జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీ
ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించిన డా. చికోటి ప్రవీణ్ గారు, తన ప్రజా నాయకత్వం, ఉత్సాహపూరిత ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతన జోష్ నింపారు. ప్రజలకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని వివరించి, ఆయనను గెలిపించడమే అభివృద్ధి దిశగా ముందడుగు అవుతుందని చెప్పారు. కార్మిక నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి ప్రధాన ప్రాంతాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధి అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్న బీజేపీ మాత్రమే తెలంగాణను నిజమైన అభివృద్ధి మార్గంలో నడిపించగలదని డా. చికోటి ప్రవీణ్ గారు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి విశ్వాసపూర్వక మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతూ, ప్రజాస్వామ్య శక్తిగా బీజేపీని బలపరచాలని పిలుపునిచ్చారు.




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home