Tuesday, 10 March 2026

పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?


 పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?


వంట గ్యాస్ సరఫరా.. ధరలు వినియోగదారుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పరిమితుల పైన ఆంక్షలు విధించారు. అటు కమర్షియల్ గ్యాస్ సరఫరా సమస్యతో హోటళ్లు మూత బడుతున్నాయి. కేంద్రం ఈ పరిస్థితుల పై అధ్యయనం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పెరిగిన వంట గ్యాస్ ధరల పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. సరఫరా, బుకింగ్ లో పరిమితులు వినియోగ దారులకు సమస్యగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒకే సారి ఏకంగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చేలా.. ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. దీంతో పాటుగా సిలిండర్ బుకింగ్ కోసం పరిమితులు.. గడువు విధించింది. దీంతో.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కాగా, దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.


Also Read

ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!

ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!

central-key-discussions-over-the-lpg-rates-reports-indicate-a-further-increase-in-prices-here-the

అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పెరిగిన ధరల పై పునరాలోచన

ఈ పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పశ్చిమాసియా పరిస్థితులతో పాటుగా వంట గ్యాస్ సరఫరా.. పెరిగిన ధరల పైన సమీక్ష చేయనుంది. ఈ వారంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతిపక్షాలు వంట గ్యాస్ ధరల పెంపు పైన రాజకీయం గా టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలను ఎంత మేర తగ్గిస్తే.. ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందీ... పశ్చిమాసియాలో ఎప్పటి లోగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశాల పైన చర్చించనున్నారు. ఎన్నికల వేళ వంట గ్యాస్ ధరల పైన పునరాలోచన చేయకుంటే నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. గ్లోబల్ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ వినియోగంపై నియంత్రణ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజు కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారు.

Monday, 2 March 2026

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

 


 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌


హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు.

ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు.

ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర్పించవచ్చు. ముఖ్యంగా ఐవిఎఫ్, వామ్ లలో సభ్యులుగా చేరిన వారిని ఓటర్ల లిస్ట్ నుండి తొలిగించినట్లు వార్తలు వచ్చాయి. వారు అడ్వకేటి కమీషనర్ కు అభ్యంతరాలు సమర్పించి తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మండల అధ్యక్షుల ప్రమేయం లేకుండా హోటల్స్ లో కూర్చొని ఓటర్ల లిస్ట్ తయారు చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఓటర్ల లిస్ట్ పై అభ్యంతరాలు ఉన్న వారందరూ అభ్యంతరాలు సమర్పించవచ్చు.


Friday, 27 February 2026

₹4 లక్షల లంచం కేసులో ఏసీబీ ట్రాప్స్ ఫారెస్ట్సెక్షన్ అధికారి

 #ఆంధ్రప్రదేశ్:

₹4 లక్షల #లంచం కేసులో #ఏసీబీ ట్రాప్స్ #ఫారెస్ట్సెక్షన్ అధికారి

#పశ్చిమగోదావరి జిల్లాలో #సామిల్లు యజమాని నుండి ₹4 లక్షల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాదు సురేష్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
#టేకు కలప స్వాధీనం తర్వాత మిల్లును నిర్వహించడానికి అనుమతించడానికి అతను #డబ్బు డిమాండ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
#అవినీతి నిరోధక చట్టం కింద #కేసు నమోదు చేయబడింది.
సోదాలు కొనసాగుతున్నాయి.

ఎర్ర జెండా అమ్ముడు పోయిందా ?

 ఎర్ర జెండా అమ్ముడు పోయిందా ?

రూ. 50 కోట్లకు డీల్ సెట్ అయిందా ?

ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతలపై కమ్యూనిస్టుల మౌనమెందుకు ?
ఖాళీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కావాలని పంచాయతీ పెట్టె కమ్యూనిస్టు పార్టీలు పేదలను రోడ్డున పడేస్తుంటే ఎందుకు చప్పుడు చేయట్లేదు ?
కంచుకోట ఖమ్మంలో ఇంత అన్యాయం జరుగుతున్నా వారికి పట్టదా ? లేదా పట్టనట్లు నటిస్తున్నారా ?
రేవంత్ రెడ్డి ఇస్తున్న డబ్బుకి ఆశపడ్డారా ? రాజీ పడ్డారా ?.. లేదా పొంగులేటి డబ్బులకు దాసోహం అన్నారా ?
మొన్న కొత్తగూడెంలో కాంగ్రెస్ మీద తొడలు కొట్టి లాలూచి పడిన సీపీఐ నాయకత్వం ఇప్పుడు డబ్బులకు లొంగిందా ?
కమ్యూనిస్టుల కంచు కోట .. ఎర్ర జెండా అడ్డాగా ఉన్న ఖమ్మంలో ఇంత అన్యాయం జరుగుతున్నా బాధితుల వైపు సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఎందుకు వెళ్లట్లేదు ? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు పోరాడట్లేదు ?
కమ్యూనిస్టు నాయకులు ముగ్గురు కాంగ్రెస్ మంత్రులతో రూ. 50 కోట్లు డీల్ సెట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.. కమ్యూనిస్టు పార్టీల మౌనం చూస్తుంటే అది నిజమని నమ్మక తప్పట్లేదు.

Thursday, 19 February 2026

To days paper 20/2/26











 

Sunday, 15 February 2026

*అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్య అరెస్ట్ జైలుకు తరలింపు*.

 *అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్య అరెస్ట్ జైలుకు తరలింపు*.



అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదార్ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

హనుమకొండ జిల్లా : అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను హనుకొండ జిల్లా సుబేదారి పోలీసులు నిన్న రాత్రి బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.అక్షర చిట్ ఫండ్ సంస్థలో చిట్టీలు వేసిన వందలాది మంది భాదితులకు చిట్టి గడువు ముగిసిన కూడా యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో చాలా మంది బాధితులు సుబేదారి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రావు పై పలు కేసులు నమోదు చేసి, రెండు సార్లు జైలుకు కూడా పంపించారు. మరో రెండు కేసుల్లో శ్రీనివాసరావు, ఆయన భార్య శ్రీవిద్య నిందితులుగా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. శ్రీవిద్య అమెరికా నుంచి వస్తుండగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి, హనుమకొండ జిల్లా జడ్జి ముందు హాజరుపరిచి నర్సంపేట జైలుకు తరలించునట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్ తెలిపారు.

Friday, 13 February 2026

ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా:జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్

ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా:జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్



          మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.

      అందువల్ల జిల్లాలోని ప్రజలు వారి ఫిర్యాదులను ఈ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సమర్పించుకోవచ్చని ఆయన తెలిపారు.

____________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు,సమాచార శాఖ, నల్గొండ*