రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, జూన్ 21: అగ్ని ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును శనివారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు. 16 ఏప్రిల్ 2023 న కుషాయిగూడ కట్టెల మండి లో అగ్నిప్రమాదం జరిగి సాయి నగర్ కాలనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పక్కనే నివాసం ఉంటున్న రేట్నేని నరేష్ తన భార్య రేట్నేని సుమ, కుమారుడు రేట్నేని జోషిత్ మరణించిన విషయం విదితమే.
బాధిత కుటుంబానికి 6 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరైన నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన పుట్టిన రోజు సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యుడు రేట్నేని చెన్నయ్యకు రూ. 6 లక్షల విలువ గల చెక్కును అందజేశారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home