రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాను విడుదల
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాను
, మండల ప్రజా పరిషత్తు కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయాలలో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటరు జాబితాలను ఈనెల 6న ప్రచురించిన నేపథ్యంలో సోమవారం అయన తన చాంబర్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ముసాయిదా జాబితా ప్రకారం నల్గొండ జిల్లాలో మొత్తం 33 మండలాలకు 33 జెడ్పిటిసిలు,33 ఎంపీపీలు ఉన్నాయని, 353 ఎంపీటీసీలు ఉన్నాయని, మొత్తం 1956 పోలింగ్ కేంద్రాలు ఉండగా, పది లక్షల 73,506 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాల పై ఈ నెల 6 నుండి 8 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, ఈ నెల 9 న అభ్యంతరాల పరిష్కారం , 10 న తుది ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ లలో ప్రచురించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు. ఓటరు జాబితాలో మార్పు చేర్పులు చేసే అధికారం తమకు లేదని ,సంబంధిత ఆర్డీవోలు ఈఆర్వోల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు.
సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ 353 ఎంపీటీసీలకు సంబంధించి పూర్తి వివరాలను ముందుగానే తమకు ఇవ్వాలని, ఏ బూతు ఏ గ్రామంలోకి వస్తుందో జాబితా ఇవ్వాలని, ముసాయిదా ఓటరు జాబితా సైతం రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరారు.
కాగా ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి గుమ్మల మోహన్ రెడ్డి, బిజెపి నుండి లింగస్వామి ,పి మోహన్ రెడ్డి, ఎం వెంకటేశం, బిఆర్ఎస్ నుండి పిచ్చయ్య ,ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎస్ కే ఆర్ అన్సారి ,ఏ. రవీందర్, బీఎస్పీ నుండి భీమ్ ప్రసాద్, కిరణ్, టిడిపి నుండి మల్లికార్జున్, రఫీ, సిపిఐ నుండి శ్రవణ్ కుమార్, సిపిఐఎం నుండి పీ. నర్సిరెడ్డి,డి ఎస్ పి నుండి డి.వంశీ,రాంబాబు, తదితరులు ,ఉన్నారు .
_______________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home