Sunday, 5 January 2025

పన్ను చెల్లింపుదారులకు ఊరట.


 Income Tax: ట్యాక్స్ పేయర్లకు మంచి ఛాన్స్.. వడ్డీ, పెనాల్టీ కట్టక్కర్లేదు.. ఐటీ శాఖ కీలక ప్రకటన!

Authored Byబండ తిరుపతి | Samayam Telugu | Updated: 5 Jan 2025, 10:26 am

Subscribe



Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట. పన్ను వివాదాల్లో ఉండి భారీగా వడ్డీ, పెనాల్టీలు కట్టాల్సి వచ్చే వారికి మరో అవకాశం లభించింది. వివాద్ సే విశ్వాస్ పథకం 2024 గడువును ఆదాయపు పన్ను శాఖ జనవరి 31, 2025 వరకు పొడిగించింది. తమ బకాయిల డిక్లరేషన్ ఇచ్చినట్లయితే వడ్డీ, పెనాల్టీ కట్టక్కర్లేదు. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం.


|

Income Tax: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే బిలేటెడ్ ఐటీఆర్, రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువును జనవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. పన్ను వివాదాల్లో ఉన్న ట్యాక్స్ పేయర్లకు ఊరట కల్పించింది. వివాద్ సే విశ్వాస్ పథకం 2024 గడువును పొడిగించింది. ఈ స్కీమ్ ప్రకారం డిసెంబర్ 31, 2024లోపు ట్యాక్స్ పేయర్లు తమ బకాయిల డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే వివాదంలో ఉన్న ట్యాక్స్ 100 శాతం చెల్లించాల్సి ఉంది. ఎవరైనా గడువు దాటాక డిక్లరేషన్ ఇస్తారో వారు వడ్డీ, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు వారందరికీ ఊరట లభించింది.


వివాద్ సే విశ్వాస్ పథకం 2024 గడువును జనవరి 31, 2025 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటన చేసింది. అంటే పన్ను వివాదంలో ఉన్న వారు తమ బకాయిల డిక్లరేషన్ ఇచ్చేందుకు జనవరి ఆఖరు వరకు అవకాశం లభించింది. ఆలోపు డిక్లరేషన్ ఇస్తే ఎలాంటి వడ్డీ, పెనాల్టీ కట్టక్కర్లేదు. 100 శాతం వివాదంలో ఉన్న పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి సీబీడీటీ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2025న లేదా ఆ తర్వాత సమర్పించే డిక్లరేషన్లకు 110 శాతం మేర పన్ను కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.

  రిట్స్, స్పెషల్ లీవ్ పిటిషన్ (అప్పీళ్లు) వంటి వివాదాల్లో ఉన్న ట్యాక్స్ పేయర్లు ఈ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024ను వినియోగించుకోవచ్చని సీబీడీటీ తెలిపింది. జులై 22, 2024లోపు పెండింగ్‌లో ఉన్న అన్ని వివాదాలకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంది. వేరు వేరు న్యాయ వేదికల్లో 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్లకు సంబంధించిన అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. వాటి విలువ సుమారు రూ.35 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కారానికి మరో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. గతంలో తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ స్కీమ్ విజయవంతమైన క్రమంలో ఈ పథకాన్ని మరోసారి తీసుకొచ్చారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home