2/26











 

Sunday, 15 February 2026

*అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్య అరెస్ట్ జైలుకు తరలింపు*.

 *అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్య అరెస్ట్ జైలుకు తరలింపు*.



అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదార్ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

హనుమకొండ జిల్లా : అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను హనుకొండ జిల్లా సుబేదారి పోలీసులు నిన్న రాత్రి బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.అక్షర చిట్ ఫండ్ సంస్థలో చిట్టీలు వేసిన వందలాది మంది భాదితులకు చిట్టి గడువు ముగిసిన కూడా యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో చాలా మంది బాధితులు సుబేదారి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రావు పై పలు కేసులు నమోదు చేసి, రెండు సార్లు జైలుకు కూడా పంపించారు. మరో రెండు కేసుల్లో శ్రీనివాసరావు, ఆయన భార్య శ్రీవిద్య నిందితులుగా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. శ్రీవిద్య అమెరికా నుంచి వస్తుండగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి, హనుమకొండ జిల్లా జడ్జి ముందు హాజరుపరిచి నర్సంపేట జైలుకు తరలించునట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్ తెలిపారు.

Friday, 13 February 2026

ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా:జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్

ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా:జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్



          మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.

      అందువల్ల జిల్లాలోని ప్రజలు వారి ఫిర్యాదులను ఈ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సమర్పించుకోవచ్చని ఆయన తెలిపారు.

____________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు,సమాచార శాఖ, నల్గొండ*

Thursday, 12 February 2026

జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్

మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి:జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్

            మున్సిపల్ ఎన్నికలలో భాగంగా న






ల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు,ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు.

        గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం లోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని , నాగార్జునసాగర్ రోడ్ లో  శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల లో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు .


       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నల్గొండ ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు, మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు , నల్గొండ సమీపంలో ఉన్న నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దేవరకొండ, చండూరు చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు చెప్పారు.

      మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి వార్డుకు ఒక కౌంటింగ్ టేబుల్ ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, కౌంటింగ్ హాల్లో బ్యారి కేడింగ్ ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ,ఓట్ల లెక్కింపు నిర్వహించే సిబ్బందికి శిక్షణను పూర్తి చేయడం జరిగిందని ,ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ అసిస్టెంట్, ఇద్దరు సూపర్వైజర్లు ఉంటారని,ఆర్ ఓ లు ఉంటారని,ముందుగా పోస్టల్ బ్యాలెట్  ఓట్లు లెక్కించిన తర్వాత,రెగ్యులర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఎక్కువ వార్డులు ఉన్నచోట పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్స్ లెక్కించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించడం జరగదని, ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని  రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


        రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి ,తదితరులు ఉన్నారు.

____________________________

 జారీ చేసినారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Saturday, 7 February 2026

ఏసీబీ వలకు చిక్కిన సచివాలయం అధికారి

 ఏసీబీ వలకు చిక్కిన సచివాలయం అధికారి

- రూ.16 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
​విశాఖపట్నం (గాజువాక): ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. గాజువాక 74వ వార్డు నెహ్రూ నగర్ సచివాలయం అడ్మిన్ గణేష్ రూ.16,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
​ఘటన వివరాలు:
బాధితుడు పల్లా సత్తిబాబు తన ఇంటి పన్ను, కుళాయి పన్నును తన భార్య పేరు మీదకు మార్చాలని కోరగా, అడ్మిన్ గణేష్ ఏకంగా రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు.
​ఇప్పటికే రూ.9,000 వసూలు చేసిన గణేష్..
​మిగిలిన రూ.16,000 ఇస్తేనే పని చేస్తానని తెగేసి చెప్పాడు.
​దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేడు సత్తిబాబు నుండి ఆ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి గణేష్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
"మీ ప్రాంతంలో కూడా ఇలాంటి అవినీతి ఎదురైందా?