Monday, 28 April 2025

*వైశ్య భవనానికి భూమి పూజ లో పాల్గొన్న ఉప్పల*

 *వైశ్య భవనానికి భూమి పూజ లో పాల్గొన్న ఉప్పల*








కాశీ లోని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బనారస్ ఆనంద నిలయం వైశ్య భవనానికి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు. వారి సతీమణి IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు ,వారి కుమారుడు ఉప్పల సాయి తేజ గారు, కోడలు శార్వారీ గారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాశీ పుణ్య క్షేత్రం లో ఇలాంటి నిలయం ఏర్పాటు కావడం అభినందనీయం అని ఆయన అన్నారు.
ఆర్య వైశ్యులకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశ్వేశ్వర్ రావు గారు, కోశాధికారి వుడుత పురుషోత్తం గారు , పబ్బా చంద్రశేఖర్ గుప్త గారు, కచాం కృష్ణమూర్తి గారు వరంగల్ జిల్లా IVF అధ్యక్షుడు మధు గారు , పాత నరేందర్ గారు, ఆర్య వైశ్య ప్రముఖులు ,IVF నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home