ఏసీబీ వలకు చిక్కిన సచివాలయం అధికారి
°విశాఖ... గాజువాక*
*టిటిడి ఇవో గా ముద్దాడ రవిచంద్ర*
*_కల్తీ లడ్డు వివాదంలో కూరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఇవో అనీల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలోనూ అప్పట్లో ఆయనే టిటిడి ఇవోగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవులు లేవు, నెయ్యి లేదు, అంతా కాక్టెయిల్ కెమికల్స్ అని తేల్చడంతో ప్రభుత్వం చేతిలో వున్న అధికారాన్ని ఉపయోగించి ఆకస్మికంగా అనీల్ సింఘాల్ పై వేటు వేశారు._*
ప్రస్తుతానికి ఏ పోస్టు కేటాయించలేదు.జిఎడిలో రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు.
*టిటిడి నూతన ఇవోగా సమర్థుడైన డైనమిక్ IAS అధికారి రవిచంద్ర ముద్దాడను* పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ విధులు నిర్వహిస్తూనే టిటిడి బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.
*రవిచంద్ర ముద్దాడ 1996 బ్యాచ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ IAS క్యాడర్ అధికారి.* ఉమ్మడి రాష్ట్రంలో 2003లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా అప్పట్లో సంచలనం సృష్టించారు. వివాదస్పదంగా మారి కబ్జాకు గురైన వందల కోట్ల భూమిని కాపాడి ప్రభుత్వానికి అప్పగించి గుర్తింపు పొందారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో మేటి అధికారిగా పేరు పొందారు. నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.
*కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా* ఆయన చేసిన సేవలు అసామాన్యం! ఎంతో సింపుల్ గా డౌన్ టు ఎర్త్ వుండే అధికారి! తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించే సమర్ధమైన అధికారి! ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వ అధికారంలో వున్నా, వ్యక్తిగత పేరు కన్నా ప్రభుత్వానికి పేరు రావాలని నిజాయితీగా కష్టపడి పని చేసే అత్యుత్తమ అధికారి రవిచంద్ర ముద్దాడ. తిరుమల తిరుపతి దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మరింతగా సేవలు అందిస్తారని మిత్రులు రవిచంద్ర ముద్దాడ గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
*బంపర్ మెజారిటీ దిశగా చకిలం వసంత*
*ఏకమయిన చకిలం అభిమానులు*
పదిరోజుల ముందు నల్గొండలోని 48 వార్డ్ లో కవితా దయాకర్ గెలుపు నల్లేరు పై నడకలా ఉండేది. ఎప్పుడైతే, బీఆర్ఎస్ అభ్యర్థిగా స్వర్గీయ చకిలం శ్రీనివాస రావు కోడలు, చకిలం అనిల్ సతీమణి వసంత పోటీలోకి దిగిందో, ఏకంగా ఆమెను నల్గొండ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం తో ఒక్కసారిగా ... వార్డ్ రాజకీయాలు శరవేగంగా మారాయి. వారం రోజుల మూడు గెలుపుపై ధీమాగా ఉన్న కవితా దయాకర్ ఒక్కసారిగా నిరాశా నిస్పృహలోకి వెళ్లారు. ఎందుకంటే, కనక దుర్గ స్ట్రీట్ లోనే యామా దయాకర్ కు పూర్తి స్థాయిలో అనుచరగణం ఉండేది. ఇప్పుడు చకిలం వసంత పోటీ చేయడంతో ముందునుండి చకిలం కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కనకదుర్గ స్ట్రీట్ తోపాటు మొత్తం వార్డులోని మెజారిటీ ఓటర్లు చకిలం వసంత కు మద్దతుగా బహిరంగంగానే బయటికి వచ్చారు. ఇక, యామా దయాకర్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి కోటాలో సీట్ రావడంతో, ఈ స్థానానికి ముందునుండి ఈ వార్డులో సీట్ కై పోటీలో ఉన్న పాత కాంగ్రెస్ వాదులు నిరుత్సాహహంతో సైలెంట్ అయ్యారు. వీరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తామని పార్టీ ఉన్నత స్థాయిలో నాయకులు ఫోన్ ద్వారా సంప్ర దింపులు జరుగుతున్నప్పటికీ, కోమటిరెడ్డి వర్గీయలు మాత్రం ససేమిరా అంటున్నారు.
అయినప్పటికీ, చకిలం అనీల్ ఇప్పటికీ వార్డ్ లోని పెద్ద లందరినీ కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరగా వారందరూ అంగీకరించారు. అయితే, కొన్ని కారణాల వల్లబహిరంగంగా బయటికి చెప్పలేమని, తమతో పాటు తమ బంధువుల ఓట్లన్నీ చకిలం వసంత కె వేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, ఇదే వార్డ్ లో తమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా చకిలం శ్రీనివాస్ రావు గారిపై ఉన్న అభిమానంతో చకిలం వసంత వైపు మొగ్గుతుండడం తో యమా దయాకర్ వర్గంలో మరింత ఆందోళన ఎక్కువైంది. ఈ వార్డుపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి ద్రుష్టి సాధించాక పోవడం, గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఈ వర్డ్ పై ఏమాత్రం అవగాహన లేకపోవడం కూడా అధికార పార్టీకి ప్రతికూల వాతావరణం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నాలుగు రోజులు చకిలం వర్గీయులు కష్టపడితే, చకిలం వసంత బంపర్ మెజారిటీ తో గెలుస్తుందనేది కనకదుర్గ వీధిలో ఉన్న టాక్.
నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ 45 వ డివిజన్ నుండి BRS పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గడాలె విజయ ను ప్రకటించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా గడాలె విజయ మాట్లాడుతూ
45 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేయుచున్నానని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాననీ, ఈ ప్రయాణంలో డివిజన్ అందరి సహాయ సహకారం, మద్దతు నాకు ఎల్లప్పుడూ అవసరం అని, మీ నమ్మకానికి తగ్గట్టుగా, నిరంతరం మన డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నాననీ తెలిపారు. ఈ అవకాశాన్ని అందించిన మా ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు.
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు
:తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పై ఆగీర్ వెంకటేశం వేసిన కేసుకు కోర్టు పిటిషనర్ యొక్క ప్రస్తుత పిటిషన్ ను ఈ రోజు కోర్టు అనుమతిస్తు, 24-02-2025న మెమో నెం.6395/Regn.II/2025 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారి స్థానంలో న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమిస్త ఉత్తర్వులు జారీ చేసినది. ఈ తేదీ నుండి రెండు నెలల వ్యవధిలో ప్రతివాది నెం.1 సొసైటీ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యొక్క బై-లాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓట్లను లెక్కించి, తదనుగుణంగా తగిన భద్రతతో ఫలితాలను ప్రకటించి, కోర్టు ముందు సమ్మతి నివేదికను దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషనర్ ఫీజు రూ.10,000/- గా నిర్ణయించబడిందనీ మరియు పిటిషనర్ అడ్వకేట్ కమిషనర్ ఫీజును అడ్వకేట్ కమిషనర్కు చెల్లించి, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుండి (7) రోజులలోపు కోర్టు ముందు మెమోతో పాటు రసీదును దాఖలు చేయాలని ఆ ఆర్డర్ లో తెలిపింది.
✳️ ఫైర్ సేఫ్టీపై హైడ్రా దృష్టి పెట్టింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వ్యాపార సముదాయాల నుంచి నివాస ప్రాంతాల వరకూ ఫైర్ సేఫ్టీలో ఎక్కడా అలసత్వాన్ని ఉపేక్షంచరాదని హైడ్రా నిర్ణయించింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకునేందుకు నడుం బిగించింది. జీహెచ్ ఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల అధికారులతో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు బుధవారం సమావేశమయ్యారు. ఫైర్ సేఫ్టీ కార్యాచరణ వివరించారు. వ్యాపార సముదాయాలు, ఫర్నీచర్, వస్త్ర దుకాణాలు ఇలా అన్ని చోట్లా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ పాటించకపోతే.. ఆయా షాపులను సీజ్ చేయాలని నిర్ణయించారు. వెనువెంటనే విద్యుత్ సరఫరా బంద్ చేయాలని.., ఫైర్ సేఫ్టీ లేని వ్యాపార సముదాయంగా.., షాపుగా పేర్కొంటూ నోటీసులు అతికి పెట్టాలని అధికారులకు సూచించారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
-9000113667 నంబరుకు సమాచారమివ్వండి..
✳️ అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 9000113667 కు ఫోను చేసి సమాచారమివ్వాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్న పరిస్థితులున్నాయో కరెంటు లొకేషన్తో పాటు.. వీడియోలు, ఫొటోలు పంపించాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలు తగ్గించడమే కావాలని కోరారు. గతేడాది నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాలు 36కు పైగా ఉన్నాయని.. నెలకు 3 చొప్పున ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
-జాగ్రత్తలు తప్పనిసరి ..
🔹నాంపల్లిలో జరిగిన ఫర్నీచర్ దుకాణం సెల్లార్లలో లెక్కకు మించిన ఫర్నీచర్ను నెట్టులుగా పెట్టారు. సెల్లార్లోనే వాచ్మ్యాన్కు నివాసం కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు షాపులో ఉన్న వారు బయటపడినా.. సెల్లార్లో ఉన్న వారు మంటల్లో చిక్కుకున్నారు. ఇందులో కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు.
🔹వస్త్ర దుకాణదారులు, ఫర్నీచర్ షాపులతో పాటు ఇతర వ్యాపారాలు చేసిన వారు.. వారి నిలువలను మెట్ల మార్గంలో, కారిడార్లో, సెల్లార్లలో నిలువ ఉంచరాదు.
🔹ఇందుకు ప్రత్యేకంగా జన సంచారం లేని ప్రాంతాల్లో గోదాముల్లో నిలువ ఉంచుకోవాలి.
🔹సెల్లార్ లు వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న వస్తువులు, పదార్థాలు నిల్వ ఉంచరాదు.
🔹వ్యాపార సముదాయాల్లో నివాసాలు ఏర్పాటు చేయరాదు. అలాగే సెల్లార్లలో వర్కర్లు, వాచ్ మ్యాన్ కుటుంబాలకు గదులు కేటాయించడం చేయరాదు.
🔹సెల్లార్ నుంచి టెర్రాస్ వరకూ మెట్ల మార్గాలను ఎట్టి పరిస్థితులలో బ్లాక్, లాక్ చేయరాదు.
🔹షాపులు, వ్యాపార సముదాయాల్లో ఉన్న అగ్ని నియంత్రణ పరికరాలు ఎల్లవేళలా పని చేసే విధంగా ఉంచుతూ, సిబ్బందికి అగ్ని పరికరాలపై తగిన అవగాహన కల్పించాలి.
🔹ఒక వేళ షార్టు సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినా దుకాణాల్లో ఉన్న వారు క్షణాల్లో బయట పడేందుకు వీలుగా దారులు చూపించాలి.
🔹అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పేందుకు ఉద్దేశించిన స్ప్రింక్లర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.