సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని కోదాడ శాసనసభ్యురాలు శ్రీ
సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని కోదాడ శాసనసభ్యురాలు శ్రీ
నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అన్నారు. సమాచార హక్కు వికాస సమితి సూర్యపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అండదండగా ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులు పొందేలా , ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమద కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్యుల చేతిలో బ్రహ్మాస్త్రం మని ,
ఈ చట్టంపై ప్రజలందరూ అవగాహన పొందాలని దాని విషయంలో ప్రతి ఒక్కరు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చేకూరి శివ, రాష్ట్ర సహాయ కార్యదర్శి వున్నం సత్యనారాయణ , జిల్లా గౌరవాధ్యక్షులు గుంటకండ్ల ముకుంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు పగిడిపల్లి యేసు పాదం, జిల్లా ఉపాధ్యక్షులు ముసుకుల గోవిందరెడ్డి, షేక్ అహ్మదు, కాసర్ల సురేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కిన్నెర ఉపేందర్రావు, జిల్లా కోశాధికారి పాతకోట్ల రామారావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, సహాయ కార్యదర్శి SK రషిదు, నోముల బుచ్చయ్య, శ్రీను నెమ్మది పున్నయ్య, అఖిలు,చిన్నారి, రవి కృష్ణ,రవి, వర్మ పాల్గొన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home