తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈసారి కాస్త ముందుగానే వార్షిక పరీక్షలు..
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈసారి కాస్త ముందుగానే వార్షిక పరీక్షలు..
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఇంటర్ బోర్డు రెండు రకాల టైం టేబుళ్లను సమర్పించింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఫీజును కూడా పెంచాలని బోర్డు ప్రతిపాదించింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఈసారి వార్షిక పరీక్షలు ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రాన్ని పంపింది. 2026 ఫిబ్రవరి 23 లేదా 25 తేదీల నుంచి పరీక్షలు మొదలయ్యేలా రెండు రకాల టైం టేబుళ్లను బోర్డు ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. సీఎం రేవంత్రెడ్డి వద్దే విద్యాశాఖ కూడా ఉన్నందున.. ఆయన తుది ఆమోదం తర్వాతే అధికారిక షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24తో ముగియనున్నాయి. ఏపీ కంటే ముందే తెలంగాణలో పరీక్షలు పూర్తయ్యేలా బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది.
వాల్మార్ట్లో రోజూ అదే పని.. అమెరికాలో భారతీయ యువకుడు అరెస్ట్
టూరిస్టులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఈ ఏరియాలకు హెలికాప్టర్ సేవలు.. ఎప్పటినుంచంటే..
TG: రైతులకు తీపికబురు.. వాటిపై 100 శాతం సబ్సిడీ..
వాస్తవానికి గతంలో కరోనా మహమ్మారి ప్రభావానికి ముందు ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ పరీక్షలు మొదలయ్యేవి. అయితే కరోనా కారణంగా షెడ్యూల్ మార్చి నెలకు మారింది. తిరిగి ఫిబ్రవరిలోనే పరీక్షలు మొదలుపెట్టడం వలన, జేఈఈ మెయిన్, ఎప్సెట్, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కొంత వెసులుబాటు లభిస్తుందని ఇంటర్బోర్డు భావిస్తోంది. ఉదాహరణకు.. గత ఏడాది మార్చి 5న ఇంటర్ పరీక్షలు మొదలవగా.. జేఈఈ మెయిన్ తుది విడత ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమైంది. దీంతో విద్యార్థులకు మధ్యలో కేవలం 12 రోజులు మాత్రమే మిగలడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి సుమారు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
ఇదే సమయంలో.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఫీజును పెంచాలని కూడా ఇంటర్బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ.520, ప్రయోగ పరీక్షలుండే ఎంపీసీ, బైపీసీ, జువాలజీ గ్రూపులతోపాటు ఒకేషనల్ కోర్సులకు అదనంగా మరో రూ.230 కలిపి మొత్తం రూ.750 వసూలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీతోపాటు సీబీఎస్ఈ, ఇతర బోర్డుల ఫీజులు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణలో కూడా కొంత మొత్తం పెంచాలని బోర్డు ప్రతిపాదించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రాక్టికల్స్ లేని కోర్సులకు ఫీజు రూ.600 వరకు, ప్రాక్టికల్స్ ఉన్న వాటికి సుమారు రూ.875 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home