అలసత్వం వలదు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి జగదీష్ రెడ్డి*
అలసత్వం వలదు అప్రమత్తంగా ఉండాలి
#వాతావరణ శాఖా హెచ్చరికలు బే ఖాతార్ చేయొద్దు
👉🏿 *మంత్రి జగదీష్ రెడ్డి*
వాతావరణ శాఖా హెచ్చరికలు ఎంత మాత్రం బే ఖాతార్ చేయవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ఏంత మాత్రం అలసత్వం వలదని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల తో నల్లగొండ జిల్లాలో ఉత్పన్నమవుతున్న పరిస్థితుల పై గురువారం సాయంత్రం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home