గతంలో ఎన్నడూ లేనివిధంగారాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
గతంలో ఎ
న్నడూ లేనివిధంగా, తెలంగాణ మీడియా అకాడమీ మరియు రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన, సమాచార శాఖ కమిషనర్ జి. ముకుందరెడ్డి గారి సమక్షంలో, మసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో 7సార్లు కమిటీ సమావేశమై, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వేలాది మంది జర్నలిస్టులకు కార్డులను మంజూరీ చేసింది. ఒక్కొక్క దరఖాస్తును స్క్రీన్ లో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పారదర్శకంగా కార్డులు మంజూరీ చేయడం విశేషం. నిన్న ఉదయం 10.30గం.ల నుండి సాయంత్రం 6.30గం.ల వరకు (దాదాపు 8గం.ల పాటు) ఏకధాటిగా జరిగిన 7వ సమావేశంలో దాదాపు 700దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. జూన్ మొదటి వారంలో జరిగే మరో ఒకటి రెండు సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాల్లో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ప్రతి సమావేశంలో సమీక్షా నిర్వహిస్తుంది. జిల్లాల్లో జర్నలిస్టులకు ఎదురవుతున్న ఆయా సమస్యలపై కమిటీ చర్చిస్తూ తగు చర్యలు చేపడుతుంది.
ఏది ఏమైనా అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరీ కావడం శుభపరిణామంగా భావిస్తున్నాను.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home