నగరవాసులకు అలర్ట్.. వేల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలన్ని అక్కడ ఫ్రీగా చేస్తారు
నగరవాసులకు అలర్ట్.. వేల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలన్ని అక్కడ ఫ్రీగా చేస్తారు
నేటి కాలంలో వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించి.. వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ నగరంలోని పలు కేంద్రాల్లో దాదాపు 40 వరకు టెస్టులన్ని ఉచితంగా చేస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బులు ఖర్చు చేసి జేబుకు చిల్లు పెట్టుకుంటారు. మరి ఇంతకు ఈ ఉచిత టెస్టులు ఎక్కడ చేస్తారంటే..
ఇక్కడ మెడికల్ టెస్టులన్ని ఉచితం
నేటి కాలంలో మనుషులు భయపడేది రోగాలు, వాటికి అయ్యే వైద్య ఖర్చుల గురించే. ఎంత చిన్న అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లినా సరే.. రకరకాల టెస్టులు రాసి.. వేల రూపాయలు లాగుతాయి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగా పట్టించుకోరు అనే అపోహలో ఉండి పోతారు. అయితే చాలా మంది ప్రభుత్వ.. అందునా నగరంలో ఉండే గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఉండే అనేక సౌలభ్యాలు గురించి తెలిసి ఉండదు. వీటిల్లో ముఖ్యమైంది మెడికల్ టెస్టులు. బయట వేలు, వందల రూపాయలు ఖర్చు చేసి చేయించుకునే చాలా వరకు పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తారు. అయితే జనాలకు ఇది తెలియక బయట ల్యాబ్స్, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి భారీగా ఖర్చు చేస్తుంటారు. దాదాపు 40 రకాల పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తారు. ఆ వివరాలు..
చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు, పరీక్షలు వంటి వాటికి ప్రైవేటు, పెద్దపెద్ద డయోగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీటన్నింటిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చేస్తారు. మీకు సమీపంలో ఉన్న ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు వెళ్లి.. ఒకసారి అక్కడ వైద్యులను కలిస్తే చాలు. మీకు వైద్యులు సూచించిన పలురకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇక్కడ ఫ్రీగా చేస్తారు. ఇక్కడ దాపు 40 రకాలపైనే పరీక్షల్ని ఫ్రీగా చేస్తున్నారు.
ఈ కేంద్రాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకు శాంపిళ్లు కలెక్ట్ చేసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత వాటిని నారాయణగూడలోని ప్రభుత్వ డయోగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తారు. ఆ తర్వాత శాంపిళ్ల మీద పేర్కొన్న టెస్టులను చేస్తారు. రిపోర్టుల్ని మీ ఫోన్ నంబరుకు పంపిస్తారు. అయితే కొన్ని టెస్టుల ఫలితాలు రావాలంటే.. 16-24 గంటల సమయం పడితే.. యూరిన్ ఇతర టెస్టుల ఫలితాలకు 2 రోజుల వరకు సమయం తీసుకుంటారు. అలానే ఇక్కడ డాక్టర్ల కన్సెల్టెంట్ సేవలు, మందులూ కూడా ఉచితంగానే ఇస్తారు. వీటితో పాటుగా ఇన్పేషంట్లకు ఫ్రీగా సెలైన్ పెడతారు. వీరికి రోజువారీ వైద్యుల పర్యవేక్షణ ఉచితం. నగరంలోని పలు బస్తీ దవాఖా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నడిపిస్తోంది.
ఉచితంగా చేసే పరీక్షలు ఇవే
బీపీ, డయబెటిక్, సీబీపీ, రియాక్టివ్ ప్రొటీన్ (పీఆర్పీ), డెంగీ, చికెన్గున్యా, మలేరియా, కంప్లీట్ యూరిన్ కల్చర్ టెస్ట్, లిఫిడ్ ప్రొఫైల్(కొలెస్ట్రాల్), లివర్ ఫంక్షన్ టెస్టు (ఎల్ఎఫ్టీ), టైఫాయిడ్, థైరాయిడ్ ప్రొఫైల్, రీనల్ ఫంక్షన్ టెస్టు (ఆర్ఎఫ్టీ) వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఇక్కడ చెప్పిన టెస్టులు ప్రైవేటులో చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాస్త ఓపిక చేసకుని ముందుగా వెళ్తే.. బస్తీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టెస్టులు చేయించుకోవచ్చు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home