Saturday, 30 November 2024

కోలాటం జడ కొప్పులాట ముగింపు కార్యక్రమం* *పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,

 *కోలాటం జడ కొప్పులాట ముగింపు కార్యక్రమం*


*పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,



పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి*

*************************************************"నల్గొండ పట్టణంలోని 33 వ వార్డులో శ్రీ ఆంజనేయ మహిళా కోలాట బృందం (శ్రీ నగర్ కాలనీ సాయి ఫంక్షన్ హాల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కోలాట బృందం ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది.  

మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,సతీమణి చైతన్య, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల్ల మోహన్ రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,33 వ వార్డు ఇన్చార్జి లింగస్వామి గౌడ్ , గుండెబోయిన వెంకన్న యాదవ్, కోలాట బృందం జ్యోతి రెడ్డి,సరిత,పుష్పలత ,సరళ , కోలాట బృందం మాస్టర్ రమేష్ , కాలనీ వాసులు కృపాకర్ రెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి, వెంకట్ సంతోష్,ఎలక వెంకట్ రెడ్డి,శ్రీనివాస్,రవిచంద్ర, వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Thursday, 28 November 2024

మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

 


మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైద్రాబాద్, (గూఢచారి): మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే అని TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.

అందరికీ విద్యను అందించేలా కృషిచేసిన మహానీయుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా LB Nagar చౌరస్తా లో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే. సామాజిక ఉద్యమాల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం, మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే. విద్యావ్యాప్తి ద్వారా కుల వివక్షతను, సాంఘిక దురాచారాలను, మూడనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేశారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురయిన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గరపు దయానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి ప్రభాకర్, SC cell చైర్మెన్ జోగి గారు, మహేందర్, బిక్షపతి, సైదులు, మహేష్, శివ కుమార్, సాయి, ప్రభాకర్, భాస్కర్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Wednesday, 27 November 2024

ఏం జరుగుతోంది?: తెలంగాణ బీజేపీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు




 ఏం జరుగుతోంది?: తెలంగాణ బీజేపీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు 

 న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పథకాలను సమగ్ర అమలు చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. "మోడీ! ది బ్రాండ్: ప్రధానిపై చంద్రబాబు ప్రశంసల వర్షం" ఎంపీలు, ఎమ్మెల్యేల యోగక్షేమాలను ప్రధాని అడిగినట్లు సమాచారం. కలిసి మెలిసి పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. 2028లో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే సమన్వయంతో కష్టపడి పని చేయాలని చెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం సమావేశం ఫొటోలతో ప్రధాని మోడీ ఎక్స్‌లో ఇంగ్లీష్ తోపాటు తెలుగులోనూ పోస్టు చేశారు. 'తెలంగాణ బీజేపీకి చెందిన శాసనసభ్యులు, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా పెరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు. బీఆర్‌ఎస్ దుష్టపాలన గురించి పూర్తిగా భయంకరమైన జ్ఞాపకాలను కలిగి ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ గట్టి స్వరం వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Thursday, 21 November 2024

అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్

 

ACB raids | అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్

 

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు.                              హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో కలిసిన గ్రామాలకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన పలు పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tuesday, 19 November 2024

RTO New Rules : సొంత కారు ఉన్న వారికీ RTO కొత్త నియమాలు అమలు చేసింది


 ఉన్న వారికీ RTO కొత్త నియమాలు అమ

:రహదారి భద్రతను మెరుగుపరచడానికి మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానాన్ని అరికట్టడానికి, Regional Transport Offices (RTO) ప్రమాదాలకు దారితీసే ప్రవర్తనలు మరియు అభ్యాసాలను లక్ష్యంగా చేసుకుని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాయి. ఈ మార్పులు, ఇటీవలి కోర్టు ఆదేశాల ( court orders ) ద్వారా నడపబడతాయి, భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించడం మరియు ఉల్లంఘనలకు జరిమానా విధించడం. కొత్త నియమాలు మరియు వాటి చిక్కుల యొక్క వివరణాత్మక అవలోకనం ఇక్కడ ఉంది:

RTO New Rules ప్రకారం కీలక మార్పులు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్ నిషేధం

  • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు  వాహనం లోపల నుండి వీడియోలను రికార్డ్ చేయడం లేదా బ్లాగింగ్ చేయడం ఇప్పుడు ఖచ్చితంగా నిషేధించబడింది.
  • అటువంటి కార్యకలాపాలలో పాల్గొనడం దీనికి దారితీయవచ్చు:
    భారీ జరిమానాలు
    లైసెన్స్ రద్దు
  • కేరళ హైకోర్టు ఆదేశించిన విధంగా చట్టపరమైన చర్యలు .

వాహన సవరణలపై నిబంధనలు

వాహనం యొక్క ఒరిజినల్ స్పెసిఫికేషన్‌లను మార్చే కొనుగోలు తర్వాత సవరణలు మోటారు వాహనాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయి .
వీటిలో ఇవి ఉన్నాయి:
శబ్ద కాలుష్యానికి దోహదపడే సైలెన్సర్‌ల ( silencers ) అధిక వినియోగం.
తయారీదారు స్పెసిఫికేషన్ల నుండి వైదొలిగే నిర్మాణ లేదా సౌందర్య మార్పులు.

రాష్ట్రాల అంతటా పటిష్టమైన అమలు

కేరళ ఇప్పటికే ఈ చర్యలను అమలు చేయడం ప్రారంభించింది మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలు దీనిని అనుసరించాలని భావిస్తున్నారు.
ఉల్లంఘనల కోసం వాహనాలను నిశితంగా పరిశీలించాలని చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు సూచించబడింది.

పాటించకపోవడం వల్ల కలిగే పరిణామాలు

వాహనాల స్వాధీనం : అనధికారిక మార్పులు చేసిన లేదా వీడియో రికార్డింగ్ ( video Recording ) కార్యకలాపాలలో పాల్గొన్న వాహనాలను సీజ్ చేయవచ్చు.
భారీ జరిమానాలు : సవరించిన సైలెన్సర్‌ల వల్ల శబ్ద కాలుష్యం లేదా వీడియోలను రికార్డ్ చేయడం వంటి అసురక్షిత పద్ధతులు వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించబడతాయి.



చట్టపరమైన పరిణామాలు : నేరస్థులు వారి డ్రైవింగ్ అధికారాలను ( Driving privileges ) సస్పెండ్ చేయడంతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవచ్చు.

కొత్త నిబంధనల వెనుక కారణాలు

పరధ్యానంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెరుగుతున్న ప్రమాదాలు

డ్రైవర్లు రోడ్డుపై దృష్టి పెట్టకుండా వీడియోలను రికార్డ్ చేయడం లేదా బ్లాగింగ్ చేయడంపై దృష్టి సారించడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ అభ్యాసం డ్రైవర్‌కే కాకుండా ప్రయాణీకులు మరియు ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదం కలిగిస్తుంది.

శబ్ద కాలుష్యం ఆందోళనలు

సవరించిన సైలెన్సర్‌లు ( Modified silencers ) మరియు ఇలాంటి మార్పులు శబ్ద కాలుష్య స్థాయిలను గణనీయంగా పెంచుతాయి, పర్యావరణ హాని మరియు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

వాహన భద్రతా ప్రమాణాలను సంరక్షించడం

అనధికార సవరణలు వాహనాల భద్రత మరియు నిర్మాణ సమగ్రతను దెబ్బతీస్తాయి, ప్రమాదాలు మరియు తయారీదారు ప్రమాణాల ఉల్లంఘనలకు దారితీస్తాయి.

కోర్టు ప్రమేయం మరియు కఠినమైన అమలు

ఈ మార్పులను తప్పనిసరి చేయడంలో కేరళ హైకోర్టు ( Kerala High Court ) కీలక పాత్ర పోషించింది. ప్రధాన ఆర్డర్‌లలో ఇవి ఉన్నాయి:

  • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్ లేదా బ్లాగింగ్ ( Recording or Blogging ) కార్యకలాపాలను నిషేధించడం.
  • మోటారు వాహనాల చట్టం ప్రకారం ( Motor Vehicles Act ) మార్కెట్ అనంతర వాహన సవరణలను నిషేధించడం.
  • నిబంధనలు పాటించేలా చూడాలని, ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని కూడా కోర్టు రవాణా అధికారులను ఆదేశించింది.

కొత్త నిబంధనలకు అనుగుణంగా ఎలా ఉండాలి

పరధ్యానాన్ని నివారించండి :

పూర్తిగా డ్రైవింగ్‌పై దృష్టి పెట్టండి మరియు వీడియోలను రికార్డ్ చేయడానికి, బ్లాగింగ్ చేయడానికి లేదా ఏదైనా ఇతర కార్యకలాపాలకు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకుండా ఉండండి.
వాహన స్పెసిఫికేషన్‌లకు కట్టుబడి ఉండండి :

తయారీదారు సిఫార్సులకు మించి మీ వాహనం డిజైన్, సైలెన్సర్ లేదా ఇతర ఫీచర్‌లను మార్చవద్దు.

రాష్ట్ర నోటిఫికేషన్‌లను అనుసరించండి :

పెనాల్టీలను నివారించడానికి స్థానిక రవాణా శాఖ మార్గదర్శకాలపై అప్‌డేట్‌గా ఉండండి. ఈ నియమాలు ఎందుకు ప్రయోజనకరంగా ఉన్నాయి

మెరుగైన రహదారి భద్రత : వీడియో రికార్డింగ్ వంటి పరధ్యానాలను తొలగించడం ద్వారా, డ్రైవర్లు రోడ్డుపై దృష్టి పెట్టవచ్చు, ప్రమాదాలను తగ్గించవచ్చు.
పర్యావరణ పరిరక్షణ : సవరించిన సైలెన్సర్‌ల నుండి వచ్చే శబ్ద కాలుష్యం అరికట్టబడింది, ప్రశాంతమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుంది.
ప్రామాణికమైన వాహన వినియోగం : అసలు వాహన స్పెసిఫికేషన్‌లను నిర్వహించడం భద్రత మరియు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది.

తీర్మానం

RTO New Rules డ్రైవర్లందరికీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు చట్టపరమైన మార్గదర్శకాలను అనుసరించడానికి రిమైండర్‌గా పనిచేస్తాయి. రాష్ట్రాల అంతటా కఠినమైన అమలు మరియు ఉల్లంఘనలకు గణనీయమైన జరిమానాలతో, వాహన యజమానులు ఈ మార్పులకు అనుగుణంగా ఉండటం చాలా అవసరం.

సురక్షితమైన డ్రైవింగ్ అనుభవం కోసం, పరధ్యానాన్ని నివారించండి, వాహన ప్రమాణాలను గౌరవించండి మరియు మీ రాష్ట్రంలోని నిబంధనల గురించి తెలియజేయండి. ఈ చర్యలు వ్యక్తిగత డ్రైవర్లను రక్షించడమే కాకుండా సురక్షితమైన రోడ్లు మరియు కమ్యూనిటీలకు కూడా దోహదం చేస్తాయ


             
RTO New Rules : సొంత  కారు ఉన్న వారికీ RTO కొత్త నియమాలు అమలు చేస

రేపటి నుండి అయ్యప్ప స్వాములకు అన్నప్రసాధ బిక్ష కార్యక్రమం ప్రారంభం:ఉపేందర్ మొగుళ్లపల్లి:

 రేపటి నుండి అయ్యప్ప స్వాములకు అన్నప్రసాధ బిక్ష కార్యక్రమం ప్రారంభం 

గమనిక.. స్థలం మార్చ బడింది..

మొగుళ్లపల్లి యూవ సేన.. శ్రీ దాస ఆంజనేయ స్వామి దేవాలయం నాగేశ్వర్ రావు నగర్ కాలనీ రోడ్ నంబర్ 6 రామలింగేశ్వర కాలనీ ఖమన్ దగ్గర   21.11.2024 నుండి 31.12.2024 వరకు మండల కాలం 41రోజులు గత 15 సం ల నుండి అయ్యప్ప స్వామి అనుగ్రహం తో నా ప్రాణ సామానులు దాతల సహకారంతో నిర్వహిస్తున్నము.. స్వామియే శరనం అయ్యప్ప.. ఉపేందర్ మొగుళ్లపల్లి .


స్వర్గీయ శ్రీ మతి ఇందిరాగాంధి గారి జయంతి సంధర్భంగా ఘనంగా నివాళలు అర్పించారు.

 స్వర్గీయ శ్రీ మతి ఇందిరాగాంధి గారి జయంతి సంధర్భంగా  ఘనంగా నివాళలు అర్పించారు. 


తిరునగరు భార్గవ్ మున్సిపల్ చైర్మెన్, మాజీ చైర్మన్ రోశయ్య, కౌన్సిలర్లు దుర్గసత్యం ఖాదర్ భాయ్ సలీమ్ భాయ్,గోవింద్ రెడ్డి దుర్గారావు అశోక్ అంజయ్య నాగరాజు వంశీ వెంకన్న పాల్గొన్నారు

బ్రాహ్మణ వెళ్లేముల ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.



         బ్రాహ్మణ వెళ్లేముల ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.





      మంగళవారం ఆమె నార్కెట్ పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లేముల వద్ద ఉన్న బ్రాహ్మణ వెల్లేముల ఎత్తిపోతల పథకం సిస్టర్న్,కుడి, ఎడమ డిస్ట్రిబ్యూటరీ కాలువలను పరిశీలించారు .

     త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల  రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్న దృష్ట్యా ఇంజనీరింగ్, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ఆమె ఎత్తిపోతల పథకం పరిసరాలను పరిశీలించారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా హెలిపాడ్ పరిసరాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. దీంతోపాటు పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనంలో ఎకో టూరిజం ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టు మధ్యలో ఉన్న దీవి పై ఏర్పాటు చేయనున్న ధ్యాన కేంద్రానికి రోప్ వే ఏర్పాటు పై  చర్చలు జరిపారు.


      నీటిపారుదల శాఖ ఎస్ ఈ అజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో అశోక్ రెడ్డి, సంబంధిత  శాఖల అధికారులు,తదితరులు ఉన్నారు.

_____________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

తెలంగాణా సచివాలయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ గా ఎన్నికైన పాత లింగమూర్తి

 *తెలంగాణా సచివాలయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ గా ఎన్నికైన పాత లింగమూర్తి


గుప్త (అసిస్టెంట్ సెక్రటరీ) గారు*


*తెలంగాణా సచివాలయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్నికకు జరిగిన హోరా హో్రీ పోరులో మన లింగమూర్తి గుప్త, (అసిస్టెంట్ సెక్రటరీ) గారు ఘన విజయం సాధించారు.*


*టివిగోవా, ఏపివిగోవా, డివిగోవా, టీ వీ ఏం డి, టి వి ఈ పి ఏ మరియు  వైశ్య డాక్టర్స్ తరపున పాత లింగమూర్తి గుప్త (అసిస్టెంట్ సెక్రటరీ) గారికి హృదయపూర్వక అభినందనలు*



అయోధ్యలో తెలుగు భోజనం 🔹 శ్రీ వాసవీ ఆర్యవైశ్య సత్రం ప్రారంభం

 అయోధ్యలో తెలుగు భోజనం 

🔹 శ్రీ వాసవీ ఆర్యవైశ్య సత్రం ప్రారంభం



🔹 వసతి, భోజన ఏర్పాట్లకు సిద్ధం 

🔹 ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె 


 హైదరాబాద్ : భూలోక మోక్షపురమైన అయోధ్యలో తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం శ్రీ అయోధ్య వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ప్రారంభమైంది. కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని,  ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె పూజలు నిర్వహించి, సత్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేష్ గుప్త, జాయింట్ సెక్రటరీ పల్ల నాగరాజు గుప్త, ట్రస్టీ కొండూరి శ్రీనివాస్ గుప్త తదితరులతో కలిసి అయోధ్య బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, అయోధ్య తో పాటు కాశీ , ప్రయాగ్ రాజ్,            నైమిశారణ్యం పరిసర క్షేత్రాల యాత్రలకు వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల యాత్రికులకు సేవలందించాలన్న లక్ష్యంతో సత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. యాత్రలో భాగంగా సందర్శించాల్సిన స్థలాల గైడెన్స్ , వసతి సౌకర్యాలతో పాటు చక్కటి తెలుగింటి భోజనాన్ని, తెలుగు రాష్ట్రాల యాత్రికులకు అందించనున్నట్లు హరినాథ్ గుప్త వివరించారు. పూర్తి సేవా భావంతో అందించే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన తెలుగు రాష్ట్రాల యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. తమ సేవలు పొందడం కోసం 9848787611 ఫోన్ నెంబర్ లో సంప్రదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Monday, 18 November 2024

బండారు సుబ్బారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా Arya Vysya mahasabha అడ్వైజర్ కౌటికె విటల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

బండారు సుబ్బారావు గారి జన్మదిన సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ అడ్వైజర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.                                     :ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగము ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చీఫ్ అడ్వైజర్ సిల్వెల్ కార్పొరేషన్ సిఎండి శ్రీ బండారు సుబ్బారావు జన్మదినోత్సవ సందర్భంగా వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అడ్వైజర్ శ్రీ కౌటిక విటల్  ఆధ్వర్యంలో ముషీరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో 1000 మందికి ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నాయకురాలు శ్రీమతి కల్వ సుజాత  ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆమె మాట్లాడుతూ సుబ్బారావు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నదాన మహాదానమని ఈ కార్తీక మాసంలో అన్నదానం చేయడం సుబ్బారావు జీవితం ధన్యమైందని ఆయన ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వైశ్య జాతిలో పుట్టడం అదృష్టం సౌభాగ్యం అని అన్నదానం అనేది రెండు పదాలతో రూపొందించబడింది అన్నమంటే ఆహారం దానం అంటే ఇవ్వడం దానం చేయడం మహాదానం అని కూడా అంటారు ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి కొన్ని ప్రాథమిక అంశాలు జీవన మాన్యతను ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆహారం లేకపోతే జీవితమే లేదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అన్నం లేదా ఆహారం లేకపోతే ఏ ప్రాణి జీవించలేదని  ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ నాయకుడు ఇంటర్నేషనల్ వైశ్య
























ఫెడరేషన్ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు వాసవి ఆర్ట్ థియేటర్ అధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్ పాల్గొన్నారు అవోపా ప్రధాన కార్యదర్శి శ్రీ రవి గుప్తా మాతా వాకర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీ అల్లాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది

Sunday, 17 November 2024

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవము

               ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్


ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవము
                                        ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వనభోజన మహోత్సవమునకు హాజరైన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రచార కమిటీ కో కన్వీనర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ కార్తీక వనభోజనాలతో ఐకమత్యం పెరుగుతుందని దూరమైన బాల్య స్నేహాలు చేజారిన జీవన మాధుర్యాలు మర్చిపోతున్న ఆత్మీయతలు అరుదైపోతున్న కలయికలు పచ్చని చెట్ల నీడలో చేరి ఆప్యాయతలను కలబోసుకోవడానికి ఈ కార్తీక వనభోజనాలు దోహదపడతాయని అదేవిధంగా వైశ్యులలో పేదవారిని ఆదుకోవడంలో వెనుకంజ వేయనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ అడ్వైజరీ బోర్డ్ కమిటీ చైర్మన్ శ్రీ గంజి రాజమౌళి గుప్తా గారు పాల్గొని ప్రసంగిస్తూ కార్తీక భోజనాలకు కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఉందని పురుషుల కంటే మహిళలు చాలా మంది రావడం నాకు చాలా ఆనందంగా ఉందని వైశ్యులలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఐ వి ఎఫ్ ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ పబ్బ చంద్రశేఖర్ గుప్తా పప్పా స్వప్న గారు ఆధ్వర్యంలో కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరిగింది అక్కన్న మాదన్నలచే నిర్మితమైన రాంపల్లి వద్ద గల యమునాంపేట ఘట్కేసర్ రింగ్ రోడ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు విశిష్ట అతిథులుగా హాజరైన శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మాట్లాడారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహిళ ఉప్పల స్వప్న పప్పా స్వప్న తెలంగాణ మహిళా విభాగవారు ఉదయం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఉసిరి చెట్టు పూజ నిర్వహించి ఆటపాటలు తాంబూలా నిర్వహించి అంగరంగ వైభవంగా ఉసిరి చెట్టు ప్రాంగణంలో విందు ఆరగించి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ ఆటపాటలతో సరదాగా గడపడం జరిగింది వివిధ ఆటపాటలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఐవిఎఫ్ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ కటకం శ్రీనివాస్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కట్టా రవికుమార్ కాచం కృష్ణమూర్తి ఐవిఎఫ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్ అత్తిలి కిషన్ ఎన్సీ సంతోష్ తోట బిక్షపతి చింతల రజినీకాంత్ సబ్బు పాండయ్య విద్యల నవీన్ కుమార్ షర్మిరాళ్ల ఉపేందర్ మధు రవికుమార్ బెల్దే నర్సింహారావు గుండ శ్రీనివాస్ వెంకటేశ్వర బాబు తిరువీధి ప్రభాకర్ నాగుల నారాయణ పోకల అనిల్ గుండా నవీన్ సుంకు లక్ష్మీనారాయణ ఇరుకుల్ల రమేష్ అశోక్ రతమై మహిళ ఉప్పల స్వప్న పబ్బ స్వప్న మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి లెంకలపల్లి మంజుల నలిని మణిమాల ప్రొద్దుటూరు శాంతి గీతా గుప్తా ఉమారాణి తదితరులు మరియు మహిళా మణులు దాదాపు 1000 మంది పాల్గొన్నారు

: ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి


 : ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి

 : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో నెం.41 ద్వారా రెండేళ్ల పాటు ఈవీ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. ఈవీ వాహనాలకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి  

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి

తెలంగాణలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) పాలసీ తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ నవంబర్ 18, 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ పాలసీ ప్రకారం ఈవీల్లో టూ వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వాహనాలకు వందశాతం పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. వీటితో పాటు ఈవీల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు ఇస్తున్నామని ప్రకటించారు. జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ అమల్లోకి తెస్తున్నామన్నారు.



హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ...దిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. బైక్ లు , ఆటో , ట్రాన్స్ పోర్ట్ , బస్సులకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నామన్నారు. అలాగే జంట నగరాల్లో ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.


పనుల టెండర్ కోసం రూ.10 లక్షల లంచం, సీబీఐకి చిక్కిన వాల్తేరు డీఆర్ఎమ్ సౌరభ్ ప్రసాద్

 


పనుల టెండర్ కోసం రూ.10 లక్షల లంచం, సీబీఐకి చిక్కిన వాల్తేరు డీఆర్ఎమ్ సౌరభ్ ప్రసాద్

 : విశాఖలోని వాల్తేరు డీఆర్ఎమ్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఓ టెండర్ విషయంలో డీఆర్ఎమ్ రూ.10 లక్షల లంచం తీసుకోగా...సీబీఐకి పట్టుకుంది. ఈ కేసులో ముంబయి, విశాఖలోని డీఆర్ఎమ్ ఇళ్లలో సీబీఐ అధికారుల సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

పనుల టెండర్ కోసం రూ.10 లక్షల లంచం, సీబీఐకి చిక్కిన వాల్తేరు డీఆర్ఎమ్ సౌరభ్ ప్రసాద్

పనుల టెండర్ కోసం రూ.10 లక్షల లంచం, సీబీఐకి చిక్కిన వాల్తేరు డీఆర్ఎమ్ సౌరభ్ ప్రసాద్

విశాఖ వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎమ్) సౌరభ్ ప్రసాద్ సీబీఐకి చిక్కారు. ఓ టెండర్ విషయంలో రూ.10 లంచం తీసుకోగా...సమాచారం అందుకున్న సీబీఐ మాటు వేసి డీఆర్ఎమ్ ను శనివారం అరెస్టు చేసింది. వాల్తేరు డివిజన్ లో మెకానికల్‌ బ్రాంచ్‌ పనుల టెండర్‌ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి డీఆర్ఎమ్ రూ. 25 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. దీంతో లంచం ఇచ్చేందుకు డీఆర్ఎమ్ ను కాంట్రాక్టర్‌ ముంబయికి రావాలని కోరాడు. దీంతో శనివారం ముంబాయి వెళ్లిన డీఆర్‌ఎమ్ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుని... ముంబయిలోని తన ఇంటికి వెళ్లగా... అప్పటికే సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నగదుతో సహా డీఆర్ఎమ్ ను పట్టుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో ముంబయి, విశాఖలోని డీఆర్‌ఎమ్ ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సీబీఐ అధికారులు డీఆర్‌ఎమ్ సౌరభ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం.. వైజాగ్‌లోని డీఆర్‌ఎమ్ కార్యాలయంలో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

ఇటీవలె గుంతకల్ డీఆర్ఎమ్ అరెస్ట్

ఈ ఏడాది జులైలో ఇదే విధమైన కేసులో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ వినీత్ సింగ్‌తో సహా ఐదుగురు రైల్వే సీనియర్ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. గుంతకల్ రైల్వే డివిజన్‌లో ఆర్థిక, పాలనాపరమైన అవకతవకల నేపథ్యంలో సీబీఐ వారిని అరెస్టు చేసింది. కొంతమంది నిందితుల ఇళ్లలో సీబీఐ బృందాలు సోదాలు చేయగా... పెద్ద మొత్తంలో నగదు లభించింది. వినీత్ సింగ్ నివాసంలో సుమారు రూ.7 లక్షలు, మరో ముగ్గురు వ్యక్తుల ఇళ్లలో రూ.11 లక్షల నగదు సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ దుకాణాలు

  రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ      దుకాణాలు

జిల్లాలోని పలు రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మా రుతున్నాయి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బి య్యం పక్కదారి పడుతోంది. గతంలో కొందరు రేషన్‌ బి య్యం దళారులకు విక్రయించి నగదు తీసుకోగా... ప్రస్తు తం పంథా మారింది.               - కిలో బియ్యానికి రూ. 10 నుంచి రూ. 15 అందజేత


- పక్కదారి పడుతున్న పీడీఎస్‌ బియ్యం


- ప్రతీనెల కోటా డ్రా కోసం బయో మెట్రిక్‌

               :జిల్లాలోని పలు రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మా రుతున్నాయి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బి య్యం పక్కదారి పడుతోంది. గతంలో కొందరు రేషన్‌ బి య్యం దళారులకు విక్రయించి నగదు తీసుకోగా... ప్రస్తు తం పంథా మారింది. రేషన్‌ దుకాణాల వద్దనే బియ్యం దందా బాహాటంగా సాగుతోంది. కొన్ని చోట్ల రేషన్‌ డీలర్లే దళారుల అవతారమెత్తి బియ్యం పంపిణీని నగదు బదిలీ పథకం మారుస్తున్నారు. బియ్యం కోటాకు బదులుగా కిలో బియ్యం డిమాండ్‌ బట్టి రూ. 10 నుంచి రూ. 15 వ రకు లెక్కగట్టి మరీ కార్డు దారులకు నగదు ఇస్తున్నారు. ఉచిత కరోనా కాలం నుంచి ఆహార భద్రత కార్డు దారుల కు ఉచిత బియ్యం పంపిణీ పథకం కొనసాగుతోంది. ఈ బియ్యం తినలేని పలు కుటుంబాలు కేవలం తమ రేషన్‌ కార్డు కాపాడుకునేందుకు నెలవారీగా బియ్యం కోటా తీ సుకొని దళారులకు విక్రయిస్తున్నారు. తాజాగా రేషన్‌ డీ లర్లే ఆ బియ్యం కొనుగోలుకు తెరలేపు తుండడం చర్చనీయాంశంగా మారింది.


జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రత కార్డులు ఇలా..


జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 592 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతీ నెల పేదలకు ఉచిత బియ్యం, రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతోంది. జిల్లాలో మొత్తం 3,07,852 రేషన్‌ కార్డులుండగా ఇందులో 2,93,354 ఆ హార భద్రతా కార్డులు, 14,352 అంత్యోదయ కార్డులు, 146 అన్నపూర్ణ కార్డులున్నాయి. ప్రతీనెల సుమారు 9,197 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సుమారు 8,87,297 మందికి పౌరసరాఫరా శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు.


బయో మెట్రిక్‌ ద్వారా..


రేషన్‌ కార్డు దారులు నేరుగా వెళ్లి బయో మెట్రిక్‌ ద్వారా వేలి ముద్ర వేసి నగదు తీసుకోవడం పలు ప్రాం తాల్లో పరిపాటిగా మారింది. దీంతో బియ్యం రేషన్‌ దు కాణాల నుంచే నేరుగా బ్లాక్‌ మార్కెట్‌కు చేరుతోంది. బి య్యం పక్కదారి పట్టకుండా సంస్కరణల్లో భాగంగా ప్ర భుత్వం ఈ పాస్‌ అమలు చేస్తోంది. లబ్ధిదారుల బయో మెట్రిక్‌, ఐరిస్‌, ఓటీపీ తప్ననిసరిగా మారింది. దీంతో డీలర్లు లబ్ధిదారుల ఆమోదంతో ఈ పాస్‌పై కార్డు దారు ల బయో మెట్రక్‌ తీసుకొని నగదు చెల్లిస్తున్నారు. ఫలి తంగా బియ్యం పక్కదారి పట్టిస్తున్న వ్యాపారుల ఆగడా లకు అడ్డుకట్ట పడడం లేదు.


అవసరం లేకపోయినా కార్డులు..


జిల్లాలో పలు రకాల రేషన్‌ కార్డుల కోసం ప్రభుత్వం ఉచిత బియ్యం సరఫరా చేస్తోంది. జిల్లాలో ఉన్న రేషన్‌ కార్డులలో సుమారు పాతిక శాతం అనర్హత కలిగిన కు టుంబాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేషన్‌ కార్డు బహుళ ప్రయోజకారి కావడంతో నిరుపేద లతో పాటు ఆదాయ వర్గాలు కూడా కార్డులు పొందుతు న్నారు. వారికి రేషన్‌ బియ్యం అవసరం లేకపోయినా కా ర్డు రద్దు కాకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు బి య్యం కోటా తీసుకుంటున్నారు. ఇంటి అవసరాల కోసం కొంత బియ్యం తీసుకొని మిగితా బియ్యం విక్రయిస్తున్నారు.


రేషన్‌ దుకాణాల్లో పేదలకు బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం కిలోకు రూ. 32.94 వ్యయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కిలో బియ్యం రూ. 31 పలుకుతుండగా రవా ణా, నిర్వహణ కలిపి అదనంగా రూ. 1.94 వ్యయం అవు తోందంటున్నారు. లబ్ధిదారులు మాత్రం తమ కోటా బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఉచిత బియ్యం పక్కదారి వ్యవహారంలో దళారులు లాభాలను ఆర్జిస్తున్నారు.


పట్టుబడుతున్నా.. ఆగని వ్యాపారం..


జిల్లాలోని పలు చోట్ల ఒక వైపు రేషన్‌ బియ్యం తరలింపు పట్టుబడుతున్న ప్ప టికీ, మరో వైపు అక్రమ వ్యాపారం ఆగడం లేదు. గ్రామాల్లోని కొందరు కిరాణ దు కాణ దారులు, రేషన్‌ వ్యాపారులు నియమించిన కమిషన్‌ ఏజెంట్లు వినియోగదా రుల నుంచి రూ. 10 నుంచి రూ. 15లకు కిలో బియ్యం చొప్పున కొనుగోలు చేస్తు న్నారు. కిలోల చొప్పున కొనుగోలు చేసి క్వింటాళ్లలో జమ చేస్తున్నారు. బియ్యం వ్యాపారుల నుంచి రూ. 2 నుంచి రూ. 5 వరకు కమీసన్‌ తీసుకొని బియ్యం అప్ప గిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారులు టన్నుల కొద్ది బియ్యం ఇతర ప్రాం తాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు మిల్లర్లకు రూ. 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం ప్రతీ రోజు జిల్లా నుంచి ఇతర ప్రాంతా లకు రూ. కోటి విలువ చేసే బియ్యం తరలి వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, టాస్క్‌పోర్స్‌ పోలీసుల వరస దాడుల్లో రేషన్‌ బి య్యం అక్రమ రవాణా ఆయా సందర్బాల్లో వెలుగు చూస్తోంది. కానీ అధికారులు మామూలుగానే వ్యవహిరిస్తున్నారన్న ఆరోపణలు

చోటు చే సుకుంటున్నాయి.

Saturday, 16 November 2024

జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?



జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?


డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల..?


జనవరి 7న నోటిఫికేషన్..?


మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..?


 పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు..


తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం..?


 జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..?


ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్


మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్..ఉప సర్పంచ్ ఎన్నిక.


👉 అర్హులు వీరే..


✦ సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.


✦ జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.


✦ ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత. 


✦ ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత


రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.


✦ పోటీకి కనీస వయసు 21 ఏళ్లు


✦ పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.


✦ వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి.


✦ రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అర్హులు.


✦ స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.


✦ దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు.


✦ ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు.


✦ ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు. ఇది గవర్నమెంట్ జీవో

4 వ శ్రీ అనఘాష్టమి వ్రతము (దత్త వ్రతం)

 జై వాసవి జై జై వాసవి -----

*సకలశుభములకు

ప్రదాయకమైన 

4 వ శ్రీ అనఘాష్టమి వ్రతము (దత్త వ్రతం)  మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి సాక్షాత్ శ్రీ దత్త పరమాత్మ స్వరూపులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పరమాత్మ స్వరూపులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీల వారి 

ఆజ్ఞ ఆశీస్సులతో అందరికీ సకల శుభములు కలగాలని  

హైదరాబాదులో శ్రీ వేణుగోపాల శర్మ గారిచే నిర్వహించబడుతుంది

ఈ పూజలో పాల్గొన దలచినవారు దంపతులు లేదా స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, యువతి, యువకులు, అందరూ పాల్గొని 

శ్రీ అనఘాదత్త శ్రీ స్వామీజీ శ్రీ బాల స్వామీజీల కృపను పొందగలరు

300 rs ticket

పూజ కు యంత్రం, కంకణం , ప్రసాదం ఇవ్వబడుతుంది*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కార్యక్రమం తేదీ :- 23-11-2024  రోజున

⏰ఉదయం 10:00 గంటలకు

అనంతరం తీర్థ ప్రసాదం, 

అన్న ప్రసాద సమర్పణ

కార్యక్రమము నిర్వహించు స్థలం:-   దిల్సుఖ్నగర్

నిర్వహించువారు 

*:L Manjula Raju

*Saraf Tulasi Gupta 

*ఆధ్వర్యంలో &

శ్రీగణపతిసచ్చిదానంద  స్వామీజీ వారి భక్త బృందం


 అనఘాష్టమి దత్త వ్రతం పైన కూర్చున్న భక్తులకు

సూచన :- 

*Saree colour yellow*🟡 

1) వీలు ఉన్నవారు జంటగా కూర్చునే ప్రయత్నం చేయండి లేనిచో ఒకరైనను కూర్చోవచ్చు

2) మీరు వచ్చేటప్పుడు కలశం కట్టుకోవడానికి ప్లేటు, ఉద్దరిని, కలశం చెంబు మరియు మంగళహారతి తెచ్చుకోగలరు 

3) పూజకు కావలసిన సామాగ్రి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, పేపర్ ఆర్ యంత్రం కింద వేసుకోవడానికి అట్టఏదైనా ఒక పండు తెచ్చుకోగలరు

ఈ సూచన  గమనించగలరు అని ప్రార్థన 🙏

https://chat.whatsapp.com/FxDDXQRcVIjBIJwx5elxo1

AVCI వారి ఆద్వర్యం లొ ఈ వ్రతం ఆచరించ బడుతుంది ...

పల్గొన దలచే వాళ్ళు ఈ పైన పెట్టిన లింక్ గ్రూపు లొ జాయిన్ అవ్వండి.🙏🙏🙏


KSR Murthy 

And Team

బ్యాంకు లింకేజీ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్



 కొత్త ఎస్.హెచ్.జి గ్రూపుల ఏర్పాటు ఫై దృష్టి సారించాలి


అర్హత గల ప్రతి మహిళకు ఎస్.హెచ్.జి లో సభ్యత్వం ఉండాలి


బ్యాంకు లింకేజీ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్


హైదరాబాద్, నవంబర్ 16:   కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వం లేని అర్హులైన మహిళలను గుర్తించి కొత్త ఎస్.హెచ్.జి గ్రూపులను ఏర్పాటు చేయాలని తెలిపారు.


శనివారం ఎం ఏ యు డి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన జిహెచ్ఎంసి, మెప్మా అధికారులతో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ టార్గెట్, లక్ష్యసాధన, కొత్త గ్రూపుల ఏర్పాటు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కార్యకలాపాల అభివృద్ధి తదితరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త మహిళా సంఘాల ఏర్పాటుతో పాటు పాత సంఘాలను పటిష్ట పరిచేందుకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు.  మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేరడానికి ప్రోత్సహించాలని, ఇప్పటికీ సభ్యులుగా లేని మహిళలను గుర్తించాలని తెలిపారు. డిసి లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించి కొత్త ఎస్.హెచ్.జి లను ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించడంలో మహిళల భాగస్వామ్యం కీలకమని, స్వయం సహాయక సంఘాల ఏర్పాటు తో మహిళా ఆర్థిక స్వాలంబనకు, మహిళల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. 


టి.ఎం.సి లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆర్.పి లు, జిహెచ్ఎంసి పి.డి లు, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్లకు ఓరియంటేషన్ నిర్వహించాలన్నారు. డిసెంబర్, 2024 మాసాంతానికి కొత్త ఎస్.హెచ్.జి లను ఏర్పాటు చేసి కొత్త సభ్యుల నమోదు పూర్తి చేయాలన్నారు. కొత్త ఎస్.హెచ్.జి లను ఏరియా లెవల్ ఫెడరేషన్లు, టౌన్ ఫెడరేషన్లకు అటాచ్ చేయాలని సూచించారు. 


స్వయం సహాయక సంఘాలకు నిర్దేశిత లక్ష్యాల మేరకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కోరారు. లక్ష్య సాధనకు నెల వారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, జీహెచ్ఎంసీ బ్యాంకు లింకేజీ ద్వారా నెలకు కనీసం 200 కోట్ల రూపాయల రుణాలు అందించాలన్నారు. మెచ్యూరిటీ ఎస్ హెచ్ జి గ్రూపులలో బిజినెస్ ఓరియంటేషన్ తీసుకురావాలని, మహిళలను వ్యాపారాల వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు. బ్యాంకర్స్ తో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అభివృద్ధికి స్థానిక ఎన్.జి.ఓ లను, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లను గుర్తించాలన్నారు. డి.సి, పి.డి ల స్థాయిలో ఎన్.జి.ఓ ల మ్యాపింగ్ జరగాలని తెలిపారు. 


జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, సి.ఎస్.ఓ లు, ఎన్.జి.ఓ లు, బ్యాంకర్లు, ఏ.సి.ఎల్.బి లు, పి.డి లకు వర్క్ షాప్ నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీలలో ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే కార్నివాల్ కోసం కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేయాలని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్.హెచ్.జి లకు, ఇప్పటికే ఉన్న టౌన్ లెవెల్, ఏరియా లెవల్ ఫెడరేషన్ లకు శిక్షణలు నిర్వహించాలని, అదేవిధంగా సొంత శిక్షణ కేంద్రాలు, మాడ్యూల్స్ కలిగి ఉన్న బ్యాంకులను సంప్రదించి శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ కు శిక్షణ ఇచ్చే విభాగాల అధికారులలో 20 మంది శిక్షకులను గుర్తించాలని తెలిపారు. టి.ఎల్.ఎఫ్, ఏ.ఎల్.ఎఫ్ ల సమావేశాలకు డి.సి లు, మున్సిపల్ కమిషనర్లు రెగ్యులర్ గా హాజరు కావాలని సూచించారు. ఎస్.హెచ్.జి లకు బ్యాంకు లింకేజీలు, నిధుల పంపిణీ, ఎస్.హెచ్.జి లకు శిక్షణలను ఎం.ఏ.యు.డి డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక పర్యవేక్షిస్తారని తెలిపారు. జీహెచ్ఎంసీలోని యు.సి.డి విభాగాన్ని పటిష్టం చేసేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సూచించారు. 


ఈ కార్యక్రమంలో సి.డి.ఎం.ఏ డైరెక్టర్ శ్రీదేవి, ఎంఏయుడి డిప్యూటీ సెక్రెటరీ ప్రియాంక, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ (యు సి డి) చంద్రకాంత్ రెడ్డి, జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మెప్మా స్టేట్ మిషన్ కో-ఆర్డినేటర్స్  పద్మ, .జీహెచ్ఎంసి ప్రాజెక్ట్ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు

---------------------------------------------------------------

- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఇప్పటి వరకు మొత్తం 8,41,256కుటుంబాల సర్వే పూర్తి హైదరాబాద్, నవంబర్ 16: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సర్వే ఈ నెల 6వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నవంబర్ 6 నుంచి 8 వరకు ఎన్యుమరేటర్లు వారి బ్లాకుల్లోని ఇళ్లను సందర్శించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. నవంబర్ 9వ తేదీ నుండి వారు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు కుల సంబంధిత వివరాలను ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే సజావుగా సాగేందుకు, మూడు సర్కిళ్లకు ఒక్కొక్క నోడల్ అధికారి నియమితులయ్యారు. వారీ తో పాటుగా జోనల్ కమిషనర్లు మానిటరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కోడింగ్ ప్రక్రియ నమోదుకు అవసరమైన సూచనలు అక్కడిక్కడే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం .149073 కుటుంబాలు సర్వే పూర్తి కాగా, ఇప్పటి వరకు మొత్తం .841256.. కుటుంబాల వివరాలు సర్వే చేయబడ్డాయి.


సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఇప్పటి వరకు మొత్తం 8,41,256కుటుంబాల సర్వే పూర్తి



హైదరాబాద్, నవంబర్ 16:   సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సర్వే ఈ నెల 6వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నవంబర్ 6 నుంచి 8 వరకు ఎన్యుమరేటర్లు వారి బ్లాకుల్లోని ఇళ్లను సందర్శించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. నవంబర్ 9వ తేదీ నుండి వారు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు కుల సంబంధిత వివరాలను ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు.



సర్వే సజావుగా సాగేందుకు, మూడు సర్కిళ్లకు ఒక్కొక్క నోడల్ అధికారి నియమితులయ్యారు. వారీ  తో పాటుగా జోనల్ కమిషనర్లు మానిటరింగ్ అధికారులు  క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కోడింగ్ ప్రక్రియ నమోదుకు అవసరమైన సూచనలు అక్కడిక్కడే

 అందిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో శనివారం .149073 కుటుంబాలు సర్వే పూర్తి కాగా, ఇప్పటి వరకు మొత్తం .841256.. కుటుంబాల వివరాలు సర్వే చేయబడ్డాయి.




హైదరాబాద్, నవంబర్ 16:   సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సర్వే ఈ నెల 6వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నవంబర్ 6 నుంచి 8 వరకు ఎన్యుమరేటర్లు వారి బ్లాకుల్లోని ఇళ్లను సందర్శించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. నవంబర్ 9వ తేదీ నుండి వారు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు కుల సంబంధిత వివరాలను ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు.



సర్వే సజావుగా సాగేందుకు, మూడు సర్కిళ్లకు ఒక్కొక్క నోడల్ అధికారి నియమితులయ్యారు. వారీ  తో పాటుగా జోనల్ కమిషనర్లు మానిటరింగ్ అధికారులు  క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కోడింగ్ ప్రక్రియ నమోదుకు అవసరమైన సూచనలు అక్కడిక్కడే

 అందిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో శనివారం .149073 కుటుంబాలు సర్వే పూర్తి కాగా, ఇప్పటి వరకు మొత్తం .841256.. కుటుంబాల వివరాలు సర్వే చేయబడ్డాయి.