Thursday, 2 April 2026

రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!

 రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!


హైకోర్టు కీలక ఆదేశాలు:


Karnataka High Court సంచలన నిర్ణయం.

ప్రాసిక్యూషన్‌కు వెంటనే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం.

అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ తప్పనిసరి.


2021లో Mysore జిల్లాలో ‘ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల’ కొనుగోలు.

మార్కెట్ ధర ₹13 ఉండగా… ₹52కు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు.

ప్రభుత్వానికి సుమారు ₹7.5 కోట్ల నష్టం.


కోర్టు వ్యాఖ్యలు హాట్ టాపిక్:

“శాఖా విచారణలో క్లీన్ చిట్ వచ్చినా… క్రిమినల్ విచారణ ఆగదు”.

అవినీతి కేసుల్లో నిజాలు వెలికితీయాలంటే పూర్తి దర్యాప్తు అవసరం.

చట్టం కింద చర్యలు:

 Prevention of Corruption Act సెక్షన్ 17A కింద విచారణకు గ్రీన్ సిగ్నల్.

ప్రభుత్వానికి కోర్టు గట్టిగా మందలింపు.

అధికారికంగా దర్యాప్తు ప్రారంభం కానుంది.

రోహిణి సింధూరి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

Wednesday, 1 April 2026

తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..!

 తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..! 


తమిళనాడులో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ప్రాంతాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవుగా తమిళనాడు ఉంది. తమిళనాడులో ప్రాచీనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. అరుణాచలం, రామేశ్వరం, మధురై, తంజావూరు, చిదంబరం లాంటి ప్రధాన క్షేత్రాలను చుట్టేసి రావొచ్చు. భక్తుల కోసం తక్కువ ధరకే ఇండియన్​ రైల్వేస్​ క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి ఈ టూర్ ను ఆస్వాదించవచ్చు. Battle for States 2026 Live Updates | Key Contests తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఓ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, చిదంబరం, మధురై, తంజావూర్ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. టూర్ లో భాగంగా రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణుగుంట మీదుగా వెళ్తుంది. ఈ స్టేషన్లలో ఎక్కడైనా ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. ఇక ప్రస్తుతం ఈ టూర్​ మే 24వ తేదీన అందుబాటులో ఉంది. ఐఆర్సీటీసీ టూర్ లో భాగంగా తొలిరోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్టు రైలు బయల్దేరుతుంది. ఆ రాత్రి ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం 9 గంటలకు అరుణాచలానికి చేరుకుంటారు. అరుణాచలం ఆలయం దర్శనం చేసుకుంటారు. రాత్రికి రామేశ్వరం బయల్దేరుతారు. రామేశ్వరం దర్శనం అనంతరం మధురైకు వెళ్తారు. మధురై దర్శనం తర్వాత అక్కడినుంచి కన్యాకుమారికి స్టార్ట్ అవుతారు. కన్యాకుమారిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస ఉంటుంది. Also Read "పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.." మరిన్ని కనుగొనండి ట్రావెల్ ప్యాకేజీలు తెలుగు పుస్తకాలు విద్య కోర్సులు బిజినెస్ న్యూస్ జిల్లా వార్తలు అంతర్జాతీయ వార్తలు సినిమా రివ్యూస్ ఇక ఏడోరోజు తిరుచిరాపల్లి నుంచి చిదంబరానికి బయల్దేరుతారు. చిదంబరంలో నటరాజస్వామి దర్శనం అనంతరం అక్కడే సికింద్రాబాద్ కు రైలు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరుసటిరోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.


Tuesday, 31 March 2026

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 న నిర్వహించే గ్రామ,మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.



       ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 న నిర్వహించే గ్రామ,మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్  అధికారులను ఆదేశించారు.

           గ్రామ, మున్సిపల్ వార్డు సభల నిర్వహణ వి


షయమై మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

          అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ,మండల స్థాయి అధికారులతో ఇదే విషయమై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

      ప్రభుత్వ  నియమ నిబంధనల ప్రకారం  గ్రామ, మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని, ఈ గ్రామ,వార్డు సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, తదితరులు అందర్నీ ఆహ్వానించాలన్నారు. గ్రామ సభలో వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల పేర్లన్నీ చదివి వినిపించాలని చెప్పారు. గ్రామసభకు హాజరయ్యే వారి కి అవసరమైన టెంటు, తాగునీరు వంటివి ఏర్పాటు చేయాలని, ఆయా పథకాల కింద లబ్ధిదారులను గుర్తించి వారి ద్వారా వారు పొందిన లబ్ధిపై మాట్లాడించాలన్నారు. గ్రామసభల నిర్వహణ వివరాలన్ని రిపోర్టు రూపంలో డాక్యుమెంటేషన్ చేసి పంపించాలని తెలిపారు. గ్రామసభ సక్రమ నిర్వహణకు గాను ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, గ్రామ సభకు సంబంధించి గ్రామ అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.   గ్రామ సభలలో భాగంగా ఆయా పథకాల కింద లబ్ధిదారులకు లబ్ధిని కల్పించే పత్రాల పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని, గ్రామసభల ను సవ్యంగా నిర్వహించేందుకు తక్షణమే మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

      అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ,వార్డ్ సభలను పకడ్బందీగా నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడాలని, జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరిని గ్రామ సభలకు పిలవాలని, ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల పేర్లన్నీ చదివి వినిపించాలని, ముఖ్యంగా రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ జీవిత బీమా, పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం వంటి వాటన్నిటిపై తెలియజేయాలని అన్నారు.

         రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

        స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్ నాయక్, గృహ నిర్మాణ పిడి రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

_________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Tuesday, 24 March 2026

ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల*

 *ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల*


 *▪️ ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు లోన్స్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్*


 *2025 - 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.*


 *దీని ప్రకారం ఏప్రిల్ 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి.*


ఇందులో 


1. ప్యాసింజర్ ఆటో 4వీలర్=8,00,000/- 

2.పాసింజర్ ఆటో3వీలర్ =3,00,000/- 

3.ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్=2,000,000/-

4. ఎలెక్ట్రిక్ ఆటో =3,00,000/-

5. పాసింజర్ కార్ (4 వీలర్)=1000000/-

6. గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల =10,00,000/- 

7. ఫ్లవర్ బొక్కే షాప్ =2,50,000/-

8. అగ్రికల్చర్ డ్రోన్ =10,00,000/- 

9. వర్మీ కంపోస్టు =2,50,000/-

10. నెట్ సెంటర్ =2,70,000/-

11. LED బల్బ్ =2,80,000/-

12. ఫ్లంబింగ్, ఎలక్ట్రికల్ షాప్=2,90,000/-

13. వాటర్ బాటిల్ తయారీ =2,90,000/-

14. వాటర్ రీసైక్లింగ్ =2,95,000/-

15. మొబైల్ రేపైరింగ్ షాప్ =3,10,000/-

16. Soap డిటర్జెంట్ తయారీ =3,20,000/-

17. Fish ఫార్మింగ్ =3,50,000/-

18. Car వాష్ =3,50,000/-

19. బ్రిక్స్ మేకింగ్=3,50,000/-

20. Tourism =3,50,000/-

21. బేకరి షాప్ =3,60,000/-

22. సిరి culture =3,80,000/-

23. Water R O plant =3,80,000/-

24. Welding ఫ్యాబ్రికేషన్ =3,85,000/-

25. Solar ప్రొడక్టింగ్ =3,90,000/-

26. జ్యూట్ బ్యాగ్ =3,90,000/-

27. సోలార్ ప్యానెల్ =3,95,000/-

28. కొబ్బరికాయ తోట=4,00,000

29. ఫోటో షాప్ =4,00,000/- 

30. ఆయుర్వేదిక్ మెడికల్ =4,00,000/–

31. జనరల్ మెడికల్ షాప్=5,00,000/- 

32. బ్యూటీ పార్లర్ =5,00,000/- 

33. మెడికల్ లాబ్ =5,00,000/- 

*34. E V బ్యాటరీ ఛార్జింగ్* =2,00,00,000/-

విశాఖ: ఏసీబీకి చిక్కిన సచివాలయం ఉద్యోగి.

 #ఏసీబీ వలలో మరో #అవినీతి అధికారి.

విశాఖ: ఏసీబీకి చిక్కిన సచివాలయం ఉద్యోగి.

రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్..

https://heyzine.com/flip-book/7c3e81f4c3.html

 https://heyzine.com/flip-book/7c3e81f4c3.html

శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు?

 శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు? 

      భారతీయ సంస్కృతిలో ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడి జన్మదినం 'శ్రీరామనవమి'. లోకోద్ధరణ కోసం అయోధ్యలో దశరథ నందనుడిగా రాముడు అవతరించిన ఈ పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగే ఈ వేడుకలు, ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచే ప్రారంభమైన వసంత నవరాత్రులు నవమి నాటికి పరాకాష్టకు చేరుకుంటాయి. ఈ ఏడాది 2026, మార్చి 27వ తేదీన (శుక్రవారం) భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 26న నవమి తిథి ప్రవేశించినప్పటికీ, సూర్యోదయ తిథి మరియు వైష్ణవ సంప్రదాయం ప్రకారం 27నే ప్రధాన వేడుకలు జరగనున్నాయి. మరిన్ని కనుగొనండి మనీ మేనేజ్‌మెంట్ సలహా విద్య & ఉద్యోగ కోర్సులు క్రికెట్ స్కోర్లు క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు ఆటోమొబైల్స్ రివ్యూ అభిజిత్ లగ్నంలో కల్యాణం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో ఉదయం 11:06 గంటల నుంచి మ 1:31 గంటల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతుంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం ఇక్కడి ఆచారం. మరుసటి రోజు, అంటే మార్చి 28న స్వామివారి మహా పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా సాగనుంది. Also Read అయోధ్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం, ఏంటి 'శ్రీరామ యంత్రం’? భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తుల కోసం ఆర్టీసీ (TGSRTC) ద్వారా తలంబ్రాలను నేరుగా ఇంటికే పంపించే ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించారు. భద్రాద్రి రాముడి కల్యాణ తలంబ్రాలను శుభకార్యాల్లో ఉపయోగించుకోవడం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. Powered By Recommended For You శ్రీరామ నవమి రోజు ఈ దానాలు చేయండి.. కానీ ఈ తప్పులు చేసి పాపాలు మూటకట్టుకోవద్దు! ధర్మ స్థాపనకు మార్గదర్శి రాముడి జీవితం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ జీవన విధానం. పితృవాక్య పరిపాలన, ఏకపత్నీ వ్రతం, ప్రజా రంజక పాలన వంటి ఆదర్శాలతో 'రామరాజ్యం' ఎలా ఉండాలో ఆయన చేసి చూపించారు. నేటి సమాజంలో నైతిక విలువలు కాపాడుకోవడానికి రాముడి అడుగుజాడల్లో నడవడం ఎంతో అవసరమని ఆధ్యాత్మిక వేత్తలు ప్రబోధిస్తున్నారు.