Sunday, 4 January 2026

ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న డా. చికోటి ప్రవీణ్ – సామాజిక ఐక్యతకు పిలుపు*

 *ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న డా. చికోటి ప్రవీణ్ – సామాజిక ఐక్యతకు పిలుపు*




తెలుగు ప్రజల ఆత్మగౌరవం, స్వయంప్రభుత్వ ఆకాంక్షలకు చిరస్మరణీయ ప్రతీకగా నిలిచిన, తెలుగు రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని భావితరాలకు సజీవంగా అందించాలనే మహత్తర సంకల్పంతో అమరావతిలో ఒక చారిత్రక ప్రయత్నం కొనసాగుతోంది. ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం మరియు స్మృతి వనం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా, ఈ తరం మాత్రమే కాదు రాబోయే తరాలకూ త్యాగం, సేవ, ప్రజాస్వామ్య విలువల పాఠాన్ని అందించాలనే దృఢ సంకల్పం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం తెలుగు సమాజానికి శాశ్వత గర్వకారణంగా నిలిచి, రాష్ట్ర రాజకీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మార్గదర్శకంగా నిలవనుంది.


*ఈ లక్ష్య సాధనలో భాగంగా ట్రస్ట్ విధి–విధానాలపై విస్తృత చర్చలు జరిపి, సమాజంలోని వివిధ వర్గాల అభిప్రాయాలు, ముఖ్యంగా ఆర్యవైశ్య ప్రముఖుల అమూల్యమైన సలహాలు, సూచనలు, సహాయసహకారాలను సమీకరించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని ది సఫైర్, తాజ్ కృష్ణ, బంజారా హిల్స్ వేదికగా ఇష్టాగోష్టిని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా స్మారక నిర్మాణం మాత్రమే కాకుండా, సమాజ ఐక్యత, సాంస్కృతిక పరిరక్షణ, ప్రజాసేవలో భాగస్వామ్యాన్ని పెంపొందించే స్పష్టమైన దిశానిర్దేశం వెలువడింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, హిందూ ధర్మ రక్ష ఫౌండర్ గౌరవ డా. చికోటి ప్రవీణ్ గారు హాజరై, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ మహత్తర యత్నానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజా చైతన్యం, ధర్మ పరిరక్షణ, జాతీయ ఐక్యతకు ఇలాంటి ప్రయత్నాలు ఆదర్శంగా నిలవాలని, ఈ స్మారక ప్రాజెక్టు విజయవంతమై తెలుగు సమాజ గౌరవాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home