రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం..*
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://*
*రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం..*
*వేములవాడ రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు..*
*అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు తాత్కాలిక ఏర్పాట్లు..*
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా భక్తుల దర్శనాల్లో, సేవల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు..
*రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం..*
ఈ అభివృద్ధి పనుల నేపథ్యంలో, భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. నేటి (11-10-2025) శనివారం నుండే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి దర్శనాలు ప్రారంభమయ్యాయి..
**రాజన్న సిరిసిల్ల జిల్లా:://*
*రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం..*
*వేములవాడ రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు..*
*అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు తాత్కాలిక ఏర్పాట్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా భక్తుల దర్శనాల్లో, సేవల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు..
*రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం..*
ఈ అభివృద్ధి పనుల నేపథ్యంలో, భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. నేటి (11-10-2025) శనివారం నుండే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి దర్శనాలు ప్రారంభమయ్యాయి..
*నిత్య కైంకర్యాలు యథావిధిగా..*
రేపటి (12-10-2025) ఆదివారం నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని సాధారణ దర్శనాలను నిలిపివేయడం జరుగుతున్నప్పటికీ, ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా, శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయని ఈవో స్పష్టం చేశారు..
ఆలయ అభివృద్ధిలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు, ప్రజలు సహకరించి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు..
రేపటి (12-10-2025) ఆదివారం నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని సాధారణ దర్శనాలను నిలిపివేయడం జరుగుతున్నప్పటికీ, ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా, శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయని ఈవో స్పష్టం చేశారు..
ఆలయ అభివృద్ధిలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు, ప్రజలు సహకరించి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు..

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home