Wednesday, 17 July 2024

డీఎస్సీ అభ్యర్ధులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

 

డీఎస్సీ అభ్యర్ధులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు


CM Revanth Reddy 

డీఎస్సీ అభ్యర్ధులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుండి ఆగస్టు నెల 5 వరకూ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు 2లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 2017 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు ఇవే కావడం గమనార్హం. రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4:30 వరకూ రెండో సెషన్ జరగనుంది. ఒక్కో సెషన్ లో 13,000 మంది చొప్పున రెండు సెషన్లకు కలిపి రోజుకు 26,000 మంది డీఎస్సీ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. నేటి నుండి ఆగస్టు 5 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలకు హాజరవుతోన్న అభ్యర్ధులకు నా శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. అలాగే 2012 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు జరుగుతోన్న ఈ డీఎస్సీ ద్వారా మీ కలలు ఫలించాలని అన్నారు. ఇక భావి భారత పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home