acb రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ–1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి కందాడి మధుసూదన్ రెడ్డిపై #అక్రమాస్తుల (డీఏ) కేసు నమోదు చేసిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు.
రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ–1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి కందాడి మధుసూదన్ రెడ్డిపై #అక్రమాస్తుల (డీఏ) కేసు నమోదు చేసిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు.
ఈ రోజు #అనిశా అధికారులు వారియొక్క నివాస గృహముతో పాటుగా వారి బంధువులు, స్నేహితులు మరియు ఇతర అనుచరులకు సంబంధించిన మరో ఏడు స్థలాల్లో సోదాలు నిర్వహించి ఈ క్రింది స్థిర, చరాస్తులను గుర్తించినారు.
ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఒక మూడంతస్తుల భవనం; ఇబ్రహీంపట్నం మండలంలో ఒక బహిరంగ ప్లాటు మరియు ఒక ఎకరం వాణిజ్య భూమి; పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి మరియు ఈత కొలను కలిగి ఉన్న ఒక ఫామ్హౌస్; 1.2 కిలోల బంగారు ఆభరణాలు; నాలుగు చక్రాల వాహనాలు – 3 (ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్వ్యాగన్); నగదు – ₹9,00,000/-. గుర్తించబడిన ఆస్తుల మొత్తం (దస్తావేజు విలువ ప్రకారం) విలువ రూ.7,83,35,302/-.
అదేవిధంగా, వీరికి ‘ఏఆర్కే స్పిరిట్స్’ పేరుతో మద్యం వ్యాపారంలో సుమారు ₹80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు, అలాగే తన భార్య మరియు పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు.
అదనపు ఆస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసు దర్యాప్తు లో ఉంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home