రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి:రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తిరుమలగిరి మండలంలో కొత్తగా 4వేల మందికి భూపట్టాలుసర్వేలో 3వేల మంది అనర్హులు గుర్తింపు మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలి రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ :- పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు.డాక్టర్ బి. ఆర్, అంబేద్కర్ సచివాలయంలో మంగళవారంనాడు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖతో కలిసి మంత్రిగారు సమావేశం నిర్వహించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home