ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు
ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి
పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు
నల్గొండ:
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య అన్నారు.
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని NG కళాశాల ఎదురుగా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషిచేసి భారత దేశ ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించారని అన్నారు.
అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శంకర్, మామిడి కార్తీక్, పెరిక వినాయక రాజ్, పెరిక అంజయ్య, పెరిక చిట్టి తదితరులు పాల్గొన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home