ద్విచక్ర వాహనాలకు కూడా ఫాస్టాగ్ రానుందా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ద్విచక్ర వాహనాలకు కూడా ఫాస్టాగ్ రానుందా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
హైవేలపై ప్రయాణించే ద్విచక్ర వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇకపై బైక్స్ కూడా ఫాస్టాగ్ అమర్చుకోవాలని కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. దీంతో బైక్స్ ఉన్న వారు చాలా ఆందోళనకు గురయ్యారు. ఇది నిజమేనా? కాదా? అని సందేహాలతో ఉన్నారు. ఈ వార్తలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వరకు చేరాయి. దీంతో ఆయన వెంటనే స్పందించారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
మంత్రి..
నితిన్ గడ్కరీ ట్వీట్
ద్విచక్ర వాహనాలకు ప్రభుత్వం టోల్ ఫీజు విధించబోతుందనే వార్తలు పూర్తిగా నిరాధారం అని గడ్కరీ తేల్చిచెప్పారు. ఎక్స్ వేదికగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. అసలు ఇలాంటి ఆలోచనేది తమ వద్ద లేదన్నారు. ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటాయని, నిజానిజాలు తెలుసుకోకుండా సంచనాల కోసం ఇలాంచి కథనాలు ప్రచురించడం మంచి జర్నలిజం కాదని వ్యాఖ్యానించారు. టూ వీలర్స్ కు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఎప్పటిలానే కొనసాగుతుందని చెప్పారు. తప్పుడు వార్తలను ఖండించారు.
హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కూడా ఈ విషయంపై స్పష్టత నిచ్చింది. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు విధించాలనే ప్రతిపాదనేది పరిశీలనలో లేదని వెల్లడించింది. అలాంటి ప్రణాళికలు లేవని తెలిపింది. దీంతో ద్విచక్ర వాహనదారుల్లో సందిగ్ధం వీడింది.
ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్
కాగా, కేంద్రం ఇటీవలీ ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను ప్రకటించింది. దీని ద్వారా వాహనదారులపై ఆర్థిక భారం తగ్గనుంది. రూ. 3,000 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్పులు హైవేలపై టోల్ ఫీజు లేకుండా ప్రయాణించవచ్చు. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీని ద్వారా వాహనదారులకు రూ. 7 వేలు ఆదా అవుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. సగటున టోల్ ఫీజు రూ. 15 మాత్రమే పడుతుందన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home