Thursday, 18 June 2026

బాలికల ఆశ్రమ పాఠశాలకు ఘన విరాళం ‘ఆర్ ఎస్ బ్రదర్స్’ నుంచి రూ.4 కోట్ల డిపాజిట్

 బాలికల ఆశ్రమ పాఠశాలకు ఘన విరాళం

‘ఆర్ ఎస్ బ్రదర్స్’ నుంచి రూ.4 కోట్ల డిపాజిట్



శంఖారావం :

బాలికల విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తలకొండపల్లి ఆశ్రమ పాఠశాలకు భారీ ఆర్థిక చేయూత లభించింది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో చాపుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్ ఎస్ బ్రదర్స్, సాత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం రూ.4 కోట్ల డిపాజిట్‌ను ప్రకటించింది.

ఈ సందర్భంగా సంస్థ ఎండీ రాజమౌళి మాట్లాడుతూ, బాలికల విద్యకు సహకరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి తొలి విడతగా రూ.కోటి చెక్కును చాపుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్‌కు అందజేశారు.

ఈ విరాళంతో ఆశ్రమ పాఠశాల మరింత బలోపేతం కావడంతో పాటు, పేద బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు కలగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ సేవా కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home