Friday, 5 September 2025

శ్రీ వేలూరు లింగయ్య గుప్తా గారి నూట ఒకటవ జయంతి వేడుకలు

శ్రీ వేలూరు లింగయ్య గుప్తా గారి నూట ఒకటవ జయంతి వేడుకలు



 * ఖైరతాబాద్ లోని వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో, తేదీ: 5 -9 -2025, శుక్రవారం,  స్వర్గీయ పూర్వ అధ్యక్షుడు కీర్తిశేషులు శ్రీ వేలూరు లింగయ్య గుప్తా గారి నూట ఒకటవ జయంతి వేడుకలు ఈరోజు ఉదయం ఖైరతాబాద్ లోని వాసవి సేవా కేంద్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం పూర్వాధ్యక్షుడు, ప్రస్తుత సలహాదారు శ్రీ కాసనగొట్టు రాజశేఖర్ గుప్తా గారు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు (అడ్మినిస్ట్రేటర్) వాసవి సేవా కేంద్రం లైబ్రరీ కమిటీ చైర్మన్ డాక్టర్ నీలా శ్రీధర్ గారు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర గుప్తా గారు మాట్లాడుతూ, ఆయన చాలా అందమైన వ్యక్తిని, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని, అనుకున్నది ఏదైనా ఎంత కష్టమైనా సాధించేవరకు విశ్రమించని  వ్యక్తిని, సంఘంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తిని, భవిష్య సంఘటనలను ఊహించే సామర్థ్యం ఉన్న వ్యక్తిని, ఎవ్వరికీ హాని తలపెట్టని వ్యక్తిని, స్వేచ్ఛను కోరుకునే వ్యక్తిని,మనస్సాక్షినే అనుసరించే వ్యక్తిని, సూచిగా, శుభ్రంగా కనిపించే వ్యక్తిని, పాదరసం లాంటి మనసున్న  మహోన్నత వ్యక్తిని, ఈ సందర్భంగా రాజశేఖర్ గుప్తా గారు ఈ సందర్భంగా అన్నారు. మరియు సేవా కార్యక్రమంలో భాగంగా పెన్షన్లను రాజశేఖర్ గుప్తా గారు డాక్టర్ నీలా శ్రీధర్ గారు అందజేస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీ నాచం ప్రభాకర్ గారు, కోశాధికారి శ్రీ ఇల్లూరి నరేంద్ర కుమార్ గారు, అడ్వైజర్ శ్రీ కొండ్లే మల్లికార్జున గారు, శ్రీ ఆలంపల్లి రవికుమార్ గారు, కార్యక్రమం చైర్మన్ శ్రీ గుగ్గిళ్ళ అశోక్ కుమార్ గారు, సర్వీస్ ఆక్టివిటీస్ సబ్ కమిటీ చైర్మన్ శ్రీ కూర జయరాములు గుప్తా గారు, వేలూరు లింగయ్య గుప్తా గారి పుత్రులు శ్రీ వేలూరు రవీంద్రనాథ్ గారు, శ్రీ వేలూరు శిలేంద్ర నాథ్ గుప్తా గారు,  శ్రీ వేలూరు వీరేంద్ర గుప్తా గారు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home