Friday, 29 May 2026

*ఉప్పల స్వప్న గారికి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్*

 *ఉప్పల స్వప్న గారికి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్*

“కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” కార్యక్ర




మం సినీ, సాంస్కృతిక వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ అవార్డు వేడుక అమీర్ పేట AAA సినిమాస్‌లో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా సమాజ సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న IVF ప్రధమ మహిళ శ్రీమతి ఉప్పల స్వప్న గారికి ప్రతిష్టాత్మకమైన “కళావేదిక ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”ను ప్రదానం చేశారు.
వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారత, సేవా కార్యక్రమాల్లో ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.
కార్యక్రమంలో సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఉప్పల స్వప్న గారిని అభినందించారు.
సమాజానికి సేవ చేయాలనే తపనతో నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తున్న ఆమె సేవలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని వక్తలు కొనియాడారు.
ఈ సందర్భగా ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ నేను చేసిన సేవలకు గుర్తింపుగా నన్ను గుర్తించి NTR Film Award నీ నాకు ప్రదానం చేయడం సంతోషకరం అని ఆమె అన్నారు.
ఈ అవార్డ్ తో బాధ్యత మరింత పెరిగింది అని ఆమె అన్నారు.
TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ ఈ వేడుకలో కళావేదిక నిర్వాహకులు మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు, సామాజిక సేవా రంగానికి విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి అవార్డ్ అందజేయడం నిజంగా అభినందనీయం అని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళా వేదిక వారికి అభినందనలు తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆయన సూచించారు.
ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మరింత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి హాజరైన అతిథులు ఉప్పల స్వప్న గారికి శాలువాతో సన్మానం చేసి, జ్ఞాపికను అందజేశారు. సభలో పాల్గొన్నవారు ఆమె భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, నందమూరి తారక రామారావు గారి మనవరాలు శ్రీమతి నందమూరి మోహన రూప గారు,
శ్రీమతి సీమంతిని గారు,
ఎన్టీఆర్ గారి కుమారుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ గారు, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్ గారు,
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు చెందిన ప్రసన్న గారు,
నటి లయ గారు,భువన రాయవరపు గారు పాల్గొనడం జరిగింది.
S

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home