ఏసీబీ సోదాలు.. తహసీల్దార్ ఇంట్లో భారీగా బయటపడిన నోట్ల కట్టలు, బంగారం
ఏసీబీ సోదాలు.. తహసీల్దార్ ఇంట్లో భారీగా బయటపడిన నోట్ల కట్టలు, బంగారం
సంపాదనకు మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో 5 చోట్ల సోదాలు నిర్వహించరు.
: సంపాదనకు మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో 5 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులకు షాక్ తగిలేల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఉదయం నుంచి కొనసాగిన ఈ సోదాల్లో.. 3 కోట్ల 20 లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఏడెకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటితో పాటు 1.4 కిలోల బంగారు ఆభరణాలు, లక్ష 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తహసీల్దార్ రజినికి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home