Saturday, 14 March 2026

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం

 

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం



 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అద్యక్షులు గా మిరుదొడ్డి శ్యామ్ సుందర్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి*


*మీలా వంశి ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో మద్దతు పలికిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు*


సూర్యాపేట పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అద్యక్షులుగా పోటి చేస్తున్న మిరుదొడ్డి శ్యామ్ సుందర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ అమరావది లక్ష్మి నారాయణ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని మిరుదొడ్డి శ్యామ్ సుందర్ పోరాటం చేసి ఎన్నికలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూమిరుదొడ్డి శ్యాంసుందర్ కు అత్యదికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సుందర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయడంతో పాటు, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. శ్రీశైలం ఆర్య సత్రం చైర్మన్ గా వ్యవహరించారని, అనేక సేవా కార్యక్రమాలు చేశారని వారు తెలిపారు. ఆర్యవైశ్యులలో రాజకీయ చైతన్యం కావాలి అని, మార్పు కోరుకునే వారందరూ కూడా శ్యామ్ సుందర్ కు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా మహదేవ్, కక్కిరేణి చంద్రశేఖర్, బ్రాహ్మండ్లపల్లి మురళిధర్, బొమ్మిడి లక్ష్మి నారాయణ, సింగిరికొండ రవీందర్, గొండ్రాల అశోక్, కర్నాటి రవి లు పాల్గొన్నారు. సూర్యాపేట ఆర్యవైశ్య నాయకులు కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, వెంపటి శబరినాథ్, చల్లా లక్ష్మయ్య, యామా సంతోష్, మంచాల శ్రీనివాస్, బెలిదె శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, మిర్యాల వెంకటేశ్వర్లు, వా సా లక్ష్మి నారాయణ,


Friday, 13 March 2026

 మార్చి మొదటి పక్షం

Thursday, 12 March 2026

ఆర్యవైశ్యుల శక్తి అపారం


 ఆర్యవైశ్యుల శక్తి అపారం

* జయాపజయాలను ప్రభావితం చేయగలరు

* వాసవీ పారాయణం ప్రపంచ రికార్డు సృష్టించాలి

హైదరాబాద్:  ఆర్యవైశ్యుల శక్తి అపారం..వారు తలచుకుంటే రాజకీయాలను , జయాపజయాలను ప్రభావితం చేయగలరని  మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలన్నారు.ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఆర్యవైశ్యులు వాసవి మాత పారాయణం చేయ తలపెట్టడం హర్షణీయమని  అన్నారు. ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా నలభై వేల మందితో... భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా వాసవీమాత పారాయణం చేయాలన్నారు. ఆ రికార్డు కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు 

శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం పేరిట ఈనెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సామూహిక పారాయణానికి సంబంధించి  గురువారం బంజారా హిల్స్ పార్క్ హోటల్ కర్టెన్ రెయిజర్ కార్యక్రమం జరిగింది.‌ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.‌ ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత సంకల్పాన్ని కొనియాడారు. . శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆకాంక్షించారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత మాట్లాడుతూ 

 21,000 మందితో సామూహిక పారాయణానికి వైశ్యులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.  అందుకు తగిన ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ పారాయణం ప్రపంచ రికార్డు కాబోతోందని అన్నారు. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాల వాసవీ మాత స్తుతి గీతాన్ని  ఈ కార్యక్రమంలో ఆలపించారు. వాసవమ్మ జాతరకు తరలి రావాలంటూ ప్రముఖ జర్నలిస్ట్ , మఖన్లాల్ చతుర్వేది జర్నలిజం యూనివర్సిటీ బోర్డు మెంబర్ రావి కంటి శ్రీనివాస్ రచించి, దృశ్య రూపంలో చిత్రీకరించిన గీతాన్ని ఈ సందర్భంగా 

ప్రదర్శించారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కొణిజేటి సుబ్బారావు , ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చీకోటి ప్రవీణ్ , కాచం సత్యనారాయణ, మలిపెద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు. .

Wednesday, 11 March 2026

జర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం! సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, మార్చి11 ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ అన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు. గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్. ໖: 11-3-2026 విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి. సమస్యలు: 1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి. 2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి. 4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కృతజ్ఞతలతో పి రాంచందర్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బి.బసవపున్నయ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి

 జర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం!

సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుజర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం!
సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం
టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మార్చి11
ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ అన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం
బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు.
గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు
తెలంగాణ రాష్ట్రం,
హైదరాబాద్.
໖: 11-3-2026
విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి
మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి.
సమస్యలు:
1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి.
2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి.
4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
కృతజ్ఞతలతో
పి రాంచందర్
యాక్టింగ్ ప్రెసిడెంట్
బి.బసవపున్నయ్య
రాష్ట్ర ప్రధానకార్యదర్శి

కుంటాం
టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మార్చి11
ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ అన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం
బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు.
గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు
తెలంగాణ రాష్ట్రం,
హైదరాబాద్.
໖: 11-3-2026
విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి
మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి.
సమస్యలు:
1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి.
2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి.
4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
కృతజ్ఞతలతో
పి రాంచందర్
యాక్టింగ్ ప్రెసిడెంట్
బి.బసవపున్నయ్య
రాష్ట్ర ప్రధానకార్యదర్శి

హైదరాబాద్ TO ఊటీ.. తక్కువ ధరకే IRCTC సమ్మర్ ప్యాకేజీ

 హైదరాబాద్ TO ఊటీ.. తక్కువ ధరకే IRCTC సమ్మర్ ప్యాకేజీ 

          వేసవి వచ్చేసింది. మార్చి మొదటి వారం నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే సమ్మర్ ఎటైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) సంస్థ. అతి తక్కువ ధరకే ఈ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. దీంతో ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఊటీ అందాలను అది కూడా సమ్మర్ లో తక్కువ ధరలో ఆస్వాధించే అవకాశం ఉంది. మరి ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. దేశంలో చాలా హిల్ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ కూడా కొండలు, లోయల మధ్య ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లోనే ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిల్ స్టేషన్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఊటీ. వేసవిలో ఈ ప్రాంతానికి ఎక్కువగా వెళ్తుంటారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు టూరిస్టులు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో వేసవిలోనే కాదు శీతాకాలంలో కూడా పర్యాటకులు ఊటీకి క్యూ కడుతున్నారు. అయితే ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ టూర్ పేరు 'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్' గా ఉంది. ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టూర్​ మార్చి 17, 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంది. మీకు కావాలనుకున్న తేదీల్లో ఈ టూర్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ ప్యాకేజీలో భాగంగా పర్యటకులు ఊటీ, కున్నూర్, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, దోడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం ప్రాంతాలను సందర్శించే వీలుంది. 

 "ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం" టూర్ లో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఉంటుంది. రాత్రంతా ప్రయాణించాలి. అలా రెండో రోజు ఉదయం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్ లో బస చేసిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. తర్వాతి రోజు దోడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతం చూస్తారు.  నాలుగోరోజు కూనూర్ సంద‌ర్శ‌న‌కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి. ఇక ఐదో రోజు కోయంబత్తూర్‌ రైల్వేస్టేషన్​ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు శబరి ఎక్స్‌ప్రెస్​ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ చేయాలి. అలా ఆరో రోజు మధ్యాహ్నానికి సికింద్రాబాద్‌ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది. మరిన్ని కనుగొనండి తెలుగు వార్తల సేవ గిజ్‌బాట్ సేవలు ట్రెండింగ్ వీడియో సేవలు మనీ సేవలు ఆటోమొబైల్స్ రివ్యూలు  "నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..!" ఇక టికెట్ ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలంటే రూ.30,060 పే చేయాలి. అలాగే ట్విన్ షేరింగ్‌ అయితే రూ.17,130, ట్రిపుల్ షేరింగ్‌ కు రూ.16,120 ఉంటుంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టికెట్ ధర రూ.8,840 గా ఉంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

Tuesday, 10 March 2026

పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?


 పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?


వంట గ్యాస్ సరఫరా.. ధరలు వినియోగదారుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పరిమితుల పైన ఆంక్షలు విధించారు. అటు కమర్షియల్ గ్యాస్ సరఫరా సమస్యతో హోటళ్లు మూత బడుతున్నాయి. కేంద్రం ఈ పరిస్థితుల పై అధ్యయనం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పెరిగిన వంట గ్యాస్ ధరల పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. సరఫరా, బుకింగ్ లో పరిమితులు వినియోగ దారులకు సమస్యగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒకే సారి ఏకంగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చేలా.. ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. దీంతో పాటుగా సిలిండర్ బుకింగ్ కోసం పరిమితులు.. గడువు విధించింది. దీంతో.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కాగా, దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.


Also Read

ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!

ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!

central-key-discussions-over-the-lpg-rates-reports-indicate-a-further-increase-in-prices-here-the

అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పెరిగిన ధరల పై పునరాలోచన

ఈ పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పశ్చిమాసియా పరిస్థితులతో పాటుగా వంట గ్యాస్ సరఫరా.. పెరిగిన ధరల పైన సమీక్ష చేయనుంది. ఈ వారంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతిపక్షాలు వంట గ్యాస్ ధరల పెంపు పైన రాజకీయం గా టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలను ఎంత మేర తగ్గిస్తే.. ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందీ... పశ్చిమాసియాలో ఎప్పటి లోగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశాల పైన చర్చించనున్నారు. ఎన్నికల వేళ వంట గ్యాస్ ధరల పైన పునరాలోచన చేయకుంటే నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. గ్లోబల్ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ వినియోగంపై నియంత్రణ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజు కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారు.

Monday, 2 March 2026

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

 


 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌


హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు.

ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు.

ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర్పించవచ్చు. ముఖ్యంగా ఐవిఎఫ్, వామ్ లలో సభ్యులుగా చేరిన వారిని ఓటర్ల లిస్ట్ నుండి తొలిగించినట్లు వార్తలు వచ్చాయి. వారు అడ్వకేటి కమీషనర్ కు అభ్యంతరాలు సమర్పించి తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మండల అధ్యక్షుల ప్రమేయం లేకుండా హోటల్స్ లో కూర్చొని ఓటర్ల లిస్ట్ తయారు చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఓటర్ల లిస్ట్ పై అభ్యంతరాలు ఉన్న వారందరూ అభ్యంతరాలు సమర్పించవచ్చు.