Tuesday, 14 July 2026

బోనాల జాతరకు సర్వం సిద్ధం.. భక్తులకు కట్టుదిట్టమైన భద్రత

 బోనాల జాతరకు సర్వం సిద్ధం.. భక్తులకు కట్టుదిట్టమైన భద్రత 




          ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం మొత్తం బోనాల శోభతో పులకించిపోతుంది. హైదరాబాద్ లో ఎటు చూసినా సందడే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ నిలుస్తూ వస్తోంది. ఇక ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండగ ఘనంగా జరగనుంది. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల పండగపై సమీక్ష నిర్వహించారు. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో మొదలవుతుంది. అలాగే 20,21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 20 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21 వ తేదీన అమ్మవారి కల్యాణం, 22వ తేదీన రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 2 న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు9 న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయని ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు బోనాల పండగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 3,427 ఆలయాలకు రూ.15.05 కోట్ల నిధులు విడుదల చేసింది. ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీసు , ఆరోగ్య శాఖల సమన్వయంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

ఆషాఢ మాసం రేపటి నుంచే ప్రారంభం.. ఈ నెలలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే..!


ఆషాఢ మాసం రేపటి నుంచే ప్రారంభం.. ఈ నెలలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే..!


ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో భక్తులు దేవుడి ఆరాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

              ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో భక్తులు దేవుడి ఆరాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు గుడి ప్రశాంత్ శర్మ న్యూస్ 18తో అన్నారు.

ఆషాఢ మాసంలో ఆషాఢ ఏకాదశి (తొలి ఏకాదశి), గురు పౌర్ణిమ, ఆషాఢ అమావాస్య, బోనాలు వంటి ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి. ఈ రోజుల్లో భక్తులు ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. గురుపౌర్ణిమ రోజున గురువులను స్మరించి వారి ఆశీర్వాదాలు పొందడం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం.

ఆషాఢ మాసంలో ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో భూమి పచ్చదనంతో కళకళలాడుతుంది. రైతులు ఈ సమయంలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మంచి వర్షాలు పడి పంటలు బాగా పండాలని రైతులు దేవుడిని ప్రార్థిస్తారు. ఈ నెల వ్యవసాయానికి కూడా ఎంతో కీలకమైనదిగా భావిస్తారు.

మత సంప్రదాయాల ప్రకారం ఈ నెలలో సాత్విక ఆహారం తీసుకోవడం, దానధర్మాలు చేయడం, పెద్దలను గౌరవించడం, పేదలకు సహాయం చేయడం శుభప్రదంగా భావిస్తారు. చాలామంది మాంసాహారాన్ని తగ్గించి, శాకాహారాన్ని పాటిస్తారు. ప్రతిరోజూ దేవాలయ దర్శనం, విష్ణు సహస్రనామం, శివ స్తోత్రాలు, లలితా సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని విశ్వసిస్తారు.

కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో కొత్త శుభకార్యాలు, వివాహాలు నిర్వహించరు. అయితే ఇది ప్రాంతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నెలను భక్తి, నియమ నిష్ఠలు, ఆత్మపరిశీలనకు అనువైన కాలంగా భావిస్తారు. కోపం, అసత్యం, అనవసర వాదనలకు దూరంగా ఉండి మంచి ఆలోచనలతో జీవించాలని పెద్దలు సూచిస్తారు.మొత్తంగా చెప్పాలంటే, జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగే ఆషాఢ మాసం ఆధ్యాత్మికత, భక్తి, ప్రకృతి అందాలు, పండుగల సమ్మేళనంగా నిలుస్తుంది. ఈ నెలలో సత్కార్యాలు చేయడం, దేవుడిని భక్తితో ఆరాధించడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మనశ్శాంతి, కుటుంబ సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని మత విశ్వాసం. అందుకే హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

Sunday, 12 July 2026

 https://heyzine.com/flip-book/9978a4d33f.html

neelagirishankaravam july issue -2026

 neelagirishankaravam july issue -2026

https://heyzine.com/flip-book/9978a4d33f.html

తెలంగాణ ఆర్ అండ్ బి శాఖను దేశంలోనే నంబర్‌వన్ తీర్చిదిద్దుతాం-రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి




 @  తెలంగాణ ఆర్ అండ్ బి శాఖను దేశంలోనే నంబర్‌వన్ తీర్చిదిద్దుతాం-రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


        రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖను  అన్ని రంగాల్లో నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.


          ఆదివారం ఆయన నల్గొండ జిల్లా ,నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్‌పల్లి మండల కేంద్రంలో  76 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నార్కట్‌పల్లి–మునుగోడు సేతుబంధు (సీఆర్‌ఐ) రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

                     ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, మెరుగైన రహదారులు, వంతెనలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, సాగునీరు, వ్యవసాయం, తదితర రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎక్కువ స్థాయిలో ధాన్యం పండిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రంలోనే

ధాన్యం అత్యధికంగా పండించిన  జిల్లా నల్గొండ జిల్లా అని అన్నారు.

నార్కట్‌పల్లి–మునుగోడు రహదారి అభివృద్ధి పనుల్లో స్థానిక రైతుల భూములకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసి నార్కట్‌పల్లి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నార్కెట్ పల్లి మండలంలో 600 కోట్లతో హ్యాం రోడ్లను,4000 కోట్లతో రాష్ట్రంలో అన్ని  రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు .

2028లో ఎస్ ఎల్ బి సి  సొరంగ మార్గం పూర్తి చేసి నార్కట్పల్లి మండల ప్రజలకు తాగునీరు, సాగు నీరు  అందిస్తామని చెప్పారు.

         ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు.


          ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్

 బి చంద్రశేఖర్,

 సేతు బందు సిఆర్ఐఎఫ్ చీఫ్ వసంత నాయక్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్  అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి ,  తదితరులు పాల్గొన్నారు .

__________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Wednesday, 8 July 2026

సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్






 సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్


          జిల్లాలో ఓటరు జాబితా  ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.


         బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15 లక్షల 16 వేల 253 మంది ఓటర్లు ఉన్నారని ,ఇందులో 15 లక్షల 12 వేల 548 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటివరకు 99.76 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన ఫారాల పంపిణీని కూడా త్వరలో పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు.

ఇప్పటివరకు సుమారు 33.58 శాతం ఫారాలను తిరిగి స్వీకరించామని, ఇంకా సుమారు 66 శాతం ఫారాలను సేకరించాల్సి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్  సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రారంభ రోజుల్లో బీఎల్ఓల పనితీరులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం బిఎల్ఓలు అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ  సహకరిస్తున్నారని తెలిపారు. బీఎల్ఓలు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ఫారాల సేకరణ చేపడుతున్నారని పేర్కొన్నారు.

2002 ఓటరు జాబితాకు సంబంధించి ఫారాలను ఎలా నింపాలనే సందేహాలపై ఎన్నికల కమిషన్‌కు వివరించామని, 2002 ఓటరు జాబితాను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటివరకు 88 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ప్రతి బీఎల్ఓ వద్ద సంబంధిత జాబితా అందుబాటులో ఉందన్నారు.

మరణించిన ఓటర్ల పేర్లను తొలగించాలని, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. డబుల్ ఓట్లను తొలగించేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. గ్రామంలో ఓటు ఉంచుకోవాలా లేదా పట్టణంలో ఉంచుకోవాలా అనే విషయంలో ఓటర్లు ఒక నిర్ణయం తీసుకొని,  . ఎక్కడైనా ఒకఓటును ఉంచుకోవాలని తెలిపారు.

సర్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలని,  పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇళ్లు తాళం వేసి ఉండడం వంటి కారణాలతో ఫారాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల బీఎల్ఏలు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, అటువంటి సందర్భాల్లో ఫారం-8 ద్వారా కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తీసుకున్న తర్వాత, జిల్లా స్థాయిలో కూడా ఆమోదం పొంది తుది జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు.

పనిభారం ఎక్కువగా ఉన్న లేదా పనితీరు బలహీనంగా ఉన్న బీఎల్ఓలకు సహాయకులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి బీఎల్ఓ ఇంటింటికీ తిరిగి ఫారాలు నింపాలని సూచించారు. ప్రతి ఫారంపై సంబంధిత బీఎల్ఓ ఫోన్ నంబర్ ఉంటుందని, ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చే సూచనలను పరిశీలించి, అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

            ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్  జె శ్రీనివాస్ ,రెవెన్యూ అధికారి దశరథ, కాంగ్రెస్ పార్టీ  ప్రతినిధి ముంతాజ్ అలీ ,బి ఆర్ఎస్ నుండి బక్క పిచ్చయ్య ,బిజెపి తరఫున లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, ధర్మసమాజ్ పార్టీ ప్రతినిధి రవికుమార్, ఆప్  పార్టీ నుండి రవీందర్,ఎంఐఎం. నుండి కలీం ,

టిడిపి  నుండి రవి తదితరులు పాల్గొన్నారు .

____________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్


 తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో చర్చించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నివేదికను అందించారు.

✅ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి గారు, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి గారు భేటీ అయ్యారు.
✅ ఖ‌మ్మం జిల్లాలో ₹ 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్టు ప్రతినిధులు వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, న‌ర్సరీ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం కేటాయించింది.
✅ సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రాహ‌దారిని విస్త‌రించాల‌ని ముఖ్య‌మంత్రి గారిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు టీజీఐఐసీ ఆధ్వ‌ర్యంలో రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు.