Tuesday, 24 March 2026

శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు?

 శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు? 

      భారతీయ సంస్కృతిలో ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడి జన్మదినం 'శ్రీరామనవమి'. లోకోద్ధరణ కోసం అయోధ్యలో దశరథ నందనుడిగా రాముడు అవతరించిన ఈ పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగే ఈ వేడుకలు, ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచే ప్రారంభమైన వసంత నవరాత్రులు నవమి నాటికి పరాకాష్టకు చేరుకుంటాయి. ఈ ఏడాది 2026, మార్చి 27వ తేదీన (శుక్రవారం) భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 26న నవమి తిథి ప్రవేశించినప్పటికీ, సూర్యోదయ తిథి మరియు వైష్ణవ సంప్రదాయం ప్రకారం 27నే ప్రధాన వేడుకలు జరగనున్నాయి. మరిన్ని కనుగొనండి మనీ మేనేజ్‌మెంట్ సలహా విద్య & ఉద్యోగ కోర్సులు క్రికెట్ స్కోర్లు క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు ఆటోమొబైల్స్ రివ్యూ అభిజిత్ లగ్నంలో కల్యాణం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో ఉదయం 11:06 గంటల నుంచి మ 1:31 గంటల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతుంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం ఇక్కడి ఆచారం. మరుసటి రోజు, అంటే మార్చి 28న స్వామివారి మహా పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా సాగనుంది. Also Read అయోధ్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం, ఏంటి 'శ్రీరామ యంత్రం’? భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తుల కోసం ఆర్టీసీ (TGSRTC) ద్వారా తలంబ్రాలను నేరుగా ఇంటికే పంపించే ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించారు. భద్రాద్రి రాముడి కల్యాణ తలంబ్రాలను శుభకార్యాల్లో ఉపయోగించుకోవడం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. Powered By Recommended For You శ్రీరామ నవమి రోజు ఈ దానాలు చేయండి.. కానీ ఈ తప్పులు చేసి పాపాలు మూటకట్టుకోవద్దు! ధర్మ స్థాపనకు మార్గదర్శి రాముడి జీవితం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ జీవన విధానం. పితృవాక్య పరిపాలన, ఏకపత్నీ వ్రతం, ప్రజా రంజక పాలన వంటి ఆదర్శాలతో 'రామరాజ్యం' ఎలా ఉండాలో ఆయన చేసి చూపించారు. నేటి సమాజంలో నైతిక విలువలు కాపాడుకోవడానికి రాముడి అడుగుజాడల్లో నడవడం ఎంతో అవసరమని ఆధ్యాత్మిక వేత్తలు ప్రబోధిస్తున్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home