Tuesday, 24 March 2026

ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల*

 *ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల*


 *▪️ ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు లోన్స్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్*


 *2025 - 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.*


 *దీని ప్రకారం ఏప్రిల్ 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి.*


ఇందులో 


1. ప్యాసింజర్ ఆటో 4వీలర్=8,00,000/- 

2.పాసింజర్ ఆటో3వీలర్ =3,00,000/- 

3.ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్=2,000,000/-

4. ఎలెక్ట్రిక్ ఆటో =3,00,000/-

5. పాసింజర్ కార్ (4 వీలర్)=1000000/-

6. గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల =10,00,000/- 

7. ఫ్లవర్ బొక్కే షాప్ =2,50,000/-

8. అగ్రికల్చర్ డ్రోన్ =10,00,000/- 

9. వర్మీ కంపోస్టు =2,50,000/-

10. నెట్ సెంటర్ =2,70,000/-

11. LED బల్బ్ =2,80,000/-

12. ఫ్లంబింగ్, ఎలక్ట్రికల్ షాప్=2,90,000/-

13. వాటర్ బాటిల్ తయారీ =2,90,000/-

14. వాటర్ రీసైక్లింగ్ =2,95,000/-

15. మొబైల్ రేపైరింగ్ షాప్ =3,10,000/-

16. Soap డిటర్జెంట్ తయారీ =3,20,000/-

17. Fish ఫార్మింగ్ =3,50,000/-

18. Car వాష్ =3,50,000/-

19. బ్రిక్స్ మేకింగ్=3,50,000/-

20. Tourism =3,50,000/-

21. బేకరి షాప్ =3,60,000/-

22. సిరి culture =3,80,000/-

23. Water R O plant =3,80,000/-

24. Welding ఫ్యాబ్రికేషన్ =3,85,000/-

25. Solar ప్రొడక్టింగ్ =3,90,000/-

26. జ్యూట్ బ్యాగ్ =3,90,000/-

27. సోలార్ ప్యానెల్ =3,95,000/-

28. కొబ్బరికాయ తోట=4,00,000

29. ఫోటో షాప్ =4,00,000/- 

30. ఆయుర్వేదిక్ మెడికల్ =4,00,000/–

31. జనరల్ మెడికల్ షాప్=5,00,000/- 

32. బ్యూటీ పార్లర్ =5,00,000/- 

33. మెడికల్ లాబ్ =5,00,000/- 

*34. E V బ్యాటరీ ఛార్జింగ్* =2,00,00,000/-

విశాఖ: ఏసీబీకి చిక్కిన సచివాలయం ఉద్యోగి.

 #ఏసీబీ వలలో మరో #అవినీతి అధికారి.

విశాఖ: ఏసీబీకి చిక్కిన సచివాలయం ఉద్యోగి.

రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్..

https://heyzine.com/flip-book/7c3e81f4c3.html

 https://heyzine.com/flip-book/7c3e81f4c3.html

శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు?

 శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు? 

      భారతీయ సంస్కృతిలో ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడి జన్మదినం 'శ్రీరామనవమి'. లోకోద్ధరణ కోసం అయోధ్యలో దశరథ నందనుడిగా రాముడు అవతరించిన ఈ పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగే ఈ వేడుకలు, ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచే ప్రారంభమైన వసంత నవరాత్రులు నవమి నాటికి పరాకాష్టకు చేరుకుంటాయి. ఈ ఏడాది 2026, మార్చి 27వ తేదీన (శుక్రవారం) భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 26న నవమి తిథి ప్రవేశించినప్పటికీ, సూర్యోదయ తిథి మరియు వైష్ణవ సంప్రదాయం ప్రకారం 27నే ప్రధాన వేడుకలు జరగనున్నాయి. మరిన్ని కనుగొనండి మనీ మేనేజ్‌మెంట్ సలహా విద్య & ఉద్యోగ కోర్సులు క్రికెట్ స్కోర్లు క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు ఆటోమొబైల్స్ రివ్యూ అభిజిత్ లగ్నంలో కల్యాణం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో ఉదయం 11:06 గంటల నుంచి మ 1:31 గంటల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతుంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం ఇక్కడి ఆచారం. మరుసటి రోజు, అంటే మార్చి 28న స్వామివారి మహా పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా సాగనుంది. Also Read అయోధ్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం, ఏంటి 'శ్రీరామ యంత్రం’? భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తుల కోసం ఆర్టీసీ (TGSRTC) ద్వారా తలంబ్రాలను నేరుగా ఇంటికే పంపించే ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించారు. భద్రాద్రి రాముడి కల్యాణ తలంబ్రాలను శుభకార్యాల్లో ఉపయోగించుకోవడం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. Powered By Recommended For You శ్రీరామ నవమి రోజు ఈ దానాలు చేయండి.. కానీ ఈ తప్పులు చేసి పాపాలు మూటకట్టుకోవద్దు! ధర్మ స్థాపనకు మార్గదర్శి రాముడి జీవితం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ జీవన విధానం. పితృవాక్య పరిపాలన, ఏకపత్నీ వ్రతం, ప్రజా రంజక పాలన వంటి ఆదర్శాలతో 'రామరాజ్యం' ఎలా ఉండాలో ఆయన చేసి చూపించారు. నేటి సమాజంలో నైతిక విలువలు కాపాడుకోవడానికి రాముడి అడుగుజాడల్లో నడవడం ఎంతో అవసరమని ఆధ్యాత్మిక వేత్తలు ప్రబోధిస్తున్నారు.

Monday, 23 March 2026

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.





 ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

       ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

      ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను సీరియస్ గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆదేశించినట్లు ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ సభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామపంచాయతీ, మండల,  మున్సిపల్,జిల్లా వారిగా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను తక్షణమే తయారు చేసి సిపిఓ కు  సమర్పించాలి. మండల ప్రత్యేక అధికారులు  మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను సందర్శించి ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి.

      జనగణనకు సంబంధించి తక్షణమే ఎన్యుమరేషన్ బ్లాక్ లను  నిర్ణయించడంతోపాటు, సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలి. అంతేకాక నియామకపు తరువులు జారీ చేయాలి.

        ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా వివిధ పథకాల కింద నిధులు పొందిన అధికారులందరూ తక్షణమే యుటీలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి.

     జంతు సంరక్షణ లో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబిసీ 

 స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలి. మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పనులు జరిగేలా చూడాలి. దేవరకొండ ఆర్డిఓ దేవరకొండలో ఏబి సి కేంద్రం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలాన్ని చూడాలి. అందరూ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి అన్ని మేజర్ గ్రామపంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో ఏబీసీల ఏర్పాటుకు స్థలాన్ని చూడాలి.  

        కుక్కల రిహబిలిటేషన్ గాను నల్గొండ మున్సిపల్ కమిషనర్ నల్గొండలో కుక్కల షెల్టర్ ను  ఏర్పాటు చేయాలి. ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల ఆవరణలలో సంచరించే కుక్కలకు సెంటర్లకు తరలించే ఏర్పాటు  చేయాలి. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఒక రోజు "దత్తత" కార్యక్రమాన్ని నిర్వహించి ఆవులు, కుక్కలను దత్తత ఇచ్చేలా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్  చూడాలి.  దీనికి మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ సహకార అందించాలని కలెక్టర్ ఆదేశించారు .

       ఈ సమావేశంలో ఉపాధి హామీ ,తదిత అంశాలపై సమీక్షించారు.

         కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 40 పిటిషన్లు,  ఇతర శాఖలకు 43 పిటిషన్లు,  మొత్తం 83 ఫిర్యాదులను ప్రజలు ప్రజావాణిలో సమర్పించారు.

        మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ  అమిత్, రెవెన్యూ అదనపు కలెక్ట్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

__________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.



 పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు  కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

        సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.

         పరీక్షా కేంద్రాలలో  అన్ని వసతులు ఎప్పటిలాగే ఉండాలని,ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,టాయ్ లెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అధికారులకు చెప్పారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కుండలలో తాగునీరు  ఏర్పాటు చేయాలని అన్నారు. 

పరీక్ష కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయాలని తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని,పూర్తి స్థాయిలో తనిఖీ తర్వాతే విద్యార్థులను  పరీక్ష కేంద్రం లోకి పంపించాలన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల హాజరు,తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స లో భాగంగా ఏ ఎన్ ఎం తో మాట్లాడారు.వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్


 తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 

         తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు నూతన నేషనల్ హైవేలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వద్ద ఈ రహదారి ముగుస్తుంది. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది. తెలంగాణా నుండి తిరుపతికి కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతి వెళ్లాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి దొరికినట్లు అయింది. ఈ కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు ప్రాంతాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. మరిన్ని కనుగొనండి TV & Video జాతీయ వార్తలు సబ్స్క్రిప్షన్ తెలుగు భాషా కోర్సులు ఆరోగ్యం & ఫిట్‌నెస్ ఉత్పత్తులు ఎన్ హెచ్ 565 నిర్మాణంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ గతంలో మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుండి హైదరాబాదుకు రాత్రిపూట అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే జనాలు ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మీదుగా దారుణంగా రోడ్డు ఉండేది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ ఎన్ హెచ్ 565 నిర్మాణం చేయడంతో ప్రస్తుతం ఆ కష్టాలు తొలగిపోయాయి. ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరంగా మారింది. రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యంతో అడ్డంకి NH565 లోని 20 కిలోమీటర్ల రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యం వంటి అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో, వేగవంతం చేసి నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు. అటవీ ప్రాంతంలో సాగే ఈ మార్గం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. Powered By 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయల ఖర్చు గతంలో పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మండలం వరకు ప్రయాణం చేయాలంటే 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లోనే ప్రయాణం సాగుతుంది. దీంతో సమయం బాగా ఆదా అవుతుంది. 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అటవీ మరియు ఘాట్ ప్రాంతాలను కలుపుతూ 16 వంతెనలు, ఎనిమిది అండర్ పాస్ లు ఈ మార్గంలో ఏర్పాటయ్యాయి. Also Read హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! ఈ ప్రాంతాల మీదుగా రహదారి మొత్తం 420 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ, కనగల్ ప్రాంతాల మీదుగా వచ్చి, మాచర్ల వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపుకు వెళితే కాళహస్తి కుడివైపుకు వెళితే తిరుపతిని చేరుకునేలా ఈ మార్గం ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు తిరుపతి వెళ్లడం ఈజీ అవుతుంది.