మానవ హక్కుల దినోత్సవాన్నిపురస్కరించుకొని ఉచిత ఆరోగ్య శిబిరం
*
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా (IHRCI) ఆధ్వర్యంలో ఇండియన్ బ్యాంక్ లేన్, రామ్నగర్లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారి దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, హిందూ ధర్మ రక్ష ఫౌండర్ డా. చికోటి ప్రవీణ్ , ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యే ముటా గోపాల్ లు పాల్గొని ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో ఉద్బోధించడం , మానవ హక్కుల పరిరక్షణలో సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరాన్ని వివరించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేశారు.*


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home