రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ దాడులు
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ దాడులు
కలెక్టర్ కార్యాలయంతో పాటు, మై హోమ్ భూజలోని తన నివాసంలో సోదాలు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్న అధికారులు, పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తింపACB దాడులు
రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ & భూ రికార్డుల కార్యాలయములో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులు పైన #అక్రమఆస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
#అనిశా అధికారులు అతనికి మరియు అతని బంధువులకు సంబంధించిన 6 స్థలాలలో సోదాలు నిర్వహించి హైదరాబాద్ లోని రాయదుర్గం - మై హోమ్ భుజాలో ఒక ఫ్లాట్, మహబూబ్ నగర్ లో 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో ఒక రైస్ మిల్లుతో పాటుగా 3 ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురములో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి,
కర్ణాటకలో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి, 2 చతు:చక్ర వాహనాలు మరియు 1.6 కిలోల బంగారు & 770 గ్రాముల వెండి ఆభరణాల వంటి స్థిర,చరాస్తులతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు కలిగి ఉన్నట్లు గుర్తించినారు. కేసు దర్యాప్తులో ఉన్నది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home