Saturday, 7 February 2026

ఏసీబీ వలకు చిక్కిన సచివాలయం అధికారి

 ఏసీబీ వలకు చిక్కిన సచివాలయం అధికారి

- రూ.16 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
​విశాఖపట్నం (గాజువాక): ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. గాజువాక 74వ వార్డు నెహ్రూ నగర్ సచివాలయం అడ్మిన్ గణేష్ రూ.16,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
​ఘటన వివరాలు:
బాధితుడు పల్లా సత్తిబాబు తన ఇంటి పన్ను, కుళాయి పన్నును తన భార్య పేరు మీదకు మార్చాలని కోరగా, అడ్మిన్ గణేష్ ఏకంగా రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు.
​ఇప్పటికే రూ.9,000 వసూలు చేసిన గణేష్..
​మిగిలిన రూ.16,000 ఇస్తేనే పని చేస్తానని తెగేసి చెప్పాడు.
​దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేడు సత్తిబాబు నుండి ఆ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి గణేష్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
"మీ ప్రాంతంలో కూడా ఇలాంటి అవినీతి ఎదురైందా?

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home