జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ ఏవో 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
80 వేలు తీసుకుంటే ఏసీబీకి చిక్కిన కొడిమ్యాల అటవీశాఖ ఏవో గులాం మొయినుద్దీన్... అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్న ఏసిబి అధికారులు....
జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ ఏవో 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
కొడిమ్యాలలో 120 టేకు చెట్లను కొట్టి రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వడానికి ఎఫ్ఆర్వో గులాం మొయినుద్దీన్ రెండు లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో ఇదివరకు లక్షా తీసుకున్నారు. మరో 80 వేలు ఈరోజు కొడిమ్యాల రేంజ్ కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. AO కూర్చున్న టేబుల్ డ్రాయర్ నుండి రూ. 80 వేలు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా, AO తన అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందడం కోసం తన అధికార విధులను అనుచితంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించారని ఏఓను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేసి, కరీంనగర్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసిబి డిఎస్పీ తెలిపారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home