Thursday, 2 April 2026

రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!

 రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!


హైకోర్టు కీలక ఆదేశాలు:


Karnataka High Court సంచలన నిర్ణయం.

ప్రాసిక్యూషన్‌కు వెంటనే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం.

అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ తప్పనిసరి.


2021లో Mysore జిల్లాలో ‘ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల’ కొనుగోలు.

మార్కెట్ ధర ₹13 ఉండగా… ₹52కు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు.

ప్రభుత్వానికి సుమారు ₹7.5 కోట్ల నష్టం.


కోర్టు వ్యాఖ్యలు హాట్ టాపిక్:

“శాఖా విచారణలో క్లీన్ చిట్ వచ్చినా… క్రిమినల్ విచారణ ఆగదు”.

అవినీతి కేసుల్లో నిజాలు వెలికితీయాలంటే పూర్తి దర్యాప్తు అవసరం.

చట్టం కింద చర్యలు:

 Prevention of Corruption Act సెక్షన్ 17A కింద విచారణకు గ్రీన్ సిగ్నల్.

ప్రభుత్వానికి కోర్టు గట్టిగా మందలింపు.

అధికారికంగా దర్యాప్తు ప్రారంభం కానుంది.

రోహిణి సింధూరి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

Wednesday, 1 April 2026

తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..!

 తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..! 


తమిళనాడులో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ప్రాంతాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవుగా తమిళనాడు ఉంది. తమిళనాడులో ప్రాచీనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. అరుణాచలం, రామేశ్వరం, మధురై, తంజావూరు, చిదంబరం లాంటి ప్రధాన క్షేత్రాలను చుట్టేసి రావొచ్చు. భక్తుల కోసం తక్కువ ధరకే ఇండియన్​ రైల్వేస్​ క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి ఈ టూర్ ను ఆస్వాదించవచ్చు. Battle for States 2026 Live Updates | Key Contests తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఓ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, చిదంబరం, మధురై, తంజావూర్ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. టూర్ లో భాగంగా రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణుగుంట మీదుగా వెళ్తుంది. ఈ స్టేషన్లలో ఎక్కడైనా ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. ఇక ప్రస్తుతం ఈ టూర్​ మే 24వ తేదీన అందుబాటులో ఉంది. ఐఆర్సీటీసీ టూర్ లో భాగంగా తొలిరోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్టు రైలు బయల్దేరుతుంది. ఆ రాత్రి ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం 9 గంటలకు అరుణాచలానికి చేరుకుంటారు. అరుణాచలం ఆలయం దర్శనం చేసుకుంటారు. రాత్రికి రామేశ్వరం బయల్దేరుతారు. రామేశ్వరం దర్శనం అనంతరం మధురైకు వెళ్తారు. మధురై దర్శనం తర్వాత అక్కడినుంచి కన్యాకుమారికి స్టార్ట్ అవుతారు. కన్యాకుమారిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస ఉంటుంది. Also Read "పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.." మరిన్ని కనుగొనండి ట్రావెల్ ప్యాకేజీలు తెలుగు పుస్తకాలు విద్య కోర్సులు బిజినెస్ న్యూస్ జిల్లా వార్తలు అంతర్జాతీయ వార్తలు సినిమా రివ్యూస్ ఇక ఏడోరోజు తిరుచిరాపల్లి నుంచి చిదంబరానికి బయల్దేరుతారు. చిదంబరంలో నటరాజస్వామి దర్శనం అనంతరం అక్కడే సికింద్రాబాద్ కు రైలు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరుసటిరోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.