Sunday, 8 December 2024

రాజన్న కోడెల పై వస్తున్న అభియోగాలను ఖండించిన ఆలయ ఈవో... వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె.వినోద్ ఖండించారు.


   రాజన్న కోడెల పై వస్తున్న అభియోగాలను ఖండించిన ఆలయ ఈవో...

వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె.వినోద్ ఖండించారు.                                     వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె.వినోద్ ఖండించారు. వరంగల్ జిల్లాలోని గీసుకొండ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర గోశాల సొసైటీకి ఎలాంటి కోడెలను అందించలేదని, ఇప్పటి వరకు పంపిణీ చేసిన ప్రతి కోడెను నిబంధన ప్రకారమే దరఖాస్తు చేసుకున్న రైతులకు, ఒక్కో రైతుకు రెండు చొప్పున కేటాయించామే తప్ప నిబంధనలను ఎక్కడ ఉల్లంగించలేదని, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మంత్రి కొండా సురేఖ పేరుతో ఉన్న లెటర్ తో తమకు ఏమి సంబంధం లేదని, అది అసలు తమ వద్దకే రాలేదని కొట్టి పారేశారు.

ఇప్పటి వరకు కోడెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, రాబోయే రోజుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాల పై ఇప్పటికే గీసుకొండ పోలీస్ స్టేషన్ నుండి తమకు సమాచారం అందిందని, దీని పై స్థానిక పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేస్తామని, కోడెల పంపిణీ విషయంలో వస్తున్న ఆరోపణల పై ఖచ్చితంగా విచారణ జరిపి ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగినట్లు నిర్థారణ అయితే బాధ్యుల పై చర్యలు తీసుకుని, భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home